-
‘తెలుగుతో పాటు ఆంగ్లం కూడా ముఖ్యమే’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రజలకు, విద్యార్థులకు తెలుగు భాష ఎంత అవసరమో ఆంగ్ల భాష కూడా అంతే అవసరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. విశాఖలోని పాయకరావుపేట శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్వరూప నందేంద్ర సరస్వతి స్వామి పాల్గోని లక్ష్మి హోమం, సహస్ర పద్మాహవనం, పూర్ణాహుతి హోమాలను జరిపించారు. ఈ సందర్భంగా ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్ విజయ్ ప్రకాష్ దంపతులు స్వామివారికి స్వర్ణ పుష్పార్చనను నిర్వహించారు. ఈ క్రమంలో అశేష భక్త జనం విద్యార్థులను ఉద్దేశించి స్వరూప నందేంద్ర స్వామి వారు అనుగ్రహభాషణం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం స్వరూప నందేంద్ర స్వామి మాట్లాడుతూ.. ఆంగ్ల భాషపై జరుగుతున్న చర్చ తనకు అర్థం కాని విధంగా ఉందని, ఈ సృష్టిలో ఎంత ప్రయోజకుడైన గురువు అధరణ వల్లే ప్రయోజకులు అవుతారని వ్యాఖ్యానించారు. విద్యార్థులు ఈ రోజు గురువవు ఆదరించే విధానం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. భారతదేశంలో ఈ రోజు విశాఖ శారదా పీఠంకు ప్రత్యేక స్థానం ఉందని, ధర్మ పరిరక్షణలోను హిందూ ఆలయాల భూములు కాపాడడంలోనూ న్యాయం కోసం ఎంత పోరాటానికైనా వెనకాడని పీఠంగా శీ శారదా పీఠం ఉందని సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబురావుతో పాటు తుని ఎమ్మెల్యే, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ప్రభుత్వ వీప్ దాడిశెట్టి రాజాలు పాల్గొన్నారు. అనంతరం విద్యాసంస్థల జాయింట్ డైరెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ వీప్, తదితరులు స్వామి వారి ఆశీర్వచనాలు పొందారు. -
101 అన్నమయ్య కీర్తనల ఆలాపన
పాయకరావుపేట, న్యూస్లైన్: శ్రీప్రకాష్ విద్యా సంస్థ వేదికగా కోఠి స్టిర్స్ ప్రపంచ రికార్డు సాధనకు 101 అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ విద్యా సంస్థలో చదువుతున్న కోఠి సిష్టర్స్ (లక్ష్మీ శ్వేత ,సత్య అక్షోభ) ఆదివారం ప్రపంచ రికార్డు సాధన, అన్నమాచార్య తత్వ ప్రచారం ధ్యేయంగా ఈ సాహసానికి పూనుకున్నారు. అదివో అల్లదివో... కీర్తనతో మొదలై జయమంగళం... అనే కీర్తన వరకూ 101 కీర్తనలను ఐదున్నర గంటలు నిర్వరామంగా ఆలపించి సరికొత్త ప్రపంచ రికార్డుకు ప్రయత్నించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రపంచ ప్రఖ్యాత ఇంద్ర జాలికుడు, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త, చింతా శ్యామ్కుమార్ (శ్యామ్ జాదూగర్) మాట్లాడుతూ చిన్న వయస్సులోనే కోఠి సిస్టర్స్ 101 అన్నమయ్య గీతాల ను ఆలపించి ప్రపంచ రికార్డుకు ప్రయత్నించడం ఆనందంగా ఉందన్నారు. విద్యతోపాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు నడిపిస్తున్న శ్రీప్రకాష్ విద్యాసంస్థల కృషి అభినందనీయమన్నారు. సినీ నటుడు కె.ఆర్.జె. శర్మ, ఎలమంచిలి సీఐ కె.రామారావు మాట్లాడుతూ ఎన్నో రోజుల పాటు సాధన చేసిన వీరు ప్రపంచ రికార్డు నెలకొల్పి ఈ ప్రాంతానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి అన్ని రంగాల్లో విజయం సాధించేలా బోధన ఇస్తున్నామని చెప్పారు. కోఠి సిస్టర్స్తో పాటు తల్లిదండ్రులు గౌతమ్, రామలక్ష్మమ్మలను విద్యా సంస్ధల కరస్పాండెంట్ సీహెచ్వికె నరసింహారావు అభినందించారు. 101 కీర్తనలు ఆలాపన చేసినట్లు స్టేట్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు చేసి కోఠి సిస్టర్స్కు ధ్రువపత్రాలు అందజేసి సుజలపుత్రి అనే బిరుదు ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement