-
అందుకే హనీమూన్ రద్దు చేసుకున్నారు!
సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది ఓ మధుర జ్ఞాపకం. రెండు మనసులను ఒక్కటి చేసే వేడుక. ఇరు కుటుంబాల కలయిక. భార్యాభర్తలు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగితేనే ఆ బంధానికి విలువ ఉంటుంది. కర్ణాటకకు చెందిన నవ దంపతులు అనుదీప్ హెగ్డే, మినుషా కాంచన్ ఆ కోవకు చెందినవారే. పెళ్లి తర్వాత కచ్చితంగా హనీమూన్ వెళ్లాల్సిందేనని ఆమె పట్టుబట్టలేదు. భార్య కోరలేదు కదా అని అతడు అడగకుండా ఉండనూ లేదు. వీలు కుదుర్చుకుని ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఏకాంతంగా సమయం గడపాలనుకున్నారు. అయితే అంతకంటే ముందు తమకు అత్యంత సమీపంలో ఉన్న సోమేశ్వర్ బీచ్ను సందర్శించారు. అక్కడికి వెళ్లిన తర్వాత హనీమూన్కు వెళ్లాలన్న ఆలోచనను పక్కకు పెట్టేశారు. సరదాగా గడపడం కంటే ప్రకృతిని కాపాడుకోవడమే వారికి ప్రథమ ప్రాధాన్యంగా తోచింది. వెంటనే రంగంలోకి దిగారు. తమతో పాటు నలుగురి మద్దతు కూడగట్టుకుని బీచ్ ప్రాంగణంలో పోగైన చెత్తను ఏరిపారేసే బృహత్కార్యం తలకెత్తుకున్నారు. 10 రోజుల పాటు శ్రమించి సుమారు 800 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు, పనికిరాని వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను అనుదీప్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ‘మీరిలాగే కలకాలం వర్ధిల్లాలి’ అంటూ నెటిజన్లు కొత్తజంటపై అభినందనల అక్షింతలు జల్లుతున్నారు.(చదవండి: తల్లిదండ్రులైన ఆకాశ్ దంపతులు ) పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్ ‘‘ మా ఇద్దరి కల ఇది. పోస్ట్ వెడ్డింగ్ చాలెంజ్, పది రోజుల అవిశ్రాంత శ్రమ తర్వాత బైందూరులోని సోమేశ్వర్ బీచ్లోని చెత్తాచెదారాన్ని తొలగించాం. ఇప్పుడు ఇదొక మహోద్యమంగా మారింది. అంతా కలిసి 8 క్వింటాళ్లకు పైగానే చెత్తను ఏరివేశాం. మాకొక మంచి అనుభవం ఇది. మానవత్వం ఇంకా బతికే ఉందనే నా నమ్మకాన్ని నిజం చేసింది. మేమంతా మిమ్మల్ని కోరుతున్నది ఒక్కటే. ఇలాంటి కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించండి. కలిసి పనిచేస్తే ఇంకెంతో మార్పును తీసుకురాగలం’’ అని అనుదీప్ విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా... ‘‘నేను, నాలో సగభాగమైన నా భార్య మినుషా ఈ ప్రయాణాన్ని కొనసాగించాలనుకుంటున్నాం. ఎంతో మంది మాతో చేతులు కలిపి బీచ్ను శుభ్రం చేసేందుకు వచ్చిన తీరు అత్యద్భుతం. మా లక్ష్యాన్ని చేరుకునే దిశగా సాయం అందించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు’’ అని తమకు సహకరించిన వారి పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. ఈ అనుదీప్- మినుషా స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(చదవండి: ఆన్లైన్లో పెళ్లికి 2 వేల మంది అతిధులు) View this post on Instagram A post shared by Anudeep Hegde (@travel_nirvana) -
ఏపీజీఏ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్స్ సంఘం (ఏపీజీఏ) కొత్త అధ్యక్షుడిగా వి.దశరథ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.సోమేశ్వర్లు ఎన్నికయ్యారు. జాతీయ మాజీ జిమ్నాస్ట్ సోమేశ్వర్ రాష్ట్రం తరఫున పలు మార్లు జాతీయ జిమ్నాస్టిక్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇక్కడి ఒలింపిక్ భవన్లో ఆదివారం హైదరాబాద్ జిల్లా జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు రవి ఈశ్వర్ చంద్ పర్యవేక్షణలో ఏపీజీఏ కార్యవర్గం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు భారత జిమ్నాస్టిక్ సమాఖ్య సంయుక్త కార్యదర్శి అశోక్ కుమార్ సాహు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ధన్కిషన్ బండారి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) తరపున అలీమ్ ఖాన్లు పర్యవేక్షులుగా వ్యవహరించారు. కోశాధికారిగా ఆర్.రవీందర్, ఉపాధ్యక్షులుగా రవి ఈశ్వర్ చంద్, రణప్రతాప్ గౌడ్, ఎం.రాజేష్ కుమార్, డాక్టర్ గౌర్ఖీ, వి.వినేష్, సంయుక్త కార్యదర్శులుగా ఎల్.శాంతి, పి.రేణుక, ఎస్.శ్రీనివాస్రావులు ఎన్నికయ్యారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
Advertisement