-
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
కొత్త పుస్తకాలు వచ్చేశాయ్!
సాక్షి, అమరావతి: సర్కారీ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ముద్రించిన కొత్త పాఠ్య పుస్తకాలు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలకూ చేరుకున్నాయి. అక్కడి నుంచి మండల కేంద్రాలకు తరలించే కార్యక్రమం కూడా ఇప్పటికే మొదలైంది. ఎంఈవోల నుంచి పాఠశాలలకు తరలించి.. విద్యార్థులు స్కూళ్లకు రాగానే 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించిన జగనన్న విద్యాకానుక కిట్లతో కలిపి వారికి అందజేసేలా చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రంలో పాఠశాలలు తెరిచే నాటికే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉండాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశం మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 3.48 కోట్ల పుస్తకాలు రెడీ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ పంపిణీ చేసేందుకు 3,48,54,791 పుస్తకాలను సిద్ధం చేశారు. కోవిడ్ మహమ్మారి కారణంగా గత కొన్ని నెలలుగా అన్ని రంగాల్లో పనులు స్తంభించడం, మందగించడం వంటి పరిస్థితులు ఏర్పడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడం కష్టంగా మారింది. ఈ తరుణంలోనూ పాఠశాల విద్యాశాఖ వాటిని అధిగమించి పిల్లలకు సకాలంలో పాఠ్య పుస్తకాల పంపిణీకి ఏర్పాట్లు చేయించడం విశేషం. పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూన్ 12 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా వల్ల జూలై 1 నుంచి ప్రారంభమయ్యాయి. కోవిడ్ వల్ల కేవలం టీచర్లు మాత్రమే రోజు విడిచి రోజు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆగస్టు రెండో వారం తరువాత స్కూళ్లలో తరగతులు దశలవారీగా ప్రారంభమయ్యేలా కార్యాచరణను రూపొందించారు. పూర్తిస్థాయిలో ఫస్ట్ సెమిస్టర్ పుస్తకాలు ప్రస్తుతం అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఫస్ట్ సెమిస్టర్ పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందించనున్నారు. 1–5 తరగతులకు మూడు సెమిస్టర్లు ఉండగా.. 6, 7, 8 తరగతులకు రెండు సెమిస్టర్లు ఉన్నాయి. 9, 10 తరగతులకు ఒకే సెమిస్టర్ విధానం నడుస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి సెమిస్టర్కు సంబంధించిన మొత్తం పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయి జిల్లాలకు చేరాయి. మొత్తం 13 జిల్లాలకు కలిపి 3,31,39,341 పాఠ్య పుస్తకాలకు గాను 3,19,62,419 పాఠ్యపుస్తకాల ముద్రణ ఆయా ప్రింటింగ్ సంస్థలు పూర్తిచేసి జిల్లాలకు తరలించాయి. జిల్లాల్లో ఇప్పటికే 28,92,372 పాఠ్య పుస్తకాలు మిగులు ఉన్నాయి. కొత్తగా వచ్చిన పాఠ్యపుస్తకాలు కలుపుకొని మొత్తం 3,48,54,791 పుస్తకాలు జిల్లాల్లో ఉన్నాయి. గతంలో టీడీపీ హయాంలో నవంబర్, డిసెంబర్ వరకు కూడా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందేవి కావు. కానీ.. ఇప్పుడు పాఠశాలలు తెరిచే నాటికే సిద్ధం చేయించడం విశేషం. -
జాప్యం జరిగింది... వాస్తవమే: జగదీష్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలు అన్నింటికీ సరైన సమయంలోనే పాఠ్యపుస్తకాలు అందజేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీష్రెడ్డి వెల్లడించారు. మంగళవారం తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి అడిగిన ప్రశ్నలకు జగదీష్ రెడ్డి సమాధానమిస్తూ... సామాజిక శాస్త్రం పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని ఆయన తెలిపారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్నాయని చెప్పారు. అధిక ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని జగదీష్రెడ్డి సభకు హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి సభలో ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో పుస్తకాల అమ్మకాలు తగ్గుతున్నాయని ఆందోళన చెందారు. పుస్తకాలు ధర మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయని... ఈ నేపథ్యంలో పేద విద్యార్థులపై పుస్తకాల కొనుగోళ్లలో అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు ఇంతవరకు పుస్తకాలు అందలేదన్నారు. నకిలీ పుస్తకాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వెల్లడించాలని వంశీచంద్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై విధంగా సమాధాన మిచ్చారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement