-
సెంటు భూమినీ లెక్కిస్తాం
♦ సాదాబైనామాలకు త్వరలో పట్టాలు ♦ కౌలురైతులకు గుర్తింపు కార్డులు ♦ పౌర సరఫరాల వ్యవస్థను బలోపేతం చేస్తా ♦ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట ♦ ఎస్సారెస్పీ భూ నిర్వాసితులకు పరిహారం ♦ జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి సాక్షి, సూర్యాపేట : ప్రభుత్వ, ప్రైవేట్ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.. భూమిలో పంటల సాగు, ఇతర అవసరాలకు వినియోగం మొదలైన అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేయిస్తాం.. సెంటు భూమినీ లెక్కించి రికార్డుల్లో భద్రపరుస్తాం.. సాదాబైనామాలకు త్వరలో పట్టాలందజేస్తాం.. పౌరసరఫరాల వ్యవస్థను పటిష్టంగా అమలు పరిచేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తాం.. ఆన్లైన్ ద్వారా భూ వివరాల సేకరణను అందుబాటులో ఉంచుతామని జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి అన్నారు.. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలోని ప్రభుత్వ భూమి.. పరిరక్షణ, పౌరసరఫరాల వ్యవస్థ మొదైలన అంశాలపై సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే క్రమమైన పద్ధతిలో భూ వివరాల సేకరణ మీరన్నది నిజమే.. భూ విస్తీర్ణం లెక్క ఉంటుంది. కానీ ఏయే భూమి, ఏయే అవసరాలకు వినియోగిస్తున్నారో అన్న విషయంపై స్పష్టత లేదు. అయితే క్రమమైన పద్ధతిలో భూ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యాం. ఈ పహాణీ, అడంగళ్ పహాణీ, ప్రభుత్వ భూములు మొదలైన వివరాల కోసం వీఆర్వో స్థాయి నుంచి తహసీల్దార్ వరకు పరిశీలించాలని ఆదేశించాం. త్వరలో వివరాలన్నీ సేకరిస్తాం. దీంతో ఏయే భూమిలో ఏ పంట సాగు చేశారు. ఏ పంట ఎంత ఉత్పత్తి సాధించామన్న విషయాలు కూడా తెలుస్తాయి. సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో యంత్రాంగం భూమి కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఆ భూమిపై హక్కు కల్పించాలన్నదే మా లక్ష్యం. అందుకోసం వారికి పట్టాదారు పాస్పుస్తకాలు 13 (బి), 13 (సి)ని అందజేయాలనే ఆలోచనతోనే సాదాబైనామాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాం. 2–06–2014 నాటికి సూర్యాపేట జిల్లా నుంచి 1,10,346 సర్వేనంబర్లకు సంబంధించిన 1,04,256 మంది సాదాబైనామాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించే పనిలో యంత్రాంగం ఉంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగానే ఐదెకరాల లోపు భూమి ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి పట్టేదారు పాస్పుస్తకాలు అందజేస్తాం. అన్ని వివరాలు ఆన్లైన్లో.. గ్రామం నుంచి జిల్లా వరకు ఎక్కడెక్కడ భూమి ఎంత ఉంది. పట్టేదారు భూమి ఎంత.. చెరువు శిఖం, ఇతర ప్రభుత్వ భూముల వివరాలన్ని ఆన్లైన్లో పొందుపరిచాం. మరికొన్ని వివరాలు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఒక్కరు తమ భూమి వివరాలను ఇంటి నుంచే తెలుసుకోవచ్చు. అదే విధంగా ఎస్సార్, ఎంఆర్ఓ సిస్టమ్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో భూమి రిజిస్ట్రేషన్ కాగానే అది తహసీల్దార్ కార్యాలయంలోకి లాగిన్ అవుతుంది. దీంతో ఎవరి ప్రమేయం లేకుండానే రెవెన్యూ రికార్డుల్లో భూ వివరాలు నమోదవుతాయి. దీంతో పహాణీలు తీసుకోవడం ఇతర అవసరాల కోసం భూ వివరాలను సేకరించడం సులువుగా ఉంటుంది. పకడ్బందీగా కౌలు రైతుల చట్టాల అమలుకు ప్రణాళిక కౌలు రైతుల చట్టాలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. వీఆర్వోల వద్ద ఉన్న కౌలు రైతు ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని రైతు పూర్తి వివరాలతో అందజేస్తే కౌలు రైతులకు గుర్తింపుకార్డులిస్తాం. దీంతో సబ్సిడీపై వచ్చే ఎరువులు, విత్తనాలు సులువుగా తీసుకోవచ్చు. పంట నష్టం జరిగినప్పుడు పరిహారం కూడా కౌలు రైతుకే చేరుతుంది. ఈ విషయంలో భూ యజమానికి ఎటువంటి సంబంధం లేకుండా కౌలు రైతులకు లబ్ధిచేకూరుతుంది. గిట్టబాటు ధరకు ధాన్యం కొనుగోలు రైతు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జిల్లాలో 19 కేంద్రాల ద్వారా 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం చేశాం. ఇందుకోసం 60 కోట్ల రూపాయలు కూడా కేటాయించాం. అయితే రైతులు చేయాల్సింది 17 శాతం కంటే తక్కువ తేమ ఉండేలా చూసుకోవాలి. ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ప్రస్తుతం ఉన్న కేంద్రాలు సరిపడక పోతే రైతుల కోరిక మేరకు కొత్త కేంద్రాలను కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు ప్రభుత్వం పేదలకు అందజేసే బియ్యం, నిత్యావసర వస్తువులు పక్కదారి పడుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతాం. గ్రామస్థాయిలో ఆహారసలహాదారుల సంఘం ద్వారా ప్రతినెలా సమావేశం ఏర్పాటుచేసి నిత్యావసర వస్తువులు అందుతున్న తీరును పరిశీలిస్తాం. సర్పంచ్, వీఆర్వో, ఇతర సభ్యులు ఉంటారు. కాబట్టి ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు సకాలంలో అందే అవకాశముంది. రేషన్ బియ్యం దారి మళ్లించే విషయంపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి ప్రాంతాల్లో పలు కేసులు బుక్ చేశాం. చెక్పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తాం. నివేదిక రాగానే పరిహారం జిల్లాలోని నాగారం, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాల్లో ఎస్సారెస్పీ కాల్వలు వెళ్లిన 300 ఎకరాలకు సంబంధించి నిర్వాసితులకు పరిహారం అందించాల్సి ఉంది. అందుకోసం ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులను నియమించాం. వారి నుంచి నివేదిక రాగానే రైతులకు పరిహారం అందజేస్తాం. -
సాదాబైనామా విచారణ షురూ!
కబ్జా, పట్టాదారుడితోపాటు జీపీకి నోటీసులు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పినా రిజిస్ట్రేషన్కు నో సాదాబైనామాకు 2,47,538 దరఖాస్తులు ఇప్పటివరకు 1,47,519 దరఖాస్తుల పరిశీలన వీణవంక : సాదాబైనామా ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు విచారణ చేపడుతున్నారు. రైతు ప్రయోజనాల నేపథ్యంలో వారి భూములను సాదాబైనామా ద్వారా క్రమబద్ధీకరించేందుకు నిర్ణయించిన విషయం తెల్సిందే. తెల్లకాగితాలపై (సాదాబానామా) రాయించుకున్న భూములకు (ఐదెకరాలలోపు) చట్టబద్దత కల్పిస్తూ.. ఉచితంగా పట్టాపాసు పుస్తకం ఇస్తామని ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతులు రికార్డుస్థాయిలో దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 2,47,538 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 1,47,519 దరఖాస్తులను అధికారులు పరిశీలించారు. కరీంనగర్ డివిజన్లో అత్యధికంగా 1,10,894 దరఖాస్తులు రాగా.. తర్వాత స్థానంలో జగిత్యాల 51,685, పెద్దపల్లి 40,272, సిరిసిల్ల 25,436, అత్యల్పంగా మంథని నుంచి 19,249 వచ్చాయి. జిల్లాలోనే అత్యధికంగా జమ్మికుంట మండలంలో 12,540 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మోకాపై విచారణ షురూ సాదాబైనామాకు దరఖాస్తు చేసుకున్న కబ్జాదారుడిని విచారించేముందు అధికారులు గ్రామ పంచాయతీ, కబ్జాదారుడికి, పట్టాదారుడికి నోటీసులు అందిస్తున్నారు. ఫలానా సమయంలో భూముల వద్దకు వచ్చి విచారిస్తామని అందులో పేర్కొంటున్నారు. ఇలా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 1,06,284మందికి నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని మండలాల్లో ఇప్పటికే మోకాపైకి వెళ్తున్న అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్య తీవ్రంగా ఉండడంతో నోటీసులు జారీ చేయడం ఇబ్బందిగా మారిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. నిబంధనలు ఇవ్వే.. – కబ్జాదారుడు, పట్టాదారుడు, గ్రామపంచాయతీకి నోటీసులు అందించిన అనంతరం మోకాపై విచారణ జరుపుతారు. ఇద్దరి వాంగ్మూలాలు తీసుకున్న అనంతరం జీపీలో మరో వాగ్మూలం తీసుకుంటారు. ఇందులో ఏ ఒక్కరు ఆబ్జెక్షన్ చెప్పినా ఉచిత రిజిస్ట్రేషన్ను అనుమతించారు. – భూమి అమ్మిన తర్వాత పట్టాదారుడు ఒకవేళ చనిపోతే మోకాపై సాక్షులను విచారిస్తారు. అనంతరం కుటుంబసభ్యుల వాంగ్మూలం తీసుకుంటారు. కుటుంబసభ్యులు అనుమతి ఇస్తేనే కొనుగోలు చేసిన వ్యక్తికి రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. – కుటుంబం కలుపుకుని (భార్య/భర్త/పిల్లలు)ఐదెకరాలలోపు ఉన్న వారికే సాదాబైనామా వర్తిస్తుంది. ఆపై ఉంటే పరిగణనలోకి తీసుకోరు. (ఈ విషయం తెలియక జిల్లాలో 6220మంది దరఖాస్తులు పెట్టుకున్నారు) – వివాదాస్పద భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూముల సాదాబైనామా దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. – 2014 జూన్ 1కంటే ముందు భూమి కొనుగోలు చేసి కబ్జాలో ఉంటేనే సాదాబైనామా వర్తిస్తుంది. ఇవి అధికారులు మోకాపై వెళ్లినప్పుడు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటారు. పరాదర్శకంగా వ్యవహరిస్తాం – తహశీల్దార్ బావ్సింగ్ సాదాబైనామా విచారణలో పారదర్శకంగా వ్యవహరిస్తాం. కబ్జా, పట్టదారుడితోపాటు జీపీలో విచారించాకే ఉచిత రిజిస్ట్రేషన్కు అనుమతిని ఇస్తాం. ఇప్పటికే విచారణ కోసం నోటీసులు జారీ చేశాం. నోటీసుల ప్రకారం రైతులు విచారణ రోజు మోకాపై తప్పనిసరిగా ఉండాలి. కబ్జాదారుడికి ఐదెకరాల పైన ఉంటే సాదాబైనామా వర్తించదు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. డివిజన్లు దరఖాస్తులు రైతులకు నోటీసులు జగిత్యాల 51685 23566 కరీంనగర్ 110894 21334 మంథని 19249 14201 పెద్దపల్లి 40272 32134 సిరిసిల్ల 25436 15049 మొత్తం దరఖాస్తులు 2,47,538
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల సంస్థలకు మరో ఎదురు దెబ్బ
- స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
- ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
- బంగారాన్ని మించి.. వెండి హడల్..
- Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
- టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
Advertisement