-
రిజర్వాయర్లకు రూ.2,611 కోట్లు
సాక్షి, యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు సాగు నీరందించేందుకు చేపట్టిన బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణానికి రూ.2611.25 కోట్లు విడుదయ్యాయి. గత నెలలోనే ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేయగా.. తాజాగా నిధులు విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా మల్లన్నసాగర్ పరిధిలో బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్లను చేపట్టారు. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో చేపట్టిన ఐదు రిజర్వాయర్లలో రెండు యాదాద్రిభువనగిరి జిల్లాలో ఉన్నాయి. పూర్తిగా సాగునీటి ప్రాజెక్టులు లేని ఈజిల్లాకు రెండు రిజర్వాయర్లను నిర్మించి సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యం. భువనగిరి మండలం బస్వాపురం రిజర్వాయర్ను 11.39, తుర్కపల్లి మండలం గంధమల్ల రిజర్వాయర్ను 9.86 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ రెండు రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 2,43,500 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతోపాటు హైదరాబాద్లోని కొంత ప్రాంతానికి తాగు నీరివ్వాలని నిర్ణయించారు. ఇదీ సామర్థ్యం.. ముందుగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్లో భాగంగా బస్వాపురం రిజర్వాయర్ను .08 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 14.69 టీఎంసీలుగా నిర్ణయించారు. దీంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ఆరు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. ముందుగా పెంచిన రిజర్వాయర్ సామర్థ్యాన్ని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో 11.39 టీఎంసీలుగా తగ్గించారు. అలాగే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు 15,16 ప్యాకేజీల్లో కాల్వల పనులు పురోగతిలో ఉన్నాయి. బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల ద్వారా హైదరాబాద్ నగర ప్రజల దాహా ర్తిని తీర్చడంతోపాటు పాటు జి ల్లాలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు సాగు నీరందనుంది. గంధమల్ల రిజర్వాయర్ వల్ల ఆలేరు నియోజకవర్గంలోని రాజాపే ట, యాదగిరిగుట్ట మండలాల్లో కొంతభాగం, ఆలేరు, గుండాల మండలాల రైతులకు సాగు నీరందనుంది. నిధుల కేటాయింపు ఇలా.. జిల్లాలో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ల నిర్మాణ నిధులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గంధమల్ల రిజర్వాయర్ కోసం రూ.860.25కోట్లు, బస్వాపురం రిజర్వాయర్ కోసం రూ.1751 కోట్లు కేటాయించి ఖర్చు చేస్తారు. కేబినెట్లో అనుమతి రావడంతో ఇక టెండర్ల ప్రక్రియ ప్రారంభించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తాం
ట్రాన్స్కో సీఎండీ హామీ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు హామీ ఇచ్చారు. సాంకేతిక రంగ అభివృద్ధితో శరవేగంగా మారుతున్న పరిస్థితులను తట్టుకుని ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలు నిలదొక్కుకోవడానికి ప్రతి ఉద్యోగి కృషి చేయాలన్నారు. శనివారం రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ స్టేట్ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ తొలి సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కె.చంద్రశేఖర్రావు దిశానిర్దేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర విద్యుత్ శాఖ అనతికాలంలోనే అన్ని సమస్యలను అధిగమించి దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థల అభివృద్ధి కోసం రూ.2,450 కోట్లను ఖర్చు చేశామని, దీని వల్లే విద్యుత్ లైన్ల సమస్య తీరిందన్నారు. ఓపెన్ యాక్సెస్, సోలార్ విద్యుత్, ఆధునిక బ్యాటరీల నుంచి ప్రభుత్వ విద్యుత్ సంస్థలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని దక్షిణ డిస్కం సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రాన్స్కో జేఎండీ సి.శ్రీనివాస్ పేర్కొన్నారు. గత నెలలో హెచ్టీ వినియోగదారులు 275 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఓపెన్ యాక్సెస్ విధానంలో ప్రైవేటు నుంచి కొనుగోలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉత్తర డిస్కం సీఎండీ ఎ.గోపాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
మిషన్ కాకతీయకు రూ.2,255 కోట్లు
గత ఏడాదితో పోలిస్తే కాస్త ఎక్కువే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది ఆశించిన స్థాయిలోనే నిధులను కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.172 కోట్ల మేర అదనపు కేటాయింపులు చేసి మొత్తంగా రూ.2,255 కోట్లు కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో సుమారు 9 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించనుంది. ఇందులో చిన్న నీటి చెరువుల పునరుద్ధరణకు రూ.1,410.15 కోట్లు కేటాయించగా, ఇదే మిషన్ కాకతీయలో పెద్దతరహా పనులైన మినీ ట్యాంక్బండ్లు ఇతర చెరువుల కోసం రూ.737.93 కోట్లు కేటాయించారు. ఇందులో సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం (ఏఐబీపీ) కింద రూ.100 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృధ్ధి నిధి (ఆర్ఐడీఎఫ్) కింద రూ.5 కోట్లు, ట్రిపుల్ ఆర్ కింద మరిన్ని నిధులు వస్తాయని అంచనా వేసింది. -
రూ.2,680 కోట్లకు ఎసరు!
ఏపీ జెన్కోలో విచ్చలవిడి అవినీతి * రెండు కొత్త థర్మల్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల్లో గోల్మాల్ * ప్రైవేటు కాంట్రాక్టర్లు టాటా, బీజీఆర్లకు * రూ.2,680 కోట్ల అదనపు చెల్లింపులకు రంగం సిద్ధం * వేల కోట్ల ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు * యావత్ తతంగం వెనుక ప్రభుత్వాధినేత హస్తం! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ (ఏపీ జెన్కో) చేపట్టిన రెండు థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో వేల కోట్ల అవినీతికి తెరలేచింది. కాంట్రాక్టర్లకు సుమారు రూ.2,680 కోట్ల అదనపు చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధమయ్యింది. పొరుగున ఉన్న తెలంగాణ ఇదే తరహా ప్రాజెక్టుల్లో ఒక మెగావాట్ నిర్మాణానికి రూ.4.40 కోట్లు వెచ్చిస్తుంటే.. ఏపీ జెన్కో మాత్రం ఒక ప్రాజెక్టులో ఏకంగా రూ.6.30 కోట్లు వ్యయం చేయనుంది. టెండర్ల విషయంలో జాతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (ఎన్టీపీసీ) అనుసరించే విధానాలను పక్కనబెట్టింది. కేవలం రెండు ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చేం దుకు వీలుగా టెండర్ నిబంధనలు పొందుపర్చింది. బాయిలర్, టర్బైన్, జనరేటర్ (బీటీజీ) పనులను.. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ (ప్లాంట్కు సంబంధించిన మిగతా పనులు-బీవోపీ) పనుల్ని ఉద్దేశపూర్వకంగా విడగొట్టింది. బీవోపీ పనులు ప్రైవేటు సంస్థలు టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, బీజీఆర్ (బి.జి.రఘుపతి ఎనర్జీ సిస్టమ్స్ లిమిటెడ్) సంస్థలు దక్కించుకునేలా చేసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ఉన్నతాధికారులు కూడా కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. బీవోపీ కాంట్రాక్టులకు సంబంధించి ఈ సంస్థ డమ్మీ టెండర్లు వేయడం, టాటా, బీజీఆర్లు ఆయా ప్రాజెక్టుల్లో ఎల్.1గా నిలవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. వేల కోట్ల ప్రజా ధనం చేతులు మారడమే ఇందుకు కారణమని, ఈ మొత్తం తతంగం వెనుక ప్రభుత్వాధినేత హస్తం ఉందని జెన్కో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ జెన్కో కొత్తగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఒకటి, విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద మరొక థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతోంది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుల నిర్మాణ పనులను రెండు కాంట్రాక్టులుగా విభజించారు. టెండర్ల విషయంలో గతంలో ఎన్టీపీసీ నిబంధనలనే ఏపీ జెన్కో కూడా పాటించేది. ఏపీ జెన్కోయే కాదు దాదాపు దేశంలోని అన్ని జెన్కోలూ ఈ నిబంధనలే అనుసరిస్తున్నాయి. కానీ ఈ ప్రాజెక్టుల విషయంలో ఎన్టీపీసీ సైతం విధించని అర్హత నిబంధనలతో (క్యూఆర్) ఏపీ జెన్కో గత అక్టోబర్లో టెండర్లు పిలిచింది. ఈ నిబంధనల మేరకు బీవోపీ పనులకు టెండర్లు వేయగలిగే అర్హత టాటా, బీజీఆర్లకు మినహా దేశంలోని మరే ప్రైవేటు సంస్థకూ లేకపోవడం గమనార్హం. అంటే ఉద్దేశపూర్వకంగానే.. టాటా, బీజీఆర్లు కాంట్రాక్టులు దక్కించుకునేందుకు వీలుగానే ఆ నిబంధనలు విధించినట్లు స్పష్టమవుతోంది. ఈ విధమైన అర్హతలు పెట్టడంపై ఇతర సంస్థలు కొన్ని అభ్యంతరాలు చెప్పాయి. దీనివల్ల ఆరోగ్యకరమైన పోటీ కొరవడి, ప్రజాధనం దుర్వినియోగం అయ్యే వీలుందని ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. ముందెన్నడూ లేని అర్హత నిబంధనలు టెండర్లో పాల్గొనే సంస్థ గడచిన పదేళ్ల కాలంలో 500 మెగావాట్ల సామర్థ్యం గల రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించి ఉండాలనేది ప్రధాన అర్హత. ఎన్టీపీసీ మార్గదర్శకాల ప్రకారం ఒక యూనిట్ నిర్మించి ఉంటే సరిపోతుంది. ఇక ఇంతకన్నా కఠినమైన నిబంధన ఏమిటంటే.. టెండర్లో పోటీ పడే సంస్థ ఇప్పటివరకు నిర్మించిన థర్మల్ ప్రాజెక్టుల్లో కనీసం ఒక ప్రాజెక్టులోనైనా రెండేళ్ల పాటు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించి ఉండాలి. మిగతా ప్రాజెక్టుల్లో ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు గ్రిడ్కు అనుసంధానించి ఉండాలి. అయితే ఒక ఏడాది వాణిజ్య కార్యకలాపాలు ఉంటే చాలనేది ఎన్టీపీసీ నిబంధన. ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించినా చాలని ఎన్టీపీసీ చెబుతుంటే, జెన్కో మాత్రం కేంద్ర, రాష్ట ప్రభుత్వాల పరిధిలో, లేదా పబ్లిక్ రంగ సంస్థల్లో థర్మల్ ప్రాజెక్టులు నిర్మిస్తేనే టెండర్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. ఈ అర్హతలు బీహెచ్ఈఎల్, టాటా, బీజీఆర్లకు తప్ప మరోసంస్థకు లేకపోవడం గమనార్హం. అడ్డగోలుగా రింగ్ ఈ నేపథ్యంలో పోటీ లేకుండానే బీటీజీ కాం ట్రాక్టును రెండుచోట్లా బీహెచ్ఈఎల్ దక్కిం చుకుంది. బీవోపీ కాంట్రాక్టుల విషయంలో కృష్ణపట్నంలో టాటా, ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ ఎల్.1గా నిలిచాయి. వీటిని కైవసం చేసుకునే విషయంలో ఈ మూడు కంపెనీలు రింగవ్వడం ఈ కథలో మరో ట్విస్ట్. బీటీజీ టెండర్ను నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్న బీహెచ్ఈఎల్, బీవోపీ కాంట్రాక్టులు చేసే అర్హత తనకున్నా అందుకోసం ప్రయత్నించలేదు. బీహెచ్ఈఎల్లోని కొందరు ఉన్నతాధికారులు ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కు కావడమే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే బీవోపీ టెండర్లలో పాల్గొని ఉద్దేశపూర్వకంగా ఎక్కువ కోట్ చేయడం ద్వారా టాటా, బీజీఆర్లకు మార్గం సుగమం చేసిందని సమాచారం. ఒక ప్రాజెక్టుకు కనీసం 3 టెండర్లు ఉండాలనే నిబంధన నేపథ్యంలో బీహెచ్ఈఎల్, టాటా, బీజీఆర్లు రింగ్ అయ్యాయి. ఇబ్రహీంపట్నంలో బీహెచ్ఈఎల్, టాటాలు ఎక్కువ ధర కోట్ చేసి బీజీఆర్ ఎల్.1గా నిలిచేలా చేశాయి. ఇందుకు ప్రతిగా కృష్ణపట్నంలో బీహెచ్ఈఎల్, బీజీఆర్లు ఎక్కువ కోట్ చేసి టాటా ఎల్.1గా నిలిచేలా చేశాయి. మెగావాట్కు రూ.6.30 కోట్లా?! టాటా, బీజీఆర్లు రెండు ప్రాజెక్టుల వ్యయం అనూహ్యంగా పెంచేయడం గమనార్హం. ఇబ్రహీంపట్నంలో చేపట్టే ప్రాజెక్టు వ్యయాన్ని బీజీఆర్ మెగావాట్కు ఏకంగా రూ.5.85 కోట్లుగా పేర్కొంది. (బీహెచ్ఈఎల్కు బీటీజీ కాంట్రాక్టు కింద మెగావాట్కు రూ. 2.88 కోట్లు, బీపీవో కింద బీజీఆర్కు మెగావాట్కు రూ.2.97 కోట్లు) ఇక కృష్ణపట్నంలో ఒక మెగావాట్కయ్యే ఖర్చును రూ.6.30 కోట్లుగా టాటా పేర్కొంది. (బీహెచ్ఈఎల్కు రూ.2.88 కోట్లు, టాటాకు రూ.3.42 కోట్లు). అంటే 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9,720 కోట్ల వ్యయం అవుతుందన్నమాట. అయితే తెలంగాణ జెన్కో ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ ఐదింటినీ ఒకే కాంట్రాక్టుగా (బీటీజీ, బీవోపీ విడగొట్టకుండా) ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్కే అప్పగించారు. మొత్తం 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టుల వ్యయం రూ. 17,600 కోట్లు. అంటే మెగావాట్కు రూ.4.40 కోట్లు మాత్రమే ఖర్చవుతోంది. మరో రాష్ట్రం గుజరాత్లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ ప్రాజెక్టును రూ.3,536 కోట్లతోనే చేపడుతున్నారు. అంటే మెగావాట్ రూ. 4.42 కోట్లు అవుతుంది. ఇక్కడ కూడా ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కే ఒకే కాంట్రాక్టుగా పనులు అప్పగించారు. కానీ ఏపీ జెన్కో మాత్రం మెగావాట్కు రూ. 5.85 కోట్లతో ఒక ప్రాజెక్టును, రూ.6.30 కోట్లతో మరొక ప్రాజెక్టును కట్టబెట్టేదుకు రంగం సిద్ధం చేసింది. మంత్రి దేవినేని ఆరోపణలు ఏమయ్యాయి? ప్రస్తుతం మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే బీజీఆర్ సంస్థపై నిప్పులు చెరిగారు. ఆ సంస్థ నాసిరకంగా పనులు చేస్తోందని ఆరోపించారు. అసలా సంస్థకు పనులు అప్పగించడమే సరికాదన్నారు. ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ అదే సంస్థకు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎర్ర తివాచీ పరిచి మరీ కాంట్రాక్టులు కట్టబెట్టడం గమనార్హం. మరోవైపు ఢిల్లీకి చెందిన మౌలిక్ భారత్ అనే స్వచ్ఛంద సంస్థ బీజీఆర్ తప్పుడు అర్హతలు చూపుతోందని నేరుగా సీఎం చంద్రబాబునాయుడికే ఫిర్యాదు చేసింది. ఈ నెల 4వ తేదీన టెండర్లు ఓపెన్ చేయడానికి ముందే (నవంబర్ 17న) ముఖ్యమంత్రికి లేఖ రాసింది. జెన్కో ప్రాజెక్టు టెండర్ల ఖరారులో అవకతవకలు జరుగుతున్నాయనీ పేర్కొంది. ఈ విషయమై విచారణకు తగిన సమయం ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కనీసం విచారణ కూడా జరపకుండానే టెండర్లు కట్టబెట్టడం వెనుక వేల కోట్ల ముడుపుల మతలబు ఉందని జెన్కో వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అదనపు పనుల వల్ల పెరిగిన వ్యయం: జెన్కో ఎండీ కృష్ణపట్నం, ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని ఏపీ జెన్కో ఎండీ విజయానంద్ తెలిపారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే ఉద్దేశంతోనే పనులను బీటీజీ, బీవోపీగా విడగొట్టినట్టు చెప్పారు. తెలంగాణ జెన్కో చేపట్టే బీవోపీ పనులకన్నా, ఏపీ ప్రాజెక్టుల్లో అదనంగా అనేక పనులు చేర్చామని, అందువల్లే వ్యయం పెరుగుతోందన్నారు. కృష్ణపట్నంలో సముద్రం నీరు శుద్ధి చేసి అందించే పనికే దాదాపు రూ.500 కోట్లు అవుతుందన్నారు. రెండు చోట్ల సిబ్బందికి అవసరమైన కాలనీని అన్ని వసతులతో కట్టించే ఒప్పందం కూడా బీవోపీలో ఉందన్నారు. ఏపీ జెన్కో విధానాలనే మరో నాలుగు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని వివరణ ఇచ్చారు. టెండర్లను ఖరారు చేయలేదని, వారితో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. జెన్కోకు నష్టం చేసే విధానాలను అనుసరించబోమన్నారు. రూ. 2,680 కోట్ల గోల్మాల్ రెండు కంపెనీలనే ఎంచుకుని ఎక్కడా లేని విధంగా నిర్మాణ వ్యయాన్ని అనుమతించడం వెనుక భారీ కుంభకోణం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం తమ ప్రాజెక్టుల్లో మెగావాట్కు రూ.4.40 కోట్లు చెల్లిస్తోంటే, ఏపీలో మెగావాట్కు అత్యధికంగా రూ.6.30 (కృష్ణపట్నం) కోట్లు చెల్లిస్తున్నారు. బీటీజీ కాంట్రాక్టు (బీహెచ్ఈఎల్) విషయం లో మెగావాట్ వ్యయం తెలంగాణతో దాదాపు సరిసమానంగా ఉన్నా బీవోపీ కాంట్రాక్టుల విషయంలో భారీ వ్యత్యాసం చోటు చేసుకోవడం గమనార్హం. కృష్ణపట్నంలో టాటా సంస్థ మెగావాట్కు రూ.1.90 కోట్లు ఎక్కువ కోట్ చేయడం ద్వారా రూ.1,520 కోట్లు (రూ.1.90:800) అదనంగా దండుకుంటోంది. ఇక ఇబ్రహీంపట్నంలో బీజీఆర్ సంస్థ మెగావాట్కు రూ.1.45 కోట్లు ఎక్కువ కోట్ చేసి రూ.1,160 కోట్లు (రూ.1.4:800) అదనంగా దక్కించుకోనుంది. అంటే మొత్తం రూ.2,680 కోట్లు ప్రైవేటు సంస్థలకు అదనంగా దోచిపెట్టేందుకు రంగం సిద్ధమయ్యిందన్నమాట. విచిత్రం ఏమిటంటే బీజీఆర్ నాలుగు నెలల క్రితమే మధ్యప్రదేశ్లోని బరేటీ వద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టును పొందింది. అక్కడి ప్రభుత్వం ఒక్కో మెగావాట్కు 0.83 కోట్లు మాత్రమే ఇస్తుండటం గమనార్హం కాగా.. అదే సంస్థకు ఏపీ జెన్కో మెగావాట్కు రూ.2.97 కోట్ల చొప్పున ఒక్కో మెగావాట్కు రూ. 2.14 కోట్లు అధికంగా కట్టబెడుతోంది. -
రెండో దశ రుణమాఫీకి రూ.2,375 కోట్లు
హైదరాబద్: రెండో దశ రైతు రుణ మాఫీ కోసం రూ. 2,375 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రైతు సాధికారిక సంస్థకు ఈ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదట్లో సెక్యూరిటీల విక్రయం ద్వారా సమీకరించిన వెయ్యి కోట్ల రూపాయల రుణాన్ని.. రెండో దశ రుణ మాఫీ కోసం ఆర్థిక శాఖ అప్పట్లోనే రైతు సాధికారిక సంస్థకు ఇచ్చింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement