-
నగరి డీఎస్పీని సస్పెండ్ చేయాలి
చిత్తూరు(సెంట్రల్): పుత్తూరు డీఎస్పీ కృష్ణమోహన్రెడ్డిని సస్పెండ్ చేయాలని నగరి ఎమ్మెల్యే రోజా జిల్లా కలెక్టర్ను కోరారు. ఇటీవల నగరిలో జాతర సందర్భంగా జరిగిన గొడవకు ఆయన వ్యవహారశైలే కారణమని ఆమె తెలిపారు. జాతరలో తనపై జరిగిన గొడవకు కారణమైన మాజీ శాసనసభ్యుని అనుచరులు ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని, మంగళవారం నగరి మున్సిపల్ చైర్పర్సన్,మాజీ చైర్మన్తో కలిసి వెళ్లి జిల్లాకలెక్టర్ సిద్ధార్థ్జైన్ను కోరినట్లు ఆమె విలేకరులకు చెప్పారు. గొడవ జరిగే అవకాశం ఉందని తాను ముందుగానే డీఎస్పీకి వివరించి రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరినా ఆయన పట్టించుకోకపోగా ఉద్దేశపూర్వకంగానే అధికారపార్టీ నాయకులకు, కార్యకర్తలకు సహకరించారని తెలిపారు. నగరి పట్టణ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరిలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినందున డైయింగ్ యూనిట్ల వల్ల నీరు కలుషితమవుతోందని, దీని నివారణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. నగరికి మంజూరైన నీటి శుద్ధి ప్లాంటు ఇంకా ప్రారంభానికి నోచుకోకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీని ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆమె జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.భరత్గుప్తాను ఆయన కార్యాలయంలో కలసి నగరి వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీని కలసినవారిలో వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రి, నగరి మున్సిపల్ చైర్పర్సన్, మాజీ చైర్మన్ ఉన్నారు. -
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సిద్ధార్థజైన్ చెప్పారు. కలెక్టరేట్లోని మినీ మీటింగ్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈ నెల ఏడు జరిగే పోలింగ్కు ఏలూరు, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గాలకు 29 మంది, 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో 163 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అన్ని రకాల ఎన్నికల ప్రచారాలు నిలుపుదల చేయాలని రాజకీయ పార్టీలను కోరారు. ఉభయగోదావరి జిల్లాలలో ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం పెద్ద ఎత్తున పంపిణీ జరిగే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్కు సమాచారం అందిందని, ఈ దిశగా పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు విస్తృతమైన తనిఖీలు చేపట్టి నిరోధించాలని ఆదేశాలు వచ్చాయన్నారు. జిల్లాలో నిఘా బృందాల ద్వారా పెద్దఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రమేయాన్ని పూర్తిగా నిరోధించడానికి ఓటర్లు సహ కరించాలని కోరారు. ఓటర్లను ప్రలోభపెట్టే డబ్బు, మద్యం, ఇతర బహుమతుల పంపిణీపై సమాచారం అందించాలని కోరారు. వీరి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు సముచితమైన రివార్డు అందిస్తామని పేర్కొన్నారు. 29,10,414 మంది ఓటర్లు జిల్లాలో 29,10,414 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 14,36,286, మహిళలు 14,73,968, ఇతరులు 160 మంది ఉన్నారని కలెక్టర్ వివరించారు. చింతలపూడి నియోజకవర్గంలో అత్యధికంగా 2,36,825 మంది ఓటర్లు ఉండగా, నరసాపురం నియోజకవర్గంలో అత్యల్పంగా 1,54,417 మంది ఓటర్లు ఉన్నారన్నారు. జిల్లాలో మొత్తం 3,055 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వాటిలో గ్రామీణ ప్రాంతాల్లో 2,518, పట్టణ ప్రాంతాల్లో 537 ఉన్నాయన్నారు. మొత్తం 30,776 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని, పరోక్షంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఇతర సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తున్నార న్నారు. పోలింగ్ విధులకు ప్రిసైడింగ్ అధికారులుగా 3,573 మంది, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 3,552, అదనపు పోలింగ్ సిబ్బంది 20,917, మైక్రో అబ్జర్వర్లు 312, వీడియోగ్రాఫర్లు 370, డ్రైవర్లు 949, ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు 34 మందిని నియమించామన్నారు. ఈ ఎన్నికల్లో 19,578 మందికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, 1603 మందికి సర్వీసు ఓట్లు ఉన్నాయని వివరించారు. ఈవీఎంలలో ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కారం జిల్లాలో ఓటర్లకు 29,14,414 ఓటరు స్లిప్పులు పంపిణీ చేయాల్సి ఉండగా ఇంతవరకూ 17,42,270 ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 6,600 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లకు మొదటి చెకప్ పూర్తి చేసి నియోజకవర్గాలకు పంపామన్నారు. వీటికి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తితే తక్షణం పరిష్కరించేందుకు నియోజకవర్గానికి ఒక ఇంజనీర్ను, ఇద్దరు హౌసింగ్ ఇంజినీర్లను నియమించామని, అదనంగా ఈవీఎంలను కేటాయించినట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులకు ర్యాంప్ సౌకర్యం కల్పించామని చెప్పారు. సమస్యలుంటే టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయండి జిల్లాలో ఎన్నికల సంబంధమైన ఫిర్యాదులను తెలియజేయడానికి 1800-425-1365 నెంబరుతో టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఓటర్లలో చైతన్యాన్ని కలిగించేందుకు ప్రచార రథాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించామని, గత ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు స్లిప్పులు తీసుకోకపోతే పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పొందవచ్చన్నారు. అదేవిధంగా ఓటరు గుర్తింపు కార్డులు లేనివారు పాన్కార్డు, డ్రైనింగ్ లెసైన్స్ తదితర ఫొటో గుర్తింపు కార్డును చూపి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. జిల్లాలో 2361 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 276 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘించిన 27,086 మందికి నోటీసులు జారీ చేశామని, 2,281 మద్యం కేసులను సీజ్ చేశామని, 1468 మందిని అరెస్టు చేశామని కలెక్టర్ చెప్పారు. జేసీ టి.బాబూరావునాయుడు, డీఆర్వో కె.ప్రభాకరరావు, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణలు పాల్గొన్నారు. -
పథకాలపై అవగాహన పెంచండి
‘బంగారుతల్లి’ని సమర్థవంతంగా అమలు చేయండి 2013 మే 1వ తేదీ తర్వాత జన్మించిన ప్రతి ఆడపిల్లనూ బంగారుతల్లి పథకంలో నమోదు చేయాలన్నారు. వారికి రూ.2,500 తొలి విడతగా జమ చేయాలన్నారు. పథకం వర్తింపునకు జనన ధుృవీకరణ, రేషన్ కార్డు, ఆధార్, బిడ్డతో కలిగిన ఫొటో, బ్యాంకు ఖాతా నెంబర్ వివరాలు అవసరం అవుతాయన్నారు. ఏలూరు, న్యూస్లైన్ : పేదలకు ఆసరాగా నిలుస్తోన్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహనకు మహిళా సమాఖ్యలు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ అభిప్రాయపడ్డారు. సత్రంపాడులోని టీటీడీసీలో శుక్రవారం 113వ జిల్లా సమాఖ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాక్రాంతి పథం ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ పథకాలపై దాదాపు 4 గంటల పాటు ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. పలు సూచనలు, సలహాలు అందించారు. పేదల ఆర్థికాభివృద్ధితో పాటు వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఇందిరాక్రాంతి పథం రూపొందించిందన్నారు. ఆశయాల అమలుకు మహిళా సమాఖ్యలు చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐకేపీ రుణాలు, పెన్షన్లు, బంగారుతల్లి, రుణా లు తిరిగి చెల్లింపు, గ్రూపు ఖాతాలు, పొదుపు తీరు అంశాలను ప్రామాణికంగా తీసుకుని ప్రతినెలా 10 మండలాల్లో జిల్లా సమాఖ్యకు చెందిన ఆయా కమిటీలు పర్యటించి సమగ్ర సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, రైతులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ‘సునందిని’ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో 6 వేల 430 కృత్రిమ గర్భోత్పత్తి ఆడదూడలు, సంకరజాతి దూడలు కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామన్నారు. వాటికి 32 నెలలు వయస్సు వచ్చేంత వరకు దాణా, మందులు, వ్యాక్సిన్లు, బీమా సౌక్యర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో ముందుంచండి జిల్లాలో స్వయం సహాయక గ్రూపులకు రుణాలు అందించడం, పెన్షన్లు పంపిణీ, బంగారుతల్లి తదితర కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమంలో ఉంచడంలో మహిళా సమాఖ్యలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జనవరి 26 నుంచి పాలసేకరణ చేపట్టాలి జిల్లాలో రూ.16 కోట్లతో ఏర్పాటు చేసిన 19 బల్క్మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభం కావాలన్నారు. పాలసేకరణలో సంబంధిత స్వయం సహాయక సంఘాలు నిమగ్నం కావాలన్నారు. జిల్లాలో నిర్మల్ భారత్ అభియాన్ కింద 70 వేల వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని ప్రభుత్వం రూ. 9100 సబ్సిడీగా అందిస్తున్నదని, ప్రతి ఇంటా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. సమావేశంలో డీఆర్ డీఏ పీడీ వై.రామకృష్ణ, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవమణి, పశుసంవర్థకశాఖ జేడీ కె.జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు. -
చెట్టుకింద కలెక్టర్
పల్లె సమస్యల్ని తెలుసుకునేందుకు ప్రజలతో పంచారుుతీ ఔను.. ఓ చెట్టుకింద సిమెంట్ బల్లపై కూర్చున్నది మన జిల్లా కలెక్టరే.. నీడకోసం చెట్టుకిందకు చేరారేమో అనుకోకండి. గురువారం ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం గ్రామానికి ఆకస్మిక తనిఖీల నిమిత్తం వచ్చిన కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఇలా దర్శనమిచ్చారు. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే చెట్టుకింద ప్లీడర్ తరహాలో పంచారుుతీ నిర్వహించారు. బల్లపై కూర్చున్నది కలెక్టర్ అని తెలుసుకున్న ప్రజలు ఒక్కొక్కరుగా వెళ్లి గ్రామంలో నెలకొన్న మంచినీరు, పారిశుధ్యం వంటి సమస్యలను ఏకరువుపెట్టారు. సుమారు అరగంటపాటు ఆయన చెట్టుకిందే కూర్చుని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి ఆయూ శాఖల అధికారులకు సూచనలను ఇచ్చారు. - న్యూస్లైన్/ద్వారకాతిరుమల -
ఆధార్ సీడింగ్ను వేగిరపర్చండి
ఏలూరు, న్యూస్లైన్ : జిల్లాలో ఈ నెలాఖరు నాటికి నూరుశాతం రేషన్కార్డులతో ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో ఆదివారం ఆధార్ అనుసంధానం, అమ్మహస్తం, నిత్యావసర సరుకుల పంపిణీ అంశాలపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో అర్హత గల ప్రతి పేద కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు రేషన్కార్డుల ఆధార్ అనుసంధానమే మార్గమని చెప్పారు. జిల్లాలో 12 లక్షల తెల్ల రేషన్కార్డులకు 33 లక్షల యూనిట్లు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని, ఇప్పటి వరకు 23 లక్షల యూనిట్లకు సంబంధించిన ఆధార్ అనుసంధానం పూర్తి అయ్యిందన్నారు. మిగిలిన 10 లక్షల యూనిట్ల అనుసంధాన పక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తిచేసేం దుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరికి ఆధార్కార్డులు అందించాలనే లక్ష్యంతో 46 మండలాల్లో శాశ్వత ఆధార్ కార్డుల జారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అమ్మహస్తం పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డీలర్లను కోరారు. చౌకడిపో డీలర్లు బాధ్యతాయుతంగా పనిచే యడానికి పటిష్ట ప్రణాళిక అమలు చేస్తామని చె ప్పారు. జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ డీలర్లకు బ్యాం కుల నుంచి రుణం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సివిల్ సప్లయిస్ జీఎం సలీంఖాన్, డీఎస్వో డి.శివశంకర్రెడ్డి పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కంగనా దుస్తులపైనే అందరి దృష్టి!
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ఉచిత సామూహిక వివాహాలు పేదలకు వరం
నీటికుంటలో పడి వ్యక్తి మృతి
ఐదు గ్యారెంటీలు తాత్కాలికమే
బహిరంగ ప్రచారానికి తెర
మరో బిగ్ మ్యాచ్.. సన్రైజర్స్ ముంబైని ఓడిస్తేనే!
Adaa Khan: ఏంజెల్లా మెరిసిపోతున్న సీరియల్ బ్యూటీ (ఫోటోలు)
పోలింగ్కు సర్వం సిద్ధం
ప్రజ్వల్పై కఠిన చర్యలు తీసుకోవాలి
తప్పక చదవండి
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- రూటే సెపరేటు
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement