-
కుట్రతోనే బదిలీ చేశారు
అనకాపల్లి: తనను కుట్రతోనే బదిలీ చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అనకాపల్లి జోనల్ కమిషనర్ షేక్ సుభానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అనంతపురం జిల్లా పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ కార్యదర్శిగా పదోన్నతిపై బదిలీ చేస్తూ ఈ నెల 28న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడి విధుల నుంచి రిలీవ్ కావల్సిన నేపథ్యంలో పలువురు అధికారులు, రాజకీయ పార్టీ నేతలు సుభానీని మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల సమక్షంలో కమిషనర్ సుభానీ తన బదిలీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ అదనపు సంచాలకులు ఆశాజ్యోతి తనను కుట్రతో బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. ఆశాజ్యోతి గతంలో ఆర్డీగా పనిచేసినప్పుడు తనను పలు అంశాల్లో ఇబ్బందులకు గురిచేశారని, ఇప్పుడు తన బదిలీ విషయంలోనూ కావాలని లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు. తనకు కేవలం ఏడాదిన్నర కాలం మాత్రమే సర్వీసు ఉందని, ఇటువంటి సమయంలో బదిలీ చేయరాదని, ఒకవేళ బదిలీ చేయాల్సి వస్తే సమీప ప్రాంతానికి బదిలీ చేయాలే తప్ప పుట్టపర్తి వంటి దూర ప్రాంతానికి పంపించడం అన్యాయమన్నారు. ఎక్కడికైనా బదిలీపై వెళ్లేందుకు అభ్యంతరం లేదని, కాని వ్యక్తిగత సమస్యలు ఉన్నందున ఇబ్బందులు ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తానని కూడా వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు. తన బదిలీని నిలుపుదల చేసుకునేందుకు ఎటువంటి పైరవీలు చేయనని చెప్పడం గమనార్హం. -
వైఎస్సార్ సీపీలో భారీగా చేరిక
నెహ్రూనగర్(గుంటూరు): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసాలను ప్రజలు గుర్తెరిగి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అదివారం పశ్చిమ నియోజకవర్గం శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్ సుభాని, అతని అనుచరులు, వెయ్యి మందికి పైగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి సమక్షంలో చేరారు. నేతలు కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంపై నోరు మెదిపితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుంటామని భయంలో చంద్రబాబు ఉన్నారన్నారు. విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలన మరలా రావాలంటే వైఎస్సార్ సీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఆరాచక పాలన కొనసాగిస్తుందని పార్టీ నగర అ«ధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, రాష్ట్ర కార్యదర్శులు ధామస్నాయుడు, రాతంశెట్టి రామాంజనేయులు, ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి), రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ జానీ, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు గౌస్, జిల్లా కార్యదర్శి మార్కు కొండారెడ్డి, సత్యనారాయణ, సయ్యద్బాబు, దాసరి కిరణ్, పల్లపు శివ, గనిక ఝాన్సీ, అభియాదవ్, పెయింటర్ రమణ, తదితరులు పాల్గొన్నారు. 150 కుటుంబాలు చేరిక.. నూజెండ్ల: టీడీపీ కంచుకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం శుభపరిణామమని ఆ పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరిశీలకులు రావి వెంకటరమణ అన్నారు. మండలంలోని పాతనాగిరెడ్డిపల్లి, కొత్తనాగిరెడ్డిపల్లి గ్రామాల్లో టీడీపీకి చెందిన 150 కుటుంబాల వారు ఆదివారం నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారిని మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా, జిల్లా నేతలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో మాజీ సర్పంచ్ వంకాయలపాటి బాలకోటయ్య, దిరిశాల కొండలు, పరిమి అంజయ్య, వంకాయలపాటి శ్రీను, చింతలచెర్వు బాబు, లేళ్ల అంజయ్య తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నూతలపాటి హనుమయ్య, పాణ్యం హనిమిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్రకార్యదర్శి దూపాటి రాజారావు మండల కన్వీరర్ బత్తుల వెంకటేశ్వర్లు యాదవ్, కొమిరిశెట్టి రామారావు, గంధం బాలిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు ముప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రాగి దొంగల ముఠా అరెస్ట్
ప్రకాశం(ఎర్రగొండపాలెం): విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగిని దొంగిలించి సొమ్ము చేసుకునే ముఠాను పుల్లల చెరువు మండల కేంద్రంలో పట్టుకున్నారు. జిల్లాలో ఈ మధ్య కాలంలో ట్రాన్స్ ఫార్మర్లకు సంబంధించిన రాగి దొంగిలిస్తున్నారని చెప్పి 64 కేసులు నమోదయ్యాయి. దీంతో అప్పమత్తమైన పోలీసులు రాగి దొంగతనాలపై నిఘా పెంచారు. ఈ నేపథ్యంలోనే పుల్లల చెరువులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి దొంగిలించేది మేమే అని నిందితులు ఒప్పుకున్నారు. ఈ ముఠా నాయకుడు షేక్ సుభానీ పరారీలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement