-
డిసెంబర్ నుంచి ఎన్ఎస్ఈ వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్చంజీ ఎన్ఎస్ఈ వచ్చే నెల నుంచి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబర్ ఒకటిన ముడి సోయాబీన్ ఆయిల్ కాంట్రాక్టుతో తమ తొలి వ్యవసాయ కమోడిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టును ప్రవేశపెడుతున్నట్లు సంస్థ తెలిపింది. సోయాబీన్ ఆయిల్ ప్రాసెసింగ్, అనుబంధ పరిశ్రమల సంస్థలు .. ధరలను హెడ్జ్ చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. లాట్ పరిమాణం 10 మెట్రిక్ టన్నులుగాను, కాంట్రాక్టు సెటిల్మెంట్ నెలవారీగాను ఉంటుందని తెలిపింది. దేశీ కమోడిటీ మార్కెట్లను మరింతగా విస్తరించేందుకు ఇలాంటి సాధనాలు ఉపయోగపడగలవని ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో విక్రమ్ లిమాయే తెలిపారు. -
సోయాబీన్ కొనుగోలుకు ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రధాన పంటలో ఒకటిగా ఉన్న సోయాబీన్ కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్సింగ్ను రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్రావు కోరారు. తెలంగాణలో సోయాబీన్ పంట ఎక్కువగా ఉత్పత్తి అయిన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి కేంద్ర సంస్థలతో పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి టి.హరీశ్రావు ఈ మేరకు కేంద్ర మంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘తెలంగాణలో 1.64 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగు చేస్తున్నారని, అనుకూల పరిస్థితులతో సగటు దిగుబడి పెరిగి, హెక్టారుకు 11.33 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. 2017–18 ఖరీఫ్ మార్కెట్ సీజనులో సోయాబీన్ కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) రూ.3050 ఉన్నప్పటికీ ప్రస్తుతం క్వింటాల్కు రూ.2300 నుంచి రూ.2800 మాత్రమే పలుకుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఖరారు చేసిన ఎంఎస్పీకి కొనుగోలు చేసి రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’అని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో హరీశ్రావు పేర్కొన్నారు. -
సీఎం దత్తత గ్రామాల్లో పచ్చని పంటలు
‘పచ్చ’వల్లి.. - సమష్టి కృషితో ఽసోయా, మొక్కజొన్న సాగు - అనుకూలించిన వర్షాలు - అధికారుల సూచనలతో సస్యరక్షణ - ఏపుగా పెరిగిన పంటలు - ఆనందంలో రైతులు జగదేవ్పూర్:సీఎం దత్తత గ్రామాల దశ తిరిగింది. నిన్నమొన్నటి వరకు సాగు దండగా అని భావించిన ఇక్కడి రైతులు ఇప్పుడు పండుగేనంటున్నారు. గత ఏడాది వరకు రైతులు తమ ఇష్టానుసారంగానే పంటలు సాగు చేసేవారు. చినుకు పడితే చాలు విత్తన పనులు ప్రారంభించే వారు. ఏటా ఒకే రకమైన పంటలు వేసేవారు. ఓవైపు ప్రకృతి సహకరించక దిగుబడులు రాకపోవడం.. మరో వైపు మార్కెట్లో మద్దతు ధర లభించకపోవడంతో సతమతమయ్యేవారు. పంట పండితే పండగ, లేకుంటే దండగ అనే వారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాగు దండగా అని భావించిన వారే ఇప్పుడు ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అధునిక సాంకేతిక పద్ధతులతో పంటలను సమష్టిగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, సోయాబీన్ పంటలు సాగవుతున్నాయి. పంటలకు అనుకూలంగా వానలు కురువడంతో సీఎం దత్తత గ్రామాలకు పచ్చని కళ వచ్చింది. రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆశాజనకంగానే పంటలు... సీఎం దత్తత గ్రామాలైన ఎర్రవల్లి, నర్సన్నపేటలో సాగు చేసిన మొక్కజొన్న, సోయాబీన్ పంటలు కళకళలాడుతున్నాయి. బిందు సేద్యం కాకుండా వర్షధార పంటలుగానే సాగు చేసిన ప్రస్తుతం ఆ పంటలు ఆశాజనకంగానే కనిపిస్తున్నాయి. రెండు గ్రామాల్లో కలిపి మొత్తం 2,800 ఎకరాల సాగు భూమి ఉండగా, రెండు వందల ఎకరాలకు ఒక జోన్గా విభజించారు. మొత్తం 14 జోన్లు ఏర్పాటు చేశారు. ఎర్రవల్లిలో 9, నర్సన్నపేటలో 5 జోన్లలో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేశారు. ఎర్రవల్లిలోని 1వ, 5వ జోన్లలో, నర్సన్నపేటలో 6,7వ జోన్లలో సోయాబీన్ వేయగా మిగిలిన జోన్లలో మొత్తం మొక్కజొన్న సాగు చేశారు. తమ భూముల్లో వర్షాధార పంటలు సాగు చేసిన రైతులంతా సమష్టిగా వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ పంట మెలకువలను పాటిస్తున్నారు. శాస్త్రవేత్తల సూచనలు... ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఏరువాక కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త ఉమారెడ్డి, నెటాఫిమ్ అగ్రనమిస్టులు నిత్యం పంటలను పరిశీలిస్తూ రైతులకు పలు సూచనలు ఇవ్వడంతో పంటలు ఏపుగా పెరిగాయి. వర్షాలు కూడా కురవడం అనుకూలించింది. ఎప్పటికప్పుడు రైతులు కలుపు నివారణ చర్యలు చేపడుతున్నారు. దీంతో పంటల్లో కలుపు మొక్క కనిపించడం లేదు. ఈ రెండు గ్రామాల్లో ఖరీఫ్కు ముందు భూమి లేని నిరుపేదలకు 42 ట్రాక్టర్లు అందించారు. దీంతో వ్యవసాయం పనుల్లో ఇబ్బందులు లేకుండా పోయాయి. విత్తనోత్పత్తిగా సోయాబీన్... సీఎం దత్తత గ్రామాల్లో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ సోయాబీన్ పంటను విత్తనోత్పత్తిగా చేపడుతుంది. రైతులు పండించిన సోయాబీన్ను స్వయంగా తెలంగాణ విత్తన సంస్థ వారే కొనుగోలు చేయనున్నారు. సీడ్స్ కార్పొరేషన్ ప్రతినిధులు పంటలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వరంగల్ ఏరువాక కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త వారంలో రెండుమూడు సార్లు పంటలను పరిశీలిస్తూ పలు సలహాలిస్తున్నారు. మొక్కజొన్న పంట మాత్రం ఈ సారి విత్తనోత్పత్తి లేదు. రెండు గ్రామాల్లో సాగవుతున్న మొక్కజొన్న పంట ఎక్కడ అమ్ముకోవాలన్నా ఇబ్బంది రాకుండా ముందస్తుగానే కావేరి విత్తన సంస్థతో బైబ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. సమష్టి విధానం ఇదే మొదటిసారి అయినందున పండిన మొక్కజొన్న సాధారణ ధాన్యంగానే విక్రయిస్తారు. రబీ నుంచి బిందుసేద్యం ద్వారా పండించే పంటను విత్తనోత్పత్తిగా తీసుకుంటారు. ఆధునిక సాగు... సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించాలన్న సంకల్పంతో ఈ రెండు గ్రామాల్లో సాగునీటి వనరుల నిర్మాణ పనులు చేపడుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించాలని రైతుకు వందశాతం సబ్సిడీపై బిందు సేద్యం పరికరాలు అందించారు. రెండు వందల ఎకరాలకొకటి చొప్పున సంపు నిర్మాణం చేపడుతున్నారు. సంపు ద్వారా పంటలకు సాగునీరు అందిస్తారు. పంటలకు ఏకకాలంలో నీరు, ఎరువులు అందించేలా పంటల మధ్యలో నెటాఫిమ్ వారు సైనెట్ వాల్ సిస్టమ్ను బిగించారు. దీనివల్ల ఎరువులు, నీరు ఆటోమెటిక్గా పంటలకు చేరుకుంటాయి. ఎకరానికి రూ.15 వేల బ్యాంకు రుణం... సీఎం దత్తత గ్రామంలో నాలుగు నెలల క్రితం ఏపీజీవీబీ బ్యాంకును ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ బ్యాంకును ప్రారంభించి ప్రభుత్వం తరుపున అప్పుడే రూ.5 కోట్లను డిపాజిట్ చేశారు. రెండు గ్రామాల రైతులు బ్యాంకులో ఖాతాలు తెరుచుకున్నారు. కొంత మంది రైతులు డిపాజిట్లు కూడా చేశారు. ఈ బ్యాంకు వారు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రుణం అందించారు. వ్యవసాసాయ అధికారులు దగ్గరుండి విత్తనాలు, ఎరువులు మందులు అందజేశారు. మందులు ఇలా... మొక్కజొన్న ఎకరానికి 8 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక్ సంచి, యూరియా మూడు బస్తాలు, పొటాషియం ఒక బస్తా, గడ్డి మందు లీటర్, సోయాబీన్ పంటకైతే ఎకరానికి 30 కిలోల విత్తనాలు, డీఏపీ ఒక సంచి, యూరియా సంచి, పొటాషియం బస్తా, గడ్డి మందు లీటర్ చొప్పున పంపిణీ చేశారు. పంటలు బాగున్నాయి... నాకున్న మూడు ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబీన్ సాగు చేసిన. ప్రస్తుతం చేనులు చాలా బాగున్నాయి. ఎకరంలో మొక్కజొన్న, రెండు ఎకరాల్లో సోయాబీన్ పంట చూస్తుంటే గత ఏడాది చేసిన అప్పులు తీరుతాయనిపిస్తుంది. ఎడ్లతో కాకుండా ట్రాక్టర్తో విత్తనం వేసిన. మంచిగా మొలిసింది. ఎరువులు, విత్తనాలు, మందులు అధికారులిచ్చారు. మొత్తం రూ.6వేల ఖర్చు వచ్చింది. - లక్ష్మి, రైతు, నర్సన్నపేట పత్తిని మరిచిపోయా... నాకున్న పదిహేను ఎకరాల్లో అధికారుల సూచనల మేరకు మొక్కజొన్న సాగు చేసిన. వర్షాలు అనుకూలించడంతో చేను బాగానే ఉంది. గత ఏడాది పదిహేను ఎకరాల్లో పత్తి పెట్టిన. వర్షాభావంతో పెట్టుబడి రాలేదు. సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని మా వ్యవసాయాన్నే మారుస్తుండు. పంటలపై అధికారులు అవగాహన కల్పించిండ్రు. బ్యాంకు రుణం కూడా ఇస్తున్నరు. పెట్టుబడికి ఎలాంటి తిప్పలు లేదు. - కనకయ్య యాదవ్, రైతు, నర్సన్నపేట -
పచ్చని పంటలతో కళకళ
జగదేవ్పూర్:సీఎం కేసీఆర్ దత్తత గ్రామలైన ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో వివిధ పంటలు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ పంటలు విస్తారంగా సాగవుతున్నాయి. రెండు గ్రామాల్లో సమష్టి వ్యవసాయంలో భాగంగా ఎర్రనేలల్లో మొక్కజొన్న, నల్ల భూముల్లో సోయాబీన్ పంటలను సాగు చేశారు. 2,800 ఎకరాలను 14 జోన్లుగా విభజించి ఒక్క జోన్ పరిధిలో 200 ఎకరాల్లో ఆయా పంటలు సాగు చేస్తున్నారు. మొక్కజొన్న, సోయాబీన్ విత్తనాలను ట్రాక్టర్ల ద్వారా విత్తారు. ప్రస్తుతం మొలకలెత్తిన పంటలతో రెండు గ్రామాలు కళకళలాడుతున్నాయి. రైతులు తమ భూముల్లో దంతె, గొర్రు, గడ్డి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఎటు చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. -
సగానికే పరిమితమైన సోయా సాగు
12.39 లక్షల ఎకరాల లక్ష్యంలో 6.86 లక్షల ఎకరాల్లోనే సాగు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం పిలుపునిచ్చిన విధంగా ఈ సారి రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. కానీ అందుకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్ సాగు వైపు వెళ్లాలని చేసిన సూచనలను రైతులు పట్టించుకోలేదు. పత్తి సాగు విస్తీర్ణం ఈసారి 26.28 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇప్పటివరకు 25.49 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. అంటే ప్రభుత్వం చెప్పిన విధంగానే రైతులు స్పందించినట్లు అర్థమవుతోంది. ఇక ఈ ఖరీఫ్లో 12.39 లక్షల ఎకరాల్లో సోయాను పండించాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. కానీ తాజా నివేదిక ప్రకారం సోయా సాగు విస్తీర్ణం 6.86 లక్షల ఎకరాలకే పరిమితమైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ లక్ష్యంలో సోయా సాగు సుమారు సగానికే పరిమితమైంది. మరోవైపు ఈ ఏడాది 17.46 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాలను సాగు చేయాలని సర్కారు నిర్ణయించింది. కానీ ఇప్పటివరకు కేవలం 11.78 లక్షల ఎకరాల్లోనే పప్పుధాన్యాల సాగు జరిగిందని నివేదిక తెలిపింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.35 ల క్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. మొత్తంగా పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.07 కోట్ల ఎకరాలు కాగా... ఇప్పటివరకు 59.40 లక్షల (55%) ఎకరాల్లోనే సాగయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో అధికంగా 85% పంటలు సాగయ్యా యి. అత్యంత తక్కువగా కరీంనగర్ జిల్లాలో 34% విస్తీర్ణంలోనే పంటలు వేశారు. మూడు జిల్లాల్లో అధిక వర్షపాతం... రాష్ట్రంలో ఈ సీజన్లో 16 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా... మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో 52 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో 44 శాతం అధిక వర్షపాతం నమోదైంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఫిల్ సాల్ట్ విధ్వంసం.. ఢిల్లీను చిత్తు చేసిన కేకేఆర్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement