-
సతీష్రెడ్డి క్షవరం కోసమే ‘పైడిపాలెం’ ప్రారంభం
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బనగానపల్లె రూరల్ : శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్రెడ్డి క్షవరం కోసమే సీఎం చంద్రబాబు పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించారని వైఎస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన తన సృగృహంలో విలేకరులతో మాట్లాడారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రూ.660 కోట్లతో పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. కేవలం 10 శాతం పనులు టీడీపీ హయాంలో కొనసాగుతున్నాయన్నారు. ప్రారంభోత్సవంలో నిజాలు తెలుస్తాయనే ఉద్దేశంతో స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని సభకు రాకుండా హౌస్ అరెస్టు చేశారని, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వదిలేశారన్నారు. జీఎన్ఎస్ పనులు పూర్తికాకున్నా అప్పుడే పులివెందులకు నీరిచ్చినట్లు చెప్పుకోవడం దారుణమన్నారు. గండికోట రిజర్వాయర్కు గోరుకల్లు ప్రాజెక్టు నుంచి జీఎన్ఎస్ ద్వారా నీరు విడుదల చేయాల్సి ఉందని, అయితే అక్కడి నుంచి అవుకు వరకు పనులు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. దీంతో ఎస్ఆర్బీసీ ద్వారా అవుకు రిజర్వాయర్కు గోరుకల్లు నుంచి నీటిని విడదల చేస్తున్నారన్నారు. ఎస్ఆర్బీసీ కాల్వలో సామర్థ్యానికి మించి నీటి ప్రవాహం ఉందని, దీని వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరిగినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు శివరామి రెడ్డి మాట్లాడుతూ గండికోటకు నీరు తీసుకెళ్లడం వల్ల ఇక్కడి రైతులకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే నీటిని ఎస్ఆర్బీసీ కాల్వ ద్వారా కాకుండా జీఎన్ఎస్ ద్వారా తీసుకెళ్లాలన్నారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు లభించే నీటివాటాపై ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంక్రాంతి సంబరాలకు కేటాయించే ని«ధులను ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలని కోరారు. రైతు సంఘం నాయకులు జయప్రకాష్రెడ్డి ఉన్నారు. -
సతీశ్రెడ్డికి ఇంజనీరింగ్ ఎక్సలెన్సీ అవార్డు
సాక్షి, హైదరాబాద్: దేశ రక్షణలో కీలకమైన క్షిపణి, ఏరోస్పేస్ రంగా ల్లో విశిష్ట సేవల కు గుర్తింపుగా రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, డీఆర్డీవో క్షిప ణి, వ్యూహాత్మక వ్యవస్థల విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ సతీశ్రెడ్డికి ప్రతిష్టాత్మక ఐఈఐ–ఐఈఈఈ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. బెంగళూరులో బుధవారం జరిగిన ఐఈఈఈ ఆసియా పసిఫిక్ విభాగం స్వరో్ణత్సవాల్లో ఐఈఈఈ అధ్యక్షుడు డాక్టర్ బారీ ఎల్. షూప్ సమక్షంలో ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్కుమార్ చేతుల మీదుగా సతీశ్రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రం గంలో మరీ ముఖ్యంగా క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల విషయంలో భారత్ స్వావలంబన దిశగా వేగం గా ముందడుగు వేస్తోందన్నారు. దేశ తక్షణ అవసరాలను, సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. -
క్యాంపస్ సెలక్షన్స్లో ఓయూ విద్యార్థికి భారీ ఆఫర్
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ విభాగంలో చివరి సంవత్సరం చదువుతున్న సతీష్రెడ్డి ఏడాదికి రూ.20 లక్షల వేతనం గల ఉద్యోగానికి ఎంపికైనట్లు ప్లేస్మెంట్ సెల్ డెరైక్టర్ ప్రొ.ఉమామహేశ్వర్ తెలిపారు. అంతర్జాతీయంగా పేరొందిన డీఈ షో కంపెనీలో మన దేశంలోనే ఉద్యోగం చేసేందుకు ఇటీవల జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూ లలో సతీష్రెడ్డిని ఎంపిక చేశారు. ఇంటర్వ్యూలో నలుగురు విద్యార్థులు హాజరుకాగా సతీష్రెడ్డి ఒక్కరు మాత్రమే ఉద్యోగం పొందినట్లు డైరెక్టర్ ఉమామహేశ్వర్ చెప్పారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement