-
హిందూ రాష్ట్ర అభివృద్ధి శాఖగా మార్చనీయకండి
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి సీతారాం ఏచూరి విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ(హెచ్ఆర్డీ) శాఖను హిందూ రాష్ట్ర డెవలప్మెంట్ మినిస్ట్రీగా మార్చకుండా తక్షణం జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి సీపీఎం విజ్ఞప్తి చేసింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించింది. ‘సెంట్రల్ వర్శిటీకి మీరు విజిటర్గా ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ వీసీ నియామకంపై వివాదం నడుస్తోంది. రోహిత్ ఆత్మహత్య తర్వాత దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన వీసీ అప్పారావు ఈ నెల 22న మళ్లీ వర్శిటీలో ప్రత్యక్షమయ్యారు. ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోగానే విద్యార్థులపై లాఠీ దాడి మీకు తెలిసే ఉంటుంది. ఈ వీసీని తొలగించాలని విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. వసతి గృహాలకు నల్లా కనెక్షన్లను తొలగించారు. హాస్టల్ మెస్కు ఆహార సరఫరా నిలిపివేశారు. పోలీసు చర్యపై ఈ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ శాంతి భద్రతల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదిగా పేర్కొంది. హెచ్చార్డీ మీవైపు మాకు దారి చూపించింది. అందువల్ల మీరు తక్షణం జోక్యం చేసుకుని సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడగలరు’ అని కోరారు. -
హెచ్సీయూకు నేడు మల్లికార్జున ఖర్గే
సాక్షి, హైదరాబాద్: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం హెచ్సీయూకు రానున్నారు. రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడానికి, సస్పెన్షన్కు గురైన విద్యార్థులకు మద్దతు తెలపడానికి ఖర్గే వస్తున్నట్టుగా రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారని, విద్యార్థులతో మాట్లాడిన తర్వాత బెంగ ళూరు వెళ్తారని వివరించారు. -
పరిస్థితి చక్కదిద్దాలని మాత్రమే కోరా
- హెచ్సీయూ పాలన అంశాల్లో జోక్యం చేసుకోలేదు: దత్తాత్రేయ - ఏబీవీపీ ప్రతినిధుల వినతి పత్రాలను నా కవరింగ్ లెటర్తో హెచ్ఆర్డీకి పంపా.. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరం సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యపై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఖండించారు. ఏబీవీపీ ప్రతినిధులు అందించిన వినతి పత్రాలను తన కవరింగ్ లెటర్తో కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపించానని వివరణ ఇచ్చారు. యూనివర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దాలని మాత్రమే మంత్రిని కోరానని, రోహిత్ ఆత్మహత్యకు తాను కారణం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీవీపీ విద్యార్థులు ఆగస్టు 10న, ఆగస్టు 29న తనకు వేర్వేరుగా రెండు వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ రెండింటినీ మంత్రికి పంపించినట్లు పేర్కొన్నారు. యూనివర్సిటీలోని విషయాలపై దృష్టి కేంద్రీకరించి, క్యాంపస్లో పరిస్థితులను చక్కదిద్దాలని కోరినట్టుగా వివరించారు. కేంద్రీయ యూనివర్సిటీ స్వతంత్ర సంస్థ అని, వర్సిటీ పరిపాలనా అంశాలు, నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోలేదని స్పష్టంచేశారు. ఏబీవీపీ ప్రతినిధుల నుంచి వచ్చిన లేఖలను కేంద్ర మానవవనరుల శాఖ మంత్రికి పంపడం వరకే తన పాత్ర పరిమితమైందన్నారు. తన దగ్గరకు ఏ విద్యార్థి సంఘం వచ్చినా సరే.. వారిచ్చే వినతి పత్రాలను సంబంధిత శాఖలకు పంపించే వాడినని తెలిపారు. అంతకు మించి ఈ కేసులో వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం తన వద్దకు ప్రతిరోజూ వందలాది మంది వస్తుంటారని, వారి విషయంలో స్పందించినట్టుగానే ఏబీవీపీ ప్రతినిధులు ఇచ్చిన వినతి పత్రాలపై కూడా స్పందించినట్టు వివరించారు. ఎంపీగా, కేంద్రమంత్రిగా ఇది తన బాధ్యత అని దత్తాత్రేయ చెప్పారు. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్టుగా పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement