-
తెలంగాణకు 9, ఏపీకి 16
-
తెలంగాణకు 9, ఏపీకి 16
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో లభ్యతగా ఉన్న నీటిలో 25 టీఎంసీలను ఇరు రాష్ట్రాలకూ పంచుతూ కృష్ణా బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 9 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కు 16 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే శ్రీశైలం నుంచి సాగర్కు రోజుకు ఒక టీఎంసీ చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సూచించింది. తెలంగాణకు కేటాయించిన నీటిలో హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు చెరో 2 టీఎంసీల చొప్పున 4 టీఎంసీలు, మహబూబ్నగర్ జిల్లాలోని కల్వకుర్తి కింది తాగునీటి అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకోవాలని పేర్కొంది. ఏపీకి కేటాయించిన నీటిలో సాగర్ కుడి కాల్వకు 6 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు అవసరాలకు 5 టీఎంసీలు, హంద్రీ–నీవా కింది అవసరాలకు మరో 5 టీఎంసీలు వాడుకునే అవకాశం ఇచ్చింది. అయితే ఏపీ ఇప్పటికే హంద్రీ–నీవా కింద 1.08 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు కింద 1.5 టీఎంసీలు వాడుకున్నందున ప్రస్తుత కేటాయింపుల్లో వాటిని లెక్కించాలని సూచించింది. అలాగే కల్వకుర్తి కింద తెలంగాణ సైతం ఇప్పటికే 1.65 టీఎంసీలు వాడినందున రాష్ట్రానికీ ఇదే సూత్రం వర్తిస్తుందని బోర్డు తెలిపింది. జూన్ వరకు నీటి కేటాయింపులపై మళ్లీ చర్చిద్దాం... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీతోపాటు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్రావు, సాగర్ సీఈ సునీల్, అంతర్రాష్ట్ర జల వ్యవహారాల చీఫ్ ఇంజనీర్లు హాజరయ్యారు. తమ తాగునీటి అవసరాలకు 16 టీఎంసీలు అవసరమని ఏపీ తెలపగా... నల్లగొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల తాగునీటి అవసరాలకు 40 టీఎంసీలు కావాలని తెలంగాణ కోరింది. ఇందుకు ఏపీ అభ్యంతరం తెలిపింది. తాము కేవలం ఒక నెల అవసరాలనే ఇండెంట్గా సమర్పించామని, ఏడాదికి అవసరమయ్యే నీటిపై మరోమారు బోర్డు సమావే శంలో చర్చించి నిర్ణయిద్దామని సూచించింది. దీనిపై బోర్డు సానుకూలంగా స్పందించ డంతో అక్టోబర్ 15 తర్వాత బోర్డు పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి వచ్చే జూన్ వరకు అవసరమయ్యే నీటి కేటాయింపులపై చర్చించాలని ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరింది. ప్రాజెక్టుల నియంత్రణపై మాకు అధికారాల్లేవు: సమీర్ చటర్జీ ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణకు సంబంధించి తమకు అధికారాలేవీ లేవని, అందుకే తమ ఆదేశాలను ధిక్కరించి ఇరు రాష్ట్రాలు నీటిని తీసుకుంటున్నా ఏమీ చేయలేక పోతున్నామని బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ పేర్కొన్నారు. బోర్డు భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము కేవలం ఇరు రాష్ట్రాల నుంచి వచ్చే వినతులు, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేస్తున్నాం. వాటిని ఇరు రాష్ట్రాలు సరైన రీతిలో అమలు పరచకుంటే మేమేం చేయలేం. తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నాం. మా చేతులు కట్టేసి, అధికారాలివ్వకుండా ఇరు రాష్ట్రాలను నియంత్రించడం సాధ్యమయ్యేది కాదు’’అని అన్నారు. -
‘కృష్ణా’పై ఏకపక్ష నిర్ణయాలా..!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీపై తెలంగాణ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారంలో ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని విషయాల్లో ఏపీకి వంతపాడుతున్నార ని భావిస్తోంది. ప్రాజెక్టుల నియంత్రణ, టెలీ మెట్రీ అంశాల్లో సమీర్ చటర్జీ వ్యవహార శైలి వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు తలె త్తుతున్నాయని, ఆయనను పదవి నుంచి తొలగించాలని త్వరలోనే కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది. నీటి పంపకాల్లో ఏపీకి అనుకూలంగా వ్యవహ రిస్తున్నారని తొలి నుంచీ ఆయనపై రాష్ట్రం గుర్రుగా ఉన్నా, కేంద్రానికి నేరుగా ఫిర్యాదు చేయలేదు. ఇటీవల కృష్ణా బేసిన్లో టెలీమెట్రీ పరికరాల అంశంలో చటర్జీ ఏకపక్షంగా వ్యవ హరించారు. పోతిరెడ్డి పాడు, సాగర్ ఎడమ కాల్వలపై టెలీమెట్రీ అమర్చే క్రమంలో తెలంగాణకు కనీస సమాచారం ఇవ్వకుం డానే మార్పులు చేశారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటా యింపులు లేనం దున, ప్రాజెక్టులపై బోర్డు నియంత్రణ అవస రం లేదని పలు వేదికలపై తెలంగాణ విన్నవిస్తున్నా, వాటిని పట్టించుకోకుండా తామిచ్చిన ఢ్రాప్ట్ నోటిఫి కేషన్పై ఇటీవల సమీర్ చటర్జీ రాష్ట్ర అభిప్రా యాలు కోరారు. ఇది కూడా రాష్ట్ర ఆగ్రహానికి కారణమైంది. ఈ దృష్ట్యా సమీర్ చటర్జీ వ్యవహారాన్ని నేరుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతికి ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement