-
బాలల ఆరోగ్యానికి భరోసా
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన ఈ చిన్నారి హర్షిత్కు రెండేళ్లు. పుట్టకతోనే గుండె సమస్యలున్నాయి. తల్లిదండ్రులు అనేక ఆస్పపత్రుల్లో చూపించారు. గుండెకు ఆపరేషన్ చేయాలని, రూ.లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. అంత ఖర్చుపెట్టే స్తోమత లేని తల్లిదండ్రులు గతేడాది నవంబర్లో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయానికి వచ్చారు. హర్షిత్ గుండెకు వెళ్లే మంచి రక్తం, చెడు రక్తం కలిసిపోతున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కరించారు. ► అనంతపురం జిల్లా ఎం.ఎన్.పి తండాకు చెందిన చిన్నారి బాలచంద్ర నాయక్కు మూడేళ్లు. చంద్ర నాయక్కు పుట్టుకతోనే గుండె సమస్యలున్నాయి. నిరుపేద కుటుంబం. పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఉచితంగా గుండె చికిత్సలు చేస్తున్నారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. గత ఏడాది చంద్రనాయక్ను ఆస్పత్రిలో చేర్చారు. వైద్యులు ఓపెన్ హార్ట్ (ఇంట్రా కార్డియాక్ రిపేర్) సర్జరీ చేశారు. ప్రస్తుతం చంద్రనాయక్ ఆరోగ్యంగా ఉన్నాడు. వీళ్లిద్దరే కాదు.. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వేలాది పిల్లల ఆరోగ్యానికి భరోసానిస్తోంది శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం. ఇప్పుడీ ఆస్పత్రి సేవలు విస్తరించనున్నాయి. శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపాంతరం చెందుతోంది. బాలలకు గుండె సంబంధిత చికిత్సలతో పాటు, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిగా రూపు దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి వద్ద దీనిని నిర్మిస్తున్నారు. రూ.300 కోట్లతో 350 పడకలతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఆస్పత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఆస్పత్రి కోసం 6 ఎకరాల్లో జీ+6 భవనాన్ని నిర్మిస్తారు. భవన నిర్మాణానికి రూ.240 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.60 కోట్లతో అధునాతన వైద్య పరికరాలు, ఇతర వసతులు సమకూరుస్తారు. 18 నెలల్లో భవన నిర్మాణం పూర్తి చేసేలా టీటీడీ ప్రణాళిక రూపొందించింది. ఆస్పత్రిపైనే హెలీప్యాడ్ గుండె, కాలేయం, కిడ్నీలకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇతర ప్రాంతాల నుంచి అవయవాలను ఇక్కడికి తరలించాల్సి వస్తుంది. అవయవాల తరలింపు ఆలస్యం అవకుండా ఆస్పత్రి భవనంపైనే ఎయిర్ అంబులెన్స్ దిగేలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సౌకర్యం దేశంలో అతి తక్కువ ఆస్పత్రుల్లో మాత్రమే ఉంది. అందుబాటులోకి వచ్చే సేవలు ఈ ఆస్పత్రిలో హెమటో అంకాలజీ, మెడికల్ అంకాలజి, సర్జికల్ అంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలాజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ లాంటి 15 రకాల ప్రత్యేక విభాగాల్లో చిన్నారులకు వైద్య సేవలు అందిస్తారు. అత్యంత ఖరీదైన బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్, గుండె, ఇతర అవయవాల మార్పిడి ఉచితంగా చేస్తారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇలాంటి ఆస్పత్రి దేశంలోనే మొదటిది కాబోతుంది. 2,020 మందికిపైగా చిన్నారులకు పునర్జన్మ గత ఏడాది అక్టోబర్ 11న పద్మావతి చిన్న పిల్లల హృదయాలయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. 70 పడకలతో ఈ ఆస్పత్రిని చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. 12 మంది స్పెషలిస్ట్ వైద్యులు పనిచేస్తున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ ఇప్పటివరకు 2,020 మందికి పైగా చిన్నారులకు ఓపెన్ హార్ట్, కీ హోల్ సర్జరీలు చేశారు. ఉచితంగా అత్యాధునిక వైద్యం పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ద్వారా నిరుపేద, మధ్య తరగతి పిల్లలకు అత్యాధునిక వైద్యం ఉచితంగా అందుతుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం కింద ఇక్కడ వైద్య సేవలు అందుతాయి. 15 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవస్థలు తప్పుతాయి. – డాక్టర్ శ్రీనాథ్రెడ్డి, శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం పిల్లలకు వైద్య సేవలపై సీఎం ప్రత్యేక దృష్టి రాష్ట్ర విభజనకు ముందు పిల్లల కోసం హైదరాబాద్లో నీలోఫర్ ఆస్పత్రి ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత చిన్న పిల్లల కోసం రాష్ట్రంలో ప్రత్యేకంగా ఆస్పత్రి లేకుండాపోయింది. దీంతో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సేవల కోసం ప్రైవేటు ఆస్పత్రులపై ఆధారపడే పరిస్థితి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక అన్ని రకాల వైద్య సదుపాయాలను పేద కుటుంబాల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో చిన్న పిల్లల కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చొరవతో తిరుపతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభమవుతోంది.విజయవాడ, విశాఖపట్నంలలోనూ పిల్లల ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. అత్యాధునిక లేబొరేటరీ, ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ విభాగాలతో అత్యాధునిక ఆస్పత్రులు నిర్మించాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక్కో ఆస్పత్రికి రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. -
అక్కడ శ్రీవారికీ... ఇక్కడ దేవేరికీ...
త్రేతాయుగంలో సీతగా, ద్వాపరయుగంలో రుక్మిణిగా, కలియుగంలో వేంకటపతి ప్రియపత్ని అలమేలుమంగగా శ్రీ పద్మావతి అమ్మవారు దివ్య దర్శనమిస్తూ భక్తకోటిని కటాక్షిస్తున్నారు. అలమేలు మంగమ్మను దర్శించుకున్న తర్వాతే లక్ష్మీపతి అయిన శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవాలని స్థలపురాణం చెబుతోంది. తన నివాసమైన శ్రీనివాసుని వక్షస్థలాన్ని భృగుమహర్షి కాలితో తన్నడంతో అమ్మవారు అలకబూని, వైకుంఠాన్ని వీడి, పాతాళ లోకంలో కపిల మహాముని ఆశ్రయం పొందారు. తర్వాత కొల్హాపూర్లో శ్రీ మహాలక్ష్మిగా కొలువయ్యారు. కొల్హాసురుడనే రాక్షసుని కడతేర్చిభక్తులకు అభయమిచ్చారు. సిరుల తల్లి లేక వైకుంఠం వెలవెలబోయింది. స్వామి విరహ వేదనతో వైకుంఠాన్ని వీడి, భూలోనికి చేరాడు. ప్రియసఖి కోసం చెట్టూపుట్టా వెతికాడు. శేషాచల కొండల్లో సంచరించాడు. భూ వరాహ క్షేత్రం వేంకటాచలానికి చేరాడు. తన ధర్మపత్ని కొల్హాపూర్లో కొలువై ఉందని తెలుసుకుని అక్కడికి చేరాడు. పదేళ్ళపాటు కఠోర తపస్సు చేసినా క్షేత్ర మహిమ వల్ల ఆమె కలియుగాంతం వరకూ ప్రసన్నం కాదన్న ఆకాశవాణి ఉపదేశంతో సువర్ణముఖి నదీ తీరాన వెలసిన తిరుచానూరు క్షేత్రంలో మరో పన్నెండేళ్ల్లపాటు తపస్సు చేశాడు. పద్మ సరోవరంలో కార్తిక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వుపై ప్రత్యక్షమైన శ్రీ మహాలక్ష్మి కలువ పూలదండతో శ్రీనివాసుడిని అలంకరించటంతో ఆ దంపతులు తిరిగి ఒకటయ్యారు. నాటి అలమేలుమంగాపురమే నేటి తిరుచానూరు తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరాన తిరుచానూరు ఉంది. వాడుకలో మంగపట్నమనీ, అలమేలు మంగాపురం అని కూడా పిలుస్తుంటారు. తమిళంలో అలర్ అంటే పుష్పం, మేల్ అంటే పైన, మంగై అంటే అందమైన స్త్రీ. పుష్పంపై వెలసిన దేవి అని అర్థం. శుకము అంటే చిలుక. చిలుకలా మృదువుగా మాట్లాడే వ్యాసమహర్షి కుమారుడు శుకమహర్షి నివసించిన ఊరు తిరుచానూరు. అందుకే ఈ క్షేత్రం తిరుశుకనూరుగానూ, ఆ తర్వాత తిరుచానూరుగానూ ప్రసిద్ధి పొందింది. చారిత్రకంగా శ్రీపద్మావతిదేవి 12వ శతాబ్దిలో అస్తిత్వంలోకి వచ్చారు. పద్మావతిని పద్మశాలీలు తమ ఇంటి ఆడపడచుగా భావిస్తారు. ఈ ప్రాంతంలో వస్త్ర వ్యాపారం చేసే శ్రీమంతులైన పద్మశాలీలు పద్మావ తి దేవి ఆలయ నిర్మాణం కోసం అన్నమాచార్యుల మనుమడైన తాళ్లపాక చిన్నన్నకు 16వ శతాబ్దంలో 20 వేల వరహాలు వితరణ చేసినట్టు శాసనం ఉంది. ఇరవై వేలకు పైగా జనాభా కలిగిన తిరుచానూరులో వందకుపైగా కల్యాణమండపాలు ఉన్నాయి. అమ్మవారి సన్నిధిలో ఏటా రెండువేలకుపైగా వివాహాలు జరుగుతాయి. ఆలయ నిర్మాణం... శిల్పశోభితం చారిత్రక ఆధారాల ప్రకారం ఇది మొదట పల్లవులు, తర్వాత చోళుల పరిపాలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాచీన శిల్ప శోభితంగా ఆలయ నిర్మాణం జరిగింది. తిరుచానూరు అమ్మవారి ఆలయాన్ని మూడు విభాగాలుగా చూడవచ్చు. మొదటిది అమ్మవారి ఆలయం, రెండోది కృష్ణస్వామి ఆలయం, ఇక మూడోది సుందరరాజస్వామి ఆలయం. అమ్మవారి ఆలయ ముఖద్వారం తూర్పుదిశలో ఉంటుంది. ఆగ్నేయమూలలో పోటు, అదే వరుస క్రమంలో వాహన మండపం, పరకామణి ఉన్నాయి. ముందుగా ధ్వజస్తంభం, తర్వాత ముఖమండపం, అంతరాళం ఉంది. అక్కడి ద్వారంపై అష్టలక్ష్మీమూర్తులు దర్శనమిస్తారు. అంతరాళం దాటి ముందుకు సాగితే గర్భాలయంలో సిరులతో దేదీప్యమైన దివ్యదర్శనంతో ప్రకాశించే శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించవచ్చు. గర్భాలయం వెనుక ప్రాంతంలో ప్రదక్షిణ మార్గం ఉంది. ఇక్కడి దక్షిణమార్గంలో విష్వక్సేనుడు, ఉత్తర దిశలో రామానుజాచార్యులవారిని దర్శించవచ్చు. వాయవ్యదిశలో ఆలయ విమాన గోపురంపై గల విమాన లక్ష్మీదేవి ఏడు కొండలపై వెలసిన స్వామిని చూస్తున్నట్టుగా కొలువై ఉంటారు. అమ్మ జన్మనక్షత్రంలో పంచమి తీర్థం కార్తిక శుక్లపంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలోని శుభలగ్నంలో పాతాళలోకం నుంచి శ్రీ మహాలక్ష్మి... శ్రీనివాసుడు తపస్సు చేస్తున్న పద్మసరోవరంలో అవతరించారు. ఇదే పుణ్యఘడియల్లో ‘పంచమి తీర్థ ముక్కోటి’ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించటం సంప్రదాయం. పంచమినాడు అమ్మవారి జన్మనక్షత్రం కావటం వల్ల ఆ రోజు స్వామివారు తిరుమల కొండ దిగి అమ్మవారిని అలంకరించి ఆనందింప చేస్తారని భక్తుల విశ్వాసం. స్వామి తన పట్టపు రాణి కోసం తిరుమల సన్నిధి నుంచి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పట్టుచీరలు, వజ్ర, వైఢూర్య, మరకత మాణిక్యాది ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు, లడ్డు, జిలేబీ వంటి పణ్యారాలతో కూడిన సారెను పంపుతారు. శ్రీవారి సన్నిధి నుంచి అర్చకులు పాదచారులై కాలిబాట మార్గం నుంచి అలిపిరి తీసుకొస్తారు. అక్కడ నుంచి ఆలయ సంప్రదాయాలతో ఏనుగుైపై పురవీధుల్లో ఊరేగింపుగా తిరుచానూరుకు చేరవేస్తారు. అలమేలుమంగ ఉత్సవ వైభవం తిరుచానూరు అమ్మవారికి పాంచరాత్ర ఆగమం ప్రకారం నిత్యారాధనలు, ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తారు. ప్రతినిత్యం సుప్రభాత సేవతో ప్రారంభమై సహస్రనామార్చన, నివేదన, నిత్యకల్యాణం, సాయంత్రం వేళలో డోలోత్సవం (ఊంజల్సేవ) నిర్వహిస్తారు. రాత్రి ‘ఏకాంత సేవ’తో ఆలయ పూజాకైంకర్యాలు పూర్తి చేస్తారు. ఇక వారపు సేవలు, ఉత్సవాల్లో సోమవారం అష్టదళ పాద పద్మారాధన సేవ, గురువారం తిరుప్పావడ (అన్నకూటోత్సవం), శుక్రవారం అభిషేకం నిర్వహిస్తారు. శనివారం పుష్పాంజలి సేవ నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం కల్యాణోత్సవానికి ముందు ‘లక్ష్మీపూజ’ నిర్వహిస్తారు. కల్యాణం తర్వాత ఆలయానికి దక్షిణ దిశలో ఉండే శుక్రవారపు తోటకు వెళ్లి అక్కడ పసుపు, చందనం ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం గ్రామోత్సవం నిర్వహిస్తారు. అచ్చం శ్రీవారికి జరిగినట్లే..! ప్రతి ఏడాది కార్తిక శుద్ధ పంచమికి ముగిసేలా అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయ తరహాలోనే అమ్మవారు వివిధ రూపాల్లో వాహనాలపై పురవీధుల్లో ఊరేగుతూ, భక్తకోటిని కటాక్షిస్తారు. శ్రీవారి గరుడ వాహన సేవ ఊరేగింపు సంబరం ఏ స్థాయిలో జరుగుతుందో అదే తరహాలోనే ఇక్కడ గజవాహన ఊరేగింపు కూడా వేడుకగా సాగుతుంది. బ్రహ్మోత్సవాలకు ముందురోజు అమ్మవారికి లక్షకుంకుమార్చన సేవ నిర్వహించటం సంప్రదాయం. తిరుచానూరు శ్రీపద్మావతి తాయార్ల బ్రహ్మోత్సవాలు తేది ఉదయం రాత్రి 19.11.2014 ధ్వజారోహణం చిన్నశేషవాహనం 20.11.2014 పెద్దశేషవాహనం హంసవాహనం 21.11.2014 ముత్యపు పందిరివాహనం సింహవాహనం 22.11.2014 కల్పవృక్షవాహనం హనుమద్వాహనం 23.11.2014 పల్లకీఉత్సవం సాయంత్రం వసంతోత్సవం గజవాహనం 24.11.2014 సర్వభూపాల వాహనం సాయంత్రం స్వర్ణరథం గరుడ వాహనం 25.11.2014 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 26.11.2014 రథోత్సవం అశ్వవాహనం 27.11.2014 చక్రస్నానం, పంచమీతీర్థం ధ్వజావరోహణం
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement