-
ఢిల్లీ మెట్రోలో గోల్డెన్ లైన్.. 15 స్టేషన్లు, 24 కి.మీ. ప్రయాణం!
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) తాజాగా మెట్రో ఫేజ్ 4 ప్రాజెక్ట్లోని తుగ్లకాబాద్ నుండి ఢిల్లీ ఏరోసిటీ కారిడార్ కలర్ కోడ్లో చోటుచేసుకున్న మార్పును ప్రకటించింది. ఇంతకుముందు ఈ లైన్ను సిల్వర్ లైన్ అని పిలిచేవారు. ఇకపై ఈ రూట్ను గోల్డెన్ లైన్ అని పిలవనున్నారు. విజిబిలిటీ సంబంధిత సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మెట్రో కోచ్లలో వెండి రంగు స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే దీనిని గోల్డెన్ లైన్ కారిడార్గా మార్చారు. ఇది 23.62 కిలోమీటర్ల విస్తీర్ణంలో, మొత్తం 15 స్టేషన్లను కలిగి ఉంటుంది. ఈ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయి. 2025నాటికి ఇవి పూర్తికావచ్చని అధికారులు చెబుతున్నారు. ఫేజ్-4లో గోల్డెన్ లైన్తో పాటు మరో రెండు కారిడార్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో జనక్పురి వెస్ట్ నుండి ఆర్కే ఆశ్రమం వరకు మెజెంటా లైన్ను పొడిగించడం, మజ్లిస్ పార్క్ నుండి మౌజ్పూర్ వరకు పింక్ లైన్ను పొడిగించడం మొదలైనవి ఉన్నాయి. ఢిల్లీ మెట్రోలోని ఒక్కో కారిడార్ను ఒక్కో రంగుతో గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్లో లైన్ సమయపూర్ బద్లీ నుండి గుర్గావ్ వరకు, బ్లూ లైన్ వైశాలి నుండి ద్వారక వరకు, రెడ్ లైన్ కొత్త బస్టాండ్ నుండి రితాలా వరకు నడుస్తుంది. -
రూ.1500 లకే స్పెషల్ హెల్మెట్
బెంగళూరు : ప్రమాదాలకు గురైన సమయంలో రక్షణ కోసమే కాదు.. దారి చూపేందుకు కూడా సహకరించే హెల్మెట్లు త్వరలో మార్గెట్లోకి రానున్నాయి. అంతర్గతంగా బ్లూటూత్ స్పీకర్ ఇందులో పొందుపరచబడి ఉంటుంది. దీని ద్వారా రూట్ విషయంలో వాహనదారుడికి సూచనలు అందుతుంటాయి. బెంగళూర్కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని తయారు చేశారు. గుల్బర్గాలోని పీడీఏ కాలేజీలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న యోగేష్, అభిజిత్లు ఈ హెల్మెట్ను రూపొందించారు. ‘హెల్మ్ట్లో ఇన్బిల్ట్గా ఓ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది. దారి మరిచిపోయిన సందర్భంలో ఫోన్ బ్లూటూత్ ద్వారా గూగుల్ మ్యాప్స్కు దీనికి అనుసంధానించే సౌలభ్యం ఉంటుంది. రూట్ తెలీక గందరగోళానికి గురయ్యే వాహనాదారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది’ అని ఆ విద్యార్థులు చెబుతున్నారు. ‘విదేశాల్లో వీటికి మంచి మార్కెట్ ఉంటుంది. కానీ, విద్యార్థుల కోరిక మేరకు 1500 రూ. దీనిని అమ్మాలని నిర్ణయించాం’ అని హెల్మెట్పై హక్కులు తీసుకున్న సంస్థ తెలిపింది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే ఇది 6 గంటలు పని చేస్తుంది. ఛార్జింగ్ పోర్ట్తోపాటు, ముందు భాగంలో కూలింగ్ షీట్ను కూడా పొందుపరిచారు. త్వరలో బెంగళూర్తోపాటు మిగతా ప్రధాన నగరాల్లోని మార్కెట్ల్లోకి ఒకేసారి ఇవి అందుబాటులోకి రానున్నాయి. -
అంతర్జాతీయ యవనికపై ఓరు‘ఘల్లు’..!
► వరంగల్కు ‘అంతర్జాతీయ’ ప్రచారం ►శాస్త్రీయంగా రూట్ గైడ్ రూపకల్పన ► పేరు ‘టూర్ గైడ్ ఆఫ్ కాకతీయ హెరిటేజ్’ ► డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ చొరవ ► బోస్టన్ ప్రొఫెసర్ వాగ్నర్కు బాధ్యతలు ► 4 రోజుల అధ్యయనం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పర్యాటకుల స్వర్గధా మంగా భాసిల్లగల గొప్ప సహజ, చారిత్రక సంపద తెలంగాణ సొంతం.విదేశాల్లో యునెస్కో గుర్తింపు పొందిన పలు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు దీటైన ఆకర్షణ లు మన దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ అంత ర్జాతీయంగా సరైన ప్రచారం లేక వాటికి రావాల్సినంత ప్రాచుర్యం రాలేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో మన చారిత్రక ప్రాం తాలకు అంతర్జాతీయంగా శాస్త్రీయ పద్ధతిలో సరైన ప్రచారం కల్పించేందుకు లండన్ కేంద్రంగా పని చేస్తున్న చారిటబుల్ సంస్థ ఒకటి ముందుకొచ్చింది. అందులో భాగంగా కాకతీయుల రాజధాని వరంగల్లు, దాని పరిసరాల్లోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై సమగ్ర అంతర్జాతీయ టూర్ గైడ్ను రూపొం దించాలని నిర్ణయించింది. అమెరికాలో బోస్టన్ నగరంలోని వెస్లీ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఫిలిప్ బి వాగ్నర్కు ఈ బాధ్యతలను అప్పగించింది. ఆయన ఇప్పటికే వరంగల్లో అధ్యయనం ప్రారంభించారు. డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ చొరవ లండన్ కేంద్రంగా పనిచేస్తున్న డెక్కన్ హెరిటేజ్ ఫౌండేషన్ దక్కన్ ప్రాంత ప్రత్యేకతలను ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఇప్పటికే హంపి, గోవా చర్చిలు, కొంకణ్ కట్టడాలు తదితరాలపై అధ్యయనం చేసి, అంతర్జాతీయ పర్యాటకులకు మార్గనిర్దేశం చేసేలా ఆయా ప్రాంతాల టూరిస్ట్ గైడ్లను వెలువరించింది. తాజాగా కాకతీయ కట్టడాలపై దృష్టి సారించింది. వరంగల్కు చెందిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సహకారంతో ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్ వాగ్నర్కు అప్పగిం చడం వెనక కారణ ముంది. దాదాపు 35 ఏళ్ల క్రితం లండన్కు చెందిన ప్రఖ్యాత చరిత్రకారుడు జార్జ్ మైకేల్ వరంగల్పై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. దానికి ఆకర్షితుడైన వాగ్నర్ ఆ తర్వాత ఆయనతో కలిసి వరంగల్లో పర్యటించి ఇక్కడి పలు ప్రత్యేకతలను గుర్తించారు. తర్వాత కూడా రెండు మూడు సార్లు నగరంలో పర్యటించారు. ఇక్కడి సంస్కృతులు, చారిత్రక నేపథ్యం మీదేగాక తెలుగు భాషపైనా కొంత పట్టు సంపాదిం చారు. తాజా అధ్యయనంలో భాగంగా శనివారం ఆయన వరంగల్కు వచ్చారు. పురావస్తు శాఖ విశ్రాంత ఉప సంచాలకుడు రంగాచార్యులు వాగ్నర్కు మార్గదర్శనం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు నగరంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి, అంతర్జాతీయ పర్యాటకులకు ఉపయోగపడేలా ‘టూర్ గైడ్ ఆఫ్ కాకతీయ హెరిటేజ్’ పేరుతో పుస్తకం రూపొందిం చేందుకు వాగ్నర్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీన్ని వచ్చే జూన్ నాటికి పర్యాటకులకు అందుబాటులోకి తెస్తారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకో వడానికి పుస్తకం దోహదపడనుంది. ప్రభుత్వం చొరవ తీసుకుని వరంగల్లోనూ, రాష్ట్రంలోని ఇతర ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో మెరుగైన వసతులు తదితర సౌకర్యాలు కల్పిస్తే విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే అవకాశముంటుంది. వరంగల్ తర్వాత హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న నాణేలపై కూడా వాగ్నర్ అధ్యయనం చేయనున్నారు. వాటి ప్రత్యేకతలు, వివిధ రాజ వంశాలపై పరిశోధన చేసి మరో ప్రత్యేక పుస్తకం కూడా తేనున్నారు. మరెంతో అధ్యయనం జరగాలి వరంగల్ నగరం ప్రపంచం లోనే ప్రత్యేకత సంతరించుకున్న నిర్మాణం. లండన్కు చెందిన చరిత్రకారుడు మైకేల్ గతంలో దీనిపై ఎంతో అధ్యయనం చేశారు. ప్రపంచంలో బాగ్దాద్ తర్వాత ఏకైక వృత్తాకార నగరం వరంగల్లేనని తేల్చారు. అయితే నాలుగు కీర్తి తోరణాల మధ్య మాత్రమే ఇప్పటిదాకా అధ్యయనం జరిగింది. వాటి వెలుపల ప్రపంచానికింకా తెలియని ప్రత్యేకతలెన్నో దాగున్నాయి. వాటిని వెలుగులోకి తెస్తే విదేశీ పర్యాటకులు ఇక్కడికి బారులు తీరతారు. వాటిపై అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకు తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. వరంగల్ నాకెంతో ఇష్టమైన నగరం. 1985 ప్రాంతంలో ఇక్కడికొచ్చాను. అప్పటికీ ఇప్పటికీ ఇక్కడెంతో మార్పు వచ్చింది. – ఫిలిప్ బి వాగ్నర్ ఆచార్యుడు, వెస్లీ విశ్వవిద్యాలయం, బోస్టన్, అమెరికా
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement