-
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా రథోత్సవం (ఫొటోలు)
-
తిరుమలలో జోరుగా ఉద్యానవనాల పెంపకం
-
నేడు గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ సేవను బుధవారం నిర్వహించనున్నారు. రాత్రి 8 గంటలకు వాహన సేవను ప్రారంభించనున్నారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, టీటీడీ సీవీఎస్వో జీవీజీ అశోక్కుమార్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు విభాగాల వారీగా గరుడసేవ ఏర్పాట్లను సమీక్షించారు. వాహన సేవ సందర్భంగా భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాటకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్యాలరీల్లో వేచి ఉండే అశేష భక్తజనం ఉత్సవమూర్తిని దర్శించుకునే విధంగా వాహనాన్ని అటుఇటూ తిప్పాలని సిబ్బందికి సూచించారు. అదనపు బస్సులు లేవు సమైక్యాంధ్ర ఉద్యమంవల్ల తిరుమల-తిరుపతి మధ్య 107 బ స్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో 8 సర్వీసులు తిరుమలలోని పాపవినాశనానికి నడుపుతున్నారు. గరుడ సేవకు అవే బస్సులు తిరుగుతాయని, అదనంగా వేసే అవకాశం లేదని తిరుమల డిపో మేనేజరు లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు. ద్విచక్ర వాహనాలకు గ్రీన్ సిగ్నల్ గరుడ సేవలో అదనపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతోద్విచక్ర వాహనాలకు అనుమతిచ్చారు. భక్తుల అవసరాల దృష్ట్యా ద్విచక్ర వాహనాలకు అనుమతించినట్టు ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు. భద్రత కట్టుదిట్టం.. గరుడ వాహన సేవలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీవీఎస్వో జీవీజీ.అశోక్కుమార్, అదనపు సీవీఎస్వో శివకుమార్రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు, ఏఎస్పీ ఉమామహేశ్వర్ శర్మ, డీఎస్పీ నంజుండప్ప భద్రతను పర్యవేక్షించారు. నాలుగు మాడ వీధుల్లో ఆహారం పంపిణీకి చర్యలు గరుడ సేవకు వచ్చే భక్తులకు ఉచిత భోజన వసతి, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఉదయం మోహినీ అవతారం.. బుధవారం ఉదయం స్వామివారు మోహినీ అవతారంలో దర్శనమిస్తారు. -
‘సాక్షి’కి ప్రశంసల జల్లు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆవిష్కరణ
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కథనాలతో 2013 అక్టోబర్ 6న ‘శరణం నీ దివ్య చరణం’ శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్డే’ సంచికను ఆదివారం చిన్నశేష వాహనసేవలో ఆవిష్కరించారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు, సీవీఎస్వో అశోక్కుమార్, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వీసీ శ్రీహరి ‘సాక్షి ఫన్డే’ సంచికను ఆవిష్కరించారు. 2011 సెప్టెంబర్ 25న ‘నమో..వేంకటేశా!’ శీర్షికతో మొదటి సంచిక, 2012 సెప్టెంబర్ 16న ‘బ్రహ్మాండ నాయకుడు’ శీర్షికతో రెండో సంచిక, తాజాగా ఆదివారం మూడో సంచిక తీసుకొచ్చి తిరుమల చారిత్రక అంశాలను పాఠకులకు తెలియజేయడంలో ‘సాక్షి’ సిబ్బంది, యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవోలు కొనియాడారు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement