-
తల్లిపై కిరోసిన్ పోసిన కూతురు
సిద్దిపేటరూరల్ : పేగు తెంచుకొని పుట్టిన కూతురు.. కన్నపేగుపైనే నిప్పులు కురిపించింది. తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ ఘటన సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్లో చోటుచేసుకుంది. రాఘవాపూర్కి చెందిన గ్యార లచ్చవ్వ (55), భర్త మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. కుమారులు సిద్దిపేటలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుండగా, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. మూడో కూతురైన గ్యార సునీత ఇంటి దగ్గరే ఉంటూ ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. గురువారం ఉద యం తల్లి కూలీ పనికి, సునీత ఆసుపత్రికి వెళ్లారు. రాత్రి పని ముగించుకొని ఇంటికి వచ్చిన కూతురుతో కుటుం బానికి సంబంధించి విషయమై లచ్చవ్వ గొడవ పడింది. గొడవ పెద్దది కావడంతో, విచక్షణ కోల్పోయిన సునీత పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని తల్లిపై కిరోసిన్ గుమ్మరిం చింది. ఆపై అగ్గిపుల్ల గీసి నిప్పంటిం చింది. ఒక్కసారిగా ఇంటినిండా మం టలు వ్యాపించాయి. కాలిన గాయాల తో లచ్చవ్వ కేకలు వేసింది. ఇరుగుపొరు గు వారు వచ్చి మంటలను ఆర్పారు. అప్పటికే సగానికిపైగా కాలిపోయిన లచ్చవ్వను అంబులెన్స్లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. 24 గంటలు గడిచే వరకు ఏం చెప్పలేమని వైద్యులు చెప్పారు. -
షార్ట సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
సిద్దిపేట రూరల్, న్యూస్లైన్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మండల పరిధిలోని బుస్సాపూర్లో శనివారం తెల్లవారుజామున ఓ ఇల్లు దగ్ధమైంది. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను అదుపు చేశారు. లేకుంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి ఇరుగుపొరుగు ఇళ్లు కూడా ధ్వంసమై పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వల్లపురెడ్డి కిష్టారెడ్డి రిటైర్డ్ టీచర్. పిల్లలకు పెళ్లి అయి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్నారు. దీంతో కిష్టారెడ్డి దంపతులు గ్రామంలో నివాసముంటున్నారు. అయితే కిష్టారెడ్డికి ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఇంటికి తాళం వేసి చికిత్స నిమిత్తం శుక్రవారం సిద్దిపేటకు భార్యతో కలిసి వెళ్లారు. డాక్టర్కు చూపించుకుని ఇంటికి బయలుదేరారు. అయితే మధ్యలో ఓ బంధువు ఆహ్వానం మేరకు వారి ఇంట్లోనే ఆ రాత్రి బస చేశారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం కిష్టారెడ్డి ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేశారు. వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పం దించకుండా ఉంటే ఇంట్లో ఉన్న రెండు సిలిండర్లు పేలి పెను ప్రమాదం సంభవించేదని గ్రామస్తులు తెలిపారు. ఇంతలో విషయాన్ని తెలుసుకున్న కిష్టారెడ్డి గ్రా మానికి చేరుకున్నారు. వంట రూంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ. 1.5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement