-
‘ఔటర్’ అందాలు అదరహో! కేటీఆర్ ట్వీట్ వైరల్
సాక్షి, పటాన్చెరు(హైదరాబాద్): ఓఆర్ఆర్ను మరిపించే రీతిలో రీజినల్ రింగ్రోడ్డు రానుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రాత్రి పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి రింగ్రోడ్డుపై ఎల్ఈడీ దీపాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఏ నగరానికి కూడా మన దగ్గర ఉన్న విధంగా 160 కిలోమీటర్ల రింగ్ రోడ్డు లేదన్నారు. ఓఆర్ఆర్పై ప్రమాదాలు జరగకుండా రెండు దశల్లో 270.5 కిలోమీటర్ల పరిధిలో 9,706 కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి.. వాటిలో 18వేల 220 ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తొందర్లోనే 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డు ఓఆర్ఆర్ను మరిపించేలా వస్తుందన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్ మెడికల్ డివైస్ పార్క్లో 50 సంస్థలకు స్థలాలు ఇచ్చామని, ఇప్పటికే ఏడు సంస్థలను ప్రారంభించామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి దొరకాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఓఆర్ఆర్ రాకతో 80 వేల ఎకరాల స్థలంలో పరిశ్రమలను ఆహ్వానించడానికి మంచి అవకాశం వచ్చిందన్నారు. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు దొరికేలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవేళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శాసన మండలి సభ్యుడు రాజు, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, హెచ్ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఔటర్’ వెలిగిపోతోంది సాక్షి, సంగారెడ్డి: ఓఆర్ఆర్ ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతోందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఓఆర్ఆర్పై రూ.100.22 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించిన అనంతరం ఎల్ఈడీ దీపాలతో వెలిగిపోతున్న ఔటర్ రింగ్ రోడ్డు ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్నారు. Delighted to illuminate the entire stretch of Outer Ring Road (ORR), all intersections & important sections of service roads totalling 190.5 kms with 6340 poles & 13009 LED fixtures with a cost of ₹ 100.22 Cr My compliments to @HMDA_Gov on a job well done 👍 pic.twitter.com/iQn7xQTEjA — KTR (@KTRTRS) December 16, 2021 -
8 నుంచి కార్తీక్ పాదయాత్ర
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర 101 కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్నారు. ఈ మేరకు శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర ముఖ్యోద్దేశాన్ని కార్తీక్రెడ్డి వెల్లడించా రు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందని, రోజూ సగటున 20-22 కి.మీ. మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఆరె మైసమ్మ దేవాలయం నుంచి మొదలయ్యే యాత్రను పంచాయతీరాజ్శాఖ మంత్రి జానారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 12న తాం డూ రు భద్రేశ్వర్ చౌక్లో యాత్ర ముగింపు సభను నిర్వహించనున్నట్లు వె ల్లడించారు. వ్యక్తిగత అజెండాకు తావులేకుండా పార్టీ పటిష్టత కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కూడా తన యాత్రకు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేననే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తనకు సూచించారని కార్తీక్ వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, ఈ నేపథ్యంలో కొత్త రాష్ట్ర నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయాల్సిన అవసరముందని ఆయన అన్నారు. అందులోభాగంగానే తెలంగాణ నవ నిర్మాణ యాత్రను చేపడుతున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఇచ్చింది మేమే... దాని పునర్నిర్మాణ బాధ్యత మాదే’ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు చెప్పారు. పాదయాత్రకు పార్టీ పెద్దల సంపూర్ణ ఆశీస్సులు, దీవెనలు ఉన్నాయని, కాంగ్రెస్ బలోపేతానికి చేస్తున్న యాత్ర కావడంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. తన యాత్రకు పీసీసీ కూడా అనుమతి ఇచ్చిందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా చెప్పారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీసీసీ కార్యదర్శి రామ్మోహన్రెడ్డి, టీటీడీ మాజీ సభ్యుడు కాలె యాదయ్య, కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామి, పార్టీ సీనియర్ నేత ఎ.మురళీధర్రెడ్డి, శంకర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement