-
దారికాసి దోచేశారు
నిడదవోలు : పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో మంగళవారం సీఐ ఎం.బాలకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన చెరకు రామకృష్ణ దేవరపల్లి సబ్ పోస్ట్మాస్టర్గా పనిచేస్తున్నారు. రోజూ నిడదవోలు నుంచి మోటార్సైకిల్పై చాగల్లు, పల్లంట్ల మీదుగా దేవరపల్లి వెళుతుంటారు. రామకృష్ణ సింగవరంలో ఇల్లు నిర్మించుకుంటుండగా బంధువులు ఇచ్చిన రూ.1.80 లక్షలు తీసుకుని ఈనెల 2న దేవరపల్లి పోస్టాఫీసు నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో దోపిడీ ముఠాలోని ఐదుగురు సభ్యులు అంతకుముందు రెండు రోజులుగా రెక్కీ నిర్వహించారు. రామకృష్ణ కదలికలను గమనిస్తూ దోపిడీకి పథకం రచిం చారు. రామకృష్ణ పోస్టాఫీస్ వద్ద బయలుదేరుతుండగా ఇద్దరు సభ్యులు అక్కడే ఉండగా మరో ముగ్గురు చాగల్లు మండలం కలవలపల్లి, చిక్కాలపాలెం గ్రామాల మధ్యలో మామిడి తోటల వద్ద మాటు వేశారు. రాత్రి 7.30 గంటలకు రామకృష్ణ నగదు బ్యాగుతో మామిడి తోటలు సమీపంలోకి వచ్చేసరికి ఐదుగురు ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. ముఠాలోని కడలి హరీష్ అనే యువకుడు తన గ్లామర్ బైక్ను అడ్డుగా పెట్టి రామకృష్ణపై పిడిగుద్దులతో దాడి చేశాడు. మిగిలిన వారు కూడా రామకృష్ణను గాయపర్చి రూ.1.80 లక్షల నగదు ఉన్న బ్యాగ్, సెల్ఫోన్, కొన్ని డాక్యుమెంట్లను దోచుకుపోయారు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న ప్రయాణికులు రామకృష్ణ బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు చాగల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీ చేసిన ముఠా తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో నగదును పంచుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సెల్ఫోన్లోని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను పట్టుకున్నారు. చాగల్లు మండలం దారవరం వద్ద మోటార్సైకిళ్లు తనిఖీలు చేస్తుండగా నిందితులు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన కడలి హరీష్, గుర్రం కృష్ణను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. వీరిద్దరి నుంచి రూ.29,500, రెండు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన పట్టణ ఎస్సై డి.భగవాన్ప్రసాద్, చాగల్లు ఏఎస్సై ధనరాజ్, హెచ్సీ షరీఫ్, కానిస్టేబుల్స్ అనిల్, బాలరాజు, నాగేశ్వరరావు, నారాయణ, నాయుడును అభినందించారు. -
దారికాసి దోచేశారు
నిడదవోలు : పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సెల్ఫోన్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో మంగళవారం సీఐ ఎం.బాలకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన చెరకు రామకృష్ణ దేవరపల్లి సబ్ పోస్ట్మాస్టర్గా పనిచేస్తున్నారు. రోజూ నిడదవోలు నుంచి మోటార్సైకిల్పై చాగల్లు, పల్లంట్ల మీదుగా దేవరపల్లి వెళుతుంటారు. రామకృష్ణ సింగవరంలో ఇల్లు నిర్మించుకుంటుండగా బంధువులు ఇచ్చిన రూ.1.80 లక్షలు తీసుకుని ఈనెల 2న దేవరపల్లి పోస్టాఫీసు నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో దోపిడీ ముఠాలోని ఐదుగురు సభ్యులు అంతకుముందు రెండు రోజులుగా రెక్కీ నిర్వహించారు. రామకృష్ణ కదలికలను గమనిస్తూ దోపిడీకి పథకం రచిం చారు. రామకృష్ణ పోస్టాఫీస్ వద్ద బయలుదేరుతుండగా ఇద్దరు సభ్యులు అక్కడే ఉండగా మరో ముగ్గురు చాగల్లు మండలం కలవలపల్లి, చిక్కాలపాలెం గ్రామాల మధ్యలో మామిడి తోటల వద్ద మాటు వేశారు. రాత్రి 7.30 గంటలకు రామకృష్ణ నగదు బ్యాగుతో మామిడి తోటలు సమీపంలోకి వచ్చేసరికి ఐదుగురు ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. ముఠాలోని కడలి హరీష్ అనే యువకుడు తన గ్లామర్ బైక్ను అడ్డుగా పెట్టి రామకృష్ణపై పిడిగుద్దులతో దాడి చేశాడు. మిగిలిన వారు కూడా రామకృష్ణను గాయపర్చి రూ.1.80 లక్షల నగదు ఉన్న బ్యాగ్, సెల్ఫోన్, కొన్ని డాక్యుమెంట్లను దోచుకుపోయారు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న ప్రయాణికులు రామకృష్ణ బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు చాగల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీ చేసిన ముఠా తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో నగదును పంచుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సెల్ఫోన్లోని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను పట్టుకున్నారు. చాగల్లు మండలం దారవరం వద్ద మోటార్సైకిళ్లు తనిఖీలు చేస్తుండగా నిందితులు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన కడలి హరీష్, గుర్రం కృష్ణను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. వీరిద్దరి నుంచి రూ.29,500, రెండు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన పట్టణ ఎస్సై డి.భగవాన్ప్రసాద్, చాగల్లు ఏఎస్సై ధనరాజ్, హెచ్సీ షరీఫ్, కానిస్టేబుల్స్ అనిల్, బాలరాజు, నాగేశ్వరరావు, నారాయణ, నాయుడును అభినందించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement