-
ఆస్పత్రులకు బదులు కబేళాలు ఇచ్చారు!
ఉత్తరప్రదేశ్లోని గత సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇంతకు ముందున్న ప్రభుత్వం ప్రజలకు ఆస్పత్రులు కట్టించి వైద్యులను ఇవ్వాల్సి ఉంటే, ఆ పని మానేసి కబేళాలు కట్టించిందని విమర్శించారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యనివర్సిటీ (కేజేఎంయూ)లో కొత్త వెంటిలేటర్ను ప్రారంభిస్తున్న సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో త్వరలోనే ఆరు కొత్త ఎయిమ్స్ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. వైద్యులు మరింత సహనంతో ఉండాలని, ప్రైవేటు క్లినిక్లు నడపకూడదని సూచించారు. గత ప్రభుత్వం మంచి వైద్యులు అందరినీ సైఫై, కనౌజ్లకు బదిలీ చేసిందని, గోరఖ్పూర్లో మాత్రం మంచి వైద్యులకు బదులు కబేళాలు ఇచ్చిందని అన్నారు. అవసరం ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా మంచి వైద్యసేవలు అందించాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. యూపీలో కనీసం 5 లక్షల మంది వైద్యులు అవసరమని, ఈ మధ్య కొందరు వైద్యులు తప్పులు చేస్తున్నట్లు వినిపిస్తోందని అన్నారు. జూనియర్ డాక్టర్లతో పేషెంట్ల మీద దాడులు చేయిస్తున్నారని, అలా కాకుండా వైద్యులు గౌరవప్రదంగా మెలగాలని సీఎం యోగి సూచించారు. వైద్యులు స్వయంగా పల్లెలకు వెళ్లి అక్కడి ప్రజలకు వైద్యసేవలు అందించాలని తెలిపారు. కానీ వాళ్లు పల్లెలకు వెళ్లకుండా పట్టణాలు, నగరాల్లో ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారన్నారు. అవినీతి, అనవసర ఖర్చుల వల్లే పేదలకు చాలా కష్టాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. గోరఖ్పూర్లో తాను ఒక చిన్న క్లినిక్ తెరిచానని, మామూలుగా ఆస్పత్రులలో సీటీ స్కాన్కు రూ. 1800-4000 వరకు తీసుకుంటుంటే తాము కేవలం రూ. 400-600కే చేస్తున్నామని తెలిపారు. -
మటన్, చికెన్ బంద్
లక్నో: ఉత్తరప్రదేశ్లో అక్రమ కబేళాలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడానికి వ్యతిరేకంగా లక్నోలో మాంసం వ్యాపారులు తమ దుకాణాలు మూసేసి శనివారం నుంచి నిరవధిక ఆందోళనకు దిగారు. సోమవారం నుంచి తమ పోరును తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. దీంతో బీఫ్ కొరత వల్ల మటన్, చికెన్ వంటకాలకు మారిన టండే, రహీం లాంటి నగరంలోని సుప్రసిద్ధ దుకాణాలు కూడా మూతపడ్డాయి. లక్షలాది మంది జీవనోపాధిని దెబ్బకొడుతున్న ప్రభుత్వ చర్య పట్ల మాంసం అమ్మకం దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో చేపల వ్యాపారులు చేరతారని ఆశిస్తున్నారు. అక్రమ కబేళాలు మూసివేయాలని అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆదేశాలు జారీచేశారు. దీంతో పలు కబేళాలను అధికారులు మూసివేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నడిచే వాటిని మాత్రమే, పారదర్శంగా వ్యాపారం చేసుకునేవారికి ఎటువంటి ఇబ్బంది ఉందని రాష్ట్ర బీజేపీ నాయకుడు మజహర్ అబ్బాస్ తెలిపారు. మాంసం వ్యాపారులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. -
పాలకేంద్రాల కన్నా కబేళాలే ఎక్కువ!
న్యూఢిల్లీ : భారతదేశంలో పాల ఉత్పత్తి కేంద్రాల కన్నా కబేళాల సంఖ్యే ఎక్కువగా ఉండటం విస్మయపరుస్తోంది. ఢిల్లీకి చెందిన రమేష్ వర్మ అనే వ్యక్తి 'దేశంలో ఉన్న పాలకేంద్రాలు, కబేళాల వివరాలు తెలుపండంటూ' సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ వివరాలను వెల్లడించింది. పశు సంవర్థక శాఖ లెక్కల ప్రకారం.. మన దేశంలో 1623 కబేళాలు ఉండగా, కేవలం 213 మిల్క్ ప్రాసిసెంగ్ ఫ్యాక్టరీలు, 793 లిక్విడ్ మిల్క్ ప్లాంట్లు ఉన్నాయి. ఇక అనుమతిలేని కబేళాల సంఖ్య చెప్పక్కర్లేదు. 'గోవధ'కు సంబంధించి గత ఏడాది దేశవ్యాప్తంగా దుమారం రేగిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర, తమిళనాడు, హర్యానా తదితర రాష్ట్రాల్లో గోవధ పట్ల తీవ్ర వ్యతిరేకత వెల్లడైంది. అనుమతిలేని కబేళాలను మూయించేశారు. బిహార్ ఎన్నికలలో కూడా ప్రభుత్వం హిందూత్వ సెంటిమెంట్ను బాగా వాడుకుంది. ఓ దశలో బీఫ్ తినేందుకు జనాలు భయపడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతానికి దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల విక్రయాలు, గోవధకు సంబంధించి పరిమిత ఆంక్షలు ఉన్నాయి. దేశంలో ఇంత దుమారం రాజుకున్న తరువాత కూడా అనుమతి లేకుండా విచ్చలవిడిగా మాంసం ఉత్పత్తి జరుగుతుండటం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ అనుమతి లేకుండా నడుస్తున్న కబేళాల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. 'ఏదేమైనా మన ప్రభుత్వం పాల ఉత్పత్తి కేంద్రాల అనుమతి కంటే కబేళాలకు అనుమతి ఇవ్వడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందంటూ' రమేష్ వర్మ వ్యాఖ్యానించారు. 'అనారోగ్యాలను తెచ్చిపెట్టే మాంసం విచ్చలవిడిగా అమ్ముడవుతోందని, పౌష్టికాహారమైన పాల ఉత్పత్తిని పెంచడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అవినాష్ శ్రీవాస్తవ అనే వెటర్నరీ నిపుణుడు ఆవేదన వ్యక్తం చేశారు. పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కోడి మొదలుకుని మేక, గొర్రె, ఆవు తదితర జంతువుల మాంసం ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. దేశంలో అత్యధికంగా కబేళాలు ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర(316) ప్రథమ స్థానంలో ఉండగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తర ప్రదేశ్(285), తమిళనాడు (130)లు ఉన్నాయి. కాగా కేరళ, పశ్చిమ బెంగాల్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో ఆవులను చట్టబద్ధంగా వధించవచ్చు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement