-
ఆత్మీయుడే కిరాతకుడు !
బావ చేసిన అప్పును తీర్చాలనే ప్రయత్నంలో ఓ బావమరిది ఏకంగా స్నేహితురాలి తమ్ముడినే హత్య చేశాడు. ముందుగా కిడ్నాప్ చేయాలని భావించినా, ఆ ప్రయత్నం బెడిసి కొట్టడంతో హత్యకు పాల్పడ్డాడు. ఆదాయపు పన్నుశాఖ అధికారిగా పనిచేస్తున్న నిరంజన్ కుమారుడైన శరత్ దారుణ హత్యకు గురయ్యాడు. సాక్షి, బనశంకరి: డబ్బు కోసం స్నేహితురాలి తమ్ముడినే అపహరించి దారుణంగా హత్య చేసిన నిందితులను ఇక్కడి జ్ఞానభారతి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వివరాలు... కెంగేరి సమీపంలోని ఉల్లాళలో ఆదాయ పన్ను శాఖ అధికారి నిరంజన్ కుమారుడు శరత్ (19)ను కిడ్నాపర్లు దారుణంగా హత్య చేశారు. వివరాలు... శరత్ ఇక్కడి ఆచార్య కళాశాలలో డిప్లమో చదువుతున్నాడు. ఇతని సోదరి ఇంజినీరింగ్ చదువుతోంది. ఈమె క్లాస్మెట్ అయిన విశాల్, శరత్ కుటుంబానికి ఆత్మీయుడు. అప్పుడప్పుడు శరత్ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఇదిలా ఉంటే విశాల్ తన బావ చేసిన అప్పు తీర్చడానికి శరత్ను కిడ్నాప్ చేయాలని పథకం పన్నాడు. తన స్నేహితులు వినయ్ ప్రసాద్, కరణ్, వినోద్ కుమార్, శాంత కుమార్లతో కలిసి ఈనెల 12న శరత్ను కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం శరత్ను కిడ్నాప్ చేసినట్లు ఇంటికి వీడియో మెసేజ్ పంపించారు. తనను కిడ్నాప్ చేశారని, కాపాడాలని వీడియో సారాంశం. దీంతో శరత్ తండ్రి జ్ఞానభారతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ. 50 లక్షలు ఇస్తారని కిడ్నాపర్లు భావించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని కిడ్నాపర్లు శరత్ను కారులోనే గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కెంగేరి సమీపంలోని రామోహళ్లి చెరువులో పడేశారు. మరుసటి రోజు శవం చెరువులో తేలుతుండటాన్ని గమనించిన వారు మృతదేహాన్ని బయటకు తీసి ఓ చోట పూడ్చారు. అనంతరం ఎవరి దారినవారు వెళ్లిపోయారు. క్లూ ఇలా బయటపడింది : విశాల్ అతని స్నేహితులపై పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ శరత్ కిడ్నాప్ కేసును ఛేదించడానికి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక పోలీస్బృందాలు వివిధ కోణాల్లో విచారణ చేశారు. శరత్ బైక్లో విహార యాత్రకు వెళ్లి ఉండొచ్చని విశాల్ చెప్పడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం వెల్లడించాడు. దీంతో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శాంత కుమార్ కోసం గాలిస్తున్నారు. నింది తులను సంఘటన స్థలానికి తీసుకెళ్లి శరత్ను పూడ్చిన స్థలాన్ని గుర్తించి మృతదేహాన్ని బయటకు తీసి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి పోలీసులను పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్, అదనపు కమిషనర్ మాలిని అభినందించారు. -
ఐటీ ఆఫీసర్ కొడుకు కిడ్నాప్, హత్య
సాక్షి, బెంగళూరు : ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఓ సీనియర్ ఆఫీసర్ కొడుకుని కిడ్నాప్ చేసి, దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఐటీ శాఖలో సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న నిరంజన్ కుమార్ కుమారుడు శరత్ (19), కెంగెరీలోని తన ఇంటికి సమీపంలో సెప్టెంబర్ 12న కిడ్నాప్కు గురయ్యాడు. ఈ కిడ్నాప్ కేసు విచారణ చేపట్టిన పోలీసులు, శుక్రవారం రోజు శరత్ మృతి చెందినట్టు గుర్తించారు. నగర శివార్లలో రామోహల్లి సరస్సులో శరత్ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి శరత్ స్నేహితుడు విశాల్తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సెప్టెంబర్ 12న కనిపించకుండా పోయిన శరత్, అప్పటి నుంచి ఫోన్కు కూడా దొరకకుండా పోయాడు. కిడ్నాప్ చేసిన నిందితులు శరత్ తల్లిదండ్రులను రూ.50 లక్షలు డిమాండ్ చేస్తూ.. అతని మొబైల్ నుంచే ఒక వాట్సాప్ వీడియోను పంపించారు. ఆ వీడియోలో శరత్ మాట్లాడుతూ మీరు ఐటీ దాడులు చేసిన బాధితులు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని విలపించాడు. అంతేకాక తనను కిడ్నాప్ చేసిన వారు టెర్రరిస్టుల ఉన్నారని, వారి వల్ల సోదరికి కూడా ప్రమాదం ముంచి ఉన్నట్టు తెలిపాడు. ఒకవేళ శరత్ను విడుదల చేస్తే, ఇరకాటంలో పడతామని భావించిన కిడ్నాపర్లు అతని హత్య చేసినట్టు తెలిసింది. కిడ్నాపర్లు వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. .
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement