-
నోరూరించే సీతాఫలాలు.. ఫుల్ డిమాండ్! 100 కాయల రేటు రూ.2500
చాగల్లు (తూర్పు గోదావరి): మండలంలోని ఊనగట్ల, అమ్ముగుంట, చిక్కాల, చిక్కాలపాలెం గ్రామాలు సీతా ఫలాలకు ప్రసిద్ధి. మెట్ట ప్రాంత గ్రామాల్లోని గరువు భూముల్లో రైతులు ఈ తోటలను విస్తారంగా పెంచుతారు. ఏటా అక్టోబర్లో కాపునకు కొచ్చే సీతాఫలాలను మండలంలోని అమ్ముగుంట, చిక్కాల కేంద్రాలుగా జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. రూ.కోట్లలో వ్యాపారం మండలంలో పండే సీతాఫలాలు రుచిగా ఉంటాయి. అందుకే డిమాండ్ కూడా ఎక్కువ. వీటిని కొనుగోలు చేయడానికి భీమవరం, తణుకు, విజయవాడ, ఏలూరు సహా పరిసర పట్టణ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ సీజన్లో రోజూ ఊనగట్ల, చిక్కాల వస్తారు. రైతులు తమ పొలాల్లో కాసిన సీతాఫలాలను మార్కెట్లకు తీసుకొచ్చి వారికి విక్రయిస్తారు.పెద్ద వ్యాపారులు రోజు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లావాదేవీలు జరుపుతారు. ఇక చిల్లర వ్యాపారులు కూడా ఈ రెండు చోట్లా సీతాఫలాలను కొనుగోలు చేసి కొవ్వూరు, నిడదవోలు పరిసర గ్రామాల్లో విక్రయిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తారు. ఊనగట్ల శివారు అమ్మిగుంట సెంటర్లో సీతాఫలాల ఎగుమతి వర్షాల వల్ల ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి ఆశాజనకంగానే ఉంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కాయలన్నీ దాదాపు ఒకేసారి పక్వానికి రావడంతో వాటిని ఒబ్బిడి చేసుకోలేక రైతులు ఇబ్బందులు పడ్డారు. కొంత మేర కాయలు వర్షానికి దెబ్బతిన్నాయని పలువురు రైతులు తెలిపారు. అయితే ఏటా ఈ పరిస్థితి ఉండదని చెబుతున్నారు. వంద సీతాఫలాలను రైతుల వద్ద నుంచి రూ.2,000 నుంచి రూ.2,500 రేటుకు కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రిటైల్గా రూ.3,000 నుంచి రూ.4,000 రేటుకు అవకాశాన్ని బట్టి, కాయల సైజును బట్టి విక్రయిస్తున్నారు. రెండు వేల ఎకరాల్లో తోటలు ఈ ఏడాది సీతాఫలాల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాగల్లు మండలంలోని సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో సీతాఫలాల తోటలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. రైతులు తమ పొలాల్లో పండిన కాయలను కోసి సైకిళ్లు, మోటారు సైకిళ్లపై తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారస్తులు తాము కొనుగోలు చేసిన కాయలను మినీ వ్యాన్లపై పట్టణాలకు తరలించి అక్కడ అమ్ముకుంటారు. అవగాహన కల్పించాలి సీతాఫలాల తోటల పెంపకంపై ఉద్యాన శాఖాధికారులు రైతులకు ఆవగాహన కల్పించాలి. ఈ ఏడాది సీతాఫలాలు కాపు బాగానే ఉంది. వాతవరణ పరిస్థితులు వలన కాయలు అధిక స్థాయిలో ఒకేసారి పక్వానికి రావడంతో రైతులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. – మిక్కిలి నాగేశ్వరరావు, రైతు, చిక్కాల అధిక ధరలకు విక్రయాలు ఈ సారి సీతాఫలాలు దిగుబడి తగ్గడంతో మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇక్కడి కాయలు వివిధ పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. రైతులకు అంతగా లాభాలు రాకపోయినా వ్యాపారులకు ప్రయోజనకరంగానే ఉంది. – సంసాని రమేష్, చిక్కాల -
మధురఫలం అందేనా?
ప్రస్తుత సీజన్లో గ్రామీణులకు ఉపాధి కల్పించే సీతాఫలాల సేకరణ ఈసారి గణనీయంగా తగ్గింది.. ఈ ఏడాది ఆలస్యంగా వర్షాలు కురవడంతో క్రమంగా సీతాఫలాలు కనుమరుగవుతున్నాయి.. దీనికితోడు అడవులను యథేచ్ఛగా కొందరు వ్యక్తులు నరికివేయడంతో ఈ చెట్లు తగ్గుముఖం పట్టాయంటున్నారు.. ఇప్పటికైనా ప్రభుత్వం సీతాఫలంతోపాటు ఇతర పండ్ల మొక్కలను విరివిగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.. * అడవుల నరికవేతతో తగ్గిన సీతాఫలాలు * మొక్కలు నాటాలంటున్న గిరిజనులు మర్పల్లి / షాబాద్ :పేదోని యాపిల్ పండుగా పిలిచే సీతాఫలాల విక్రయాలతో పలు గ్రామాల గిరిజన మహిళలు ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తారు. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులతో చెట్లు ఎక్కువగా పెరగక సీతాఫలాల దిగుబడి తగ్గిందని వారు వాపోతున్నారు. మర్పల్లి మండలంలో మర్పల్లితండా, శాపూర్తండా, గుర్రంగట్టుతండా, పట్లూర్తండా, జాజుగుబ్భడితండా, దామస్తాపూర్ తండాలకు చెందిన గిరిజనులు సాధారణంగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు సీతాఫలాలను పొలాలవద్ధ, అటవీప్రాంతంలో బీడు ప్రదేశాల్లో ఉన్న చెట్లనుంచి కాయలు తెంపుకొచ్చి తమ ఇళ్లలో కొర్రకంకి, వరిగడ్డి లేదా ఇతర గడ్డి సేకరించి రెండు, మూడు రోజులుగా నిల్వ ఉంచి పండ్లు తయారుచేస్తారు.అనంతరం జహీరాబాద్, వికారాబాద్ పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి ఒక్కో పండును రూ.ఐదు నుంచి రూ.పది వరకు అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటారు. ఇక షాబాద్ మండలంలోని మాచన్పల్లి, కుమ్మరిగూడ, నాగరకుంట, నరెడ్లగూడ, కేశారం, కక్కులూర్, సీతారాంపూర్, ముద్దెంగూడ, మాచన్పల్లి, నాగరకుంట, దామర్లపల్లి, హైతాబాద్, మన్మర్రి, అంతారం ప్రజలు సీతాఫలాలను సేకరించి షాద్నగర్, షాబాద్, చేవెళ్ల, శంషాబాద్ తదితర మార్కెట్లలో సీతాఫలాలను విక్రయిస్తారు. అయితే సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా సీతాఫలాల సేకరణ ఆశించిన స్థాయిలో లేదు. కాగా, ఒకప్పుడు కల్ఖోడ, శాపూర్తండా, దామస్తాపూర్, బూచన్పల్లిలో దట్టమైన అడవులు ఉండేవి. అయితే కొందరు కలప స్మగ్లర్లు క్రమేపీ అడవులను నరికివేస్తుండటంతో సీతాఫల చెట్లు తగ్గుముఖం పట్టాయని గిరిజనులంటున్నారు. తమకు జీవనాధారమైన సారా విక్రయాలను మానేసి కనీసం సీజన్లలో అడవి ఫలాలను విక్రయిస్తూ జీవనం వెళ్లదీస్తున్న తమను మాత్రం ప్రభుత్వం గుర్తించటంలేదని ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సీతాఫల చెట్లతోపాటు, ఇతర పండ్ల చెట్లు నాటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి మార్గాలు చూపాలి గిరిజన కుటుంబాలను అభివృద్ధి పర్చేందుకు ప్రభుత్వం ఉపాధి మార్గాలు చూపాలి. చదువుకున్న తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. స్వయం ఉపాధికోసం వడ్డీలేని ఎస్టీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో, అడవుల్లో ప్రత్యేకంగా పండ్ల మొక్కలను నాటించాలి. అడవిలో దొరికే ఫలాలకు పూర్తి హక్కు మాకే ఉండాలి. - సీతిబాయి, గుర్రగట్టుతండా, మర్పల్లి మండలం భూపంపిణీ చేయాలి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం భూ పంపిణీ చేయాలి. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన సబ్ప్లాన్ పక్కాగా అమలు చేయాలి. సబ్ప్లాన్ ద్వారా మంజూరైన నిధులను ఇతర పనులకు మళ్లించవద్దు. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరగా నెరవేర్చాలి. - చందిబాయి, శాపూర్తండా, మర్పల్లి మండలం
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
Advertisement