-
బాలీవుడ్లో కరోనా కలకలం.. నమ్రత సోదరికి పాజిటివ్
దేశంలో కరోనా మళ్లీ విజృంభించింది. వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. సాధారణ ప్రజలు మొదలు.. సెలబ్రిటీల వరకు కరోనా ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వరుసపెట్టి సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్, టాలీవుడ్ హీరో మంచు మనోజ్, బాలీవుడ్ భామ కరీనా కపూర్, ఐటెం బ్యూటీ నోరా ఫతేహి తదితరులు కోవిడ్ బారిన పడగా.. తాజాగా మరో బాలీవుడ్ హీరోయిన్కి కరోనా సోకింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. గత నాలుగురోజుల నుంచి ఆమె కరోనాతో పోరాటం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండండి, దయచేసి టీకాలు వేసుకోని, అన్ని నియమాలను పాటించండి’ అంటూ ఇన్స్టాలో ఓ పోస్ట్ చేసింది శిల్ప. ఇక ఈ పోస్ట్ కి నమ్రతా స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ పెట్టింది. -
కరోనా టీకా తీసుకున్న మొట్టమొదటి బాలీవుడ్ నటి
దుబాయ్ : కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి నటిగా బాలీవుడ్ సెలబ్రిటీ శిల్పా శిరోద్కర్ నిలిచారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న 51 ఏళ్ల శిల్పా యూఏఈలోనే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి కృతఙ్ఞతలు తెలిపారు. గోపి కిషన్’, ‘బేవాఫా సనమ్’, ‘కిషన్ కన్హయ్య’, ‘హమ్’ చిత్రాలతో బాలీవుడ్లో పాపులర్ అయినఆమె 2000వ సంవత్సరంలో బ్రిటన్కు చెందిన అపెరేష్ రంజిత్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వివాహం అనంతరం కొంత గ్యాప్ తీసుకున్న శిల్పా 2013లో పాపులర్ సీరియల్ ‘ఏక్ ముత్తి ఆస్మాన్’ లో నటించింది. శిల్పా శిరోద్కర్ ప్రముఖ సూపర్స్టార్ మహేష్బాబు భార్య నమ్రతకు సోదరి అన్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) View this post on Instagram A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) -
ఇలాంటి క్షణాలు అమూల్యమైనవి: నమ్రత
వారం రోజుల క్రితం ఫ్యామిలీతో కలిసి హీరో మహేశ్ బాబు ఫ్లైటెక్కిన విషయం తెలిసిందే కదా! మహేశ్ హాలీడే ట్రిప్ ప్లాన్ చేసింది మరెక్కడికో కాదు.. దుబాయ్లో ఉంటున్న ఆయన వదినమ్మ ఇంటికే. అవును, నమత్ర అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి కుటుంబంతో సహా వెళ్లిన మహేశ్ అక్కడే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. పనిలో పనిగా అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టొస్తూ ప్రతిక్షణాన్ని పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫొటోను నమ్రత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఇందులో సూపర్ స్టార్ కుటుంబంతో పాటు శిల్ప, ఆమె భర్త, కూతురు ఉన్నారు. (చదవండి: విశ్వనాథ్గారిని కలవాలనిపించింది: చిరంజీవి) "ఇల్లు కాని ఇంట్లో సేద తీరుతున్నాం. గత రాత్రి మర్చిపోలేనిది.. అసలు ముఖానికి మాస్కులే లేవు(ఫొటో వరకు మాత్రమే) దీపావళి పండగ రోజు అంతా కలిసి బయట భోజనం చేశాం. అయినా పండగను ఫ్యామిలీతో జరుపుకోడానికి మించినదేం ఉంటుంది. ఇలాంటి క్షణాలు అమూల్యమైనవి" అని నమ్రత రాసుకొచ్చారు. కొడుకు, కూతురుతో రెస్టారెంటులో భోజనం చేస్తున్న ఫొటోను సైతం ఆమె అభిమానులతో ఇదివరకే పంచుకున్నారు. కాగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో సక్సెస్ అందుకున్న మహేశ్ 'సర్కారు వారి పాట'తో మరో హిట్టు తన ఖాతాలో వేసుకునే పనిలో పడ్డారు. సమాజానికి స్ట్రాంగ్ మెస్సేజ్ ఇవ్వనున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇది మహేశ్కు 27వ సినిమా. (చదవండి: మరో ఇద్దరికి ప్రాణదానం చేసిన మహేశ్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
అతనితో స్నేహం చేస్తా: నమ్రతా శిరోద్కర్
ముంబై: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ మిస్ ఇండియా పోటీ చేసిన నాటి ఓ వీడియోను ఆమె సోదరి, నటి శిల్పా శిరోద్కర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 1993లో నమ్రతా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పోటీలో నమ్రత తన సమాధానంతో షో జడ్జీలను మెప్పించారని శిల్పా తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వీడియోను బుధవారం శిల్పా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఇందులో మాజీ మిస్ ఇండియా సంగీత బిజ్లానీ కూడా కనిపించారు. ఈ రౌండ్లో ఏ ముగ్గురు తర్వాత రౌండ్కు వెళతారని సంగీతను అడగ్గా.. కచ్చితంగా నమ్రత విజయం సాధిస్తుందన్నారు. అంతేగాక తనకు ఇష్టమైన కంటెస్టెంట్ కూడా నమ్రత అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: అతడు నా అభిమాన హీరో) ఆ తర్వాత నమ్రతను.. ‘మీరు ఓ ఉదయం లేచేసరికి కౌంట్ డ్రాక్యులా(కల్పిత పాత్ర) మీ మంచంపై నిద్రిస్తున్నట్టు కనిపిస్తే ఏం చేస్తారు అని అడగ్గా’.. దానికి నమ్రత.. నేను నిజంగా భయపడాతాను కానీ అప్పుడు అతనితో స్నేహం చేస్తాను’ అంటూ సమాధానం ఇచ్చారు. నమ్రతా హిందీలో ‘కచ్చే ధాగే’, ‘పుకార్’, ‘అస్తిత్వ’, ‘అల్బెలా’, ‘దిల్ విల్ ప్యార్ వయార్’ వంటి హిందీ చిత్రాలలో తన నటనకు నమ్రతా శిరోద్కర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ, తెలుగు, మలయాళ చిత్రాలలో కూడా నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన ‘వంశీ’ సినిమా సమయంలో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డారు. అనంతరం వీరిద్దరూ 2005లో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. (చదవండి: ఆవిడంటే నాకు చాలా ఇష్టం: నమ్రత) View this post on Instagram @namratashirodkar I Love you😘😘😘 #feminamissindia #1993 A post shared by Shilpa Shirodkar (@shilpashirodkar73) on Jul 28, 2020 at 11:38pm PDT -
టీవీక్షణం: శిల్ప సెకెండ్ ఇన్నింగ్స్!
సినిమా చూస్తారా, సీరియల్ చూస్తారా అంటే... ఒక్క క్షణం కూడా తడుముకోకుండా సీరియల్ అంటున్నారు మహిళా మణులు. అందుకే చానెళ్లలో సినిమాలు రావడం కూడా తగ్గిపోయింది. శని, ఆది వారాల్లో తప్ప మిగతా రోజుల్లో సీరియల్స్దే హవా. ఇటీవల కొత్తగా శనివారం కూడా ఇచ్చేస్తున్నారు. ముందు ముందు ఆదివారం కూడా ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంతగా సీరియళ్లు ఏలుతున్నాయి కాబట్టే... సినిమా వాళ్లు సయితం సీరియళ్ల మీద మోజు పడుతున్నారు. సినిమాల్లో చేస్తున్నవారు కాస్త హవా తగితే సీరియళ్లలోకి జంప్ చేస్తున్నారు. శిల్పా శిరోద్కర్ కూడా అదే పని చేశారు. ఒకప్పుడు పాపులర్ హీరోయిన్ అయిన ఈమె... ఇప్పుడు జీటీవీలో ప్రసారమయ్యే ‘ఎక్ ముఠ్ఠీమే ఆస్మాన్’ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఇంతకీ శిల్ప ఎవరో గుర్తుందిగా? ‘బ్రహ్మ’ చిత్రంలో మోహన్బాబుతో నటించారు. ‘ముసిముసి నవ్వులలోన కురిసిన పువ్వుల వాన’ అంటూ ఆ సినిమాలో మోహన్బాబు పాట పాడేది ఈమె కోసమే. నమ్రతా శిరోద్కర్కి అక్క, మహేశ్బాబుకి వదిన అయిన శిల్ప... ఒకనాడు తన గ్లామర్తో యువకుల కలల రాణిగా వెలిగారు. ఇప్పుడు సీరియల్లో ఓ సాధారణ ఇల్లాలిగా నటనను పండిస్తూ... తెలుగు ఇల్లాళ్లతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మరి టీవీతో మొదలైన ఆమె సెకెండ్ ఇన్నింగ్స్... ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి!
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
ల్యాండ్ టైట్లింగ్ చట్టం సమగ్ర స్వరూపం ఇదే..
25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
ఈహెచ్టీని ఢీ కొట్టిన లారీ
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
తప్పక చదవండి
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement