-
2016 బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ ఏదో తెలుసా?
లండన్ : స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో జోరు మీదున్న ఆపిల్ మరోసారి తన సత్తా చాటుకుంది. 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ కిరీటం ఆపిల్ ఐఫోన్ 6ఎస్ దక్కించుకుంది. ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో 2016లో బెస్ట్-సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ గా ఐఫోన్ 6ఎస్ నిలిచినట్టు తెలిసింది. ఇటీవల ఆపిల్ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఐఫోన్ 7, నాలుగో క్వార్టర్లో బెస్ట్-సెల్లర్ గా నిలిచినట్టు ఈ ర్యాంకింగ్స్ తెలిపాయి. దాని తర్వాత ఐఫోన్ 7ప్లస్ ఉంది.ఎన్నో నూతన ఆవిష్కరణలను, కొత్త కొత్త ఫీచర్లతో ఐఫోన్లను ఆపిల్ మార్కెట్లోకి తీసుకొస్తుడటంతో కంపెనీ మళ్లీ సత్తా చాటుకుంటోందని ఐహెచ్ఎస్ మార్కిట్ తెలిపింది. కొత్త ఫోన్లతో పాటు పాత ఐఫోన్లను కంపెనీ విక్రయాలకు ఉంచుతోందని రిపోర్టు పేర్కొంది. 2016లో ఎక్కువగా రవాణా అయిన స్మార్ట్ ఫోన్ మోడల్స్ లో పాత ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్లే ఉన్నాయని మార్కిట్ వెల్లడించింది. అదేవిధంగా గెలాక్సీ నోట్7 పేలుళ్లకు ముందు మార్కెట్లో తన సత్తా చాటిన శాంసంగ్ ఫోన్లు గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7లు కూడా ఐదు, తొమ్మిదవ స్థానాల్లో నిలిచాయి. పేలుళ్ల దెబ్బతో శాంసంగ్ అల్లాడినప్పటికీ, ఎక్కువగా సరుకురవాణా అయిన టాప్-10 స్మార్ట్ఫోన్లలో శాంసంగ్ ఫోన్లే ఐదున్నాయి. టాప్-10 ర్యాంకింగ్స్ లో చైనీస్ కంపెనీ ఓపో మోడల్స్ కూడా నిలిచాయి. -
ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏదో తెలుసా?
2016 త్వరలోనే బైబై చెప్పి వెళ్లిపోబోతున్నది. కొత్త సంవత్సరం రాబోతున్నది. మరి, 2016లో వచ్చిన బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది? ఏ ఫోన్ ఎక్కువగా యూజర్ల మనస్సును గెలుచుకుంది? స్పెషికేషన్స్ పరంగా ఏ స్మార్ట్ఫోన్ ఈ ఏడాది విజేతగా నిలిచిందంటే.. ఈ నిజానికి ఈ ఏడాది డిజైన్పరంగా స్మార్ట్ఫోన్లలో గొప్ప మార్పులేమీ రాలేదు. కానీ అన్ని స్థాయిల ధరలలోనూ బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25వేలకుపైగా ధరతో భారీ ఫీచర్లతో ఫ్లాగ్షిప్ బ్రాండ్గా వెలువడిన స్మార్ట్ఫోన్ల వరకు చూసుకుంటే.. ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ఫోన్ల గురించి నిపుణుల చెప్తున్న అభిప్రాయమిది. ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ఫోన్ విన్నర్: ఐఫోన్ 7 ప్లస్ 2016లో వచ్చిన స్మార్ట్ఫోన్లలో పర్ఫామెన్స్ పరంగా చూసుకుంటే.. ఈ ఏడాది విజేత ఐఫోన్ 7 ప్లస్సే. డిజైన్పరంగా పెద్దగా మార్పులు చేయకపోయినా.. అంతర్జాతీయస్థాయి పరీక్షలను ఎదుర్కొని ఉత్తమ స్థాయి పర్ఫార్మెన్స్ అందించడంలో ఈ ఫోన్ టాప్ స్థానంలో నిలిచింది. ఫ్లాగ్షిప్ స్థాయిలో రానున్న రెండేళ్లు నిలకడగా సేవలు అందించే ఫోన్ మీకు కావాలంటే.. మీరు దీనిని ఎంచుకోవచ్చు. ఈసారి నీళ్లు, దుమ్ము పడకుండా రెసిస్టెంట్ డిజైన్తో రావడం మరో అడ్వాంటేజి. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా ఐఫోన్-7 ప్లస్ ఈసారి డుయల్ ఫ్రంట్ కెమెరాతో రావడం మరో విశేషం. వైడ్ యాంగిల్, టెలిఫొటో లెన్స్ కాంబినేషన్లో వచ్చిన 'బోకే స్టైల్' ఎఫెక్ట్.. ఐఫోన్ 7 ప్లస్ యూజర్లకు అంతర్జాతీయస్థాయి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తోంది. 2X ఆప్టికల్ జూమ్, 10x డిజిటల్ జూమ్ ఉండటం ఈ ఫోన్లోని కెమెరాలో మరో స్పెషాలిటీ. రన్నరప్: సాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ టెక్నాలజీ దిగ్గజం సాంసంగ్ ఈ ఏడాది గెలాక్సీ ఎస్7 ఎడ్జ్తో మళ్లీ లాభాలబాట పట్టింది. గ్లాస్, మెటల్ డిజైన్తో, కర్వ్డ్ అంచులతో ఈ ప్రీమియర్ ఫ్లాగ్షిప్ ఫోన్ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. పర్ఫార్మెన్స్ విషయంలోనూ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ బాగుంది. అయితే, ఐఫోన్ 7 ప్లస్ను మాత్రం ఢీకొనలేకపోయింది. సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ ఉండటం ఈ ఫోన్కు ఉన్న మరో ప్రత్యేకత. ఏకంగా 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్లో ఉంది. ఈ ఏడాది గెలాక్సీ నోట్ 7 బ్యాటరీ పేలుళ్ల వివాదం సాంసంగ్ను తీవ్రంగా ఒడిదుడుకుల్లో నెట్టినా.. గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ ఆ సంక్షోభం నుంచి కొంతమేర నిలబెట్టగలిగింది. గూగుల్ పిక్సెల్ కన్నా చాలా స్టేబుల్గా ఉండటం వల్ల దీనికి రన్నరప్ స్థానం ఇవ్వవచ్చునని నిపుణులు అంటున్నారు. బెస్ట్ అండ్రాయిడ్ ఫోన్: గూగుల్ పిక్సెల్ ఈ ఏడాది గూగుల్ స్మార్ట్ఫోన్ రంగంలో అడుగుపెట్టింది. గత అక్టోబర్ నెలలో ప్రీమియం ధరలతో పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ సిరీస్ ఫోన్లను విడుదల చేయడం ద్వారా ఈ రంగంలో సాంసంగ్, యాపిల్ టాప్ బ్రాండ్ ఫోన్లకు సవాలు విసిరింది. బెస్ట్ గూగుల్ ఫీచర్లు పొందాలంటే ఈ ఫోన్లు తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ ఫోన్ల కోసమే గూగూల్ అసిస్టెంట్ ఫిచర్ను కంపెనీ తీసుకురావడం గమనార్హం. అత్యాధునిక్ సాఫ్ట్వేర్తో కూడిన సుపీరియర్ కెమెరాతోపాటు ఐఫోన్ సహా అన్ని ఫోన్ల నుంచి నేరుగా మొత్తం డాటాను బదిలీచేసుకునే వీలు కల్పిస్తూ ఈ పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ మార్కెట్లోకి వచ్చాయి. ఐఫోన్ ఎస్ సిరీస్కు, సాంసంగ్ ఎస్ 7 ఎడ్జ్కు సరితూగేరీతిలో ఈ ఫోన్లలో కెమెరా డిపార్ట్మెంట్ ఉండటం మరో హైలెట్. ఔట్డోర్లో అయినా, లో లైటింగ్ సెట్టింగ్లో అద్భుతమైన షాట్స్ తీసుకునే సదుపాయాన్ని ఈ ఫోన్ కల్పిస్తోంది. డిజైన్పరంగా పెద్దగా ప్రత్యేకత లేకపోయినా ఈ ఏడాది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో దీనికి పెద్దపీట వేయవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రన్నరప్: వన్ ప్లస్ 3 ఫ్లాగ్షిప్ బ్రాండ్లకు దీటుగా టాప్ పర్ఫార్మెన్స్తో అందుబాటు ధరలతో మార్కెట్లోకి వచ్చిన ఫోన్ వన్ ప్లస్ 3. ధరపరంగా (ఫ్లాగ్షిప్ బ్రాండ్ల ధరలో సగం ధరకే లభిస్తోంది), ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే.. వన్ ప్లస్ 3యే విన్నర్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్లో కెమెరా, ఓవరాల్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్ ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఐఫోన్, గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్థాయి ఫీచర్లతో తక్కువ ధరకు ఫోన్ కావాలంటే తప్పక దీనివైపు మొగ్గుచూపవచ్చు. అయితే, వన్ ప్లస్ 3, 3టీ రెండు సిమిలర్గా కనిపిస్తున్నా.. ఒకటి కాదు. ఇటీవల భారత్లో విడుదలైన వన్ ప్లస్ 3నే చాలావరకు ఉత్తమంగా ఉంది. ప్రత్యేక ప్రస్తావన మోటో జడ్! మాడ్యులర్ డిజైన్తో, ఎక్స్ట్రా స్లిమ్ ఫ్యాక్టర్తో వచ్చిన మోటో జడ్ ఫోన్ను ఈ ఏడాది ప్రత్యేకంగా ప్రస్తావించవచ్చు. ఎక్స్ ట్రా బ్యాటరీ, హజెల్బ్లాడ్ జూమ్ లెన్స్, ప్రోజెక్టర్, జేబీఎల్ స్పీకర్ వంటి పలు సృజనాత్మకమైన ఫీచర్లతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. భారత్లో లభిస్తున్న ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఫోన్లను బట్టి చూస్తే దీని ధర కొంచెం తక్కువేనని చెప్పవచ్చు. నుబియా జెడ్11 30వేల ధరలో లభించే ఫ్లాగ్షిప్ బ్రాండ్ ఫోన్లలో వన్ ప్లస్ 3 తర్వాత అంతే చెప్పుకోదగిని ఫోన్ ఇదే. ఈ నెలలోనే విడుదలైన ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుంటోంది. చక్కని డిజైన్, మంచి కెమెరా వంటి ఫీచర్లతో మధ్యతరహా ధరలతో లభిస్తున్న న్యూబియా జెడ్11 దేశంలో బ్రాండ్ గా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. -
శాంసంగ్ కు మరో షాక్
న్యూయార్క్: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మంటలు చల్లారకముందే మరో షాక్ తగిలింది. అదే కంపెనీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ కూడా పేలిపోయింది. అమెరికాలోని ఓ వ్యక్తి దగ్గరున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది. చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది. ఒరిజినల్ చార్జర్ తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది. రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఇందులో బ్యాటరీ సురక్షితమైందని కంపెనీ తనకు భరోసాయిచ్చిందని బాధితుడు చెప్పాడు. కాగా, శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. శాంసంగ్ నోట్ 7 మోడల్ ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్ కు వచ్చ ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement