-
టెన్త్ సోషల్ నుంచి 5 చాప్టర్ల తొలగింపు
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదవ తరగతి సాంఘిక శాస్త్రం (సోషల్ సైన్స్) సబ్జెక్ట్ నుంచి ఐదు అధ్యాయాలను తీసేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయించింది. ప్రజాస్వామ్య సవాళ్లు (చాలెంజెస్ టు డెమోక్రసీ), రాజకీయ పోరాటాలు, ఉద్యమాలు (పొలిటికల్ స్ట్రగుల్స్ అండ్ మూవ్మెంట్స్), ప్రజాస్వామ్యం, భిన్నత్వం (డెమోక్రసీ అండ్ డైవర్సిటీ), అడవులు, వన్యప్రాణులు (ఫారెస్ట్ అండ్ వైల్డ్లైఫ్), నీటి వనరులు (వాటర్ రిసోర్సెస్) అనే ఐదు అధ్యాయాలను సాంఘిక శాస్త్రం నుంచి సీబీఎస్ఈ తొలగించనుంది. 2021లో పీసా (ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్)లో పాల్గొనాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించిందనీ, అందుకు తగ్గట్లుగా విద్యార్థుల మూల్యాంకన పద్ధతుల మార్చాల్సి ఉందని గత నెలలోనే పాఠశాలలకు సీబీఎస్ఈ తెలిపింది. -
ఆ పుస్తకాలు నిషేధించిన పాక్
ఇస్లామాబాద్: పాక్ ప్రభుత్వం పంజాబ్ పరిసర ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాల్లో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ పుస్తకాల్లో ముద్రించిన పాక్ మ్యాప్లో కశ్మీర్ భూభాగం భారత్లో అంతర్భాగమని చూపిస్తుండటంతో వాటిపై నిషేధానికి ఆదేశాలు జారీ చేసింది. 2, 4, 5, 7, 8 తరగతులు విద్యార్థులకు సంబంధించిన సోషల్ స్టడీస్ పుస్తకాల్లో వివాదాస్పద, అభ్యంతరకరమైన విషయాలు, ముఖ్యంగా పాక్ మ్యాప్ల్లో కశ్మీర్ భారత్లో ఉన్నట్లు గుర్తించినట్లు పంజాబ్ కరికులమ్, టెక్స్ట్బుక్ బోర్డు(పీసీటీబీ) ఒక ప్రకటనలో పేర్కొంది. పంజాబ్ ప్రావిన్స్లో తక్షణమే ఆ పుస్తకాలను నిషేధించాలని పీసీటీబీ మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ ఖయ్యూమ్ ఆయా పాఠశాలలకు సర్క్యూలర్ జారీ చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు ఈ ఘోర తప్పిదం చేసిన పబ్లిషర్స్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ సంస్థ పీసీటీబీ పేర్కొంది. -
మార్చి 28న టెన్త్ సోషల్–1 పరీక్ష!
హైదరాబాద్: వచ్చే ఏడాది నిర్వహించే పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా మార్చి 28వ తేదీన సోషల్ స్టడీస్ పేపరు–1 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయానికి వచ్చింది. మార్చి 29వ తేదీన ఆ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకు షెడ్యూలును జారీ చేసినా ఆ రోజు ఉగాది పండుగ ఉండటంతో ముందుగానే (28వ తేదీన) పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూలుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించింది. నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది. -
ఊరు ఉంది
జ్ఞాపకం మూడుంపావు అవుతోంది. లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారు గారి సోషల్ క్లాస్. బుర్రలో రకరకాల ఆలోచనలు. ఎలా కాళీని చూడాలి. కాళి తప్ప మనసుకు ఏమీ పట్టడం లేదు. ఆ... ఐడియా వచ్చింది. సార్.. అని పిలుస్తూ నెమ్మదిగా అంజయ్య మాస్టారి దగ్గరకు వెళ్లాను. స్టాఫ్ రూమ్లో ఉన్నారు. కొంచెం మంచి అభిప్రాయమే ఉంది కదా మనమంటే, ‘ఏంటమ్మా’ అన్నారు ప్రసన్నంగా. ‘తలనొప్పిగా ఉంది సార్. మీరు పర్మిషన్ ఇస్తే లాస్ట్ పావు గంట ఇంటికి వెళ్తాను’ అన్నాను. అరగంట ఆయన క్లాస్ వింటాననే సరికి వాత్సల్యం అంతా కళ్లల్లో ప్రకటిస్తూ సరేనమ్మ వెళ్లు అన్నారు. అనందభాష్పాలు రాలడం ఒక్కటే తక్కువ. హమ్మయ్య ఇవాళ కాళిని చూడొచ్చు అనుకోగానే ఎక్కడలేని హుషారు వచ్చింది. ఉత్సాహంగా క్లాస్కి అటెండ్ అయ్యి, సోషల్ స్టడీస్లో కూడా డౌట్స్ అడిగి వెళ్లాల్సిన టైమ్ దగ్గర పడగానే నీరసంగా ముఖం పెట్టి కూర్చున్నాను. నా ముఖం చూసే సరికి సర్కి గుర్తొచ్చింది. ‘ఇంక వెళ్లమ్మా’ అన్నారు. ఓపిక లేనట్లు లేచి బుక్స్ తీసుకుని బయల్దేరాను. ఏమనుకున్నారో.. నేనూ వస్తానమ్మ. పదా.. నాన్నగారిని కలిసి చాలా రోజులు అయ్యింది అన్నారు. నా గుండె ఢాం అంది. బిత్తర చూపులు చూశాను. కారణం తెలిసిన నెప్పల్లి పద్మ నా ముఖం చూసి కిసుక్కున నవ్వింది. మిగతా పిల్లలు అర్థం కాక అయోమయంగా, అసూయగా చూస్తున్నారు. గొంతులోంచి మాట రావట్లేదు. ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కదా! కాళి ఈ ఊళ్లో ఉన్నన్నాళ్లూ ఈ అబద్ధాలు తప్పవు. ఇంతలో వచ్చాడు ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, ఆర్తత్రాయ పరాయణుడు. మా స్కూల్ అటెండర్ నోటీసు పట్టుకుని. ఇదే ఛాన్స్ అనుకుని ఛలో... స్కూల్ బయటి వరకు నెమ్మదిగా నడుచుకుని వచ్చాను. పరుగు. ఇంక ఒకటే పరుగు. తెలిసినవాళ్లు ‘డాక్టరు గారి అమ్మాయి ఏంటి ఇలా పరుగెడుతోంది’ అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్లకేం తెలుసు. ఇంకా నాలుగు రోజుల్ల్లో కాళి వెళ్లిపోతాడని. ఆయాసపడుతూ వచ్చాను గేట్ దగ్గరికి. నన్ను చూడగానే ఏసు గేట్ తెరిచాడు. లాస్ట్ చెయిర్ ఖాళీగా ఉంటే కూర్చున్నాను. హమ్మయ్య ఇంకా కొంచెం టైమ్ ఉంది. జయసుధ, జయప్రదల క్లైమాక్స్ డాన్స్ పాట ఇంకా మొదలవలేదు. ఎన్.టి.రామారావు కాళీని పిలవడానికి టైమ్ ఉంది. ఇదంతా.. అడవిరాముడు సినిమాలో కాళి... కాళి... కాళీ అనే పాట గురించి. ఏనుగుల గుంపు వచ్చి ఎన్.టి.ఆర్.కి హెల్ప్ చేసే పాట. ఇంతలో పాట స్టార్ట్ అయింది. అదిగో అనుకున్న టైమ్ వచ్చింది. పిలిచేశాడు ఎన్.టి.ఆర్. కాళీ అని. మైమరచి పోయి చూస్తున్నాను. ఒళ్లు గగుర్పొడిచే సీన్. ఏనుగుల హెల్ప్తో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. కాళిని కరువు తీరా చూసి ఏనుగునెక్కిన ఆనందంతో ఇంటికి వచ్చాను. ఆ పాట కోసం ఇరవై నాలుగుసార్లు సినిమా మొత్తం చూశాను. లాస్ట్ లాస్ట్లో కేవలం పాట కోసం వెళ్లేదాన్ని. కాకపోతే లాస్ట్ పిరియడ్ అంజయ్య మాస్టారితో ఇబ్బంది. మంచి మాస్టారు. మల్లెపువ్వులాంటి పంచాలాల్చీలో బక్క పలుచని రూపం. నోరు విప్పితే ‘సంస్కృతం’. ఎక్కువగా అబ్బాయిలతోనే ఆ భాషలో మాట్లాడి వాళ్లని ఎడ్యుకేట్ చేసేవాళ్లు. ఇంకా నాలుగు రోజుల్లో కొత్త సినిమా వేస్తారు, అడవిరాముడు తీసేస్తారు అనగానే మధ్యాహ్నం భోజనానికి వచ్చి ఇంక స్కూల్కి వెళ్లేదాన్ని కాదు. నాతో పాటు నా ఫ్రెండ్స్ నగరాజకుమారి, నెప్పల్లి పద్మ. ఏడుకొండలవాడ... వెంకటరమణ అనే పాట వినపడగానే వెళ్లి పోయేవాళ్లం. డాక్టర్ గారి అమ్మాయిని కదండీ, టికెట్స్ ఏమీ తీసుకోనక్కర్లా. అందులోనూ మ్యాట్నీ షో. పైగా గేట్దగ్గర మన ఆత్మబంధువు ఏసు ఉంటాడు. చూడగానే నవ్వుతూ లోపలికి పంపేవాడు. ఇంటర్వెల్లో సోడా తెచ్చేవాడు. ఎప్పుడైనా ఫస్ట్ షోకి వెళ్లి నిద్రపోతే లేపి జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చేవాడు. కాళిని కరువు తీరా చూసి ఏనుగు ఎక్కినంత ఆనందంగా ఇంటికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎన్.టి.ఆర్. లేడు. అంజయ్యగారు లేరు. ఏసు లేడు. కాళిని పిలిస్తే ఏనుగొచ్చి హెల్ప్ చెయ్యడం అనే కాన్పెప్టుని ఎంజాయ్ చేసే అమాయకపు జనాలూ లేరు. కానీ ఊరు ఉంది. ఊరిని తలుచుకోగానే నిండే మనసు, వచ్చే ఆనందము ఉంది. - కవిత -
మెరుగైన స్కోర్కు మార్గం చూపే.. సాంఘిక శాస్త్రం
పోలీస్ ఉద్యోగాల రాత పరీక్షలో ఎక్కువస్కోరింగ్కు అవకాశం కల్పించే విభాగం.. సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్). ఎందుకంటే చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం,అర్థ శాస్త్రం ఇలా నాలుగు భాగాలుగా ఉండే సాంఘిక శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలువచ్చే అవకాశం ఉంది. వీటిని ప్రిపేర్ కావడం కూడా సులభమే. తద్వారా ఈ అంశాల్లో 100 శాతం స్కోర్ సాధించవచ్చు.ఈ నేపథ్యంలో సాంఘిక శాస్త్రం ప్రిపరేషన్కు సంబంధించి ఎటువంటి వ్యూహాలుఅనుసరించాలి, ముఖ్యమైన అంశాలు, ప్రశ్నల సరళి తదితరాలపై విశ్లేషణ.. భారతదేశ చరిత్ర: భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా చదవాలి. అవి.. ప్రాచీన చరిత్ర, మధ్యయుగ చరిత్ర, ఆధునిక చరిత్ర. ఈ మూడు యుగాల్లోని భారతదేశ సంస్కృతిని ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా పరిపాలించిన రాజులు-వంశాలు, ఆనాటి రాజకీయ-సాంఘిక పరిస్థితులు, మత, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై దృష్టిసారించాలి.ప్రాచీన చరిత్ర: ప్రాచీన శిలాయుగం, మధ్య శిలా యుగం, కొత్త రాతి యుగ అంశాలను చదవాలి. ఈ క్రమంలో సింధు నాగరికత, ఆర్య నాగరికతలకు సంబంధించిన విషయాలను క్షుణ్నంగా ప్రిపేర్ కావాలి. క్రీ.పూ. 6వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చిన నూతన మతాలు.. జైనం, బౌద్ధంతోపాటు మహావీరుడు, గౌతమ బౌద్ధుడు-వారి ప్రవచనాలు, సామాజిక మార్పులకు అవి ఏవిధంగా కారణమయ్యాయో విశ్లేషించుకుంటూ చదవాలి. మగధ, మౌర్య సామ్రాజ్యాలు, పారశీక, గ్రీకు దండయాత్రలు, సంగం యుగం నాటి సాహిత్యం, శాతవాహన రాజ్యాల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆనాటి రాజులు, సాహిత్యం, రచయితలు, బిరుదులను వివరంగా అధ్యయనం చేయాలి.మధ్యయుగ చరిత్ర: సింధు రాజ్యంపై అరబ్బుల దండయాత్ర, ఢిల్లీ సుల్తానులు, మొగల్ పాలన సంబంధిత అంశాలను బాగా చదవాలి. ముఖ్యంగా ఆనాటి సాహిత్యం, శిల్ప కళ, వాస్తు అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఇదేకాలంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రకూటులు, కాకతీయులు, హోయసలులు, పాండ్యులు తదితర రాజ్యాల కాలంనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్నంగా చదవాలి. అంతేకాకుండా భక్తి ఉద్యమం, సూఫీ మతం గురించి కూడా తెలుసుకోవాలి. ఆధునిక భారత చరిత్ర: క్రీ.శ.1498లో వాస్కోడిగామా కాలికట్ (కేరళ)లో అడుగుపెట్టిన తర్వాత భారతదేశంలోకి యూరోపియన్ల రాక మొదలైంది. నాటి నుంచి 1947 వరకు నెలకొన్న పరిస్థితులను చదవాలి. ఈ క్రమంలో బ్రిటిష్ పాలన, సిపాయిల తిరుగుబాటు, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో-మహారాష్ట్ర యుద్ధాలు, సాంఘిక సంస్కరణోద్యమం సంబంధిత అంశాలపై దృష్టి సారించాలి. భూగోళ శాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలు.. సౌర కుటుంబం, గ్రహాలు, భూమి, భూ చలనాలు, అక్షాంశాలు-రేఖాంశాలు, గ్రహణాలు, భూస్వరూపాలు, శీతోష్ణస్థితి, పర్వతాలు, భూకంపాలు, సముద్రాలు గురించి తెలుసుకోవాలి. ఈ విభాగంలో భారతదేశ ప్రాంతీయ భౌగోళిక వ్యవస్థ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. ఈ క్రమంలో భారతదేశ ఉనికి, భౌతిక రూపురేఖలు, శీతోష్ణస్థితి, అడవులు, మృత్తికలు, నదులు, వ్యవసాయం, పంటలు, నీటిపారుదల వ్యవస్థ, ప్రాజెక్ట్లు, రవాణా సమాచార సాధనాలు, జనాభా, ఓడరేవులు, పరిశ్రమలు, ఖనిజాలు, దర్శనీయ ప్రదేశాలు వంటి అంశాలను విస్తృతంగా చదవాలి. ఈ అంశాలను అట్లాస్తో సమన్వయం చేసుకుంటూ చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. పాలిటీ: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకికతత్వం, మానవ హక్కులు, సమాచార హక్కుచట్టం, భారత రాజ్యాంగంలోని ముఖ్య ఘట్టాలను బాగా చదవాలి. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లోని శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి మధ్య సంబంధాన్ని విశ్లేషణాత్మకంగా చదవాలి. వీటిని సమకాలీన అంశాలతో సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. అదేవిధంగా స్థానిక పరిపాలన వ్యవస్థ, పంచాయతీరాజ్, మున్సిపల్ వ్యవస్థ వాటి పనితీరు గురించి అధ్యయనం చేయాలి. అర్థశాస్త్రం: ముందుగా ప్రాథమిక భావనలను అవగాహన చేసుకుంటే మిగిలిన అంశాలను చదవడం సులభంగా ఉంటుంది. ఈ క్రమంలో జాతీయాదాయం, తలసరి ఆదాయం, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, జీవన ప్రమాణాలు వంటి అంశాల గురించి తెలుసుకోవాలి. అంతేకాకుండా ఉత్పత్తి, మారకం, పంపిణీ సమస్యలు, బడ్జెట్, ద్రవ్యం, బ్యాంకింగ్ వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు-లక్ష్యాలు, వాటి కాలాలు, ఫలితాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ఏం చదవాలి? ఈ అంశాలకు సంబంధించి 6 నుంచి 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకాలను చదవాలి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉండి ఇంటర్మీడియెట్లో పునరావృతమయ్యే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఆయా అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గత ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ బిట్స్ను ఎక్కువగా సాధన చేయాలి. తద్వారా ఏయే అంశాల నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారనే విషయంపై అవగాహన ఏర్పడుతుంది. గతంలో వచ్చిన కొన్ని ప్రశ్నలు రుగ్వేదంలో అత్యంత సాధారణమైన నేరంగా పేర్కొంది-పశువులను దొంగిలించడం పల్లవులు ఎక్కడి నుంచి పరిపాలించారు-కాంచీపురం విష్ణుకుండినుల రాజధాని-దెందులూరు వాస్కోడిగామా ఏ దేశస్థుడు-పోర్చుగల్ జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉంది- అమృత్సర్ శ్రీకృష్ణదేవరాయలు ఎవరితో స్నేహసంబంధాలు కొనసాగించాడు-పోర్చుగీసు వారితో నెప్ట్యూన్ వాతావరణం ఏ గ్రహ వాతావరణానికి సమానంగా ఉంటుంది - యురేనస్
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
IPL 2024: సీఎస్కేను చిత్తు చేసిన పంజాబ్.. ఘనమైన రికార్డు
గోల్డ్ స్పాట్ కుటుంబం.. గోల్మాల్ ‘గీతం’
మళ్లీ జగన్ రావాలి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
Advertisement