-
15 నిమిషాల్లోనే స్కానింగ్ రిపోర్ట్
తిరుపతి (తుడా): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల నుంచి పుట్టిన గుండె చికిత్సాలయం ఆదరణ పొందుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బర్డ్ పాత భవనంలో శ్రీ పద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ సెంటర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ నెల 11న ప్రారంభించిన ఈ సెంటర్ రుయాకు వరంగా మారింది. ఇందులోని చిన్నపిల్లల ఆస్పత్రికి రోజుకు 200కు పైగా ఓపీలు నమోదవుతున్నాయి. వీరిలో రోజుకు 15 మంది చిన్నపిల్లలకు ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) అవసరమవుతోంది. కార్డియాక్ సెంటర్లో ఐసీయూ వార్డు మూడు నెలల క్రితం వరకు గుండె స్కానింగ్ కోసం స్విమ్స్, ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లాల్సి వచ్చేది. ప్రభుత్వం కొత్తగా కార్డియాలజిస్టును నియమించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎకో కార్డియోగ్రామ్ (గుండె స్కానింగ్) రిపోర్టును అందజేస్తున్నారు. ఓపీ సేవలు ముగిసేలోపే రిపోర్టు వస్తుండటంతో వైద్యులు పరిశీలించి వెంటనే సూచనలు చేస్తున్నారు. గతంలో ఈ పరీక్ష చేయించుకుని నివేదిక తీసుకోవాలంటే రోజంతా నిరీక్షించాల్సిన పరిస్థితి ఉండేది. గుండె సంబంధిత సమస్యలున్న పిల్లలను బయటి ప్రాంతాలకు తీసుకెళ్లే పనిలేకుండా స్థానికంగానే అత్యున్నత వైద్యం అందుతుండటంపై బాధితుల కుటుంబీకులతోపాటు వైద్యాధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్తనాదాలతో దద్దరిల్లిన రుయా
⇒ఏర్పేడు రోడ్డు ప్రమాద మృతులకు రుయాలో పోస్టుమార్టం ⇒రైతుల మృతికి పోలీసులు, రెవెన్యూ అధికారులు, బొజ్జల అనుచరులే కారణం ⇒మార్చురీ వద్ద ఆందోళనకు దిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ తిరుపతి మెడికల్, అలిపిరి : ఏర్పేడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో తిరుపతి రుయా ఆస్పత్రి దద్ధరిల్లింది. మృతులను చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ముసిలిపేడుకు చెందిన దేవతమ్మ కొడుకు ఎం.హరిబాబు(45), తమ్ముడు ఎం.బాబు (47) మృతి చెందడం, హరిబాబు కొడుకు సాయి గాయాల పాలవడంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. తమ గ్రామ సరిహద్దులో మాజీ మంత్రి బొజ్జల అనుచరుడు ధనంజయులునాయుడు, చిరంజీవి నాయుడు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, దీన్ని అడ్డుకున్నందుకు కక్ష గట్టి తమను లారీ రూపంలో చంపించారని గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి శ్రీదేవి, సీపీఎం నాయకులు కందారపు మురళి, రైతు సంఘం నుంచి నాగరాజు, జయచంద్ర, సీపీఐ నుంచి వెంకయ్య, చిన్నం పెంచలయ్య, రామానాయుడు, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరుగట్టు నగేష్, కన్వీనర్ విజయభాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్రమాదానికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. రూ.25లక్షలు పరిహారం చెల్లించాలి.. ప్రమాదంలో మరణించిన వారికి రూ.25లక్షలు, గాయపడ్డ వారికి రూ.15లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణ స్వామి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జ్ బియ్యపు మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు. వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నాడని తెలిపారు. ఇసుకను తరలిస్తూ దొరికిపోయిన వారిపై ఎలాంటి కేసూ నమోదు చేయడం లేదన్నారు. ఇందులో పోలీసులకు, రెవెన్యూ అధికారులకు రోజువారీ మామూళ్లు వెళుతున్నాయని ఆరోపించారు. దీన్ని రైతులు అడ్డుకుంటే వారిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు పెడతానంటూ సీఐ బెదిరించడం దారుణమన్నారు. ఇసుక మాఫియా కారణం కాదు ఏర్పేడు రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందిన ఘటనకు, అక్కడ జరుగుతున్న ఇసుక మాఫియాకు ఎలాంటి సంబంధమూ లేదని సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య తెలిపారు. రుయా మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, దీన్ని ఇసుక మాఫియా కింద చూడకూడదని అన్నారు. విచారిస్తున్నాం.. ఏర్పేడు ఘటన పూర్తిగా రోడ్డు ప్రమాదమని తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి తెలిపారు. దీన్ని ఇసుక మాఫియాతో పోల్చకుండా ప్రత్యేకంగా విచారించాలన్నారు. ఈ ఘటనలో రైతులతోపాటు పోలీసులు కూడా గాయపడ్డారని, ప్రాథమిక విచారణలో లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడం వల్లే జరిగినట్టు తేలిందని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement