-
దూసుకుపోతున్న ‘చదువురాని చాయ్వాలా’
దేశంలో టీ దుకాణాలకు మంచి డిమాండ్ ఉంది. ఎక్కడ కొత్తగా టీ దుకాణం ఏర్పాటైనా అది విజయవంతం అవుతుందనే మాట వినిపిస్తుంటుంది. తాజాగా బీహార్లో వినూత్న టీ దుకాణం ఏర్పాటయ్యింది. దాని పేరు వినగానే ఎవరికైనా వింతగా అనిపిస్తుంది. మాధేపురాలోని సింగేశ్వర్కు చెందిన రోహిత్ ‘అన్పఢ్ చాయ్వాలా’ (చదువురాని చాయ్వాలా) పేరుతో టీ స్టాల్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఐదు రకాల టీలు లభిస్తాయి. అయితే ఇక్కడ టీ బాగోలేదని ఎవరైనా వినియోగదారుడు అంటే రోహిత్ వారికి డబ్బు వాపసు చేస్తాడు. విద్యార్థులకు టీపై ప్రత్యేక డిస్కౌంట్ కూడా ఇస్తుంటాడు. రోహిత్ తన దుకాణంలో టీని రూ. 10కే అందిస్తున్నాడు. మొదట్లో తన దుకాణం పేరు బాగోలేదని చాలామంది అన్నారని, అయితే ఆ పేరు అలాగే ఉంచాలని అనుకున్నానని రోహత్ తెలిపాడు. తాను ఎటువంటి డిగ్రీ చదవలేదని, పెద్దగా ఏమీ చదువుకోలేదని అందుకే అన్పఢ్ చాయ్వాలా అని దుకాణానికి పేరు పెట్టానని రోహిత్ వివరించాడు. ఇప్పుడు తన టీ దుకాణం పేరు స్థానికంగా అందరి నోళ్లలో నానుతోందని, తాను ప్రతిరోజూ 400 నుండి 500 కప్పుల టీ విక్రయిస్తున్నానని రోహిత్ తెలిపాడు. విద్యార్థులకు 10శాతం తగ్గింపు ధరకే టీ ఇస్తున్నానని, దీనివలన చదువుకుంటున్న విద్యార్థులకు కాస్త ఉపశమనం లభిస్తుందని రోహిత్ తెలిపాడు. యూట్యూబ్లో పలు టీ దుకాణాల వీడియోలను చూశాక, తాను ‘అన్పఢ్ చాయ్వాలా’ పేరుతో సొంత స్టార్టప్ను ప్రారంభించానని అన్నాడు. తాను వినియోగారులకు మసాలా టీ, ప్లెయిన్ టీ, స్పెషల్ టీ, అల్లం టీ, కాఫీ టీ అందిస్తున్నానని తెలిపాడు. -
'టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్' వృద్ధుని దుకాణంపై ఆనంద్ మహీంద్ర పోస్ట్..
'టీ ' అంటే మనందరికీ ఇష్టమే. ఉదయం లేచిన దగ్గర నుంచి టీ తాగకుండా ఇంకే పని మొదలుపెట్టము. పనిలో కాస్త ఇబ్బంది అనిపిస్తే వెంటనే ఓ కప్ టీ తాగి మళ్లీ ఫ్రెష్గా ప్రారంభిస్తాము. అందుకే ఏ సందులో చూసినా టీ షాప్ ఉంటుంది. ఇది ఎందరికో జీవనోపాధిని కల్పిస్తుంది. అయితే.. తాజాగా అమృత్సర్లో ఓ వృద్ధుడు కొనసాగిస్తున్న టీ షాప్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత 45 ఏళ్లుగా వృద్దుడు ఓ మర్రి చెట్టు మొదలులో టీ షాప్ని నడిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. 'అమృత్సర్లో చాలా ప్రదేశాలు చూశాను. కానీ వీడియోలో కనిపిస్తున్న ఈ టీ షాప్ని ఎప్పుడూ చూడలేదు. ఈ సారి అమృత్సర్ వెళ్లినప్పుడు ఈ దుకాణాన్ని తప్పుకుండా చూస్తాను. గత 40 ఏళ్లుగా ఓ వృద్ధుడు నడిపిస్తున్న టీ షాప్ని 'టెంపుల్ ఆప్ టీ సర్వీస్' గా పేర్కొంటూ' ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆలోచిస్తే మన హృదయమే దేవాలయం అని పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. There are many sights to see in Amritsar. But the next time I visit the city, apart from visiting the Golden Temple, I will make it a point to visit this ‘Temple of Tea Service’ that Baba has apparently run for over 40 years. Our hearts are potentially the largest temples.… pic.twitter.com/Td3QvpAqyl — anand mahindra (@anandmahindra) July 23, 2023 ఈ వీడియోలో 80 ఏళ్ల వయస్సు ఉన్న ఓ వృద్ధుడు ఓ భారీ వృక్షం సందులో టీ షాప్ని నిర్వహిస్తున్నాడు. గత 45 ఏళ్ల నుంచి తను ఒకటే పనిని కొనసాగిస్తున్నారు. అందరూ అతన్ని బాబాగా పిలుస్తారు. స్థానికంగా అతనంటే తెలియని వారుండరు. ఈ టీ విక్రయదారునికి పని పట్ల ఉన్న నిబద్ధత, విధేయత, ఆసక్తి నెటిజన్లను ఆకర్షించింది. Amidst the timeless charm of Amritsar, under the embracing canopy of a majestic tree, a venerable man gracefully serves the elixir of Indian Tea. With every cup poured, he weaves a tapestry of tradition, warmth, and hospitality, earning the title of the "Temple of Tea Service 😊 — Rahul Verulkar (@verulkar_rahul) July 23, 2023 The city has a lot of magnetic qualities. Truly Golden city.....City with the legendary Golden temple and seems to have lovable human beings like Babaji too 😍👏🥳🙏..... — Sunil Balachandran (@Sunil_bchandran) July 23, 2023 ఇదీ చదవండి: రామ నవమి అల్లర్ల కేసు.. సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు షాక్ -
మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..
ఇప్పటి వరకు ఎన్నో వైరల్ వీడియోలు చూశాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో అందరీ హృదయాలను దోచేవిధంగానూ, కదిలించేలా ఉంటుంది. రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవించే ఒక వృద్ధురాలు కలలో కూడా ఊహించి ఉండి ఉండదు. తన జీవితంలో ఇలాంటి మంచి రోజు ఒకటి ఉంటుందని, చింత లేకుండా బతకుతాను అని అనుకుని ఉండకపోవచ్చు కదా. ఆ యువకుడు ఒక్కరోజులో ఆమె జీవితాన్ని మొత్తం మార్చేశాడు. వివరాల్లోకెళ్తే...75 ఏళ్ల వృద్ధురాలు రోడ్డుపై చెత్త కాగితాలు అమ్ముకుంటూ జీవిస్తుంటుంది. ఒక యువకుడు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. ఆమె చెత్తకాగితాలు అమ్ముకుంటూ బతుకుతుంటానని చెప్పింది. ఆ తర్వాత ఆ యువకుడు ఆమెను తీసుకెళ్లి షాపింగ్ చేయించి ..కూరగాయాలు, వేయింగ్ మిషన్, తోపుడు బండి వంటి అన్ని వస్తువులు కొని కూరగాయాలు అమ్ముకుంటూ బతకమని చెబుతాడు. అంతేగాదు ఆమెకు రోజు బతకడానికి కావల్సిన కనీస అవసరాలన్నింటిని సమకూరుస్తాడు. దీంతో సదరు వృద్ధురాలి సంబరపడిపోతూ ఆ యువకుడిని ఆనందంగా ఆశీర్వదిస్తుంది. అందుకు సంబంధించిన వీడియోని ట్విట్టర్లో ఐఏఎస్ ఆఫీసర్ అవినాశ్ శర్మ పోస్ట్ చేశారు. ఆ వృద్ధురాలికి సహాయ సహకారాలు అందించిన వ్యక్తి తరుణ్ మిశ్రా అనే ఇన్స్ట్రాగ్రామర్ అని చెప్పారు. అతను తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో నచ్చడంతో షేర్ చేసినట్లు తెలిపారు. అంతేగాదు నెటిజన్లు ఆ వృద్ధురాలికి చేసిన సాయానికి సదరు యువకుడిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. Humanity.🙏🙏🙏 pic.twitter.com/NUZTGEB6Cp — Awanish Sharan (@AwanishSharan) October 18, 2022 View this post on Instagram A post shared by TARUN MISHRA (@tarun.mishra17) (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్ని తగలెట్టేశాడు) -
ఒక్కరాత్రిలో.. ఆమె జీవితమే మారిపోయింది!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే!. కానీ, సమయానికి అది బయటపడితేనే.. గుర్తింపు దక్కేది. అందుకు ఎవరో ఒకరి ప్రోత్సాహం అవసరం కూడా. ఇవాళ రేపు ఓవర్నైట్ సెన్సేషన్స్కి ఒక వేదిక అయ్యింది ఇంటర్నెట్. బచ్పన్ కా ప్యార్, కచ్చా బాదామ్ లాంటి వాళ్లు ఇలా పాపులర్ అయినవాళ్లే. ఈ లిస్ట్లో ఇప్పుడు చేరిపోయింది బెలూన్లు అమ్ముకునే యువతి కిస్బూ. కిస్బూ రాజస్థానీ కుటుంబానికి చెందిన అమ్మాయి. కేరళలో ఆమె కుటుంబం సెటిల్ అయ్యింది. రోడ్ల మీద, సిగ్నళ్ల దగ్గర బెలూన్లు, బొమ్మలు అమ్ముకుని జీవనం కొనసాగిస్తోంది ఈమె కుటుంబం. అయితే అండలూర్ కవూ జాతరకు బుగ్గలు అమ్మడానికి వెళ్లిన కిస్బూ జీవితం.. రాత్రికి రాత్రే ఊహించని మలుపు తిరిగింది. వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ అయిన అర్జున్ కృష్ణన్.. సరదాగా జాతరకు వెళ్లి ఫొటోలు తీయసాగాడు. అక్కడ అర్జున్.. అనుకోకుండా అక్కడే బుగ్గలు అమ్ముకుంటున్న కిస్బూను క్లిక్మనిపించాడు. ఆ ఫొటో అద్భుతంగా వచ్చింది. దీంతో ముగ్దుడైన అర్జున్..ఆ ఫొటోను కిస్బూ, ఆమె తల్లికి చూపెట్టాడు. ఆపై సోషల్ మీడియాలోనూ ఆ ఫొటో వైరల్ కావడానికి ఎంతో టైం పట్టలేదు. దీంతో స్టైలిష్ రమ్య ఆధ్వర్యంలో ఆమెతో కొన్ని ఫొటోషూట్లు చేయించారు. దీంతో ఇప్పుడామె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) సిగ్నళ్ల దగ్గర బుడగలు అమ్ముకునే కిస్బూ.. మోడలింగ్ ఫొటోషూట్లు వైరల్ కావడం, ఆమెకు పలు బ్రాండ్స్ అవకాశాలు దక్కడంపై ఫొటోగ్రాఫర్ అర్జున్ స్పందించాడు. తాను తీసిన ఒక్క ఫొటో వల్ల ఆమె జీవితం మారిపోవడం సంతోషంగా ఉందని అన్నాడు. ఇంత గుర్తింపునకు కారణమైన అర్జున్కు కృతజ్ఞతలు చెబుతున్నారు కిస్బూ, ఆమె తల్లి. View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) View this post on Instagram A post shared by PHOTO MAN (@photoman_official) -
Kacha Badam Singer: కచ్చా బాదామ్ సింగర్కు యాక్సిడెంట్
కచ్చా బాదామ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్తో విపరీతంగా ఆదించారు.. ఇంకా ఆదరిస్తున్నారు జనాలు. పచ్చి పల్లీలు అమ్ముకునే ఓ వీధివ్యాపారి.. ఊరూరా తిరుగుతూ అరిచిన అరుపులనే పాటగా మలిచి క్రేజీనెస్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆ పల్లీల వ్యాపారి జీవితమే మారిపోయింది. అయితే.. తాజాగా ఈ వైరల్ సెన్సేషన్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు పశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ బద్యాకర్. కచ్చా బాదామ్ పాటతో క్రేజ్తో పాటు అవతారమే పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో దక్కిన కొద్దిపాటి రెమ్యునరేషన్తో సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాడు. సోమవారం స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో యాక్సిడెంట్కు గురయ్యాడు అతను. ఛాతీలో బలమైన గాయం కావడంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం భూబన్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఇక ‘కచ్చా బాదామ్’ భూబన్ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. పశ్చిమ బెంగాల్లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి ఆ వచ్చే 200, 300 వందల రూపాయలతో జీవనం కొనసాగించేవాడు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానెల్స్, ఇన్స్టా రీల్స్తో కచ్చా బాదామ్ ఫేమస్ అయ్యింది. మొదట్లో సాంగ్ వైరల్ అయినప్పుడు.. తనకు క్రెడిట్ దక్కలేదని గోల చేసిన భూబన్, తీరా అది దక్కాక పూర్తిగా మారిపోయాడు. ఇకపై పల్లీలు అమ్ముకోనని, సింగింగ్ కెరీర్లోనే కొనసాగుతానని, ఈ క్రేజ్ కారణంగా తనను కిడ్నాప్ చేస్తారేమోనని భయంగా ఉందంటూ భూబన్ పోలీసులను సైతం ఆశ్రయించాడు. ఆ బిల్డప్ చూసి అప్పటిదాకా అతన్ని మెచ్చుకున్న వాళ్లే.. తిట్టకున్నారు కూడా. తాజాగా కోల్కతాలోని ఓ పోష్ క్లబ్లో అతగాడు రాక్స్టార్ అవతారంలో ప్రదర్శన కూడా ఇవ్వడం చూసి ముక్కున వేలేసుకున్నారు చాలామంది. సంబంధిత వార్త: కచ్చా బాదామ్ అంటూ ఊపేసిన పోరి గురించి తెలుసా? -
గల్లీలో పల్లీలు అమ్ముకుంటూనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు
ఎప్పుడో రెండు నెలల కిందట మొదలైన ‘కచ్చా బాదాం’ మేనియా.. మళ్లీ తెర మీద ఊపేస్తోంది. అందుకు కారణం.. అంజలీ అరోరా అనే అమ్మాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో తన ఇన్స్టా రీల్లో హాట్ హాట్గా చిందులేసిన ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. కచ్చా బాదం సాంగ్ హక్కులు తన పేర ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ పాట ఒరిజినల్ క్రియేటర్ పోలీసులను ఆశ్రయించాడంటూ కొన్ని మీడియా హౌజ్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఈ కచ్చా బాదం లొల్లి ఏంటి? వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజమేంత? చూద్దాం.. ఏడాది కిందట.. గల్లీలలో సైకిల్ మీద, బైక్ మీద తిరుగుతూ పచ్చి పల్లీలు(కచ్చా బాదాం) అమ్ముకునే ఓ వ్యక్తి పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు భూబన్ బద్యాకర్. అతని వీడియోలు కొన్ని వాట్సాప్ స్టేటస్ల ద్వారా ‘ఎక్తారా’ అనే యూట్యూబ్ ఛానెల్కు చేరాయి. దీంతో ఒక ఫుల్లెంగ్త్ వీడియో తీసి, ఎడిట్ చేసి యూట్యూబ్లో వదలడంతో 21 మిలియన్కి పైగా వ్యూస్ వచ్చాయి. అలా కచ్చా బాదాం వెర్షన్ ఫేమస్ కావడం మొదలైంది. ఆపై ఆ పాట ఇన్స్టాగ్రామ్కు చేరగా.. సింగర్, మ్యూజీషియన్ నజ్మూ రియాఛాట్ ఆ వీడియోను రీమిక్స్ చేసి వదిలాడు. అలా ఆ రీమిక్స్ వెర్షన్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ కావడం మొదలైంది. మరోవైపు బాదం అఫీషియల్ ర్యాప్ వెర్షన్ను భూబన్తో కలిసి కట్టారు రోన్ఈ, ప్రగ్యా అనే ర్యాపర్లు. అలా యూట్యూబ్కు అఫీషియల్గా ర్యాప్ సాంగ్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ పల్లీలు అమ్ముకునే చిరువ్యాపారి. ఆ వీడియోకు ఇప్పటిదాకా 33 మిలియన్ వ్యూస్పైగా వచ్చాయి. ఆపై ఎన్నెన్నో వెర్షన్లు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇన్స్టాగ్రామ్లో కచ్చా బాదాం పాపులర్ అయ్యింది మాత్రం నజ్మూ రియాఛాట్ వెర్షన్తోనే!. View this post on Instagram A post shared by Nazmu Reachat (@nazmureachat) రండమ్మా.. రండి పశ్చిమ బెంగాల్లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బు రూ.250 నుంచి 300రూ. మాత్రమే. ఆ అమ్మడంలోనూ.. స్థానిక భాషలో అరవడంలోనూ ప్రత్యేకత ఉండాలనేది అతని తాపత్రయం. అదే అతనిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసేసింది. అందిన ఆర్థిక సాయం.. కచ్చా బాదం పాట ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నెటిజనులు, స్థానిక నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అంతా అడిక్ట్ అయిపోయారు. కొరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు సైతం పాకేసింది. షార్ట్ వీడియోస్లో రికార్డు స్థాయిలో వీడియోలతో కచ్చా బాదం రీమిక్స్ ఏలుతుండగా.. ఆ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ భూబన్ బద్యాకర్కి తగిన గుర్తింపూ దక్కింది. ఒకానొక దశలో పాట మీద రైట్స్ కోసం ఆయన్ని పోలీసులను ఆశ్రయించాడనే వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) అయితే అందులో వాస్తవం ఉంది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాపీ రైట్స్ వ్యవహారం తమ చేతుల్లో లేదంటూనే.. భూబన్కి కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పలువురు పొలిటీషియన్లు, స్థానికులు, ఆయనకు చాలా సాయం అందించారు. ప్రభుత్వం కూడా స్పందించి.. తనకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాడు భూబన్. ఎప్పటిలాగానే తన వ్యాపారం చేసుకుంటూ.. అడపా దడపా ఇంటర్నెట్లో కనిపించాలని అనుకుంటున్నాడు. అంతేకాదు త్వరలో టీమిండియా దాదా సౌరవ్ గంగూలీతో కలిసి ఓ రియాలిటీ షోలో(దాదాగిరి అన్లిమిటెడ్ సీజన్9లో) భూబన్ బద్యాకర్ సందడి చేయబోతున్నాడు. అదీ సంగతి! ఎవరీ అంజలి.. అంజలి అరోరా.. వయసు 22 ఏళ్లు. టిక్టాక్ ఉన్న టైంలో పాపులర్ అయిన నార్త్ నిబ్బీ. ఢిల్లీకి చెందిన! అంజలి ఒకవైపు మోడల్గానే రాణిస్తూ.. ఆ పాపులారిటీతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఈ తరుణంలో కచ్చా బాదాం వెర్షన్కి ఈ అమ్మడు వేసిన స్టెప్స్ యూత్ని ఎట్రాక్ట్ చేసింది. ఆ ఒక్క వీడియోతో అంజలి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. అయితే ఆమె వీడియోస్ను తీసేది ఆమె తండ్రే. పైగా ఆమె చిందులూ హాట్ హాట్గా ఉన్నాయి. అందుకే ఆమెపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. నార్త్ నుంచి సౌత్ దాకా దేశం మొత్తం.. బాషాబేధాలకు అతీతంగా సోషల్ మీడియాలో ఆమె కచ్చా బాదాం వెర్షన్ వైరల్ అయ్యింది. అంజలి ఇన్స్పిరేషన్తో మరికొందరు అమ్మాయిలు సైతం అలాంటి డ్యాన్స్లకే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఈ తరుణంలో హాట్ డ్యాన్సులు వేసినందుకు ఆమె అరెస్ట్ అయ్యిందంటూ ఓ పుకారు చెలరేగగా.. అందులో వాస్తవం లేదని ఆమె తండ్రి స్థానిక మీడియా ఛానెల్స్కు వివరణ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Anjali Arora (@anjimaxuofficially) -
తనపై ఉమ్మిపడిందని వాగ్వాదం.. క్షణికావేశంలో..
పట్నా(బిహార్): క్షణికావేశంలో జరిగే సంఘటనలు ఒక్కొసారి వ్యక్తుల ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తుంటాయి. ఇలాంటి సంఘటనలు మనం వార్తలలో చదువుతుంటాం. ఇలాంటి ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సివాన్జిల్లాలోని పోఖ్రాప్రాంతంలో అహ్సాన్ మాలిక్ అనేవ్యక్తి.. వీధిలో బట్టల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతంలో.. రెండో అంతస్థులో తన మిత్రులతో కలిసి ఉండేవాడు. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంట్లోని బాల్కని ఉన్న కిటికీ నుంచి అనుకోకుండా పాన్తిని కిందకు ఉమ్మివేశాడు. అది కాస్త.. కింద నిలబడిన ఒక వ్యక్తిపై పడింది. అతను కోపంతో ఊగిపోయి.. అహ్సాన్ ఇంటికి వెళ్లాడు. అతడితో వాగ్వాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా క్షణికావేశంలో అహ్సాన్ మాలిక్ను కాల్చిచంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. కాగా, బుల్లెట్ శబ్దం రావడంతో చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: హరియాణా ఆవిర్భావ దినోత్సవం: ఖైదీలకు సీఎం ఖట్టర్ తీపికబురు -
అమ్మేది ఎవరో తెలియాల్సిందే.. సీసీపీఏ ఆదేశాలు
న్యూఢిల్లీ:ప్యాకింగ్పై విక్రేతల పేరు, చిరునామా, ఫిర్యాదుల పరిష్కార అధికారి నంబర్ను స్పష్టంగా, అందుబాటులో ఉండే పద్ధతిలో ఈ–కామర్స్ సంస్థలు ప్రదర్శించాల్సిందేనని సెంట్రల్ కంజ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు సీసీపీఏ అన్ని రాష్ట్రాలు, పారిశ్రామిక సంఘాలకు సమాచారమిచ్చింది. వినియోగదార్ల రక్షణ (ఈ–కామర్స్) నిబంధనలు–2020 ప్రకారం విక్రేతల వివరాలు పొందుపర్చడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సీసీపీఏ స్పందించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టం కింద చర్య తీసుకుంటామని సీసీపీఏ కమిషనర్ అనుపమ్ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–జూలైలో దేశవ్యాప్తంగా నేషనల్ కంజ్యూమర్ హెల్ప్లైన్కు ఈ–కామర్స్ కంపెనీల మీద 69,208 ఫిర్యాదులు అందాయి. బ్యాంకింగ్, టెలికం రంగాలతో పోలిస్తే ఇవే అధికం. -
సారా విక్రయాలు వద్దన్నందుకు గ్రామ వాలంటీర్పై దాడి
సాక్షి, కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం హనుమంతులగూడెం గ్రామంలో సారా విక్రయదారులు రెచ్చిపోయారు. గ్రామంలో సారా విక్రయాలు ఆపేయాలని చెప్పినందుకు ఏకంగా గ్రామ వాలంటీర్పైనే దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే... సారా విక్రయదారులు హనుమంతులగూడెం గ్రామంలో సారా అమ్మకాలను సాగిస్తున్నారు. సారా అమ్మకాలను గమనించిన గ్రామ వాలంటీర్ ధీరపాల విజయ గ్రామంలో సారా విక్రయాలు నిలిపివేయాలని చెప్పారు. దీంతో సారా విక్రయదారులంతా ఏకమై గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్ విజయపై కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆమెకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. తనపై దాడికి పాల్పడిన ఏడుగురు సారా అమ్మకందారులపై వాలంటీర్ విజయ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చదవండి: గోదావరిలో నలుగురు విద్యార్ధుల గల్లంతు.. 3 మృతదేహాలు లభ్యం -
పోయిన ప్రాణం తిరిగొచ్చింది: పండ్ల వ్యాపారి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని పళ్ల వ్యాపారి ఫూల్ మియా చోటూ మరోసారి తన కళ్లను తానే నమ్మలేకపోతున్నాడు. దాదాపు రూ.30వేల విలువైన తన మామిడి పళ్లను దోచుకుపోయారని కన్నీటి పర్యంతమైన అతడు ఇపుడు ఆనందంతో కంటతడి పెట్టాడు. దోచేసే మనుషులతో పాటు, సాయం చేసే మహానుభావులు కూడా ఉన్నారని ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. (సిగ్గు..సిగ్గు.. వీధి వ్యాపారిని దోచేసిన జనం!) వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని జగత్పురి ప్రాంతంలో చోటూ బండి మీద పళ్లు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో జరిగిన దిగ్బ్రాంతికర ఉదంతంలో జనాలు మామిడి పళ్లను అందినకాడికి దోచుకుని వెళ్లిన వైనం వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది దాతలు మానవత్వంతో స్పందించారు. దీంతో అతని బ్యాంకు ఖాతాలో దాదాపు రూ. 8లక్షలు జమ అయ్యాయి. దీనిపై చోటు అంతులేని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా వుంది. ఇపుడిక సంతోషంగా ఈద్ పండుగ జరుపుకుంటాను.. బిడ్డలని చూసుకుంటా’నని చోటూ చెప్పాడు. అంతేకాదు తనకు సాయం చేసిన ప్రతి ఒక్కరికీ చెమ్మగిల్లిన కళ్లతో కృతజ్ఞతలు తెలిపాడు. కొంతమంది కాని పనిచేసినా, చాలామంది మానవత్వంతో స్పందించడం ఆనందంగా వుందన్నాడు. (ఇది నిజమా.. ఇంతకంటే దారుణం ఉండదు) (కరోనా : భారీ సంపదనార్జించిన బిలియనీర్లు) -
'ఆ మద్యం' అమ్ముతూ పట్టుబడ్డాడు!
గాజువాక : ఏపీలో ఇప్పటికే ఓపెన్ బార్లు, వైన్ షాపుల్లో మద్యం విచ్చలవిడిగా లభిస్తోంది. ఇది చాలదన్నట్లు ఓ వ్యక్తి వెరైటీగా మద్యం విక్రయిస్తూ కటాకటాల పాలయిన ఘటన వైజాగ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే... గాజువాక బీసీ రోడ్డుకు చెందిన శంకర్రావు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని విక్రయిస్తున్నాడు. నేవీ ఉద్యోగులకు సరాఫరా చేసే మద్యాన్ని తక్కువ ధరకు శంకర్రావు కొనుగోలు చేసేవాడు. దానిని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. దీనిపై ఎక్సైజ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుతో అతని ఇంటిపై దాడి చేసి 150 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శంకర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
- కొత్త రికార్డు స్థాయిని తాకి, వెనక్కి..
- Israel–Hamas war: రఫాపై దాడుల్లో 45 మంది మృతి
- మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
- అమెరికాలో టోర్నడోల బీభత్సం
- కోర్టులో ఎంపీ కన్నీరు
- Amit Shah: ‘ఉగ్ర’ సంబందీకులకు ఉద్యోగాలు రావు
- Lok sabha elections 2024: మోదీని ఈడీ అడిగినా దేవుడు పంపాడని చెప్తారేమో
- ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
- మరో 10,542 టెన్త్ జవాబు పత్రాల రీ వెరిఫికేషన్
Advertisement