-
సింహస్థా కుంభమేళాకు హిజ్రా సాధువులు
భోపాల్: చదివేందుకు వింతగానే ఉన్నా ఇది అక్షరాలా నిజం. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ జిల్లాలో వచ్చే ఏడాది ఏప్రిల్ 22 నుంచి మే 21 వరకు జరగనున్న సింహస్థా కుంభమేళాలో దాదాపు పదివేల మంది హిజ్రా సాధువులు పాల్గొని, పవిత్ర స్నానాలాచరించనున్నారట. దేశం నలుమూలల నుంచే కాకుండా బ్యాంకాక్ వంటి దేశాల నుంచి కూడా హిజ్రా సాధువులు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తున్నారని ఉజ్జయిన్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రుషి అజయ్దాస్ వెల్లడించారు. ఈ కుంభమేళాలో ఇప్పటిదాకా 13 వర్గాలకు చెందిన సాధువులు మాత్రమే పాల్గొనేవారని, వారికోసం మాత్రమే శిబిరాలు ఏర్పాటు చేసేవారని, ఈసారి హిజ్రా సాధువులు కూడా పెద్దమొత్తంలో హాజరవుతుండడంతో 14వ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అజయ్దాస్ తెలిపారు. ఉజ్జయిన్లోని తన ఆశ్రమంలోనే హిజ్రా సాధువుల కోసం ఈ నెల 13 నుంచే శిబిరాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా హిజ్రా సాధువుల విషయంలో మిగతా సాధువర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని పలువురు భావిస్తుండగా ఉజ్జయిన్ జిల్లా కలెక్టర్ మాత్రం.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు. -
దిగంబర సాధువులకు చిర్రెత్తింది
నాసిక్: పుష్కర స్నానాలకు వచ్చిన జైన దిగంబర సాధువులకు చిర్రెత్తిపోయింది. ఎప్పుడు భగవన్నామ స్మరణలో ఉండే వారంతా ఆగ్రహంతో ఊగిపోతూ అధికారులపై చిందులేశారు. ఏమిటీ ఏర్పాట్లు, జాగ్రత్తలు అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోదావరి పుష్కరాలు ప్రారంభమైనట్లుగానే మహారాష్ట్రలో సింహాష్ట కుంభమేళా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో జైన దిగంబర సాధువులు తరలి వచ్చారు. అయితే, గోదావరిలో నీళ్లు సరిగా లేకపోవడం, రాత్రి పూట విద్యుత్ సమస్య తలెత్తడం, చుట్టుపక్కల కుప్పలుగా చెత్తపేరుకోవడంవంటి పలు ఏర్పాట్ల లోపం వారికి కాస్త ఇబ్బంది కలిగించినట్లుదశరధ్ దాస్ అనే సాధువు అసంతృప్తి వ్యక్తం చేశాడు. కుంభమేళాకు వచ్చే తమకు కొన్ని ప్రత్యేక ప్రదేశాలు కేటాయించాల్సి ఉంటుందని, ఆ విషయంలో అధికారులు విఫలమయ్యారని ముందు తమకు ఆ పనిచేసి పెట్టాలని కోరారు. కన్నంవార్ బ్రిడ్జి నుంచి లక్ష్మీనారాయణ ఘాట్ వరకు కిలో మీటర్ కుపైగా ఉంటుందని, దానిని ఇప్పటికీ ఓపెన్ చేయకుండా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement