-
జైపాల్రెడ్డిపై విమర్శలు సరికాదు
టీఆర్ఎస్ ఎంపీలపై మల్లు రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్.జైపాల్రెడ్డిపై టీఆర్ఎస్ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఖండించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జైపాల్రెడ్డి చేసిన కృషి మరువలేనిదని, తెలంగాణ బిల్లును ఆమోదించే సమయంలో విపక్షాలను సమన్వయపరచడంలో ఆయన కీలకమైన పాత్రను నిర్వహించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్రెడ్డి పాత్ర లేదంటూ టీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించడం వారి రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. బుధవారం మల్లు రవి విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాక జైపాల్రెడ్డిని మొదట కేసీఆర్ కలసిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు మరిచిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటులో జైపాల్రెడ్డి పాత్ర ఏమిటో సీఎం కేసీఆర్ను అడిగితే టీఆర్ఎస్ నాయకులకు తెలుస్తుందన్నారు. కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, ఆయన ఏ విధమైన దీక్ష చేశారో, ఎలా విరమించారో, దానిపై ఓయూ విద్యార్థుల నుంచి ఎలాంటి నిరసనలు ఎదుర్కొన్నారో ప్రజలకు తెలుసునన్నారు. కేసీఆర్ చేసింది దొంగ దీక్ష కాదని టీఆర్ఎస్ నాయకులు నిరూపించగలరా అని ప్రశ్నించారు. -
'వాళ్లు పచ్చి అవకాశవాదులు'
మహబూబ్నగర్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి విధివిధానాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 2013 నాటి భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టం అమలు చేయకుంటే నిరసనలు చేపడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని వదలిపెట్టి ఇతర పార్టీల్లోకి వెళ్లినవాళ్లు పచ్చి అవకాశవాదులని పేర్కొన్నారు. వచ్చే రెండున్నరేళ్లలో సత్తా చాటుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ పచ్చి అవకాశవాది అని అంతకుముందు ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకే కాదు, రాష్ట్రంలో ఏ వర్గానికి దక్కలేదని జైపాల్ రెడ్డి అన్నారు. -
'ఎమ్మెల్యేలను లాక్కోవడం అప్రజాస్వామికం'
హైదరాబాద్: విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఏపీ సర్కారుపై తెలంగాణ ప్రభుత్వం చేసే పోరాటానికి కాంగ్రెస్ మద్దతిస్తుందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి విషయంలోఅధికార టీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీలతో కూడా కలవడానికే కూడా సిద్ధమేనన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామన్నారు. ప్రజల, హక్కులను, స్వేచ్ఛను హరించేవిధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లాక్కోవడం అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి విధానాలతో నవతెలంగాణ నిర్మాణం జరపలేరన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదని జైపాల్రెడ్డి అన్నారు. -
మెజారిటీతోనే బిల్లుకు ఆమోదం: జైపాల్ రెడ్డి
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభలో మూడిం ట రెండొంతుల మెజారిటీతో ఆమో దం లభించిందని కేంద్రమంత్రి ఎస్.జైపాల్రెడ్డి అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్నారంటూ ప్రచారం చేయడం సరికాదని, ఓటింగ్ ద్వారానే బిల్లు ఆమోదం పొందిందని స్పష్టం చేశారు. బిల్లు ఆమోదం తర్వాత మంగళవారం జైపాల్రెడ్డి నివాసానికొచ్చిన టీ-మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు స్వీట్లు పంచుకుని, బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రు లు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్తోపాటు రాష్ట్ర మంత్రులు జానారెడ్డి, శ్రీధర్బాబు, పొన్నాల, సారయ్య, ఎంపీలు మధుయాష్కీ, పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, గుత్తా సుఖేందర్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తదితరులతో కలిసి జైపాల్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘యూపీఏ, బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించాక కూడా బిల్లుకు తగిన సంఖ్యా బలం లేదని ఎవరైనా చెప్పగలరా? తెలంగాణ రావడం సీపీఎంకు ఇష్టం లేదు. అందుకే ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి బిల్లుపై సవరణలు, ఓటింగ్ కోరాలనుకుంటే ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాదిరిగా సభలోని తమ తమ స్థానాల్లో ఎందుకు కూర్చోలేదు? అలాగాక వెల్లోకి దూసుకువచ్చి సవరణలపై ఓటింగ్ కోరడమేంటి?’’ అని ప్రశ్నించారు. కాగా తెలంగాణ ఏర్పాటు చారిత్రక విజయమని, దీన్ని ఉద్యమ అమరులకు అంకితమిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఏపీభవన్లో టీ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబరాలు చేసుకున్నారు. తర్వాత విలేకర్లతో మాట్లాడారు. మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్బాబు, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్రెడ్డి, యాదవరెడ్డి, మల్లురవి, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. కాగా తెలంగాణలోని నాలుగున్నర కోట్ల మంది ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అభివర్ణించారు. -
మూడు వారాల్లో తెలంగాణ: జైపాల్రెడ్డి
తెలంగాణ రాష్ట్రం, ప్రభుత్వం ఏర్పడతాయి: కేంద్రమంత్రి జైపాల్రెడ్డి గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లోనే సమయం చాలుతుంది.. బీజేపీ మద్దతిస్తుంది కిరణ్ది పనికిరాని తొండి తీర్మానం దానిపై స్పీకర్ది తప్పుడు నిర్ణయం పార్లమెంటుకు కళ్లు కూడా ఉన్నాయ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఈ రెండూ ఫిబ్రవరి మూడో వారాంతానికల్లా ఏర్పడడం ఖాయమని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పి పంపాలన్న సీఎం కిరణ్ తీర్మానాన్ని తొండి తీర్మానంగా అభివర్ణించారు. దాన్ని ఒక ప్రహసనంగా కొట్టిపారేశారు. ఈ విషయంలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా తప్పుడు నిర్ణయం తీసుకున్నారన్నారు. ‘ప్రిసైడింగ్ అధికారులకు దురుద్దేశాలు ఆపాదించను. వాళ్లూ మానవమాత్రులే. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు’ అని అన్నారు. ‘‘ఆ తీర్మానాన్ని అసలు సభ ఏకగ్రీవంగా ఆమోదించిందా? మన లోకంలో మనం నివసిస్తున్నాం. భారత పార్లమెంటుకు చెవులు మాత్రమే కాదు, కళ్లు కూడా ఉన్నాయి’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘తాము నిరోధించామంటూ కొందరు గొప్పలు చెప్పుకునేందుకు తప్ప అసెంబ్లీ తీర్మానం దేనికీ ఉపయోగపడదు. బిల్లులో భాగంగా ఆమోదిస్తే ఆ తీర్మానానికి రాజ్యాంగ విలువ ఉండకపోయినా రాజకీయ విలువైనా ఉండేది’’ అన్నారు. జైపాల్ శుక్రవారం సాయంత్రం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తామంతా ఉన్నామని, తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడిన అంశాలు ఆయన మాటల్లోనే... తీర్మానం.. ఓ ప్రహసనం: ‘‘తీర్మానం పేరుతో రాష్ట్ర అసెంబ్లీలో జరిగినదంతా ఒక ప్రహసనంలా ఉంది తప్ప తెలుగు ప్రజల ప్రతిష్టను, అసెంబ్లీ సంప్రదాయాన్ని పెంచేలా లేదు. అంత వివాదగ్రస్తమైన తీర్మానాన్ని ఏకపక్షంగా మూజువాణితో సెకన్ల వ్యవధిలో ఆమోదించడం అవాంఛనీయం, తప్పుడు విధానం. మండలిలో, అసెంబ్లీలో జరిగిన పరిణామాలు నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. పార్లమెంటు సర్వసత్తాక అధికారాన్ని ఈ తప్పుడు తీర్మానం ద్వారా తగ్గించామనే భ్రమ సృష్టిస్తున్నారు. దాంట్లో ఏ మాత్రం పస లేదు. పార్లమెంటు అధికారం వీసమంతా కూడా తగ్గదు. బిల్లును రాష్ట్రపతి పంపింది శాసనసభ అభిప్రాయాలు తెలుసుకునేందుకే తప్ప 77వ నిబంధన కింద అభిప్రాయం తెలపాలనో, తీర్మానం చేయాలనో కాదు. పైగా 77వ నిబంధన కింద ఏ తీర్మానాన్ని రూపొందించినా దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికే పంపిస్తారు. అంతే తప్ప రాష్ట్రపతికి పంపే అధికారం శాసనసభకు లేదు. ఆ తీర్మానాన్ని చూసి సీమాంధ్ర మిత్రుల్లో భ్రమలు పెరగకూడదు. తెలంగాణలో భయాలుండాల్సిన అవసరమూ లేదు’’ సభ ఆమోదం ఖాయం ‘‘కావాల్సిన సవరణలతో పార్లమెంటులో బిల్లు యథావిధిగా ఆమోదం పొందుతుంది. ఫిబ్రవరి మూడో వారం చివరికల్లా తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడతాయి. ఇది నిస్సందేహం. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రెండు రాష్ట్రాలు ఏర్పడతాయి. నాకున్న అవగాహన ప్రకారం అందుకు సమయం కూడా సరిపోతుంది. బిల్లు పాసవడమే కాదు.. గెజిట్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. రాష్ట్రం ఏర్పడుతుంది. అందుకు ఇంత సమయం పడుతుందంటూ ఎక్కడా లేదు. గత దృష్టాంతాలను బట్టి 6 నుంచి 85 రోజుల వరకు నోటిఫికేషన్ పీరియడ్ ఉంది. గుజరాత్కు 6 రోజులుంది. వాళ్లు సిటీ మార్చారు. ఇక్కడ ఆ అవసరం కూడా లేదు. ఆఫీసులు మార్చాల్సిన పనిలేదు. వాటిలో రూములు మార్చితే సరిపోతుంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో వెంటనే పెడతారని నా వ్యక్తిగత అంచనా. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడతాయని అనుకుంటున్నా. తెలంగాణ ఏర్పాటు కేవలం కాంగ్రెస్ నిర్ణయం కాదు. ముందు బీజేపీ, తరవాత బీఎస్సీ తీసుకున్న నిర్ణయం. తుదకు మాత్రమే కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణను సమర్థించిన చంద్రబాబుకు, వైఎస్సార్సీపీకి బాధ్యత లేదా?’’ పార్లమెంటే సుప్రీం మూడో అధికరణం ప్రకారం పార్లమెంటుకు సర్వసత్తాక అధికారముంది. రాష్ట్రాల అధికారాలివీ, కేంద్రం అధికారాలివీ, ఉమ్మడి అధికారాలివీ అని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అయితే ఆ జాబితాలను కూడా కాదని చట్టం చేసే అధికారాన్ని పార్లమెంటుకు 3వ అధికరణం ఇచ్చింది. బిల్లుపై బీజేపీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 3వ అధికరణ కింద ఉభయ సభలు ఒక బిల్లు రూపొందించాక అందులో కోర్టులు అంత సులువుగా జోక్యం చేసుకుంటాయనుకోను. సాంకేతిక కారణాలతో బిల్లును ఆపరు (ఆర్థిక ప్రతిపాదన పంపలేదనే వాదనపై స్పందిస్తూ)’’ సీమాంధ్రులవి ఏకపక్ష భావనలు ‘‘సీమాంధ్ర నేతలు ఒక్క విషయం ఆలోచించుకోవాలి. తెలుగు జాతి సమైక్యతను కాపాడతామంటున్నారు. తెలుగు జాతి తమిళనాడులో 25-35 శాతం ఉంది. బెంగళూరు నగరంలో 35-45 శాతం ఉంది. బళ్లారిలో 90 శాతం ఉంది. ఒడిషాలో జిల్లాలకు జిల్లాలే తెలుగు వారున్నారు. సీమాంధ్ర మిత్రులు ఏకపక్షంగా ఐక్యత కోరడంలోని అసహజత్వాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు. ఇది అస్వభావికం. ఇంత విభజన తర్వాత ఈ దశలో ఎలా కలిసుంటారు?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement