-
హిందూపురానికి బ్రాండ్ ఇమేజ్ను పెంచాలి
హిందూపురం అర్బన్: హిందూపురం అంటే పారిశ్రామికాభివృద్ధికి పెట్టిందిపేరుగా బ్రాండ్ ఇమేజ్ను పెంచాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలపై ఉందని జిల్లా ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. వన్టౌన్ పోలీçసుస్టేషన్లో శనివారం డీఎస్పీ కరీముల్లాషరీఫ్ అధ్యక్షతన శాంతికమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హిందూపురంలో అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉన్నప్పుడే పట్టణాభివృద్ధి చెందుతుందన్నారు. హిందూముస్లింలు సోదరభావంతో ఐక్యతగా వినాయకచవితి, బక్రీద్లను శాంతియుత వాతావరణంలో సంతోషంగా జరుపుకుందామన్నారు. ఇందుకోసం శాంతికమిటీలను ఏర్పాటు చేశాం వాట్సాప్ గ్రూపులు కూడా కల్పించామన్నారు. డీఎస్పీ కరీముల్లా షరీఫ్, సీఐ ఇదురుబాషా మాట్లాడుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు నిర్వాహకులు పోలీసుల సూచనల మేరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మైకు గట్టిగా పెట్టడం, ఊరేగింపులకు ఇబ్బందికరమైన ఎతైన విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటివి వద్దన్నారు. కార్యక్రమంలో ముత్తవల్లి తల్హాఖాన్, కౌన్సిలర్ రోషన్వలి, నాయకులు భాస్కర్, రాయల్గోపాల్, కమిటీసభ్యులు కౌన్సిలర్ జబివుల్లా, రైల్వే శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : రోడ్డుప్రమాదాలను పూర్తిగా నియంత్రించడానికి తీవ్రంగా కృషిచేస్తున్నామని ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. శనివారం హిందూపురం విచ్చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రోడ్డుప్రమాదాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు పెంచుతున్నామని చెప్పారు. ఇందులో భాగంగా అనంతపురం, హిందూపురం కేంద్రాల్లో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తర్వాత అన్ని ప్రధాన పట్టణాల్లో ప్రారంభిస్తామన్నారు. కొడికొండ, తూమకుంట సరిహద్దు ప్రాంతాల్లో అక్రమరవాణా అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా నివారణకు చెక్పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో రాజకీయహత్యలు పెరిగాయని చెప్పగా జరిగిన హత్యల్లో రాజకీయ కోణాలు లేవని మాదన్న హత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందన్నారు. -
ప్రమాదాల నివారణలో డ్రైవర్లదే కీలకపాత్ర
అనంతపురం రూరల్ : రోడ్డు ప్రమాదాలు నివారించడంలో డ్రైవర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్కుమార్ సూచించారు. అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఎకాలజీ సెంటర్లో డ్రైవింగ్ శిక్షణను శుక్రవారం ఆయన ప్రారంభించారు. డ్రైవర్లు మెలకువలు తెలుసుకుని వాహనాలు నడపాలన్నారు. నైపుణ్యాన్ని ప్రదర్శించి డ్రైవింగ్ చేస్తే రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డ్రైవింగ్ లైసెన్సులు అందజేశారు. ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ మల్లారెడ్డి మాట్లాడుతూ 2008 నుంచి ఇప్పటిదాక గ్రామీణ ప్రాంతాల్లోని 15వందల మందికి పైగా నిరుద్యోగులకు డ్రైవింగ్పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం ద్విచక్రవాహనాల మెకానిక్పై శిక్షణ తరగతులను ప్రారంభించారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement