-
ఉద్యోగ నియామకాలు పెరిగాయ్, ఏ రంగంలో ఎంత పెరిగాయంటే!
ముంబై: దేశీయంగా జూన్లో నియామకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 3 శాతం పెరిగాయి. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ ప్రకారం.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), యాత్రలు, పర్యాటకం, రసాయన పరిశ్రమల్లో నియామకాల అధికమయ్యాయి. సుస్థిర ఆర్థిక రంగం, పర్యావరణ అనుకూల విభాగాలు, ఆతిథ్యంలోనూ ఈ జోరు సాగింది. మాన్స్టర్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 271 నుంచి గత నెలలో 279కి ఎగసింది. మే నెలలో ఇండెక్స్ 284 పాయింట్లు నమోదు చేసింది. మీడియా, ఎంటర్టైన్మెంట్ 26 శాతం, ఇంజనీరింగ్, సిమెంట్, నిర్మాణం, ఐరన్/స్టీల్ రంగాలు 20 శాతం తిరోగమనం చెందాయి. -
నెలాఖరులోగా పైప్లైన్ టెండర్లు
సేఫ్ స్టేజ్కి ఇన్టేక్వెల్స్ నిర్మాణం ఐదు డీపీఆర్లకు వ్యాప్కోస్ పచ్చజెండా ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ (వాటర్గ్రిడ్)కు సంబంధించి ప్రధాన పైప్లైన్ ఏర్పాటుకు నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటిసరఫరా విభాగం నిర్ణయించింది. ప్రాజెక్ట్కు సంబంధించి సెగ్మెంట్ల వారీగా అధికారులు రూపొందించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్)లకు వ్యాప్కోస్ నుంచి ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై మంగళవారం జరిగిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పైప్లైన్ టెండర్ల అంశంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆర్డబ్ల్యూఎస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఇన్టేక్వెల్స్ అన్నీ దాదాపుగా సేఫ్స్టేజ్కి వచ్చాయని, దీంతో వాటర్గ్రిడ్ పనులను సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి అయిన వెంటనే ఆయా ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. తొలిదశలోనే ఫ్లోరైడ్ బాధిత ప్రాంతమైన నల్లగొండ, కరువు ప్రాంతమైన మహబూబ్నగర్ జిల్లాలకు నీళ్లిస్తామని చెప్పారు. గ్రామాల్లో అంతర్గత పైపులైన్ నెట్వర్క్, నీటి ట్యాంకుల నిర్మాణం కోసం ప్రత్యేకంగా సర్వే చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఐదు డీపీఆర్లకు పచ్చజెండా.. సెగ్మెంట్ల వారీగా రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)లను వ్యాప్కోస్ పరిశీలన చేస్తోందని, మొత్తం 26 డీపీఆర్లలో ఇప్పటికే ఐదింటికి ఆమోదం తెలిపిందన్నారు. వారం రోజుల్లోగా డీపీఆర్ల పరిశీలన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే.. వాటర్గ్రిడ్ ప్రాజెక్ట్ పర్యవేక్షణ నిమిత్తం ఔట్ సోర్సింగ్ పద్ధతిన వర్క్ ఇన్ స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ల నియామకాన్ని వెంటనే చేపట్టాలని కోరారు. వాటర్గ్రిడ్ పైప్లైన్తో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఏర్పాటుపై ఐటీశాఖ అధికారులతో త్వరలో సమావేశమవుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్ తదితరులున్నారు. ఇదిలా ఉంటే.. పంచాయతీరాజ్ విభాగంలో తెలంగాణకు చెందిన సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న విషయాన్ని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఉన్నతాధికారులతో చర్చించి తగిన న్యాయం చేస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
కాంగ్రెస్లో.. లకలకలక..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ముంగిట బయటపడుతున్న లుకలుకలు కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి. పార్టీలోని గ్రూపులు చేతులు కలపట్లేదు. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు వైరి వర్గాలు అమీతుమీకి సిద్ధపడుతున్నాయి. తమ స్థానాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపునకు పాటుపడతామన్న ఇద్దరు మాజీ మంత్రులు.. ప్రస్తుతం సొంత సెగ్మెంట్లలో నెగ్గుకు వచ్చేందుకే చెమటలు కక్కుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని హడలెత్తిస్తున్నాయి. డివిజన్ స్థాయి నాయకులు- ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు- ఎంపీ అభ్యర్థుల మధ్య సమన్వయం కొరవడుతోంది. ప్రచార కార్యక్రమాలు రసాభాసగా మారుతున్నాయి. బుధవారం సికింద్రాబాద్ శాసనసభ నియోకజవర్గ పరిధిలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ పాల్గొన్న సభ అనంతరం కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్కుమార్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన వైఖరిపై నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పీసీసీ కార్యదర్శి చంద్రారెడ్డి దుమ్మెత్తిపోశారు. ఒక దశలో నువ్వెంతంటే నువ్వెంత అనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పార్టీ కోసం శ్రమించి, టికెట్లు దక్కక కినుక వహించిన ముఖ్య నేతల ఇళ్లకు జైరాం రమేష్తో పాటు కొప్పుల రాజు స్వయంగా వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సీతాఫల్మండిలో కాంగ్రెస్ సభ ముగియగానే జైరాం రమేష్ బండ కార్తీకరెడ్డి ఇంటికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ‘ఇప్పుడు టైం లేదు.. వద్దం’టూ అంజన్కుమార్ ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బండ కార్తీక, ఆమె వర్గీయులు నిరసనకు దిగడంతో కలకలం రేగింది. కొత్త ముఖాల బిక్కమొహం ముషీరాబాద్లో బుధవారం జరిగిన సభలోనూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంజన్కుమార్, వినయ్కుమార్ మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సభలో అంజన్ మాట్లాడుతూ తనను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు సిద్ధమవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలను అయోమయంలో పడేశాయిఎన్నికల బరిలోకి కొత్తగా దిగిన ముద్దం నర్సింహయాదవ్ (కూకట్పల్లి), నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి), గజ్జెల కాంతం (కంటోన్మెంట్) పరిస్థితి మరీ దారుణం.. ఇప్పటికీ కింది, డివిజన్ స్థాయి నేతలతో వీరికి సఖ్యతలేదు రెండోసారి పోటీలో ఉన్న జయసుధ (సికింద్రాబాద్), జ్ఞానేశ్వర్ (రాజేంద్రనగర్)కు నియోకజవర్గంలోని ముఖ్య నాయకులంతా ముఖం చాటేస్తున్నారు. వీరిని ఎలా బుజ్జగించాలో, ప్రచారం ఎలా సాగించాలో తెలియక వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఇద్దరు మంత్రుల ఎదురీత నగరంలో ప్రతి కార్యక్రమంలో హడావుడి చేసే తాజా మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్గౌడ్.. సొంత నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతున్నారు. ప్రజా వ్యతిరేకత, మెజారిటీ సెక్షన్లు పార్టీకి దూరమైన తీరుతో ఖిన్నులైన వీరు.. నయానో భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు. ఖైరతాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను వైఎస్సార్సీపీ అభ్యర్థి, దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గట్టి ప్రజాబలంతో ఢీకొడుతున్నారు. రోజుకో బస్తీ విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో చాలా కాలంగా బస్తీలకు వెళ్లని దానం, బస్తీ వాసులందరిని తెల్లవారక ముందే తమ ఇంటి ముందు క్యూ కట్టించుకుంటూ తాయిలాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గోషామహల్లో మూల ముఖేష్గౌడ్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోధా చేతిలో ముప్పుతిప్పలు పడుతూ నియోకజవర్గం దాటలేని పరిస్థితి నెలకొంది. జైరాం, కొప్పుల రాజులే ప్రచార సారథులు నగరంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార సభలకు కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు ముఖ్య అతిథులుగా వెళుతున్నారు. ‘స్టార్ క్యాంపెయినర్లు’గా పాల్గొంటున్న వీరిని పార్టీ అభ్యర్థులే ప్రజలకు పరిచయం చేయాల్సి వస్తుం డటం విచిత్రం. వీరివల్ల ఓట్లు రాలవని అభ్యర్థులే సొంత ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రుబెల్లాపై గర్భిణులు అప్రమత్తంగా ఉండాలి
స్పైస్జెట్కు రూ.60 వేల జరిమానా
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పింఛన్ల పెంపు
నేడు ప్రధానమంత్రి రోడ్ షో
ఓటింగ్ శాతం పెంచాలి
ఉమ్మరకోట్ సొంతం!
సీ్త్ర, పురుష నిష్పత్తిలో తేడా తగ్గించాలి
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
సమన్వయంతో పనిచేద్దాం: ఎస్పీ
‘12, 13 తేదీల్లో పత్రికా ప్రకటనలపై ముందస్తు అనుమతి తప్పనిసరి’
తప్పక చదవండి
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement