-
వడ్డీలేని రుణాలనడం సిగ్గుచేటు
► సర్కార్పై ‘స్త్రీనిధి’ మహిళల మండిపాటు ► ఎజెండాను చదవకుండానే ఆమోదించమంటే ఎలాగని ఎండీపై ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన స్త్రీనిధి బ్యాంక్ సర్వసభ్య సమావేశంలో మహిళా సంఘాల సంక్షేమంపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును పలువురు మహిళా సమాఖ్యల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించారు. ఎజెండా అంశాలను ముందుగా తెలపకుండానే, సమావేశంలోనే ఇచ్చి హడావుడిగా ఆమోదం తెలపాలని స్త్రీనిధి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొనడాన్ని తప్పుపట్టారు. వేదికపైన అధ్యక్షురాలు చదువుతున్న అంశాలకు, తమ చేతికి అందించిన ఎజెండా కాపీలోని అంశాలకు పొంతన లేదని మహిళలు దుయ్యబట్టారు. రూ.37.25 కోట్ల ఆదాయం వచ్చిందంటూ ప్రభుత్వానికి రూ.3.48 కోట్ల డివిడెంట్ ఇచ్చిన ఎం.డి. విద్యాసాగర్రెడ్డి, రూ.2.50 కోట్ల పెట్టుబడి పెట్టిన తమ జిల్లా సమాఖ్యకు ఏడాదిగా వడ్డీని ఎందుకు చెల్లించలేదని నిజామాబాద్ జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నిలదీశారు. రెండేళ్లుగా ప్రభుత్వం తన వాటాధనం ఇవ్వకుంటే కిక్కురుమనని అధికారులు, గ్రామ, మండల సమాఖ్యలపై వాటాధనం పేరిట అదనపు భారం మోపడాన్ని పలువురు మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎస్హెచ్జీలకు వడ్డీలను చెల్లించేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం, గ్రామ సమాఖ్యల అనుమతి లేకుండానే సహాయకులకు వేతనం ఎలా పెంచిందని ప్రశ్నించారు. ఉపాధిహామీ పనులకు వెళ్లండి: జూపల్లి మరోమారు వాటాధనం చెల్లించడం తమకు అదనపు భారమంటున్న గ్రామ సమాఖ్యల ప్రతినిధులకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఉపాధిహామీ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయని, కూలీ పనులకు పోతే కుటుంబానికి రూ.15 వేల నుంచి 19 వేల దాకా ఆదాయం వస్తుందని జూపల్లి అన్నారు. త్వరలోనే వడ్డీలను చెల్లించేవిధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి జూపల్లి చెప్పారు. సమావేశం ఆమోదించిన అంశాలివే l2017–18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,585 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.225 కోట్ల రుణాలు lపాడి గేదెల కొనుగోలు కోసం రూ.100 కోట్లు రుణంగా అందించాలని నిర్ణయం lసభ్యుల పిల్లలకు సైకిళ్లు, సభ్యులకు స్మార్ట్ ఫోన్, ఆటో రిక్షా, ట్రాలీల కొనుగోలుకు రుణాలు lఎస్హెచ్జీ మహిళల కోసం కొత్త బీమా పథకానికి రూపకల్పన, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.4 లక్షలు అందేలా పథకం lగతేడాది కన్నా ఒక శాతం అధికంగా 8 శాతం డివిడెండ్ను చెల్లించాలని తీర్మానం lరూ.1,000 రుణానికి రూ.4ల సురక్ష ప్రీమియంను 2.50 రూపాయలకు తగ్గించాలని నిర్ణయం వార్షిక రుణ లక్ష్యం రూ.1,810 కోట్లు 2017–18 వార్షిక ఏడాది బడ్జెట్ను రూ.2,623 కోట్లుగా ప్రతిపాదించామని, ఇందులో వార్షిక రుణ లక్ష్యాన్ని రూ.1,810 కోట్లుగా నిర్ణయించినట్లు విద్యాసాగర్రెడ్డి తెలిపారు. 2016–17 సంవత్సరంలో రుణలక్ష్యాన్ని ఇంతవరకు చేరుకోలేకపోయినా వార్షిక రుణలక్ష్యాన్ని 2 9 శాతం పెంచడం పట్ల మహిళా సమాఖ్యల ప్రతినిధులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
రూ.1,050 కోట్లతో స్త్రీ ‘నిధి’
ఆమోదం తెలిపిన స్త్రీనిధి బ్యాంకు పాలకమండలి బినామీ రుణాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం జీవనోపాధి ప్రాజెక్టులకు అధికంగా రుణాలివ్వాలని నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో తక్షణ రుణాల కింద రూ.1,050 కోట్లు అందించాలని స్త్రీనిధి బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు వార్షిక రుణ ప్రణాళిక (క్రెడిట్ ప్లాన్)కు బ్యాంకు పాలకమండలి ఆమోదం తెలిపింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయంలో గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో క్రెడిట్ ప్లాన్ అమలుకు సంబంధించి బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం రుణ ప్రణాళికలో రూ.950 కోట్లు సెర్ప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు, రూ.100 కోట్లు మెప్మా ద్వారా పట్టణ ప్రాంత మహిళా సంఘాలకు రుణాలుగా అందించాలని నిర్ణయించారు. జీవనోపాధికి అధిక ప్రాధాన్యం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు తక్షణ అవసరాల కోసం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా రుణం పొందే వీలుంది. ఒక్కో మహిళా సంఘం రూ.25 వేల వరకు రుణం పొందవచ్చు. జీవనోపాధి కోసం రూ.25 వేలకుపైగా రుణాలను అందిస్తారు. గ్రామ సమాఖ్యల పనితీరును బట్టి రుణ పరిమితిని పెంచాలని నిర్ణయించారు. పనితీరు బాగున్న సమాఖ్యలకు రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఒక్కో సంఘం రుణం పొందేందుకు ఆరుగురు మహిళలకు మాత్రమే ఉన్న పరిమితిని తాజాగా తొమ్మిది మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ క్షేత్రస్థాయిలో మహిళా సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటికి సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సలహాలు, సూచనలను స్వీకరించేందుకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. కాగా, గతేడాది రుణ ప్రణాళిక రూ.753 కోట్లలో రూ.705 కోట్లు రుణాలుగా అందించామని, 99 శాతం రికవరీ కూడా జరిగిందని స్త్రీనిధి బ్యాంకు డెరైక్టర్ విద్యాసాగర్రెడ్డి పాలకమండలి దృష్టికి తెచ్చారు. ఇప్పటివరకు 1.62 లక్షల సంఘాలకు చెందిన 7.71 లక్షల మంది మహిళలకు రుణాలను అందించామని వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, సెర్ప్ సీఈవో మురళి, మెప్మా డెరైక్టర్ జనార్ధ్దన్రెడ్డి, వివిధ ప్రభుత్వ విభాగాల, జిల్లా సమాఖ్యల డెరైక్టర్లు పాల్గొన్నారు. రుణ మంజూరులో బయోమెట్రిక్ బినామీలకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రానిక్ లోన్ డాక్యుమెంటేషన్ ద్వారా మహిళలకు రుణాల మంజూరు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించింది. అలాగే పైల ట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 50 మండలాల్లో బయోమెట్రిక్ బేస్డ్ లెండింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వం చేపట్టిన ‘తెలంగాణ పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా వివిధ జిల్లాల్లోని 2,784 గ్రామాల్లో ‘వన్ స్టాప్ షాప్’లను స్త్రీనిధి బ్యాంకు ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో ఒకేచోట అన్ని రకాల (ఈ సేవ, మీ సేవల్లో లభించే సేవలు, ప్రభుత్వ విభాగాలకు దరఖాస్తులు, ఫిర్యాదులు, ఉపాధి వేతన చెల్లిం పులు) సేవలు అందించడమే వన్ స్టాప్ షాప్ ఉద్దేశం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement