-
ఆశ్రమంలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: దుండిగల్లో గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆశ్రమం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపుచేస్తున్నారు. ఆశ్రమంలో ఉన్న రెండు ఆలయాలకు మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. -
జోగుళాంబ సన్నిధిలో ధర్మపురి పీఠాధిపతి
అలంపూర్ రూరల్: అష్టాదశక్తి పీఠాలలో అయిదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారిని సోమవారం శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి రావడంతో వారి దర్శనం కోసం ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి వచ్చారు. పీఠాధిపతులు విడిది చేసిన గృహంలో వారిని దర్శించి వారితో కొద్దిసేపు మాట్లాడి అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధర్మపురి పీఠాధిపతుల వారికి ఆలయ సంప్రదాయాలతో స్వాగతం పలికారు. -
సచ్చిదానంద్ మమ్మల్ని రేప్ చేశాడు: నలుగురు సాధ్వీలు
లక్నో: ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఆశ్రమంలో ప్రధాన గురువుగా ఉన్న బాబా సచ్చిదానంద్, అతని ఇద్దరు అనుచరులు తమపై అత్యాచారం జరిపారని మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు. సచ్చిదానంద, అతని ఇద్దరి అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరిపారని నలుగురు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసి.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. బాధిత సాధ్వీలపై కొంతకాలంగా ఆశ్రమంలోని మహాంత్లు ఒత్తిడి తెచ్చారని, తమ లైంగిక కోరికలు తీర్చేందుకు నిరాకరించడంతో వారిని ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసుల కథనాన్ని బట్టి తెలుస్తోంది. బస్తీ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. బాధితులకు వైద్యపరీక్షలు నిర్వహించామని, కేసు దర్యాప్తు జరుగుతోందని బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. 2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు. నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు. -
శ్రీశైలంలో సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి
శ్రీశైలం: కార్తీక మాసం సందర్భంగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల సన్నిధిలో ఆదివారం రాత్రి కోటి దీపార్చన మహోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామిజీ హాజరయ్యారు. ప్రధానాలయగోపురం వద్ద ఈఓ భరత్ గుప్త స్వామీజీకి బిల్వమాల ఇచ్చి ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం స్వామీజీ నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన కోటి దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని శాస్త్రోక్తపూజల అనంతరం దీపార్చనను ప్రారంభించారు.
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- Rishabh Pant: భారీ ప్రమాదం నుంచి మైదానం వరకు..
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
Advertisement