-
కాంగ్రెస్లో చేరిన షోయబ్ ఇక్బాల్
సాక్షి, న్యూఢిల్లీ: మతియా మహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికైన షోయబ్ఇక్బాల్ గురువారం కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో షోయబ్ ఇక్బాల్ తన బంధువులు, మున్సిపల్ కౌన్సిలర్లు అల్లె మహ్మద్ ఇక్బాల్, ఖుర్రం ఇక్బాల్తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. షోయబ్ చేరిక వల్ల రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింల మద్దతు కాంగ్రెస్కు లభిస్తుందని ఆశి స్తున్నారు. ముస్లింలను ఆకట్టుకోవడం కోసమే కాంగ్రె స్ ఆయనను పార్టీలో చేర్చుకుందని రాజకీయ పరిశీ లకులు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ తరఫున గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలలో నలుగురు ముస్లింలేకావడం విశేషం. అయితే లోక్సభ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్కు మద్దతుగా నిలిచిన ఓటర్లు గత లోక్సభ ఎన్నిక లలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేశారు. ఢిల్లీ ఓటర్లలో ముస్లింలు 15 శాతం ఉన్నారు. ముస్లింల ఓట్లు చీలకుండా ఉండడం కోసం కాంగ్రెస్లో చేరుతున్నట్లు పోయబ్ ఇక్బాల్ తెలిపారు. లౌకిక పార్టీల మధ్య ఓట్లు చీలడం వల్ల మతతత్వ పార్టీలు విజయం సాధిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. షోయబ్ ఇక్బాల్ 1993 నుంచి మతియా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐదు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన వేర్వేరు పార్టీల తరపున పోటీచేసి గెలవడం విశేషం.మొట్టమొదట జనతాదళ్, ఆ తరువాత కాంగ్రెస్, ఒకసారి లోక్ జన్శక్తి పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆయన జనతాదళ్ (యునెటైడ్) తరఫున పోటీచేసి గెలిచారు. -
ఆప్లోకి షోయబ్?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో జనతాదళ్ యునెటైడ్కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ ఆ పార్టీని వీడి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. మాతియా మహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన షోయబ్ ఇక్బాల్ విశ్వాస పరీక్ష సమయంలో ఆప్ ప్రభుత్వానికి మద్దతు పలికిన విష యం తెలిసిందే. షోయబ్ ఇక్బాల్ తమ పార్టీలో చేరడం గురించి ఆప్ ఇప్పటిదాకా ఏమీ ప్రకటించనప్పటికీ ఆయన ఆప్లో చేరితే అసెం బ్లీలో ఆ పార్టీ సంఖ్యాబలం 29కి చేరుతుంది. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాలనుకుంటున్నానని, ఆ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలని, ఒకటి రెండు రోజులలో ఓ స్పష్టత వచ్చే అవకాశముందని షోయబ్ ఇక్బాల్ శుక్ర వారం విలేకరులతో చెప్పారు. దేశంలో మతతత్వశ క్తులను బలహీనపర్చాల్సిన అవసరముం దని ఆయన అభిప్రాయపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ బాగా పనిచేస్తున్నారని, తాను కూడా ఆ పార్టీలో చేరితే మరింత బాగా పనిచేస్తానన్నారు. పార్టీలో చేరే విషయమై కేజ్రీవాల్ను కలిసినట్లు చెప్పారు. -
ఓల్డ్ సిటీపై ఏఏపీ కన్ను
న్యూఢిల్లీ: ముస్లింలు అత్యధికంగా ఉన్న ఓల్డ్ సిటీపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) కన్నేసింది. ఇక్కడ తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. స్థానిక ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మేమున్నామంటూ భరోసానిస్తోంది. గతేడాది ఇక్కడ నుంచి భారీ ఓట్లతో గెలిచిన షోయబ్ ఇక్బల్ ఇలాకాలో తమ జెండా రెపరెడలాడేయాలని ఉవ్విళూరుతోంది. ఇందులో భాగంగా మటియా మహల్లో షాగంజ్ ప్రాంతంలో ఏఏపీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల భారీ స్క్రీన్పై ప్రత్యక్షమై ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అలాగే కేజ్రీవాల్ రాసిన లేఖను ఆ పార్టీ కార్యకర్తలు ప్రతి గడప గడపకు పంపిణీ చేశారు. గత 65 ఏళ్ల నుంచి 65,000లకు పైగా మత ఘర్షణలు జరిగాయని, వీటన్నింటికి బాధ్యులైన బీజేపీ, కాంగ్రెస్ రాజకీయంగా వాడుకుంటున్నాయని అందులో విమర్శించారు. ఉర్ధూ పాఠశాలల దయనీయ స్థితి, శిథిలావస్థలో ఉన్న మదర్సాలు, అవినీతి ఊబిలో చిక్కుకపోయిన వక్ఫ్ బోర్డుతో పాటు జైలు ఊచలు లెక్కపెడుతున్న అమాయక ముస్లింల గురించి వివరించారు. తమ సొంత గడ్డపైనే ముస్లింలు పొరుగింటి ప్రాంతాల వారిగా నివసించాల్సి వస్తోందని తెలిపారు. మైనారిటీవర్గ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తున్న కమిషన్ల చురుగ్గా పనిచేయకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. అయితే తమను అధికారంలోకి తీసుకొస్తే ఈ సమస్యలన్నీ పరిష్కరించి ముస్లింల అభివృద్ధికి పాటుపడతామని పేర్కొన్నారు. ఉర్దూ భాషకు ప్రత్యేక హోదాను ఇస్తామని, మెరుగైన పౌర సేవలు అందిస్తామని, ఉచిత నీటి సరఫరా చేస్తామని, ఉచిత విద్యను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే స్థానికంగా అనేక మంది పార్టీ కార్యకర్తలు లేకపోవడం ఏఏపీకి కాస్త నిరాశ కలిగించే అంశంగా చెప్పవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయం నాటికి పార్టీలో మరింత మంది చేరి స్థానికంగా పటిష్టపరుస్తారన్న ఆశతో ఉంది. అయితే ఇక్కడ మంచి నేతగా పేరున్న తక్వి మహమ్మద్ పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నాయకులు తమ పార్టీలో చేరే అవకాశముందని ఏఏపీ సభ్యుడు ఫిరోజ్ భక్త్ అహ్మద్ తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపై వారు వివిధ సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన వారు అనేక మంది ఉన్నారని చెప్పారు. ఇటువంటి వారందరూ ప్రత్యామ్నాయంగా ఏఏపీని ఎంచుకునే అవకాశముందని వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement