-
అవినీతికి కేరాఫ్ డీఎల్ రవీంద్రారెడ్డి
కడప కార్పొరేషన్: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్లో ఆయనకు నెలకు రూ.50 లక్షల బాడుగలు వచ్చే ఆస్తులున్నాయని చెప్పారు. రాజకీయాల్లోకి రాక ముందు ఆయన ఆస్తి, ఇప్పుడున్న ఆస్తి ఎంత అని నిలదీశారు. గురువారం ఇక్కడ మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎంవైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా బుధవారం రాష్ట్రమంతా వేడుకలు, సేవా కార్యక్రమాలు జరిగాయని, ఈ సంతోషం నుంచి రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయాలనే కుట్రతోనే డీఎల్ వైఎస్సార్సీపీ పైన, వైఎస్ జగన్ పైన విమర్శలు చేశారని చెప్పారు. రామోజీరావు, రాధాకృష్ణల ఎత్తుగడలో భాగంగానే డీఎల్ ప్రెస్మీట్ పెట్టారన్నారు. డీఎల్కు నైతిక విలువల్లేవని, నిజాయితీగా ఏ పార్టీకీ పనిచేయలేదని అన్నారు. ఆయన జీవితమంతా అక్రమాలేనని చెప్పారు. రెండుసార్లు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారని చెప్పారు. కోట్ల విజయ్భాస్కర్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కల్తీ మద్యం అమ్మి 20 మంది చనిపోవడానికి కారణమయ్యారని, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారని తెలిపారు. డీఎల్ గురించి తెలిసే వైఎస్ మంత్రిపదవి ఇవ్వలేదన్నారు. కిరణ్కుమార్రెడ్డి హయాంలో 108 ఒప్పందంలో అక్రమాలకు పాల్పడ్డారని, దీంతో ఆయన విదేశాల్లో ఉండగానే బర్తరఫ్ చేశారని తెలిపారు. 2014లో కాంగ్రెస్లో ఉంటూ టీడీపీ అభ్యర్థికి పనిచేశారని, ఆయన సతీమణి సుభద్రమ్మను టీడీపీ ఏజెంట్గా కూర్చొబెట్టారని తెలిపారు. 2019కి ముందు వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే తమ పార్టీలోకి వచ్చారన్నారు. అయితే టీడీపీకి ఓటెయ్యాలని చెప్పి తనకు, పార్టీకి తీరని ద్రోహం చేశారన్నారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో ఉన్నానని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అని నిలదీశారు. ఆయనకు అసలు వైఎస్సార్సీపీ సభ్యత్వమే ఇవ్వలేదని చెప్పారు. డీఎల్ నీచ చరిత్ర అందరికి తెలిసిందే: మేయర్ సురేష్బాబు డీఎల్ రవీంద్రారెడ్డి నీచ చరిత్ర వైఎస్సార్ జిల్లాలో చంటిపిల్లాడికి కూడా తెలుసని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. డీఎల్ ఓ పొలిటికల్ బ్రోకర్ అని, ఆయన జీవితమంతా బ్లాక్మెయిల్ రాజకీయాలేనని తెలిపారు. పేద విద్యార్థులకు ఉత్తమ విద్య అందించాలని బైజూస్తో ఒప్పందం చేసుకుంటే దానిపైనా విమర్శలు చేయడం దారుణమన్నారు. డీఎల్కు ఏ పార్టీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. పవన్ కళ్యాణ్లో ఏం నిజాయితీ కనిపించిందో డీఎల్ చెప్పాలని అన్నారు. -
కలకలం
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజా ప్రతినిధుల సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కెవీ రమణపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కోడెల శివప్రసాద్ దృష్టికి మైదుకూరు ఎమ్మెల్యే ఎస్ రఘురామిరెడ్డి అసెంబ్లీలో శుక్రవారం తీసుకెళ్లడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఆహ్వానించి, ఆపై పోలీసుల ద్వారా అడ్డుకొని ప్రజాప్రతినిధులను అవమాన పరచడంపై కొద్ది రోజులుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 168 నిబంధనల ద్వారా విచారణకు స్వీకరించి చర్యలు చేపట్టాలని ఆయన స్పీకర్ను కోరారు. ఆ మేరకు స్పీకర్ నోటీసు స్వీకరించారు. ఫిబ్రవరి 27న గండికోట ప్రాజెక్టు సందర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కలెక్టర్ జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. పైగా అందరూ ఆహ్వానితులేనని ఆహ్వాన పత్రంలో ముద్రించారు. ముఖ్యమంత్రి ప్రాజెక్టుల చెంతకు చేరుతున్నారని తెలిసి జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని అఖిలపక్షంగా ఏర్పడి పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. వాస్తవ విషయాన్ని తెలుసుకొని ముఖ్యమంత్రికి వివరించి నిధులు కోరాలని భావించారు. అలాంటి పరిస్థితిలో జమ్మలమడుగు నియోజకవర్గం గుర్రప్పకోన వద్ద పోలీసుల ద్వారా ఎమ్మెల్యేలను, అఖిలపక్షం సభ్యుల్ని అడ్డుకున్నారు. ప్రజాప్రతినిధులుగా తమ హక్కులకు భంగం కల్గించడం ఏమాత్రం సరైంది కాదని వివరించారు. ప్రజల కోసం, మెట్టప్రాంతం ఉన్నతి కోసం వాస్తవ పరిస్థితిని ముఖ్యమంత్రికి విన్నవించాలనే ఉద్దేశంతో ఉన్నామని ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతించాలని కలెక్టర్కు అక్కడి నుంచే ఫోను ద్వారా విన్నవించినా ఫలితం లేకపోయింది. కలెక్టర్పై తొలిసారి.. వైఎస్సార్ జిల్లా చరిత్రలో కలెక్టర్పై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేయడం తొలిసారి అని విశ్లేషకులు భావిస్తున్నారు. కలెక్టర్గా పనిచేస్తున్న జయేష్రంజన్ బదిలీ నేపథ్యంలో.. ఆయన బదిలీ అపాలంటూ ఉద్యమం చేసిన చరిత్ర జిల్లాలో ఉంది. ప్రస్తుత కలెక్టర్ తీరుతో విసిగి పోయి.. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు రౌండు టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ‘ఈకలెక్టర్ మాకొద్దు’ అని మూడు రోజుల క్రితం తీర్మానం చేశాయి. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు కడప జిల్లా అంటే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, భూములు ఇస్తామన్నా ముందుకు రావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం లేపింది. ఇక్కడ పెట్టుబడులకు భద్రత ఉండదనే భయంతో ఉన్నారని, ఇక్కడి ప్రజలు ఆవేశపరులు అంటూ మాట్లాడటం జిల్లా వాసులను ఆవేదనకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో.. ఈ కలెక్టర్ను ప్రభుత్వం వెనక్కు పిలిపించుకుని మరో సమర్థుడైన కలెక్టర్ను నియమించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. తొలి నుంచి వివాదస్పదమే.. జిల్లా కలెక్టర్గా కెవీ రమణ జూలైలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో రాజంపేట హైస్కూల్లో ఆర్థర్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేశారు. విచారణకు వెళ్లిన కలెక్టర్ గురువులు ‘గిచ్చడం’ విద్యాభివృద్ధి కోసమే అని మాట్లాడి వివాదాస్పదమయ్యారు. ప్రాంతీయ స్పోర్ట్సు స్కూల్ విద్యార్థులు అప్పటి స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి వైఖరికి నిర సనగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. డిప్యూటి డిఈఓ, పరిశ్రమల జిఎంలను ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసి కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అనంతరం స్పెషల్ ఆఫీసర్ను కలెక్టర్ పక్కలో కూర్చోబెట్టుకొని ఆరోపణలు తప్ప ఆధారాలు లేవంటూ క్లీన్ చిట్ ఇవ్వడం అప్పట్లో దుమారం లేపింది. అంతేకాకుండా విద్యార్థుల ఆందోళనకు యోగ, తెలుగు టీచర్లు డాక్టర్ రంగనాథ్, బాస్కర్రెడ్డిలు కారకులంటూ సస్పెన్షన్ చేశారు. బద్వేల్లో ప్రభుత్వ ఆస్పత్రిని మార్చొద్దని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రజల పక్షాన ఏకంగా ఎమ్మెల్యే జయరాములు నిరహార దీక్ష చేపట్టారు. ఇప్పుడున్న ఆస్పత్రి 10 ఎకరాల్లో ఉందని, ఆ స్థలం అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉందని, రూ.2కోట్లు నిధులు మంజూరయ్యాయని మొత్తుకున్నా విన్పించుకోలేదని బద్వేలు వాసులు వాపోతున్నారు. అయితే తాను పట్టిన కుందేలికి మూడే కాళ్లు అన్నట్లుగా కలెక్టర్ సీమాంక్ ఆస్పత్రిలోకి ఆస్పత్రిని మార్చారు. ప్రస్తుతం చర్చి నుంచి 60 అడుగుల రహదారి (ఆస్పత్రికి వెళ్లడానికి) ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని క్రిష్టియన్లు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆవేదన చెందుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్ తీరుపై అన్ని వర్గాల వారి నుంచి నిరసన వ్యక్తమవుతుండగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వడంపై జోరుగా చర్చ సాగుతోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement