-
ఉపకారం..అందనంత దూరం!
కర్నూలు, ఆళ్లగడ్డ: స్వయం సహాయక సంఘాల సభ్యుల పిల్లలకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం అటకెక్కింది. నాలుగేళ్ల క్రితం వరకు ఆమ్ ఆద్మీ బీమా యోజన, అభయ హస్తం, జనశ్రీ బీమా యోజన పేరుతో ప్రతి ఏటా ఆగస్టులో స్కాలర్షిప్లు ఇచ్చేవారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పథకాలను చంద్రన్న బీమా కిందకు తీసుకొచ్చారు కానీ అమలు చేయడం లేదు. ఏటా ప్రీమియం చెల్లిస్తున్న పొదుపు మహిళలు మాత్రం తమ పిల్లలకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పొదుపు మహిళల పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. నాటి నుంచి 2014 వరకు ఈ కార్యక్రమం సక్రమంగా సాగింది. ఆమ్ఆద్మీ, జనశ్రీ బీమా యోజన (ప్రస్తుతం చంద్రన్న బీమా) పథకం కింద లబ్ధిదారులు ఏడాదికి రూ. 115 చొప్పున కమ్యూనిటీ మేనేజ్డ్ మైక్రో ఇన్సూరెన్స్కు ప్రీమియం చెల్లించాలి. అభయ హస్తం పథకంలో ఉన్నవారు ఏడాదికి రూ. 385 చెల్లించాలి. అలా చెల్లించిన వారి పిల్లలకు ఏడాదికి రూ. 1200 చొప్పున స్కాలర్షిప్లు ఇస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు ఇందుకు అర్హులు. నాలుగేళ్లుగా ఎదురుచూపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ బీమా , అభయహస్తంను చంద్రన్న బీమాలోకి విలీనం చేశారు. ఏటా జిల్లా వ్యాప్తంగా 1,18,780 మంది పొదుపు మహిళలు ప్రీమియం చెలిస్తున్నారు. అయితే, చదువు కుంటున్న వీరి పిల్లలకు ఇప్పటి వరకు పైసా ఉపకార వేతనం అందలేదు. 2015 – 16, 2016 – 17, 2017 – 18 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఇప్పటి వరకు మంజూరు కాలేదు. మరికొద్దిరోజులు గడిచితే 2018 – 19 విద్యా సంవత్సరం కూడా పూర్తవుతుంది. స్కాలర్షిప్లు మంజూరైతే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఎంతో కొంత ఊరట లభించేది. సన్నగిల్లుతున్న ఆశలు పొదుపులో ఉన్న వారు ఎక్కువగా పేదలు. పనిచేస్తే కానీ పూటగడవదు. అలాంటి వీరు పిల్లలకు ఉపకారవేతనాలు వస్తే చదివించుకోవచ్చని ఆశించి ప్రీమియం చెలిస్తున్నారు. అయితే, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లేలా వ్యవహరిస్తుంది. ఉపకారవేతనాలు మంజూరు చేస్తుందో లేదో అధికారులకు సైతం తెలియని పరిస్థితి. చాలా మంది మహిళలు ప్రతి రోజు పొదుపు సంఘాల లీడర్లు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద 22,794మంది, చంద్రన్న బీమా కింద 78,820 మంది, అభయహస్తం కింద 16,166 మంది ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నాం నేను జనశ్రీ బీమా యోజన కింద ఒక్కో సభ్యురాలితో రూ. 115 లెక్కన 40 మంది, అభయ హస్తం కింద రూ. 385 ప్రకారం 15 మంది, ఆమ్ఆద్మీ బీమా కింద రూ. 115 ప్రకారం 20 మందితో ప్రీమియం వసూలు చేసి కార్యాలయంలో చెల్లించా. 5 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా చెల్లిస్తూనే ఉన్నాం. ఇంతవరకు ఒక్క సభ్యురాలికి కూడా పైసా రాలేదు. ఎందుకు రావడం లేదని సభ్యులు అడిగితే సమాధానం చెప్పలేక పోతున్నాం. అధికారులను అడిగితే తెలియదంటున్నారు.– ప్రమీల, ఐక్య సంఘం లీడర్ -
నిస్సహాయం..!
కర్నూలు(అగ్రికల్చర్): ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన స్వయం సహాయక సంఘాలు నేడు దీనస్థితిలో కొట్టమిట్టాడుతున్నాయి. ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు చేయూతనివ్వకపోవడంతో పొదుపు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మైక్రో ఫైనాన్స్ ఊబిలో చిక్కుకొని చాలా మంది విలవిల్లాడుతున్నారు. అక్కలు..చెల్లమ్మలూ ఎవరూ ఆందోళన చెందవద్దు.. అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట మార్చారు. సంఘానికి రూ.లక్ష ప్రకారం రివాల్వింగ్ ఫండ్ ఇస్తామని ప్రకటించారు. ఇందుకు అనేక షరతులను విధించారు. చంద్రబాబు మాటలు నమ్మి డ్వాక్రా మహిళలు.. ఏప్రిల్ నుంచి రుణాలు చెల్లించడం మానేశారు. రుణాల రికవరీ లేదని బ్యాంకులు సైతం కొత్తవాటిని ఇవ్వలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 24,663 ఎస్హెచ్జీలకు రూ.712 కోట్లు బ్యాంకుల నుంచి లింకేజీ రుణాలను ఇప్పించే విధంగా ప్రభుత్వం లక్ష్యాన్ని ఇచ్చింది. ఆగస్టు నెల వరకు 6,069 సంఘాలకు రూ.165.4 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉంది. అయితే బ్యాంకులు ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ఇప్పటివరకు 1,789 సంఘాలకు రూ.45.56 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. ప్రభుత్వం పట్టించుకోక, బ్యాంకులు రుణాలు ఇవ్వక మహిళల ఆర్థికాభివృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత ఏపీఎంలపై ఉంది. వీరు ఎస్హెచ్జీలకు సంబంధించి సూక్ష్మ ప్రణాళికను బ్యాంకులకు సమర్పిస్తే రుణాలు అందుతాయి. ఏపీఎంలు, సీసీలు.. ఎవరూ స్పందిచడం లేదు. పలువురు ఏపీఎంలు ఇంతవరకు తమ పరిధిలో ఒక్క సంఘానికి కూడా రుణాలు ఇప్పించకపోవడం గమనార్హం. ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు.. బ్యాంకు ఇవ్వాల్సిన రుణం (రూ.కోట్లలో) ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 85.60 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18.67 ఆంధ్ర బ్యాంకు 12.42 సిండికేట్ బ్యాంకు 32.61 ఇండియన్ బ్యాంకు 9.40
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement