-
‘సదావర్తి’లో సత్యం సమాధి!
దేవాదాయ శాఖకు ఆర్జేసీ సవివర నివేదిక అమరావతి: అత్యంత విలువైన సదావర్తి సత్రం భూములను ప్రభుత్వ పెద్దలు కారుచౌకగా కొట్టేశారన్నది ముమ్మాటికీ నిజమని మరోసారి తేటతెల్లమైంది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో రూ.22.44 కోట్లకే బినామీల ముసుగులో వారు దక్కించుకున్నట్లు ‘సాక్షి’ ఆధారాలతో సహా ఇప్పటికే వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ వేలం నిబంధనల మేరకే జరి గిందని, అక్రమాలకు ఆస్కారమే లేదం టూ సర్కారు పెద్దలు అడ్డంగా బుకాయిస్తున్నా... వారి దోపిడీని బయటపెట్టే సాక్ష్యం ‘సాక్షి’ చేతికి చిక్కింది. సదావర్తి సత్రం భూముల వేలంలో నిబంధనలకు పాతరేశారని, అడ్డగోలుగా వ్యవహరించారని ఆక్షేపిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రాంతీయ సంయు క్త కమిషనర్(ఆర్జేసీ) ఆ శాఖ కమిషనర్కు సవివరమైన నివేదిక అందజేశారు. తమ బండారం బయటపడుతుందనే భయంతో ప్రభుత్వ పెద్దలు ఈ లేఖను తొక్కిపెట్టేశారు. సదరు నివేదిక ‘సాక్షి’కి అందింది. అక్రమాలపై 9 పేజీల నివేదిక రూ.1,000 కోట్ల భూ దోపిడీపై ఈ ఏడాది మే 28న ‘సాక్షి’ ప్రత్యేక కథనం తర్వాత దేవాదా య శాఖ తిరుపతి రీజినల్ జాయింట్ కమిషనర్ డి.భ్రమరాంభ ఈ వ్యవహారంపై మరి న్ని ఆధారాలు సేకరించి కమిషనర్కు జూన్ 8న ఒక నివేదిక సమర్పించారు. సదావర్తి సత్రం భూముల అమ్మకంలో చోటుచేసుకున్న అక్రమాలను 9 పేజీల నివేదికలో ఆర్జేసీ సమగ్రంగా వివరించారు. ఈ భూముల వేలం విధానం ఏమాత్రం సరికాదని, మార్గదర్శకాల కు విరుద్ధంగా జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఎకరాకు రూ.27 లక్షలేనా? వేలంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆర్జేసీ స్పష్టంగా పేర్కొన్నారు. భూముల అమ్మకానికి రూపొందించిన నిబంధనల ప్రకారం... మొదట బహిరంగ వేలం నిర్వహించారు. ఎక్కువ మొత్తానికి పాడిన పాటదారుడిని ఎంపిక చేయాలి. తదుపరి సీల్డు టెండర్లు తెరవాలి. అయితే, మార్చి 28న నిర్వహించిన వేలం సమయంలో తాను నిబంధనలను గుర్తు చేసినా హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం నుంచి వేలం పాట పర్యవేక్షణకు వచ్చిన ఎస్టేట్స్ విభాగపు అసిస్టెంట్ కమిషనర్ ఖాతరు చేయలేదని ఆర్జేసీ వెల్లడించారు. ముందుగా సీల్డు టెండర్లు తెరిపించారని పేర్కొన్నారు. భూముల వేలానికి ఎకరాకు రూ.50 లక్షల బేస్ ధరను దేవాదాయ శాఖ నిర్ణయించినా.. తర్వాత దాన్ని క్రమంగా తగ్గించారని, చివరకు ఎకరాకు రూ.27 లక్షల ధర నిర్ణయించారని తెలిపారు. రిజిస్ట్రేషన్ ధరే ఎకరాకు రూ.7.80 కోట్లు వేలానికి ముందే భూముల వాస్తవ ధర తెలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. సదావర్తి సత్రం కార్యనిర్వహణాధికారి(ఈవో) భూముల వాస్తవ ధర తెలుసుకోవడానికి ప్రయత్నించినా తమిళనాడులోని అధికారులు సహకరించలేదనడం కూడా అవాస్తవమే స్పష్టమవుతోంది. మే 28న భూముల విలువ గురించి తాను స్వయంగా తమిళనాడులోని సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించగా, సత్రం ఈవో నుంచి తనకు ఎలాంటి లేఖ అందలేదని వారు తెలియజేశారని ఆర్జేసీ నిదేదికలో పొందుపరిచారు. అక్కడి రిజిస్ట్రార్ అందజేసిన వివరాల ప్రకారం వేలం నిర్వహించిన భూములకు రిజిస్ట్రేషన్ ధరే రూ.2 కోట్ల నుంచి రూ.7.80 కోట్ల వరకు ఉందని తెలినట్టు నివేదికలో భ్రమరాంబ పేర్కొన్నారు. సర్వే నెంబర్ల వారీగా భూముల రిజిస్ట్రేషన్ ధరలను నివేదికలో ఆమె వివరించారు. భూముల వాస్తవ విలువ విషయంలో సత్రం ఈవో దేవాదాయ శాఖలోని ఇతర ఉన్నతాధికారులందరినీ తప్పదారి పట్టించారని వివరించారు. నిబంధనల ద్వారా బెదరగొట్టేశారు తమ బినామీలకే సత్రం భూములు దక్కేందుకు వీలుగా ప్రభుత్వ పెద్దలు ఇతరులను భయభ్రాంతులను గురిచేసేలా టెండర్ల నిబంధనలను రూపొందించారని ఆర్జేసీ నివేదిక ద్వారా తెలిస్తోంది. వేలం నిర్వహిస్తున్న 83.11 ఎకరాలు అక్రమణల్లో ఉండడంతోపాటు ఆ స్థలాల్లో భవనాలు, విల్లాలు, నిర్మాణాలు, ఫెన్సింగ్లు ఉన్నాయని టెండర్ నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, వేలం నిర్వహించిన భూముల్లో 30 నుంచి 40 ఎకరాల భూమి ఖాళీగా ఉందని.. దాని చుట్టూ ప్రహరీ గోడ లేదా ఫెన్సింగ్ మాత్రమే ఉందని ఆర్జేసీ గుర్తుచేశారు. ఆ భూమిలో నిర్మాణాలు లేవని తన పరిశీలనలో తేలినట్టు వెల్లడించారు. కేవలం ఫెన్సింగ్తో ఉన్న భూముల వివరాలను సర్వే నంబర్తో సహా తన నివేదికలో ప్రస్తావించారు. ఈ-టెండర్ లేదు.. వేలానికి ప్రచారమూ లేదు దేవాదాయ శాఖకు చెందిన భూముల అమ్మకంలో ఈ-టెండర్ విధానాన్ని పాటించాలని 2011లో ఆ శాఖ కమిషనర్ జారీ చేసిన మెమో ఏ4/14389లో స్పష్టంగా ఉంది. సదావర్తి సత్రం భూముల అమ్మకానికి ఈ-టెండర్ను అమలు చేయలేదని ఆర్జేసీ తప్పుపట్టారు. భూముల వేలం గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం కల్పించాల్సి ఉండగా ఆ దిశగా ఎలాంటి ప్రయత్నం జరగలేదని తెలిపారు. వేలానికి పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలోనూ భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం వివరాలను పేర్కొనలేదని నివేదికలో వెల్లడించారు. ఈ భూములకు అధిక ధర పలుకుతోందనే సంగతి అందరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారని, వేలం వేస్తున్న భూముల్లో పెద్ద మొత్తంలో భూమి ఖాళీగా ఉందన్న విషయాన్నీ రహస్యంగా ఉంచారని తెలియజేశారు. -
సత్రం భూముల దోపిడీ నిజమే!
- వాస్తవ ధర తెలిసినా చౌకగా విక్రయం - వేలం ధర తగ్గింపుపై మౌనం - కీలక ప్రశ్నలకు వివరణ ఇవ్వని మంత్రి మాణిక్యాలరావు సాక్షి, హైదరాబాద్ : సదావర్తి సత్రం భూముల విక్రయంలో భారీ దోపిడీ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణ పత్రమే తేటతెల్లం చేస్తోంది. భూముల వాస్తవ ధర ఎంత ఉందో తెలిసినా 83.11 ఎకరాలను చౌకగా విక్రయించడానికి అనుమతి ఇచ్చినట్టు ప్రభుత్వం అంగీకరించింది. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న అత్యంత విలువైన సత్రం భూములను అధికార పార్టీ నేతలు వేలంలో తక్కువ ధరకే దక్కించుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. రూ.1,000 కోట్ల విలువైన భూములను టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు వేలంలో రూ.22 కోట్లకే సొంతం చేసుకున్నారని, దీనివెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరుఫున దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు మంగళవారం విజయవాడలో వివరణ ఇచ్చారు. నోట్ కూడా విడుదల చేశారు. భూముల వేలానికి మార్చి 1వ తేదీన దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని... రెండు రోజుల్లో(3వ తేదీ)నే భూమి ధరకు సంబంధించి తమిళనాడులోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆరా తీసినట్లు మంత్రి తన వివరణలో పేర్కొన్నారు. మార్చి 3న ఆరా తీసినప్పుడు సత్రం భూములు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ చదరపు అడుగు రూ.1,700 చొప్పున ఎకరాకు రూ.6 కోట్ల వరకు ధర ఉన్నట్లు తెలుసని అంగీకరించారు. భూముల ధర తగ్గించారెందుకు? ఎక రం ధర రూ.6 కోట్ల వరకు ఉందని తెలిసినా, సదావర్తి సత్రం భూములు ఆక్రమణలో ఉన్నాయన్న సాకుతో వేలం సమయంలో ఎకరా రూ.50 లక్షలు బేసిక్ ధరగా నిర్ణయించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆ సమయంలో ఎకరం ధరను రూ.27 లక్షలకు ఎందుకు తగ్గించి అమ్మాల్సి వచ్చిందన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. విజయవాడ దుర్గ గుడి వద్ద ఈ ఏడాది చెప్పుల షాపు నిర్వహణకు ప్రభుత్వం వేలం నిర్వహించింది. గతేడాది కన్నా రూ.2 లక్షలు తక్కువకు పాట వచ్చిందని రెండుసార్లు వాయిదా వేసి, మూడోసారి అనుమతించి ంది.కానీ రూ.1,000 కోట్ల విలువైన భూముల వేలంలో ఈ జాగ్రత్తలు తీసుకోలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు. రాష్ట్రంలో ఏ గుడి అధీనంలోని దుకాణాన్నైనా అద్దెకు ఇవ్వాలంటే దేవాదాయశాఖ ఈ-టెండర్ అమలు చేస్తోంది. అలా పిలవకుండా బహిరంగ వేలం నిర్వహించింది. దీని గురించి అధికార పార్టీ నేతలు మినహా ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడింది.ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో సర్కార్ చెప్పడం లేదు. వేలం తర్వాత అనుమతికీ తొందరే దేవాదాయ శాఖలో నాలుగైదు ఏళ్ల క్రితం వేలంలో భూములను దక్కించుకున్నా వాటిని వారు స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఇవ్వని ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సత్రం భూముల విషయంలో మాత్రం మార్చి 28న వేలం జరగ్గా ఏప్రిల్ 24నే పాటదారుకు అప్పగించాలని నిర్ణయించింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement