-
రెడ్డి గౌస్ కుటుంబానికి జగన్ భరోసా
చిత్తూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్తను జీర్ణించుకోలేక అసువులు బాసిన రెడ్డి గౌస్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పరామర్శించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురానికి చెందిన రెడ్డి గౌస్.. వైఎస్ ఇక లేరన్న వార్త విని.. ప్రాణాలు విడిచాడు. గౌస్ మృతితో కుటుంబానికి బాసట కరువైంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న గౌస్ కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. తోడుగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు జగన్ చేపట్టిన సమైక్య శంఖారావం యాత్ర మంగళవారం పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. గంగాదొడ్డిలో రామచంద్రకుటుంబాన్ని ఓదారుస్తారు. పీలేరులోని గాంధీ సర్కిల్ లో బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. సమైక్య శంఖారావం యాత్రకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. అక్కడ్నుంచి ఓల్డ్ డిగ్రీ కాలేజ్, చింతపర్తి, గండబపోయినపల్లిలో మహానేత విగ్రహాలను ఆవిష్కరిస్తూ కలికిరి చేరుకుంటారు. కలికిరి బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం కలికిరిరెడ్డివారిపల్లిలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించి కందూరులో రాత్రిబస చేస్తారు. -
సమైక్య శంఖారావానికి జన ప్రవాహం
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదం హోరెత్తింది. వర్ష బీభత్సం వారి ‘సమైక్యాంధ్ర’ ఆకాంక్షను నీరుగార్చలేకపోయింది. ఇళ్లు, పొలాలను ముంచెత్తిన వరద వారిని సమైక్యాంధ్ర ఉద్యమపథం నుంచి పక్కకు మళ్లించలేకపోయింది.అందుకే.. ప్రకృతి ప్రకోపాన్ని కూడా లెక్క చేయకుండా భావితరాల బాగు కోసం.. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం సమష్టిగా హైదరాబాద్కు కదం తొక్కారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు రాష్ట్రం నలు మూల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. రైళ్లు, బస్సులు, వివిధ వాహనాల ద్వారా సమైక్యవాదులు హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు సమైక్య శంఖారావం సభ మొదలవుతుంది.అయితే ఇప్పటి నుంచి సమైక్యవాదులు సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.మరోవైపు సమైక్య సభకు పెద్దఎత్తున ఉద్యోగులు, కార్మిక సంఘాల మద్దతు తెలిపాయి. -
సమైక్య దండు కదిలింది
సాక్షి, గుంటూరు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్న ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు జిల్లా నుంచి వేలాది మంది తరలి వెళుతున్నారు. రాష్ట్ర విభజనను అడ్డుకునే శక్తి ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని ఎలుగెత్తి చాటి చెప్పేందుకు శంఖారావం సభలో పాల్గొనేందుకు బయలుదేరారు. పార్టీ శ్రేణులతో పాటు సమైక్యాన్ని కాంక్షించే పలు ప్రజా, ఉద్యోగ సంఘాలు తరలి వెళుతున్నాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడంతో శుక్రవారం రాత్రి పార్టీ నేతలు, కార్యకర్తలు రైళ్లు, బస్సులలో హైదరాబాద్ బయలుదేరారు. సమైక్య సభకు వచ్చే వారి కోసం మొత్తం మూడు రైళ్లు, 610 బస్సులు ఏర్పాటు చేశారు. ఇవికాక ఎక్కడికక్కడ కార్లు కూడా బయలుదేరుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా ఇప్పటి ఇబ్బందుల కన్నా భవిష్యత్తులో తలెత్తే సమస్యలు ఎదురయ్యే ఇబ్బందులే ప్రమాదమని సమైక్య దండు కదిలింది. ఆ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బస్సులు, కార్లలో పార్టీ కార్య కర్తలంతా శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలో పార్టీ కేడర్ మొత్తం శనివారం తెల్లవారు జామున బయలుదేరుతున్నారు. సత్తెనపల్లి నుంచి పార్టీ రాష్ట్రఅధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో బస్సులు, కార్లలో ఆ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ శ్రేణులు సమైక్య శంఖారావానికి బయలుదేరారు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జిల్లా కన్వీనరు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో వేలాది మంది ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో తరలి వెళ్లారు. కృష్ణా, గుంటూరు జిల్లాల కోఆర్డినేటర్ ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మంగళగిరి నుంచి 20 బోగీలతో ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. దుగ్గిరాల మండలం నుంచి బస్సులు ఏర్పాటు చేయడంతో వేలాదిగా పార్టీ కార్యకర్తలు, మహిళలు సమైక్య శంఖారావానికి వెళ్లారు. తెనాలి నుంచి ప్రత్యేక రైలులో... గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు వల్లభనేని బాలశౌరి తెనాలి నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి సమైక్య శంఖారావానికి శ్రేణులు తరలివెళ్లాయి. తెనాలి నుంచే అక్కడి సమన్వయకర్త గుదిబండి చిన వెంకటరెడ్డి బస్సులను ఏర్పాటు చేశారు. పొన్నూరు నియోజకవర్గ పార్టీ శ్రేణులకు సమన్వయకర్త రావి వెంకటరమణ పొన్నూరు నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో పార్టీ కేడర్ మొత్తం తరలి వెళ్లింది. బాపట్ల నుంచి కోన రఘుపతి ఆధ్వర్యంలో బస్సులు, ప్రత్యేక వాహనాలు, కార్లలో వెళ్లగా, గురజాల నియోజకవర్గంలో సీజీసీ సభ్యుడు జంగా కృష్ణమూర్తి బస్సులు, కార్లు, రైలులో వెళ్లేందుకు అనువుగా ఏర్పాట్లు చేయడంతో పార్టీ కేడర్ కదిలింది. వేమూరు నియోజకవర్గంలో మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వినుకొండ నియోజకవర్గంలో డాక్టర్ నన్నపనేని సుధ, తాడికొండ నుంచి నియోజకవర్గ సమన్వయకర్తలు ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్, పెదకూరపాడు నియోజకవర్గంలో సమన్వయకర్తలు నూతలపాటి హనుమయ్య, బొల్లా బ్రహ్మనాయుడు, రాతంశెట్టి సీతారామాంజనేయులు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేయడంతో వేలాదిగా వెళ్లారు. గుంటూరు నుంచి భారీగా తరలిన పార్టీ శ్రేణులు గుంటూరు నుంచి హైదరాబాద్కు వైఎస్సార్ సీపీ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులు, కారుల్లో పార్టీ శ్రేణులు చుట్టుగుంట నుంచి బయలుదేరారు. అప్పిరెడ్డి జెండా ఊపి వాహన శ్రేణిని బయలుదేరదీశారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్లు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు ఏర్పాటు చేసిన బస్సులు, కార్లలోనూ నగరం నుంచి యువత తరలి వెళ్లింది. ట్రేడ్ యూనియన్ నగర కన్వీనరు షేక్ గులాం రసూల్, పార్టీ నాయకుడు మహ్మద్ ముస్తఫా, విద్యార్థి యూనియన్ నగర కన్వీనర్ పానుగంటి చైతన్య, ఏటిగడ్డ నరసింహారెడ్డి, నూనె ఉమామహేశ్వర రెడ్డి ప్రైవేట్ బస్లు, కార్లు ఏర్పాటు చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
దిగ్గజ బ్యాంకర్ 'నారాయణన్ వాఘుల్' కన్నుమూత
వేగంగా దర్యాప్తు జరిపి, నిందితులను అరెస్టు చేస్తాం: ఐజీ వినీత్ బ్రిజ్లాల్
‘‘స్వాతి మలివాల్కు సీఎం అపాయింట్మెంట్ లేదు’’
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా జితేష్ శర్మ..
Summer special థండయ్ కుల్ఫీ రెసిపీ
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
Music Shop Murthy: ఆకట్టుకుంటున్న రాహుల్ సిప్లిగంజ్ ‘అంగ్రేజీ బీట్’ సాంగ్
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
తప్పక చదవండి
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement