-
వ్యవసాయాధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలి
సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దీనిద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగంలో పరిశ్రమల ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకెళ్లేందుకు వీలవుతుందని ఉపరాష్ట్రపతి అన్నారు. రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీవోల) వంటివి చిన్న, మధ్యతరగతి రైతులకు ఎంతగానో ఉపయుక్తం అవుతాయన్నారు. వీటి నిర్మాణానికివ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలని వెంకయ్యనాయుడు సూచించారు. ఆదివారం బిహార్ చంపారన్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. చిన్న, మధ్యతరగతి రైతులు తమకున్న పరిమిత వనరులతో అద్భుతాలు సాధించడం వెనుక దేశ వ్యవసాయ రంగం గొప్పదనం దాగుందని, అందుకే వివిధ మార్గాల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారికి మద్దతుగా నిలవాలన్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ఆహారభద్రతను సుస్థిరం చేయాలన్నారు. -
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి
సాక్షి, వనపర్తి: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. రాష్ట్రంలోనే మొదటిదైన మత్స్య కళాశాల భవన నిర్మాణ పనులకు పెబ్బేరులో సోమవారం నాడు ఆయన శంకుస్థాపన చేశారు. అదేవిధంగా అద్దె భవనంలో తరగతులను ప్రారంభించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచడంతోపాటు ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే భావనతో ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను అందజేస్తుందన్నారు. గడిచిన సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను, ఈ ఏడాది 51 కోట్ల చేపపిల్లల విత్తనాలను ఉచితంగా అందజేశామన్నారు. రాష్ట్రంలో జలవనరులు అధికంగా ఉన్నాయని వీటికి తోడు నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తయితే నీరు నిల్వ ఉండే ప్రాంతం పెరుగుతుందని, దీనికితోడు చెరువుల పునరుద్ధరణ మిషన్ కాకతీయ వల్ల కూడా నీటి నిల్వ సామర్థ్యం బాగా పెరిగిందన్నారు. రానున్న రోజుల్లో చేపల సరఫరాలో రాష్ట్రం ముందంజలో ఉండాలనే సంకల్పంతో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ రంగంలో పరిశోధనలు పెరగాలని మత్స్య కళాశాలను ప్రారంభిస్తున్నామన్నారు. విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ఈ రంగంలో మంచి భవిష్యత్ ఉంటుందని మీకు కోర్సు పూర్తి కాగానే మీకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అన్నారు. ఈ ప్రాంత ప్రజల అదృష్టం.. మత్స్య కళాశాల వనపర్తి జిల్లాకు రావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి అన్నారు. కళాశాల భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం రూ.86 కోట్లు మంజూరు చేసిందని ఏడాదిలోగా పనులు పూర్తిచేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పశు సంవర్ధక శాఖ కళాశాల సంచాలకులు వెంకటేశ్వర్లు, గొ ర్రెలు, మేకల సహకార సంఘం రాష్ట్ర ఎండీ లక్ష్మారెడ్డి, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, జాయింట్ కలెక్టర్ నిరంజన్రావు, ఆర్డీఓ చంద్రారెడ్డి, కళాశాల డీన్ రవీందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు రవికుమార్, బుచ్చారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రమేష్, గ్రంథాలయ చైర్మన్ లక్ష్మయ్య, పెబ్బేరు సర్పంచ్ సుశీల, ఎంపీపీ పద్మావతి పాల్గొన్నారు. వారివి అర్థం లేని మాటలు.. పెద్దమందడి (ఖిల్లాఘనపురం): కాంగ్రెస్ దొంగలంతా అచ్చంపేటలో కలిసి బీసీలకు ఏం చేశారని ప్రశ్నించడం సిగ్గుచేటని తెలంగాణ మంత్రి తలసాని అన్నారు. పెద్దమందడి మండలం వెల్టూరులో రూ.16 లక్షలతో నిర్మించిన పశువైద్య ఆరోగ్య కేంద్రం నూతన భవనం, రూ.13 లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు గదిని నిరంజన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల అభివృద్ధికి, కులవృత్తుల ప్రోత్సాహానికి చేపడుతున్న పథకాలతో తాము ఎక్కడ ఉనికి కోల్పోతామోనని మాట్లాడుతున్నారని విమర్శించారు. వనపర్తి జిల్లాలో 198 గొర్రెల సహకార సంఘాలు ఉండగా సభ్యులకు 29.50 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దయాకర్, జెడ్పీటీసీ సభ్యుడు జేడీ విజయరామారావు, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ సత్యనారాయణరెడ్డి, మండల పశువైద్యాధికారి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రూరల్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్
1. నీటిసరఫరాను ఏ రంగంలో భాగంగా పరిగణిస్తారు? ద్వితీయ రంగం (తయారీ, నిర్మాణం, విద్యుత్, చమురు రంగాలను కూడా ద్వితీయ రంగాల్లో భాగంగానే పరిగణిస్తారు) 2. గర్బిణులు,బాలింతలకు పోషకాహార పంపిణీ, సంరక్షణ కోసం డిసెంబర్ 4, 2012న ప్రారంభించిన పథకం? అమృతహస్తం 3. నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహంలో కన్పించే మార్పులు? 1. జీవశాస్త్ర 2. రసాయనిక 3. యాంత్రిక 4. రైతుల జీవన స్థితిగతులను మెరుగుపర్చడానికి అక్టోబరు 4, 2006న జాతీయ రైతు కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? ఎం.ఎస్. స్వామినాథన్ 5. లాభదాయక వ్యవసాయం కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ? జయతీఘోష్ 6. రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసి, వాటి నివారణకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్? రామచెన్నారెడ్డి కమిషన్ 7. 1983లో ఏపీలో నిమ్న జాతుల అభివృద్ధి కోసం ఎన్టీయార్ ‘15 సూత్రాల ప్రగతి పథకాలు’ ప్రవేశపెట్టారు. దీనిలోని ముఖ్యాంశాలు? 1. కిలో రెండు రూపాయల బియ్యం 2. నిరుపేదలకు జనతా వస్త్రాల పంపిణీ 3. బడిపిల్లలకు మధ్యాహ్న భోజన పథకం 4. వితంతువులకు పింఛన్లు 8. భూగర్భ జల మట్టాన్ని పెంచడంతోపాటు వృథా నీటిని నిలువ చేయాలనే ఉద్దేశంతో 1997, డిసెంబర్లో ఏ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని వాటర్షెడ్ పథకాన్ని ప్రారంభించారు? మహారాష్ర్ట 9. భారతదేశంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకం? రోష్నీ (జూన్ 7, 2013) 10. పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? నంద్యాల (కర్నూల్ జిల్లా) 11. మిర్చి పరిశోధన కేంద్రం ఎక్కడుంది? లాం (గుంటూరు జిల్లా) 12. 1929లో బాల్య వివాహాల నిరోధక చట్టం (దీన్నే శారదా చట్టం అంటారు) చేశారు. ఈ చట్టం స్థానంలో బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకువచ్చింది? 2006 (2007 నుంచి అమల్లోకి వచ్చింది) 13 స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ర్టం? బీహార్ 14. నిర్బంధ ప్రాథమిక విద్యను సూచించే అధికరణలు ఏవి? 21(ఎ), 45, 51(ఎ) (ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాల్లో నిర్బంధ విద్య గురించి పేర్కొన్నారు) 15. అక్టోబరు 29, 2013న కేంద్ర ఆహార శాఖ మంత్రి కె.వి. థామస్ లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ (టీపీడీఎస్) పేరును ఏ విధంగా మార్చారు? ఇందిరమ్మ అన్న యోజన 16. ఐదేళ్లలో మురికివాడలు లేని భారతదేశాన్ని రూపొందించడానికి 2012లో ఏర్పాటు చేసిన పథకం? ఆర్ఏవై - రాజీవ్ ఆవాస్ యోజన 17. రాజ్యాంగంలో 40వ అధికరణం గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి తెలుపుతోంది. ఐతే స్థానిక స్వపరిపాలనా సంస్థల గురించి వివరించే భాగం? 4వ భాగం 18. {V>-Ð]l$-çసభకు ప్రాధాన్యత కల్పించడం, న్యాయ పంచాయతీ విధానం ఏర్పాటు, పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడం గురించి సిఫారసు చేసిన కమిటీ? ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ (1986) 19. {పాంతీయ ఆచారాలు, సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని ఏయే రాష్ట్రాల్లో ప్రత్యేక పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు? నాగాలాండ్, మణిపూర్, మిజోరామ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ 20. ఏపీలో దారిద్య్ర రేఖకు దిగువనున్న వారి శాతం? 15.8 శాతం 21. 2011-12 నాటికి దేశంలోని పేదల శాతం ఎంత? 21.9 శాతం (26.93 కోట్లు) 22. {V>-Ò$× ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు? 25.7 శాతం 23. పట్టణ ప్రాంతంలో ఎంతశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు? 13.7 శాతం 24. 2015 నాటికి పేదరికం ఎంత శాతం తగ్గుతుందని అంచనా వేశారు? 22 శాతం 25. భారతదేశంలో అత్యధిక పేదరికంలో ఉన్న రాష్ట్రాలు? ఒడిశా, బీహార్, చత్తీస్ఘడ్ 26. పేదరికం అంచనాల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 21వ స్థానం (15.79శాతం) 27. 15 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిని ఏమంటారు? ఉత్పాదక వయోవర్గం 28. {శామికుల పెరుగుదల రేటు కంటే ఉద్యోగావకాశాల పెరుగుదల రేటు తక్కువగా ఉండటాన్ని ఏమంటారు? వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత 29. వ్యవసాయ రంగంలో కొన్ని నెలలపాటు శ్రామికులకు పని ఉండి, మరికొన్ని నెలలు నిరుద్యోగులుగా ఉండటాన్ని ఏమంటారు? కాలిక నిరుద్యోగిత/ రుతు సంబంధిత నిరుద్యోగిత 30. ఉత్పాదక వయోవర్గంలో అధిక జనాభాను కలిగిన జిల్లా? తూర్పు గోదావరి (61.93 శాతం) 31. జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం)ను ఎప్పుడు ప్రారంభించారు? ఆగస్టు 2007 32. జూలై 12,1982న శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు నాబార్డను ఎవరు ఏర్పాటు చేశారు? ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా 33. అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటని పేర్కొన్న సంస్థ? {sాన్సపరెన్సీ ఇంటర్నేషనల్ 34. అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానం? 94వ స్థానం 35. కేంద్ర నిఘా కమిషన్ మాజీ అధిపతి ఎన్. విఠల్ ప్రకారం భారతదేశంలో స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం అవినీతి చోటు చేసుకుంది? 40 శాతం 36. {పపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణలకు శ్రీకారం చుట్టిన ప్రధాన మంత్రి? పి.వి.నరసింహారావు (1990) 37. అవినీతి నిరోధక చట్టాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో రూపొందించింది? 1947 38. అవినీతి నివారణకు తొలిసారిగా పరిపాలన సంస్కరణలను సూచించడానికి వేసిన కమిటీ? కె. సంతానం 39. భారతదేశంలో తొలిసారి నక్సలిజం ప్రారంభమైన రాష్ర్టం? పశ్చిమ బెంగాల్ 40. హార్టికల్చర్ రంగం అభివృద్ధికి(పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్) 2005 మేలో నియమించిన మిషన్? నేషనల్ హార్టికల్చర్ మిషన్ 41. పట్టణ ప్రాంతంలో ఒక వ్యక్తి సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన కనీస క్యాలరీలు? 2100 42. {V>-Ò$× ప్రాంతంలో ఒక వ్యక్తి సగటున రోజూ తీసుకునే ఆహారంలో ఉండాల్సిన క్యాలరీలు? 2400 43. {పధానమంత్రి గ్రామోదయ యోజన(పీఎంజీవై) ముఖ్య లక్ష్యం? ప్రాథమిక విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణం, తాగునీరు 44. ఎస్ఐటీఆర్ఏ(సిట్రా) ఉద్దేశం? గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తిదారులకు ఆధునిక పనిముట్ల సరఫరా 45. డ్వాక్రా ఒక? గ్రామీణ ప్రాంతాల్లో మహిళా, శిశు అభివృద్ధి పథకం 46. సుఖీభవ పథకం దేనికి ఉద్దేశించింది? ఆడశిశువుల సంక్షేమం 47. ఆంధ్రాప్రాంతంలో ఇనాందార్లను ఏమని పిలిచేవారు? మొఘసా 48. ఆంధ్ర కౌలుదారుల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1956 49. హైదరాబాద్ (తెలంగాణ) కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1950 50. రక్షిత కౌలుదారులుగా ఎవరిని పేర్కొంటారు? ఆరేళ్లు కౌలుదారులుగా ఉన్నవారిని 51. ఆంధ్రరాష్ర్ట రైతుసంఘం ఎప్పుడు ఏర్పడింది? 1928లో 52. అఖిల భారత కిసాన్ సభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1936లో 53. మనదేశంలో అత్యధిక సగటు భూకమతం కలిగిన రాష్ట్రాలు వరుసగా రాజస్థాన్, పంజాబ్ కాగా, అతి తక్కువ కలిగిన రాష్ర్టం? కేరళ 54. భూ సంస్కరణల అంతిమ లక్ష్యం ఏమిటి? సామాజిక న్యాయం సాధించడం 55. ఏపీలో భూగరిష్ఠ పరిమితి చట్టాలు ఏవి? 1) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం-1(1961) 2) ఆంధ్రప్రదేశ్ భూగరిష్ఠ పరిమితి చట్టం - 2 (1973) 56. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్లాకులను పునర్ వ్యవస్థీకరించే విషయంలో పరిశీలన కోసం వేసిన కమిటీ? పాయ్ కమిటీ 57. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 6 ప్రకారం గ్రామసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1994 58. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామసభకు అధిక ప్రాధాన్యం కల్పించారు? 73వ 59. సమాజాభివృద్ధి పథకం (సీడీపీ)ని ఎప్పుడు ప్రారంభించారు? అక్టోబరు 2, 1952 60. సమాజం తనంతట తాను స్వయంశక్తిపై ఆధారపడి అభివృద్ధి చెందడం ఏ పథకం ముఖ్య లక్షణం? సమాజాభివృద్ధి పథకం 61. ఎడారి ప్రాంత అభివృద్ధి పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1977
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement