-
మామ, అల్లుళ్ల డబుల్ ధమాకా
తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి ఊపిరి సిద్దిపేట. ఉద్యమాల పురిటి గడ్డగా, విలక్షణమైన తీర్పునకు వేదికగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. నాడు తెలంగాణ ప్రజాసమితితో తొలిదశ ఉద్యమానికి అనంతుల మదన్ మోహన్ నాయకత్వం వహించారు. నేడు మలిదశ ఉద్యమం ద్వారా స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ ఓనమాలు నేర్పిన గడ్డ ఇది. మామ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని హరీశ్రావు ప్రస్తుతం అదే పరంపర కొనసాగిస్తున్నారు. సిద్దిపేటజోన్: సిద్దిపేట నియోజకవర్గం ఏర్పడి 71 ఏళ్లు అయినప్పటికీ ఐదు దశాబ్దాలుగా ముగ్గురిని మాత్రమే ప్రజలు ఆదరించి విలక్షణమైన తీర్పును ఇచ్చారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్ సాధించగా, సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు హరీశ్రావు మాత్రం డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఐదుసార్లు, కాంగ్రెస్ ఐదు సార్లు, టీడీపీ నాలుగు సార్లు, ఒక్కొక్కసారి పీడీఎఫ్, టీపీఎస్, స్వతంత్ర అభ్యర్థులను ఆదరించారు. ప్రస్తుతం ఏడోసారి విజయం కోసం హరీశ్రావు బరిలో ఉన్నారు. ముగ్గురూ ముగ్గురే.. సిద్దిపేట నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఇరవై సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఐదుసార్లు ఉప ఎన్నికలు వచ్చాయి. 1952లో ఎడ్ల గురవారెడ్డి(పీడీఫ్), 1957 లో రాజేశ్వర్రావు(కాంగ్రెస్), 1962లో సోమేశ్వర్ రావు(స్వతంత్ర), 1967లో వీబీ రాజు(కాంగ్రెస్)ను నియోజకవర్గ ప్రజలు ఒక్కోసారి ఆదరించి గెలిపించారు. తర్వాత 1970లో పోటీ చేసిన మదన్ మోహన్ను నాలుగు సార్లు, తర్వాత పోటీ చేసిన కేసీఆర్, హరీశ్రావును ఆరు సార్లు వరుసగా గెలిపించారు. వారిలో మదన్ మోహన్ హ్యాట్రిక్, కేసీఆర్, హరీశ్రావు డబుల్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. ఉద్యమానికి వేదిక.. సిద్దిపేట తెలంగాణ తొలి, మలి ఉద్యమానికి వేదిక లాంటిది. 1969 తొలి విడత ఉద్యమ నేపథ్యంలో అప్పట్లో వీబీ రాజు ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. 1970లో జరిగిన తొలి ఉపఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి(పీడీఎఫ్) నుంచి అనంతుల మదన్ మోహన్ పోటీచేసి విజయం సాధించారు. అక్కడి నుంచి మొదలైన మదన్ మోహన్ రాజకీయ ప్రస్థానం 1985 వరకు కొనసాగింది. కాంగ్రెస్లో టీపీఎస్ విలీనం కావడంతో పీవీ రాజేశ్వర్రావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాం, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వాల్లో మదన్ మోహన్ పలుశాఖల మంత్రిగా పనిచేశారు. 1985లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మదన్ మోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగారు. అదే పంథాలో సీఎం కేసీఆర్ 2001లో మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి స్వరాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. అంతకు ముందు కేసీఆర్ ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాల్లో మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. 2001 నుంచి గులాబీ గుబాళింపు ఒకప్పుడు కాంగ్రెస్, తర్వాత టీడీపీలకు కంచుకోటగా ఉన్న సిద్దిపేట నియోజకవర్గం నేడు గులాబీ పార్టీకి కంచుకోట అయ్యింది. తెలంగాణ మలి విడత ఉద్యమ నేపథ్యంలో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పేరిట గులాబీ జెండా చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు రెండు దశాబ్దాల కాలం పైగా సిద్దిపేట గులాబీ పార్టీకి అడ్డాగా మారింది. -
అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’
మెదక్ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో మెదక్లో టీఆర్ఎస్ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్లో టీఆర్ఎస్ విజయం సాధించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. సాక్షి, మెదక్ : మెదక్లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో మెదక్ స్ధానాన్ని టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానాన్ని కొల్సోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావులకు బలమైన కేడర్ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు. హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం, నిత్యం ప్రజలతో మమేకం అయ్యే హరీష్ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక పొయింది. ఎందుకంటే హరీష్ రావుకు సిద్దిపేటలో ట్రబుల్ షూటర్కు కబలమైన కేడర్ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. నర్సాపూర్లో కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారెడ్డి పైన టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి విజయం సాధించారు. జహీరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.మాణిక్రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు. పఠాన్చెరులో టీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గెలిచారు. ఆందోల్లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్ గెలుపొందారు. నారయణఖేడ్లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేశ్ షెట్కార్ , టీఆర్ఎస్ అభ్యర్ధి భుపాల్రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్రెడ్డి పైన , టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి , బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్ గజ్వేల్ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి టీఆర్ఎస్ జహీరాబాద్(ఎస్సీ) కె. మాణిక్ రావు టీఆర్ఎస్ సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ ఆందోల్ చంటి క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ పఠాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ సిద్దిపేట టీ. హరీశ్ రావు టీఆర్ఎస్ గజ్వేల్ కేసీఆర్ టీఆర్ఎస్ హూస్నాబాద్ వడితెల సతీష్ కుమార్ టీఆర్ఎస్ దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్ఎస్ నారాయణఖేడ్ ఎమ్. భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ -
సిద్దిపేట: ఆమే శక్తి
శాసనసభ ఎన్నికల్లో గెలుపోటములను మహిళలు ప్రభావితం చేయబోతున్నారా..? రాజకీయ నేతల భవితవ్యంపై తీర్పునివ్వబోతున్నారా..? మహిళ నిర్ణయమే శిరోధ్యారమవుతుందా.. అనే ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. జిల్లాలో మహిళల నిర్ణయమే రాజకీయ పార్టీల భవిష్యత్తును శాసించబోతోంది. మహిళా ఓటర్లు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొనడం అభ్యర్థుల తల రాతలను మార్చబోతోంది. జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో గజ్వేల్ మినహా మిగతా చోట్ల మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పోలింగ్ జరిగిన తీరు పరిశీలిస్తే మహిళలదే పైచేయిగా ఉంది. గజ్వేల్ : హుస్నాబాద్ నియోజకవర్గంలో మొత్తం 222436 ఓటర్లు ఉండగా... ఇందులో మహిళలు 111692, పురుషులు 110737 మంది ఉన్నారు. ఎన్నికల్లో 185976 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 93587 మంది ఓటు హక్కును వినియోగించుకోగా పురుషులు 92100 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ లెక్కన 1487 మంది మహిళా ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఓట్లు వేశారు. నియోజకవర్గంలో స్థానిక అంశాలు ఓటింగ్ను ప్రభావితం చేశాయని తెలుస్తోంది. నియోజకవర్గంలోని మిషన్ భగీరథ పథకం పనులు కొన్ని గ్రామాల్లో పూర్తయి, మరికొన్ని గ్రామాల్లో ప్రగతిపథంలో ఉండడం, హుస్నాబాద్ పట్టణంలో 560 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం సాగుతుండడం తమకు అనుకూలంగా ఉంటుం దని... ఈ అంశాన్ని మహిళలు సానుకూలంగా తీసుకొని తమ వైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫ ల్యాలు, అసంపూర్తి పనులు మహిళలను తమ వైపు మళ్లించాయని ప్రజాకూటమి అంచనా వే స్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ మొత్తంగా 190483 ఓట్లు ఉండగా... ఇందులో మహిళలు 96780, పురుషులు 93703 మంది ఉన్నారు. ఎన్నికల్లో మొత్తంగా 163798 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83176, పురుషులు 80482 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలో 26 94మంది మహిళలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశం తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ భావిస్తోంది. నియోజకవర్గంలో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆసరా పింఛన్దారులు తమ వైపే మొగ్గు చూపారని అంచనా వేస్తోంది. మరోవైపు మిషన్ భగీరథ పథకం కూడా తమకు కలిసివచ్చిందనే ఆశలో ఉంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నియోజకవర్గంలో స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందనే ఆశలో ఉన్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితి మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇక్కడ మహిళలు ఏకపక్షంగా తీర్పునిస్తారనే అంచనాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 209339 ఓట్లలో మహిళలు 105279 మంది ఉన్నారు. ఎన్నికల్లో 165368 ఓట్లు పోలవగా... ఇందులో మహిళలు 83575 మంది ఉన్నారు. వీరిలో 95శాతానికి పైగా తమవైపే మొగ్గు చూపారని టీఆర్ఎస్ భావిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్పూర్, కొండపాక, మర్కూక్, మనో హరాబాద్, తూప్రాన్ మండలాల్లో మొత్తంగా 233207 ఓట్లు ఉండగా... మహిళలు 116202, పురుషులు 116982, ఇతరులు 23మంది ఉన్నా రు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన గా... ఈ రెండు పార్టీలు కూడా తమ మేనిఫెస్టోతో మహిళల ముందుకు వెళ్లాయి. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ‘మిషన్ భగీరథ’ పథకాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. నియోజకవర్గంలో రూ. 450కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని చే పట్టి 248 ఆవాసాలకు స్వచ్ఛమైన నల్లా నీటిని అందించామని పార్టీ శ్రేణులు ప్రచారంలో వివరించే ప్రయత్నం చేశాయి. గతంలో ఇక్కడ మం చినీళ్లు దొరకక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకున్న కష్టాలను గుర్తు చేస్తూ కేసీఆర్కు ఓటు వేయాలని అభ్యర్థించాయి. అంతేగాకుండా మహిళా సంఘాలకు రుణాలు, ఇతర పథకాలను ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ సైతం మేనిఫెస్టోలో పొందు పర్చిన ఓ కుటుంబానికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచి తంగా పంపిణీ చేస్తామనే అంశాన్ని బలంగా మహిళల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాయి. ఏటా 6 సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తే మహిళల కష్టాలు తీరుతాయని వివరించాయి. అదే విధంగా మహిళా సంఘాలకు రుణాల పెంపు అంశాన్ని ప్రచారం చేశాయి. ఇక ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు, సభలకు మహిళలను పెద్ద ఎత్తు న తరలించడంపైనే పార్టీలు దృష్టి పెట్టాయి. రెండు పార్టీలు మహిళలు తమవైపే ఉంటారని వి శ్లేషిస్తున్నాయి. ఎన్నికల్లో మొత్తంగా 206699 ఓటర్లు పాల్గొనగా... అందులో మహిళలు 1022309 మంది, పురుషులు 104457 మంది, ఇతరులు ముగ్గురున్నారు. రెండు పార్టీలు మహిళలు తమ వైపే మొగ్గు చూపారనే అంచనాల్లో నిమగ్నమయ్యాయి. మొత్తానికి సిద్దిపేట ఎన్నికల చిత్రం మహిళల పాత్రపైనే ఆధారపడి ఉండటం విశేషం. -
బెట్టింగ్..రంగా
ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై జిల్లావ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం గెలుపు ఎవరిదనే మాటే అందరి నోటా వినిపిస్తోంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఫలితాల కోసం మరో 24గంటలు ఎదురు చూడాల్సిందే. జిల్లాలో మాత్రం ఎన్నికల వేడి ఇంకా తగ్గలేదు. ఎవరికి వారు గెలుపోటములపై తమ తమ అంచనాలతో జోరుగా విశ్లేషిస్తున్నారు. ఫలితాలపై జోరుగా పందెం కొనసాగుతోంది. సిద్దిపేటజోన్ : ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? ఏ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వస్తాయి? అనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ముఖ్యంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పరస్పరం బెట్టింగ్ కాస్తున్నారు. రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు తమ స్థాయికి తగ్గట్టుగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. మరి కొందరు విహార యాత్రలు, విందులు, వినోదాలు ఇచ్చేలా పందెం కాస్తున్నారు. తాము పెట్టిన సొమ్ముకు రెట్టింపుగా రాబట్టుకునేందుకు పందెంరాయుళ్లు ఆసక్తిని కనబరుస్తున్నారు. జిల్లాలో కీలకమైన స్థానాలు ప్రధానంగా జిల్లాలో కీలకమైన స్థానాలు ఉండడం, అధికారంలో, పార్టీలో కీలక వ్యక్తులుగా ఉన్న వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు కావడంతో బెట్టింగ్ రాయుళ్లు పందెం కాసేందుకు అవకాశం కల్పిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదెవరు అనే అంశం మొదలుకొని నియోజకవర్గంలో గెలుపు ఎవరిదనే అంశంపై బెట్టింగులు కాస్తున్నారు. వివిధ రకాల ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్ సర్వేలు, సోషల్ మీడియా పోస్టింగులను బేస్ చేసుకొని బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. జాతీయ చానళ్ల ఎగ్జిట్ పోల్ సర్వేకు భిన్నంగా లగడపాటి రాజగోపాలు సర్వే వివరాలు పేర్కొనడంపై యువతలో ఆసక్తి నెలకొంది. ఫలానా పార్టీ , ఫలానా అభ్యర్థి విజయం సాధిస్తారని, ఫలానా పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, నియోజకవర్గాల వారిగా ఫలానా అభ్యర్థికి వచ్చే మెజార్టీపై ఎవరికి వారు తమ అంచనాలకు అనుగుణంగా పందెంలో డబ్బులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గజ్వేల్లో గెలుపుపై భారీగా.. జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ బరిలో ఉండడం, ఆయనకు పోటీగా కూటమి అభ్యర్థి ప్రతాప్రెడ్డి నిలిచిన క్రమంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉందన్న సోషల్ మీడియా ప్రచారాన్ని చూసి యువత పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. రూ. 10 వేల నుంచి రూ. 5లక్షల వరకు గజ్వేల్ నియోజకవర్గంలో బెట్టింగ్కు దిగడం విశేషం. దుబ్బాక నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై, మెజార్టీపై పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. మరోవైపు పొరుగునే ఉన్న జనగామ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలు చేర్యాల, కొమురవెల్లిలో బెట్టింగ్ జోరుగా సాగుతోంది. అక్కడ బరిలో ఉన్న వారిలో ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, మరొకరు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు కావడం విశేషం. అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులు గెలుపోటములు, ప్రధానంగా మెజార్టీ పైనే బెట్టింగ్ జరుగుతుండడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా జరిగే బెట్టింగ్ ప్రక్రియ సహజంగా పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు కూడా పాకుతోంది. ఆయా మండలాల్లోని కీలక నేతలు, కార్యకర్తలు, అభిమానులు బెట్టింగ్కు ఆసక్తి చూపుతున్నారు. సిద్దిపేట స్పెషల్.. లక్ష మెజార్టీపైనే పందెం ఉమ్మడి జిల్లాలో సిద్దిపేట ప్రస్తుతం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. గతంలోనే సిద్దిపేట అభ్యర్థి హరీశ్రావు రికార్డు స్థాయిలో రెండు సార్లు భారీ మెజార్టీని సాధించి రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో సాధారణ ఎన్నికలు రావడం, షెడ్యూల్ విడుదల నుంచి లక్ష మెజార్టీ లక్ష్యంగా పార్టీ శ్రేణులు ప్రచారాన్ని నిర్వహించాయి. పోలింగ్ ప్రక్రియ ముగియడం, అందరి అంచనాలకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరగడంతో ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో మెజార్టీపై చర్చ జోరుగా సాగుతోంది. ఓట్లేసి 72 గంటలు దాటినా ఇప్పటికీ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ. అది లక్ష మెజార్టీ పైనే. ప్రధానంగా హరీ«శ్ గెలుపు అంశాన్ని పక్కన బెట్టి స్వంత పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు ముఖ్యంగా యువతలో మెజార్టీ ప్రధాన అంశంగా జోరుగా బెట్టింగ్ సాగుతున్నట్లు సమాచారం. -
ఎవరి ధీమా వారిది
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండవసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 8,55,465 మంది ఓటర్లు ఉండగా ఇందులో 84.14శాతం అంటే 7,20,780 మంది ఓటర్ల తమ ఓటు వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 4శాతం ఓట్లు అధికంగా పోలయ్యాయి. రాష్ట్ర సగటుతో పోలిస్తే జిల్లాలో 14శాతం ఎక్కువ ఓట్లు వేసి మరోసారి సిద్దిపేట జిల్లా చైతన్యాన్ని చాటారు. అయితే ఈ పోలింగ్శాతాన్ని చూసి అభ్యర్థుల్లో ఎవరికివారు దీమాను వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీపై అంచనాలు జిల్లాలో పలుచోట్ల గెలుపు ఓటములపై, మరికొన్ని చోట్ల అభ్యర్థులకు వచ్చే మెజార్టీలపై రాజకీయ పక్షాలు, అభ్యర్థులు అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గంలో గతం కన్నా ç4.5శాతం ఓట్లు అధికంగా పోల్ కావడంతో ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్య ర్థిగా పోటీలో ఉన్న తన్నీరు హరీశ్రావు మాత్రం తనకు లక్షకు పైగా మెజార్టీ వస్తుందనే ధీమాతో ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,09,339 ఓటర్లు ఉండగా 1,65,368 మంది ఓట్లు వేశారు. ఇందులో ప్రత్యర్థి బీజేపీకి 20వేల మేరకు ఓట్లు పడే అవకాశం ఉందని, మిగిలిన కూటమి అభ్యర్థి భవానీరెడ్డి, ఇతర అభ్యర్థులకు కలిపి మొత్తం మరో 15వేల ఓట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు. మిగిలిన లక్షా ముప్పైవేల ఓట్లు హరీశ్రావుకు వస్తాయని, సులభంగా లక్ష మెజార్టీ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ, కూటమి అభ్యర్థులు కూడా తమకేమీ తక్కువ ఓట్లు రావని, గెలుపు ఓటమిలు అటుంచినా.. గౌరవ ప్రదమైన ఓట్లు వస్తాయని చెప్పడం గమనార్హం. అదేవిధంగా దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గంల్లో తమ నాయకులకు కూడా 60వేల మెజార్టీ వస్తుందని ఆయా నియోకవర్గాల టీఆర్ఎస్ కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా గజ్వేల్లో కూడా భారీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విజయబావుటా ఎగుర వేయడం ఖాయమని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. బీజేపీ, విపక్షాల్లో ధీమా జిల్లాలోని నాలుగు స్థానాలకు నాలుగు మేమే గెలుస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. అయితే తామేమీ తక్కువ కాదని, 11వ తేదీన విడుదల కానున్న ఫలితాలే రుజువు చేస్తాయని విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులు దీమాతో ఉండటం గమనార్హం. గజ్వేల్లో మేమే గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్రెడ్డి విలేకరుల సమావేశంలో చెప్పడం విశేషం. అదేవిధంగా దుబ్బాకలో తమకు కూడా ఓట్లు బాగానే వస్తాయని, విజయం మావైపే ఉందని బీజేపీ, కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు. హుస్నాబాద్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత మాకు అనుకూలించిందని, కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా పనిచేశారని విజయం ఖాయమని సీపీఐ నాయకులు అంటున్నారు. ఇంతకాలం ప్రచారంలో నిమగ్నమైన అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ గెలుపుపై చర్చలు పెడుతున్నారు. వీరితోపాటు తటస్థులు కూడా నలుగురు కూడిన చోట గెలుపోటముల ముచ్చటే కొనసాగతోంది. అయితే మరో రెండు రోజుల్లో ఈనెల 11న ఫలితాలు వెళ్లడి కానున్నందున అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తక్కెళ్లపాడులో దారుణహత్య
కోల్డ్స్టోరేజ్ల సమస్యల పరిష్కారానికి కృషి
టీడీపీ నేత పెమ్మసానికి నోటి దురుసు ఎక్కువ
అణగారిన వర్గాలకు రాజ్యాధికారం వైఎస్ జగన్తోనే సాధ్యం
నూటికి నూరుపాళ్లు గెలిచేది వైఎస్సార్ సీపీనే
ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామనడం దుర్మార్గం
సీఎం వైఎస్ జగన్తోనే సువర్ణ పాలన
ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై టీడీపీ దుష్ప్రచారం
No Headline
No Headline
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement