-
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్ల ఎన్నికను సవాలు చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన ఎన్నికల వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అలాగే ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు సైతం నోటీసులిచ్చింది. తదుపరి విచారణను అక్టోబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ ఎం.గంగారావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీచేశారు. విశాఖ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కె.కన్నప్పరాజు, రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ ఎన్నికను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థి బొప్పన భవకుమార్ తరఫున ఎన్నికల ఏజెంట్ వి.శ్రీనివాస్రెడ్డి హైకోర్టులో ఎన్నికల పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మలసాని మనోహర్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి అఫిడవిట్లో తన ఆదాయం, వృత్తి వివరాలను తెలపాల్సి ఉండగా వీరు పొందుపర్చలేదన్నారు. అనగాని సత్యప్రసాద్ కూడా ఆదాయ వివరాలు పేర్కొనలేదని తెలిపారు. వాస్తవాలను దాచి వీరు అఫిడవిట్ దాఖలు చేశారని, ఎన్నికల నిబంధనలకు ఇది విరుద్ధమని మనోహర్రెడ్డి వివరించారు. -
టీడీపీలో కలకలం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకోక ముందే వరుసగా తగులుతున్న షాక్లు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవలే టీడీపీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనం కాగా తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీకి చెందిన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతతో సమావేశమై చర్చించడం, ఇటీవలే పార్టీని వీడిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావును కలవడంతో కలకలం రేగింది. నాలుగు రోజుల క్రితమే బీజేపీలో చేరిన గరికపాటి మోహనరావు ఆయన్ను దగ్గరుండి బీజేపీ అగ్రనేత వద్దకు తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. సత్యప్రసాద్తోపాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సత్యప్రసాద్ దీన్ని ఖండించారు. పది రోజుల్లోపే మరికొందరు కూడా! ఇటీవలే బీజేపీలో చేరిన చంద్రబాబు సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ద్వారా పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో సాధ్యమైనంత ఎక్కువ మందిని బీజేపీలో చేర్చేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కమలం గూటికి చేరుకోనున్నట్లు నాలుగు రోజులుగా టీడీపీలో ప్రచారం జరుగుతోంది. తాను బీజేపీలో చేరడం లేదని గంటా పైకి చెబుతున్నా మరికొందరు ఎమ్మెల్యేలను కూడగట్టి పార్టీని వీడేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీమోహన్, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి తదితరులు కూడా టీడీపీని వీడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. వారం పది రోజుల్లోనే పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరతారని ప్రచారం జరుగుతోంది. ఏలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, పామర్రు ప్రాంతానికి చెందిన టీడీపీ నేత కృష్ణబాబు ఇప్పటికే బీజేపీ కండువా కప్పుకున్నారు. బాబు వ్యూహాత్మక మౌనం టీడీపీలో ఇంత జరుగుతున్నా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మాత్రం నోరు మెదపకపోవడం చర్చనీయాంశమైంది. ఆయన వ్యూహం ప్రకారమే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్రావు, టీజీ వెంకటేష్లు బీజేపీలో చేరినట్లు పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని బీజేపీలో విలీనం చేసినా స్పందించకపోవడం, అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేయకపోవటాన్ని బట్టి ఇదంతా ఆయనకు తెలిసే జరుగుతోందన్న వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యక్తిగత పనుల మీదే ఢిల్లీకి: ఎమ్మెల్యే సత్యప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఢిల్లీ వచ్చానని, ఈ విషయమై పార్టీ వర్గాలకు ముందుగానే సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన కుటుంబానికి సన్నిహితుడైన గరికపాటి ఇటీవల అస్వస్థతకు గురి కావడంతో పరామర్శించేందుకు వచ్చినట్టు తెలిపారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని, రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం వారి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించారు. బీజేపీలో లంకా చేరిక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బీజేపీలో చేరారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అవమానాలపై కాపు నేతల్లో ఆగ్రహం టీడీపీలోని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు బుధవారం నిర్వహించిన సమావేశానికి తోట త్రిమూర్తులు, బొండా ఉమామహేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు గైర్హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం ఈ వర్గం కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమై పార్టీలో తమ సామాజికవర్గానికి అవమానాలు జరుగుతున్నాయని, అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తమను పట్టించుకోలేదని, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? టీడీపీలోనే కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే అంశంపై సమాలోచనలు జరిపారు. చంద్రబాబు భజన ఆపాలని తోట త్రిమూర్తులు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. -
టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు
ఉద్యోగుల తొలగింపుపై వివరణ ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల తొలగింపు విషయంలో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీతో పాటు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు కూడా నోటీసులిచ్చింది. ఉద్యోగుల తొలగింపునకు సం బంధించిన పూర్తి వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం ఉత్తర్వులిచ్చారు. టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపును సవాలు చేస్తూ సుద్దాల సుధాకర్ మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు... పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయ వాది ఎ.సత్యప్రసాద్ వాదనలు విని పిస్తూ... టెక్ మహీంద్ర కంపెనీ పలువురు ఉద్యోగుల్ని రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తోందని, సెలవు పై వెళ్లాలని వేధిస్తోందని చెప్పారు. దీనిపై రంగా రెడ్డి జిల్లా కార్మిక శాఖ జాయింట్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన తర్వాత సదరు కంపెనీ ఉద్యోగుల్ని తొలగించిందన్నారు. కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదు పెండింగ్లో ఉండగా ఉద్యోగులను తొల గించరాదని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 47(2) స్పష్టం చేస్తోందన్నారు. ఇటీవల పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొల గిస్తున్నాయని, ఒక నెలలోనే కార్మిక శాఖ కమి షనర్ దగ్గర 80 పిటిషన్లు దాఖలయ్యాయని సత్య ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న జడ్జి ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె
విశాఖ ట్రాన్స్కో కార్యాలయం వద్ద సిబ్బంది ఆందోళన సీలేరు విద్యుదుత్పత్తి కేంద్రాలు మూత విశాఖపట్నం , న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు జిల్లాలోనూ విద్యుత్ ఉద్యోగులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ పంపిణీ సంస్థల సిబ్బంది విధులను బహిష్కరించారు. జెన్కో ఉద్యోగులంతా సీలేరు జలవిద్యుత్ కేంద్రం మెయిన్గేటు వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో ఈ విద్యుత్ కాంప్లెక్స్ పరిధిలోని మాచ్ఖండ్, సీలేరు, డొంకరాయి, మోతుగూడెం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. నాలుగింట 505 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విశాఖ మహారాణిపేటలోని ట్రాన్స్కో కార్యాలయం వద్ద ఆ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ ఇ.గణపతి మాట్లాడుతూ పేరివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు విషయంలో ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. 2014 నూతన వేతన సవరణ చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అందజేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పరిమితి లేకుండా వైద్యఖర్చులు చెల్లించాలన్నారు. విద్యుత్ సరఫరా, పంపిణీ ప్రైవేట్ సంస్థలకు అప్పగించవద్దని కోరారు. అనంతరం ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ సత్యనారాయణ, ఉప కన్వీనర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. మాచ్ఖండ్ సిబ్బంది ఆందోళన ముంచంగిపుట్టు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కారించాలంటూ ఆదోళన చేశారు. పీఆర్సీని అమలు చేయాలని జలవిద్యుత్ కేంద్రం కార్మిక, ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎస్ఈ కార్యలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ, ఐఆర్ సమస్యను ప్రభుత్వం అమలు చేయకుంటే అత్యవసర సేవలు స్తంభింప చేస్తామని హెచ్చరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
సంక్షేమం సగం బలం
జగన్కు జైకొట్టిన ఆటో డ్రైవర్లు
ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement