-
కొత్తగా 14 జిల్లాలు
కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై నేడు కే బినెట్ భేటీలో చర్చ ఏపీ డిస్ట్రిక్ట్ ్స (ఫార్మేషన్) చట్టాన్ని వర్తింపజేయడంపై నిర్ణయం మరో పది వేల ఉద్యోగాలు, నూతన మద్యం విధానంపై చర్చ ప్రాజెక్టుల ఎస్కలేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా చర్చ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం-1974ను తెలంగాణకు వర్తింపజేయాలని భావిస్తోంది. తెలంగాణ డిస్టిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్-2015 పేరుతో స్వల్ప మార్పులతో ఈ చట్టాన్ని అమలు చేయనుంది. బుధవారం మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావటంతో పలు కీలకమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజించి 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఎం కె.చంద్రశేఖర్రావు వివిధ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో చట్టం అమల్లోకి తీసుకురావటం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతమున్న ప్రతిపాదనల ప్రకారం.. మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్కర్నూలు, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్ను జిల్లాగా మార్చటంతోపాటు హైదరాబాద్ను నాలుగు జిల్లాలుగా మార్చే ఆలోచనలున్నాయి. దశలవారీగా వీటిని పునర్విభజించాలని.. తొలిదశలో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చీప్ లిక్కర్పై చర్చ కొత్తగా అమల్లోకి తీసుకురానున్న మద్యం విధానంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసిన ఈ ఫైలును అధికారులు కేబినెట్ ఆమోదానికి పంపారు. రూ.15, రూ.30 బాటిళ్లలో చీప్ లిక్కర్ను విక్రయించాలనే నిర్ణయం ప్రభుత్వం తుది పరిశీలనలో ఉంది. మరో పది వేల ఉద్యోగాలపై.. ఈ ఏడాది 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. జూలైలో 15,552 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మిగతా పది వేల పోస్టుల భర్తీకి లక్షలాది మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్న ఈ ఫైలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. కేబినెట్లో చర్చకు రానున్న మరిన్ని అంశాలు.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఎస్కలేషన్ పెంపు చేయాలనే ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా చర్చ జరిగే అవకాశముంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలనే డిమాండ్పై చర్చ జరగనుంది. ప్రతిపాదిత జిల్లాలు ►మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి ►మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్కర్నూల్ ►నల్లగొండలో సూర్యాపేట.. ►వరంగల్లో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి ►ఖమ్మంలో భద్రాచలం ►కరీంనగర్లో జగిత్యాల.. ►ఆదిలాబాద్లో మంచిర్యాల ► హైదరాబాద్ ను 4 జిల్లాలుగా.. రంగారెడ్డికి బదులుగా వికారాబాద్ను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనా ఉంది -
‘పాలమూరు’ అంచనాలు పైపైకి
ప్రాజెక్టు తొలిదశ పూర్తికే రూ.15 వేల కోట్ల వ్యయం! అలుగు పునాదిని పెంచాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సూచించిన సీడీవో ఈ మార్పులతో మరో రూ.500 కోట్ల మేర పెరగనున్న అంచనాలు సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టు అంచనా వ్యయం మరింత పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకే దాదాపు రూ.15 వేల కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని మరింత కిందకు తీసుకెళ్లాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) సూచించిన నేపథ్యంలో వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి రూ.5.73 కోట్లను విడుదల చేసింది. ఈ కాలేజీ తొలిదశ సర్వేను డిసెంబర్లోనే పూర్తి చేసింది. పైప్లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటి తరలింపునకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కిలోమీటర్ల మేర టన్నెల్ను నిర్మించాలని సూచించింది. ఈ నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉండే మొదటి రిజర్వాయర్ కోయిల కొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసే పంపిం గ్ స్టేషన్ వద్ద 160మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 పంపులను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులకు సుమారు రూ. 14,950 కోట్ల మేర అవసరం ఉంటుందని అంచనా వేసింది. దీనిపై డిసెంబర్ రెండో వారంలోనే పరిశీలన చేసిన ఆర్థిక శాఖ రూ.14,400 కోట్లకు డీపీఆర్ను ఆమోదించి తదుపరి పరిశీలన కోసం సీడీఓకు పంపింది. అన్ని అంశాలను పరిశీలించిన సీడీఓ, ప్రాజెక్టు వద్ద రాళ్లు, మట్టి సామర్థ్యాన్ని బట్టి అలుగు పునాదిని మరింత కిందకు తీసుకెళ్లాలని సూచించింది. దీని కోసం అదనంగా మరో రూ. 60 నుంచి రూ.80 కోట్ల మేర ఖర్చు పెరుగుతుందని అంచనా వే సింది. ప్రధాన కాల్వలకు కాంక్రీట్ లైనింగ్ చేయాలని దీనికి మరో రూ.200 నుంచి రూ.300ల కోట్ల మేర వ్యయం పెరుగుతుందని సీడీఓ పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇక వీటితోపాటే రిజర్వాయర్ల వద్ద ఏర్పాటు చేసే పంప్హౌస్ల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. వీటన్నింటినీ కలుపుకొని అదనంగా రూ.500 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అంచనా వస్తోంది. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లోనే సీడీఓ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిసింది. అనంతరం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు, శంకుస్థాపన తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
రోడ్ల నిర్వహణ రేట్లు పెంపు
రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల రహదారుల సాధారణ నిర్వహణ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇంధనం ధరలు, కూలీ రేట్లు పెరగడంవల్ల రహదారుల నిర్వహణ వ్యయం రేట్లను సవరించినట్లు రహదారులు, భవనాల శాఖ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రహదారుల నిర్వహణ రేట్లు కిలోమీటరు కొలమానంగా ఉంటాయి. ఈ మేరకు సింగల్ లేన్ బీటీ రోడ్డు నిర్వహణ రేటు రూ. 12 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. డబుల్ లేన్ బీటీ రోడ్డుకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేలకు, మట్టిరోడ్లు, కంకర రోడ్లకు రూ. 6 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. తెలంగాణలో ఇక నుంచి నిర్మించే కొత్తరోడ్లను అయిదేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఆశల పల్లకిలో..
కష్టపడి చదివారు.. ఉద్యోగం రాలేదు. నిర్ణీత వయస్సు దాటిపోతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థ్థితి. కొలువుమీద ఆశ వదులుకునే దశలో వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశలు కల్పించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపడంతో పాటు ఉద్యోగాలకు నిర్ణీత వయస్సునూ మరో ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. దీంతో వేలాదిమందికి ఆశలు చిగురించాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు. సాక్షి, మహబూబ్నగర్: కొత్తరాష్ట్రంలో నిరుద్యోగుల కోటి ఆశలు నెరవేరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల వయో పరిమితిని ఐదేళ్లు పెంచడంతో నిరుద్యోగుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఐదేళ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లూ జారీకాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు సర్కా రు ప్రకటన ఊరట కలిగించింది. త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించిన నేపథ్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటివరకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదైన వారిని బట్టి 1,61,546 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో పదో తరగతి చదివిన వారు 59,129 మంది, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు 31,168 మంది, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదివిన వారు 31,183మంది ఉన్నారు. అలాగే వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన వారు 36,758 మంది ఉన్నారు. వీరికి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఒక్క కాల్ లెటర్ కూడా వెళ్లలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నత చదువులు పూర్తి చేసుకుంటున్న వారు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఐదారేళ్లుగా పేర్లు నమోదులో భారీగా తగ్గిపోయింది. భారీగా పేరుకుపోయిన ఖాళీలు ఉమ్మడి రాష్ట్రంలో సర్కారీ కొలువుల కోసం కొంతకాలంగా ఎలాంటి నోటిఫికేషన్లూ లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.నాలుగైదు ఏళ్లుగా పదవీ విరమణ పొందినవారి సంఖ్య అదేస్థాయిలో ఉండడంతో ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. జిల్లాలో మొత్తం 84 శాఖల్లో కూడా ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పోలీస్శాఖ మినహా మిగతా వాటిన్నింటిలో కలిపి జిల్లాలో దాదాపు 2,400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా పాఠశాల విద్యశాఖలో అత్యధికంగా 1,600 పోస్టులు ఖాళీలున్నాయి. అలాగే వైద్యారోగ్యశాఖలో 600, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 260, రెవెన్యూశాఖలో 260, పశుసంవర్థక శాఖలో 55పోస్టులు ఖాళీలున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం ఇటీవల ఆదర్శరైతులను తొలగించింది. కాగా, వారిస్థానంలో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్)లను నియమించనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు రెండు వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లూ పుస్తకాలను దూరం పెట్టిన వారు తిరిగి కోచింగ్ సెంటర్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు ప్రభుత్వ ప్రకటించడంతో బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెవెన్యూ ఉద్యోగాల ఖాళీలు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో గ్రూప్స్ కోచింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ పయనమవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ.. రాష్ట్ర పరిధిలోని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,800మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా డ్వామాలో 1,725, ఆర్వీఎంలో 845, డీఆర్డీఏలో 275, విద్యుత్శాఖలో 320మంది పనిచేస్తున్నారు. అయితే ఏయే శాఖల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తారనే విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగసంఘాలు మాత్రం అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. విద్యార్హతల వారీగా.. విద్యార్హత నిరుద్యోగులు ఐదేళ్ల సడలింపుతో లబ్ధి 10వ తరగతి 59,129 72,112 ఇంటర్ 31,168 41,317 డిగ్రీ, పీజీ 31,183 45,734 వృత్తివిద్యాకోర్సు 36,758 52,007 -
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
సీఎం చైర్మన్గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది. పాలక మండలిలో సభ్యులు వీరే... తెలంగాణ ప్రభుత్వం న్యాక్కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్అండ్బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్అండ్బీ ఈఎన్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్డీవో అడిషనల్ డీజీలు. చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్రావు ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్రావు ప్రశ్నించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ
వివాదాస్పద భూభాగాలతో రూ.100 నోట్ ముద్రించాలని నిర్ణయం
ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన
నీ ముఖానికి డ్యాన్సా? ట్రోలింగ్పై స్పందించిన నటి
చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్
‘అతడు 70 శాతం ఇండియన్.. 30 శాతం మాత్రమే ఆస్ట్రేలియన్’
తప్పక చదవండి
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
Advertisement