-
పులివెందులలో నాటుబాంబుల కలకలం
పులివెందుల: వైఎస్సార్జిల్లా పులివెందులలో నాటుబాంబుల కలకలం రేగింది. స్థానిక నామాలగుండు శివాలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకొని ప్రత్యర్థి వర్గీయులు బాంబులతో దాడి చేశారు. ఈ సంఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన మొట శంకరప్ప సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని నామాలగుండు ఆలయంలో పూజలు నిర్వహించడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న ప్రత్యర్థి వర్గీయులు ఆలయ సమీపంలో అతనిపై నాటుబాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరప్పకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. శంకరప్పపై దాడి చేసిన వారు అనంతపురం జిల్లా తలుపుల మండలం ఎపిలిపల్లికి చెందిన సంజీవరాయుడు వర్గీయులని పోలీసులు అనుమానిస్తున్నారు. -
ప్రమాదవశాత్తు కిందపడి జూనియర్ అసిస్టెంట్ మృతి
షాబాద్ మండల కేంద్రంలో ఘటన మృతుడు మహబూబ్నగర్ జిల్లావాసి షాబాద్: ఇంట్లో ప్రమాదవశాత్తు కిందపడిన ఓ జూనియర్ అసిస్టెంట్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ సంఘటన షాబాద్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ డివిజన్ బొంరాస్పేట్ మండలానికి చెందిన కుర్వ శంకరప్ప(40) మూడు సంవత్సరాలుగా షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక్కడే అద్దె ఇంట్లో ఉం టూ ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం 6 గంటల వరకు కార్యాలయంలో విధులు ముగించుకున్న ఆయన గదికి వెళ్లాడు. వంటగదిలో నుంచి బయటకు వ స్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయా డు. తల వెనుకభాగం గోడకు తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం 10 గంటలు దాటిన శంకరప్ప బయటకు రాకపోవడంతో ఇంటి యజమాని వెంకటయ్య తలుపుతట్టాడు. లోపలి నుంచి గడియ ఉంది. ఎంతకూ స్పందన లేకపోవడంతో స్థానికులతో కలిసి తలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే శంకరయ్య విగతజీవిగా కనిపించాడు. దీంతో ఆయన ఎంపీడీఓ పద్మావతితో పాటు కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. ఎస్ఐ శ్రీధర్రెడ్డి, ఎంపీపీ పట్నంశెట్టి జ్యోతి, ఎంపీడీఓ పద్మావతి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు పెళ్లీడుకొచ్చిన కూతుళ్లు ఉన్నారు. శంకరప్ప కుటుంబీకులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎంపీపీ, ఎంపీడీఓలు హామీ ఇచ్చారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న శంకరప్ప మృతితో కుటుంబీకులు కన్నీటిపర్యంతమయ్యారు. చేవెళ్ల ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అ ప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కట్టమూరులో నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరం
16 ఏళ్ల వయసులో ఛాన్సుల కోసం వెళ్తే.. అమ్మ మందే ఇలా అడిగారు: వితికా
పూజా హెగ్డే గ్లామర్ వేరే లెవల్.. సీరత్ గురించి చెప్పక్కర్లేదు!
వేముల రోహిత్ కేసు మూసేస్తున్నాం.. హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్
టీ20 వరల్డ్కప్కు అంపైర్లు వీరే.. భారత్ నుంచి ఇద్దరు
టంపాబే లో అనాథల కోసం నాట్స్ సరికొత్త సేవా కార్యక్రమం!
కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారు?
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
టంపాలో చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం దాతృత్వం!
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
తప్పక చదవండి
- పూజా హెగ్డే గ్లామర్ వేరే లెవల్.. సీరత్ గురించి చెప్పక్కర్లేదు!
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
- ఆస్పత్రిలో లేడీ కమెడియన్.. కొడుకుని తలుచుకుని ఎమోషనల్
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు : డిప్యూటీ సీఎం నారాయణస్వామి
- వంగా గీతని ఓడించడం ఎవరి వల్ల కాదు.. పవన్పై నటి శ్యామల షాకింగ్ కామెంట్స్
- Black Salt Benefits : బ్లాక్ సాల్ట్తో ఇన్ని లాభాలా?
Advertisement