-
వైఎస్సార్ సీపీ వెంటే ప్రజలు
ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్లైన్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమానికి అహరహం పాటుపడిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, వారి ఆదరణతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న ఆయన శుక్రవారం తన స్వగ్రామం ఆదిబట్లలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల ప్రదాతగా వైఎస్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయారని, అందుకే వైఎస్సార్ సీపీని వారంతా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ అభిమానులు, ఆయన పథకాలతో లబ్ధి పొందిన వారు నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమంది తనను కలిసి మద్దతు తెలుపుతున్నారని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అండగా ఉంటున్నందున వారంతా తనను ఆదరిస్తున్నారన్నారు. సొంత గ్రామమైన ఆదిబట్లలో పార్టీలకతీతంగా ప్రజలు, నాయకులు తనకు మద్దతు తెలుపుతుండటం ఉత్సాహాన్నిస్తోందన్నారు. త్వరలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని, పార్టీ అధినాయకులు కూడా ఇబ్రహీంపట్నంలో పర్యటిస్తారని శేఖర్గౌడ్ వెల్లడించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయన కుమార్తె షర్మిల ఈ ప్రాంతంలో పర్యటించారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష అయిన తాగు, సాగు నీరుతో పాటు విద్యుత్, రోడ్లు, పారి శుద్ధ్య సమస్యల పరిష్కారమే తన ప్రచార ఎజెండా అని చెప్పారు. ప్రతి పేదింటి బిడ్డ అభివృద్ధి చెందాలన్న వైఎస్ ఆశయ సాధనకు పాటుపడతానన్నారు. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో గ్రామస్తులు పల్లె శ్రీనివాస్గౌడ్, సేగూరి రమేశ్, భూపతిగళ్ల వెంకటయ్య, పల్లె నరేందర్గౌడ్, గజ్జెల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే సంక్షేమ పథకాల అమలు
యాచారం, న్యూస్లైన్ : ప్రాంతాలకతీతంగా అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకూ సక్రమంగా సంక్షేమ పథకాల అమలు వైఎస్సార్ సీపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఈసీ శేఖర్గౌడ్ పేర్కొన్నారు. ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నస్దిక్సింగారం, కుర్మిద్ద, నక్కర్తమేడిపల్లి, మల్కీజ్గూడ, యాచారం గ్రామాల్లో పార్టీ నాయకులతో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన సమవేశాల్లో శేఖర్గౌడ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీని గెలిపిస్తే రాజన్న సువర్ణ పాలన మళ్లీ ప్రజలకు అందుతుందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వైఎస్ కృషి వల్లే వచ్చిందని, ఆయన ఆనాడు ఎమ్మెల్యేల బృందాన్ని కేంద్రం వద్దకు పంపి ఒత్తిడి తెచ్చారని అన్నారు. దివంగత వైఎస్ రుణం తీర్చుకోవడం కోసం ఆయన ఆశయాల సాధనకు కంకణం కట్టుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని, ఆయన నాయకత్వంలో రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. వైఎస్ హఠాన్మరణం తర్వాత ఏనాడూ ప్రజలు, రైతుల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీడీపీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రాదేశిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జిల్లాలో పోటీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాయిని సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేసి ఇబ్రహీంపట్నం నుంచి ఈసీ శేఖర్గౌడ్ను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని అన్నారు. ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలంటూ కళాకారుల బృందం ఆటపాటలు గ్రామస్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి, పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ అమృతాసాగర్, పార్టీ మండల కన్వీనర్ మోతీరాంనాయక్, ఎంపీటీసీ అభ్యర్థులు సంధ్యారాణి, మల్లమ్మ, నాయకులు దార నర్సింహ, వరప్రసాద్రెడ్డి, సుధీర్ రెడ్డి, వెంకటేష్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సారథుల సమరం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒకరు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.. మరొకరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు.. ఇంకొకరు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్.. ఈ ముగ్గురు ఒకే స్థానం నుంచి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే.. ప్రస్తుతం ఇదే పరిస్థితి ఇబ్రహీంపట్నంలో నెలకొంది. మూడు ప్రధాన పార్టీలకు చెందిన జిల్లా బాధ్యులు ఇక్కడి నుంచి పోటీ చేయడం ఆసక్తిని రేపుతోంది. ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ ఇప్పటికే భారీ ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ కూడా అభిమానుల మధ్య నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అనుచరగణంతో నామినేషన్ సమర్పించారు. ఈ ముగ్గు రు నేతలు కూడా ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన వారే కావడం విశేషం. ప్రధానంగా పోటీ కూడా ఈ ముగ్గురి మధ్యే నెలకొంది. మొత్తంగా పార్టీ జిల్లా సారథులు ముగ్గురూ ఒకే సీటుకోసం పోటీపడుతుండడంతో స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది. అంతిమంగా గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
ఇబ్రహీంపట్నం, న్యూస్లైన్: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంటరాగా ఎడ్లబండిపై వచ్చి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. అంతకు ముందు శాస్తా గార్డెన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఈసీ శేఖర్గౌడ్ మాట్లాడారు. అసమర్థ కాంగ్రెస్ను, ప్రతిపక్ష పార్టీగా ఘోరంగా విఫలమైన టీడీపీని ప్రజలు ఓడించాలన్నారు. పెద్ద చెరువును కృష్ణా జలాలతో నింపుతానని ఇచ్చిన హామీని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నిలబెట్టుకోలేకపోయారని ఆరోపించారు. గడిచిన ఐదేళ్లలో నియోజకవర్గానికి టీడీపీ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫల మైందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు మంచిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నాయిని సుదర్శన్రెడ్డి, మూల హరీశ్గౌడ్, కె.అమృతాసాగర్, యు.సతీష్గౌడ్, మహేందర్రెడ్డి, బొక్క జంగారెడ్డి, పల్లె సాయిబాబాగౌడ్, శ్రీనివాస్రెడ్డి, మోతీరాంనాయక్, ఎం.జంగయ్యగౌడ్, కందాల శ్రీకాంత్రెడ్డి, దొండ వినోద్రెడ్డి, దంతూరి రంగయ్యగౌడ్, ఆనంద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనసంద్రమైన పట్నం.. ఈసీ శేఖర్గౌడ్ నామినేషన్ వేయడానికి వేలాది మందితో భారీ ర్యాలీగా తరలిరావడంతో పట్నం జనసంద్రంగా మారింది. ఎడ్ల బండిని నడిపిస్తూ శేఖర్గౌడ్ అందరినీ ఆకర్శించారు. శాస్తా గార్డెన్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అంతకు ముందు అంబేద్కర్ విగ్రహానికి శే ఖర్గౌడ్ పూలమాల వేశారు. ర్యాలీ సందర్భంగా కార్యకర్తలు బాజా భజంత్రీలతోపాటు బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. -
పేదల బతుకుల్లో వైఎస్ వెలుగులు నింపారు
మొయినాబాద్ రూరల్, న్యూస్లైన్: దివంగత ముఖ్యమంత్రి పేదల బతుకుల్లో వెలుగులు నింపి చిరస్మరణీయుడిగా మిగిలిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని అలేఖ్య రిసార్ట్లో నియోజకవర్గ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫించన్లు, ఉచిత విద్యుత్, రేషన్ బియ్యం, 108, 104, ఆరోగ్యశ్రీ, రుణాల మాఫీ తదితర పథకాలతో రాష్ట్రంలో లబ్ధి పొందని కుటుంబమే లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రతి కార్యక్రమాన్ని వైఎస్ చేవెళ్ల నుంచే ప్రారంభించి నియోజకవర్గానికి దేశస్థాయిలో గుర్తింపుతెచ్చిన విషయాన్ని ప్రజలెవరూ మరవలేదన్నారు. వైఎస్ఆర్ పథకాలతో లబ్ధి పొందిన ప్రతిఒక్కరూ తమ పార్టీకి అండగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్ సీపీని గెలిపించి మహానేత రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ విభేదాలు లేకుండా రెండు ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే తపనతోనే తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆలోచించారన్నారు. తెలుగు వారున్న రెండు రాష్ట్రాలనూ సువర్ణ ఆంధ్రప్రదేశ్, సువర్ణ తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు జగన్ తాపత్రయపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు వివరించి, చైతన్యం కలిగించాల్సిన బాధ్యత పార్టీ నాయకులపైనే ఉందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తాం.. రానున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్గౌడ్, చేవెళ్ల నియోజక వర్గ ఇన్చార్జి రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు మహేందర్రెడ్డి, బాల్రాజ్, ఆయా మండలాల అధ్యక్షులు రాజయ్య, ప్రతాప్రెడ్డి, క్రిష్ణ, డి. బల్వంత్రెడ్డి, పిఆర్. క్రిష్ణ, నాయకులు కాంతారావు, శంకర్నాయక్, రెడ్డియా నాయక్, వెంకటేష్, వడ్డె సత్యయ్య, వెంకట్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జొన్నాడ రాజు, ఖాజాపాషా, లకా్ష్మరెడ్డి, సుధాకర్రెడ్డి, పాండు తదితరులున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement