-
‘సుదర్శన్ సేతు’ ప్రత్యేకత ఏమిటి?
దేశంలో మౌలిక సదుపాయాలకు (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్వెల్) మరో ప్రత్యేక ఉదాహరణ మన కళ్ల ముందుకు వస్తోంది. అదే సుదర్శన సేతు. ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. దాదాపు రూ.980 కోట్లతో నిర్మించిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (ఆదివారం)జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేబుల్ వంతెన ఓఖా ప్రధాన భూభాగాన్ని సముద్రం మధ్యలో ఉన్న బేట్ ద్వారకతో అనుసంధానం చేస్తుంది. ప్రత్యేకమైన డిజైన్తో సుదర్శన్ బ్రిడ్జిని రూపొందించారు. బ్రిడ్జికి ఇరువైపులా శ్రీకృష్ణుని చిత్రాలతో అలంకరించారు. ఇందులో ఫుట్పాత్ పైభాగంలో సోలార్ ఎనర్జీ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ వంతెన ద్వారక- భేట్-ద్వారక మధ్య ప్రయాణించే భక్తుల రాకపోకలను సులభతరం చేయడమే కాకుండా, చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. సుదర్శన్ సేతు నిర్మాణానికి ముందు భేట్ ద్వారక చేరుకోవడానికి ప్రయాణికులు చాలా కష్టపడాల్సి వచ్చేది. పడవపైనే ఆధారపడేవారు. వాతావరణం ప్రతికూలంగా ఉంటే ప్రయాణానికి మరింత జాప్యం జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన నిర్మితం కావడంతో భక్తుల కష్టాల తీరనున్నాయి. అలాగే దేవభూమి ద్వారకలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణ అందరినీ అలరించనుంది. ఈ వంతెన నిర్మాణానికి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 2017, అక్టోబర్ 7న ఓఖా- భేట్ ద్వారకలను కలిపే వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.962 కోట్లు కాగా, తర్వాత దానిని రూ.980 కోట్లకు పెంచారు. ఈ వంతెన కారణంగా లక్షద్వీప్లో నివసిస్తున్న సుమారు 8,500 మందికి కూడా ప్రయోజనం చేకూరనుంది. ఈ వంతెన డెక్ మిశ్రమ ఉక్కు-రీన్ఫోర్స్డ్ కాంక్రీటుతో తయారయ్యింది. దీని వెడల్పు 27.2 మీటర్లు (89 అడుగులు). ఈ వంతెనకు ఇరువైపులా 2.5 మీటర్లు (8 అడుగులు) వెడల్పు గల ఫుట్పాత్ కూడా ఉంది. ఈ వంతెన మొత్తం పొడవు 2,320 మీటర్లు (7,612 అడుగులు). ఇది భారతదేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా నిలిచింది. -
రూటు మారేనా?
తలైమన్నార్కు వంతెన మార్గం పాంబన్లో మరో ట్రాక్ సాక్షి, చెన్నై: తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహదకారిగా గతంలో ప్రకటించిన సేతు సముద్రం ప్రాజెక్టు రూట్ మ్యాప్ మారేనా అన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. ఇందుకు తగ్గ కసరత్తుల్ని కేంద్రం వేగవంతం చేసినట్టుంది. రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు వాటిళ్లకుండా ఈ ప్రాజెక్టును కొత్త మార్గంలో తీసుకెళ్లేందుకు తగ్గ పరిశీలనలను నిపుణులు వేగవంతం చేశారు. అలాగే, ధనుస్కోడి నుంచి తలైమన్నార్కు వంతెనతో రోడ్డు మార్గం పరిశీలనులు సాగుతుండడం గమనార్హం. శ్రీలంక తో పాటు సముద్ర తీర దేశాల మధ్య భారత్ నుంచి నౌకాయాన మార్గాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టుకు 2005లో యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి నౌకలు దక్షిణ భారత్లోకి రావాలంటే, శ్రీలంకను చుట్టి రావాల్సి ఉంది. దీంతో సమయం వృథా. దూరంతో పాటు ఖర్చులు ఎక్కువే. అందుకే శ్రీలంకను చుట్టకుండా నేరుగా రవాణా సాగే రీతిలో సేతు సముద్రం కాలువను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపట్టారు. ఆ మేరకు రామనాథపురం జిల్లా రామేశ్వరం నుంచి ధనుస్కోడి మీదుగా నాగపట్నం తీరం వెంబడి భారత సరిహద్దుల గుండా 167 కి.మీ దూరం ఈ ప్రాజెక్టుకు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పనులకు వేలాది కోట్లతో అత్యాధునిక పరికరాల్ని రంగంలోకి దించారు. పనులు ముందుకు సాగుతున్న మార్గంలో శ్రీరాముడు నిర్మించిన రామ సేతు వంతెన బయట పడింది. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పడి ఉన్నాయి. ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతంలో డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించినా, వివాదం కోర్టుకు చేరడంతో ఇక, పనులు ఆగినట్టే అన్న ప్రశ్న బయలు దేరింది. 2011లో అధికార పగ్గాలు చేపట్టిన అన్నాడీఎంకే సర్కారు రాముడు నిర్మించిన వంతెనను కూల్చేందుకు వీలు లేదని, ఆ వంతెనను పురాతన చిహ్నంగా ప్రకటించాలంటూ ఏకంగా అసెంబ్లీలో తీర్మానం సైతం తీసుకొచ్చింది. ఈ పరిణామాలతో సేతు ప్రాజెక్టు శకం ముగిసినట్టే అన్నది తేట తెల్లమైంది. అయితే, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ సేతుకు జీవం పోయడానికి తగ్గ కసరత్తుల్ని చేపట్టి ఉన్నట్టుంది. కేవలం తమిళనాడు ప్రగతిని పరిగణలోకి తీసుకోకుండా, దేశ ప్రగతికి దోహద పడే విధంగా ఈ ప్రాజెక్టు రూపు రేఖల్ని మార్చేందుకు నిర్ణయించినట్టుంది. పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తగ్గట్టుగా ప్రణాళిక సిద్ధమవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రూటు మారేనా: గత ఏడాది కేంద్ర నౌకాయాన, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ రాష్ట్ర పర్యటనకు వచ్చిన వేళ హెలికాప్టర్లో చక్కర్లు కొడుతూ సేతు సముద్ర ప్రాజెక్టు మార్గాన్ని పరిశీలించి వెళ్లారు. తదుపరి దక్షిణ తమిళనాడు ప్రగతి మీద దృష్టి పెట్టే విధంగా రహదారుల విస్తరణ, కన్యాకుమారి జిల్లా కులచల్లో హార్బర్ తదితర పనుల ప్రకటనలు ఒక దాని తర్వాత మరొకటి వెలువడిందని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో గత వారం చెన్నైలో జరిగిన ప్రాంతీయ మీడియా సంపాదకుల సదస్సులో సేతు ప్రాజెక్టు పరిస్థితిపై ప్రశ్నల వర్షం కురిసినా, అధికారులు దాటవేత దోరణి అనుసరించారు. అదే సమయంలో ఆ ప్రాజెక్టు వివాదం కోర్టులో ఉందని, ప్రత్యామ్నాయం ఆలోచించే అవకాశాలు ఉన్నాయని సమాధానాలు ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో సేతు సముద్ర ప్రాజెక్టును పాత మార్గంలో కాకుండా, కొత్త మార్గంలో తీసుకెళ్లడానికి తగ్గ ప్రక్రియకు శ్రీకారం చుట్టే విధంగా పరిశీలనల వేగం పెరగడం ఆలోచించాల్సిందే. ధనుస్కోడి మీదుగా కాకుండా, పాంబన్ వంతెన మార్గం గుండా దారి మళ్లించి రామసేతు వంతెనకు ఎలాంటి ముప్పు ఎదురు కాని విధంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగి ఉన్నట్టుంది. ఇందు కోసం కేంద్రనౌకాయాన శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల క్రితం ఆ మార్గాల్లో పరిశీలన జరిపింది. ఈ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త మార్గంలో పనులకు తగ్గ కార్యాచరణను కేంద్రం ప్రకటించేందుకు అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో కొత్త మార్గంలో ఈ ప్రాజెక్టును తీసుకెళ్లడంతో పాటు రామేశ్వరం లోని ధనుస్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్కు సముద్రంలో వంతెన మార్గంలో రోడ్డు నిర్మాణాలకు తగ్గ పరిశీలన జరిగి ఉండటం విశేషం. అలాగే, ప్రఖ్యాతి గాంచిన పాంబన్ రైల్వే వంతెన విస్తరణకు తగ్గ ప్రక్రియకు చర్యలు చేపట్టి ఉన్నారు. వేలాడి వంతెన తరహాలో భారీ ట్రాక్ నిర్మాణానికి తగ్గట్టు రైల్వే శాఖ దృష్టి పెట్టి ఉండడం బట్టి చూస్తే, తమిళనాడు సర్వతోముఖాభివృద్ధికి దోహద పడే విధంగా మున్ముందు పరిణామాల వేగం పుంజుకునేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
తప్పక చదవండి
- కేజ్రీవాల్పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- Rashmika Mandanna: గుడ్ న్యూస్ చెప్పిన రష్మిక
- బాబు, లోకేష్కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement