-
'రొటేషన్ పాలసీ మా కొంపముంచింది'
అహ్మదాబాద్: టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను ఇంగ్లండ్ 3-1 తేడాతో ఓడిపోవడం వెనుక రొటేషన్ పాలసీ ముఖ్య కారణమని ఆ జట్టు మాజీ ఆటగాడు నాసిర్ హుస్సేన్ అభిప్రాయపడ్డాడు. రొటేషన్ పాలసీ అనేది తప్పుడు నిర్ణయమని.. అది ఎప్పుడు కలిసి రాదని.. ఆ విధానాన్ని తప్పుబడుతున్నట్లు నాసిర్ విమర్శించాడు. ‘‘ఆటగాళ్ల రొటేషన్ విధానం అనే నిర్ణయం సరైనది కావొచ్చు.. కానీ భారత్తో సిరీస్లో అలా చేయడాన్ని సమర్థించలేను. ఆటగాళ్లను రొటేట్ చేయడం అన్ని సమయాల్లో కలిసిరాదు. టీమిండియా పర్యటనకు ముందు లంక పర్యటనలో రొటేషన్ పాలసీ కలిసి వచ్చింది.. అదే టీమిండియాతో సిరీస్కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. రెండో టెస్టు తర్వాత మొయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోయాడు. వాస్తవానికి అలీని మిగిలిన టెస్టుల్లో ఆడించాలని ఈసీబీ భావించింది. కానీ రొటేషన్ పాలసీ ఉండడంతో ఆటగాళ్లు తమ సొంత నిర్ణయాలపై ఆధారపడుతున్నారు. జానీ బెయిర్ స్టో విషయంలోనూ ఇలాగే జరిగింది. లంకతో సిరీస్లో అద్భుతంగా రాణించిన బెయిర్ స్టో టీమిండియా సిరీస్ వచ్చేసరికి మాత్రం విఫలమయ్యాడు. మొదటి రెండు టెస్టులకు దూరంగా ఉన్న అతను చివరి రెండు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే రొటేషన్ పాలసీ ఈసారి మా కొంపముంచింది. ఇంకో విషయం ఏంటంటే.. ఐపీఎల్ సీజన్కు కూడా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా ఈసీబీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఐపీఎల్ 2020 ముగిసి ఆర్నెళ్లు కాకుండానే మరో సీజన్ రెడీ అయితుంది. ఐపీఎల్లో పాల్గొంటే.. ఫార్మాట్ వేరైనా.. టెస్టు క్రికెట్ ఆడేందుకు కాస్త స్కోప్ ఉంటుంది. '' అని వివరించాడు. ఇక ఇంగ్లండ్, టీమిండియాల మధ్య 5 టీ20ల సిరీస్లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్ శుక్రవారం(మార్చి 12న) జరగనుంది. చదవండి: టీమిండియాతో సిరీస్.. ఐదు కేజీలు బరువు తగ్గా టీమిండియా సిరీస్ గెలవగానే మాట మార్చేశాడు -
పాపం: ఒక్క మ్యాచ్ ఆడకుండానే స్వదేశానికి వోక్స్
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రొటేషన్ పాలసీలో భాగంగా భారత పర్యటన నుంచి మరో ఇంగ్లండ్ ప్లేయర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, భారత్తో సిరీస్లకు 31 ఏళ్ల ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ ఎంపికయ్యాడు. అయితే ఈ మూడు సిరీస్లలో వోక్స్కు ఒక్క మ్యాచ్లోనూ ఆడే అవకాశం రాలేదు. గతేడాది సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో చివరిసారి వన్డే మ్యాచ్లో వోక్స్ బరిలోకి దిగాడు. రొటేషన్ పాలసీలో భాగంగా ఇప్పటికే ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్, మొయిన్ అలీ స్వదేశానికి వెళ్లిపోయారు. (చదవండి: ‘పిచ్ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి’) -
మేయర్ ఎన్నికల్లో గందరగోళం ‘ఏడాది’పై వివాదం
న్యూఢిల్లీ:ఢిల్లీ పురపాలక సంఘ అధీనంలోని మూడు కార్పొరేషన్లకు మరికొన్ని రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయీ సంఘం సభ్యులను ఏటా మార్చే అంశంపై నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో కీలక నిర్ణయాలు తీసుకొని, సమర్థపాలన అందించడం సాధ్యపడదని వీళ్లు వాదిస్తున్నారు. ఉత్తర, దక్షిణ, తూర్పు ఢిల్లీ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఈ నెలాఖరున ఎన్నుకుంటారు. ప్రస్తుతం మేయర్ల ఏడాది పదవీకాలం పూర్తి కావడంతో వీళ్లు వైదొలుగుతున్నారు. నిబంధనల ప్రకారం మేయర్ పదవీ కాలం ఐదేళ్లు. అయితే ఏటా ఒక్కొక్కరు (రొటేషన్ విధానం) వైదొలుగుతుంటారు. తొలి ఏడాది మహిళకు, మలి ఏడాది సాధారణ విభాగానికి (ఓపెన్ కేటగిరి), మూడో ఏడాది రిజర్వుడు కేటగిరికి, నాలుగు, ఐదు సంవత్సరాల్లో మళ్లీ సాధారణ విభాగానికి మేయర్ పదవిని కేటాయిస్తామని ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) ప్రజాసంబంధాల అధికారి యోగేంద్ర సింగ్ మాన్ అన్నారు. ఇది మూడో ఏడాది కాబట్టి ఎస్సీలకు మేయర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది. ఎన్డీఎంసీలో ఈ నెల 28న, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడీఎమ్సీ), దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎమ్సీ)లో 29న మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. పెంచకుంటే నష్టమేనంటున్న నాయకులు ఈడీఎమ్సీ మేయర్ రామ్ నారాయణ్ దూబే మాట్లాడుతూ మేయర్ల పదవీకాలాన్ని ఏడాది కాకుండా కనీసం 25 నెలల వరకైనా పొడిగించాలని కోరారు. భారీ మున్సిపల్ ప్రాంతంలోని పాలనను అర్థం చేసుకొని, అభివృద్ధికి చర్యలు తీసుకోవడం ఏడాదిలో సాధ్యపడబోదని ఆయన స్పష్టం చేశారు. మేయర్ పదవీకాలం కనీసం 2.5 ఏళ్లు అయినా ఉండాలని ఎన్డీఎమ్సీ మేయర్ ఆజాద్సింగ్ అన్నారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి 12 నెలల సమయం ఎంత మాత్రమూ సరిపోదని ఆయన వాదించారు. ‘ఉత్తరఢిల్లీలో నీరు, డ్రైనేజీలు, డెంగీ వంటి సమస్యలు ఎక్కువ. సంవత్సరానికి ఒక మేయర్ మారుతూ ఉంటే పాలనావ్యవస్థ మారుతూ ఉంటుంది. కొత్త మేయర్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలి. దీనివల్ల పనులన్నీ ఆలస్యమవుతాయి’ అని సింగ్ అభిప్రాయపడ్డారు. దక్షిణ ఢిల్లీ కార్పొరేషన్ మేయర్ పదవి, ఇతర ముఖ్య పదవులకు ఇంకా ఎవరూ నామినేషన్ పత్రాలు సమర్పించలేదు. అయితే నామినేషన్లకు తుది గడువు సోమవారంతో ముగుస్తుందని అధికారులు ప్రకటించారు. పదవీకాలం వివాదంపై ఎస్డీఎమ్సీ విపక్ష నాయకుడు ఫర్హాద్ సూరి మాట్లాడుతూ ‘రొటేషన్ పద్ధతిలో ఏడాదికి ఒకరిని మేయర్ పదవికి ఎన్నుకునే పద్ధతిని రద్దు చేయాలి. ఐదేళ్లకోసారి రిజర్వేషన్లు అమలు చేయాలి. ఒకసారి మహిళలకు, రెండోసారి (ఐదేళ్లపాటు) ఎస్సీ, మూడోసారి సాధారణ విభాగం.. ఇలా ఎన్నికలు నిర్వహించాలి. దీనివల్ల అన్ని కార్పొరేషన్లలోనూ సమర్థ పాలన సాధ్యపడుతుంది’ అని ఆయన సూచించారు. ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటే.. సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, ఢిల్లీ ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలకు మేయర్ల ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పని చేయడం లేదు కాబట్టి ఎంపీలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. కొందరు ఎంపీలు రెండు కార్పొరేషన్లలోనూ ఓటు వేయవచ్చు. ఉదాహరణకు ఒక ఎంపీ నియోజకవర్గ ప్రాంతం ఎన్డీఎమ్సీ, ఎస్డీఎమ్సీలోనూ ఉంటే రెండు కార్పొరేషన్లలోనూ ఆయన ఓటు వేయవచ్చు. ఎన్డీఎమ్సీలో మొత్తం 104 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా పోటీకి దిగారు. ఈడీఎమ్సీలో 64 మంది సభ్యులు ఉండగా, ఇద్దరు రాజీనామా చేశారు. ఎస్డీఎమ్సీలోనూ 104 మంది సభ్యులు ఉండగా ముగ్గురు వైదొలిగారు. మేయర్లతోపాటే డిప్యూటీ మేయర్లు, స్థాయీసంఘం సభ్యుల పదవులకూ ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే స్థాయీసంఘం సభ్యులను మాత్రం మేలో ఎన్నుకుంటారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement