-
TS Election 2023: సిద్దిపేటపై అక్కసు ఎందుకు? విపక్షాలపై మంత్రి హరీశ్రావు ఫైర్..!
సిద్దిపేట: సిద్దిపేట అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు ఓర్వలేక పోతున్నాయని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సామూహిక భవనాల నిర్మాణం కోసం రూ.1.20కోట్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. పత్తి మార్కెట్ యార్డులో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాడు సమైక్య పాలనలో సిద్దిపేట గోస పడిందని, స్వరాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక పోతున్నారని చెప్పారు. అన్నీ సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాలకేనా అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఉద్యమంలో సిద్దిపేట ప్రజలు పాల్గొన్న సమయంలో కాంగ్రెస్, బీజేపీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. ఉద్యమాన్ని ముందు ఉండి నడిపిన గడ్డ సిద్దిపేట అని, అప్పుడు ముందు ఉన్నాం.. ఇప్పుడూ అభివృద్ధిలో ముందుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో బాజాప్త మరింత ప్రగతి సాధిస్తామన్నారు. అరవై ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో జరిగిందన్నారు. ఈనెల 15న సిద్దిపేటకు రైలు రానుందని వెల్లడించారు. దసరాకు వెయ్యి పడకల ఆస్పత్రి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. తల్లిదండ్రుల కంటే పిల్లలు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని, ఎంత ఎత్తుకు ఎదిగినా విద్య నేర్పిన గురువును మరువొద్దని ఉద్బోధించారు. దేశానికి మోడల్గా తెలంగాణ.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి మోడల్గా నిలుస్తుందని హరీశ్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని రామంచ శివారులో నూతనంగా నిర్మించిన రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాలను సబితారెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఐటీ, వైద్య రంగంలో తెలంగాణ నంబర్వన్గా ఉందన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు 3 లక్షల ఐటీ ఉద్యోగాలుంటే నేడు 10 లక్షలకు చేరిందన్నారు. ధాన్యం ఉత్పత్తిలోనూ మొదటి స్థానంలో ఉందన్నారు. 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అని, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరంట్ ఇవ్వలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎస్ఈ కార్యాలయం ప్రారంభం.. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈఈ కార్యాలయ ప్రాంగణంలో ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మంజుల, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత, పట్టణ అధ్యక్షుడు సంపత్, ఎంపీపీ మాణిక్యరెడ్డి, సర్పంచ్ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, ఎస్ఈ జోగారెడ్డి, ఈఈ శ్రీనివాసరావు, జెడ్పీ వైస్ చైర్మెన్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మానానికి రూ.50 లక్షలు.. అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికి, తెలంగాణ దేశానికి ఆదర్శమని మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లిలో ముదిరాజ్, రెడ్డి, కురుమ, ఎస్సీ కమ్యూనిటీ హాల్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, లైబ్రరీ భవనం, అంగన్వాడీ భవనం, రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడకపల్లి ప్రభుత్వ పాఠశాల నూతన భవనాన్ని, లైబ్రరీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గ్రామంలో రూ. 50 లక్షలతో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. సర్పంచ్ మంగ భాస్కర్, ఎంపీటీసీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఎల్లం, అర్బన్ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎద్దు యాదగిరి, ఎంఈఓ యాదవ రెడ్డి పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఆదరించండి.. అభివృద్ధిని చూసి ఆదరించండని మంత్రి హరీశ్రావు అన్నారు. ఒకప్పుడు పని దొరకక వలసలు పోయిన మనం.. నేడు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకునే స్థాయికి ఎదిగామన్నారు. సోమవారం రాంపూర్లో ఓపెన్ జిమ్, సిద్దన్నపేట వరకు రోడ్డు, వడ్డెర కమ్యూనిటీహాల్కు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు స్పింక్లర్లు పంపిణీ చేశారు. జేపీ తండాలో పంచాయతీ భవనం, ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమా, సర్పంచ్లు లక్ష్మి, బిక్షపతినాయక్, పరశురాములు, లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. హరీశ్తో పోటీ పడలేరు: సబిత.. సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు మెజార్టీతో ఎవరూ పోటీ కూడా పడే పరిస్థితిలో ఉండరని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దేశానికి అభివృద్ధిలో తెలంగాణనే మోడల్ అంటే.. తెలంగాణకే సిద్దిపేట మోడల్గా నిలిచిందని కితాబిచ్చారు. ఉద్యమంలో ఏదైతే తపన, ఆరాటం ఉండేదో ఇప్పుడు కూడా అదే స్ఫూర్తి హరీశ్రావు ఉన్నారన్నారు. తొమ్మిదేళ్లలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పారు. త్వరలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. -
విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
-
నిజాం కాలేజ్ ఇష్యూ పై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందన
-
TS Inter Results 2022 : జూన్ 28వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను జూన్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ స్పష్టత నిచ్చింది.జూన్ 28వ తేదీన(మంగళవారం) ఉదయం 11 గంటలకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్బోర్డు జూన్ 26వ తేదీ (ఆదివారం) ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొంది. ఫలితాలు విడుదల చేసిన 15 రోజుల్లోనే ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహింస్తామని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించారు. మే 6వ తేదీన మొదలైన ఇంటర్మీడియెట్ పరీక్షలు మే 24న ముగిసిన విషయం తెల్సిందే. తెలంగాణ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
వర్సిటీల్లో పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర ఖాళీలన్నీ భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. నియామక ప్రక్రియ కోసం ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం నియామకాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. అయితే రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలు ఎవరికి వారుగా నియామకాలు చేపట్టకుండా ఉమ్మడి నియామక విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. వర్సిటీల వారీగా రిక్రూట్మెంట్ జరగడం వల్ల గతంలో వచ్చిన ఆరోపణలు, విమర్శలను పరిగణనలోకి తీసుకుని ఒకే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నిపుణులతో కూడిన ప్రత్యేక కమిటీ కోసం కొన్ని పేర్లు పంపాలని సూచించినట్టు తెలిసింది. రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలోనే విధి విధానాలను ఖరారు చేయనున్నారు. సగానికిపైగా ఖాళీలు.. రాష్ట్రంలోని 11 వర్సిటీల్లో మొత్తం 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2017లో విశ్వవిద్యాలయాల్లో ఖాళీలపై ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అప్పట్లోనే 1,528 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి.. వాటిలో 1,061 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ ముందుకు పడలేదు. రిజర్వేషన్ల అంశం, న్యాయపరమైన వివాదాలు, నియామక విధానంపై కసరత్తు పేరిట విద్యాశాఖ అధికారులు కాలయాపన చేశారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మరికొందరు పదవీ విరమణ చేయడంతో 2021 జనవరి చివరినాటికి యూనివర్సిటీల్లో ఖాళీల సంఖ్య 1,869కి చేరింది. ఇందులో 238 ప్రొఫెసర్ పోస్టులు, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఇలా భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడటంతో తాత్కాలిక, కాంట్రాక్టు అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. ఫలితంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎట్టకేలకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ట్రిపుల్ఐటీ నిరసనపై నివేదిక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల నిరనసకు సంబంధించి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమగ్ర వివరాలతో సీఎం కేసీఆర్కు నివేదిక అందజేశారు. విద్యార్థులతో చర్చలు ఫలప్రదం కావడం, అక్కడ తీసుకున్న చర్యలను వివరించారు. ట్రిపుల్ఐటీలో వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, విద్యార్థుల డిమాండ్లు తక్షణం కొన్నింటిని, ప్రాధాన్యతా క్రమంలో మరికొన్నింటిని నెరవేర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement