-
వివాదాలకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం దిశగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మరోసారి సమావేశమై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాల యం ప్రగతి భవన్ ఈ సమావేశానికి వేదిక కానుంది. తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి గురువారం సాయంత్రమే వైఎస్ జగన్ హైదరాబాద్కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రగతి భవన్కు చేరుకుని సీఎం కేసీఆర్తో సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారం, గోదావరి జలాల సంపూర్ణ వినియోగం, విద్యుత్ ఉద్యోగుల విభజన, విద్యుత్ పంపకాలకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం చెల్లించుకోవాల్సిన బిల్లుల బకాయిలు, రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్డ్–9, 10లో పేర్కొన్న ప్రభుత్వరంగ సంస్థల విభజన తదితర అపరిష్కృత అంశాలపై ఇద్దరు సీఎంలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయినా ఇంకా అపరిష్కృతంగా మిగిలిపోయిన ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండానే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేసీఆర్, జగన్లు ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమై సుహృద్భావ వాతావరణంలో చర్చలు నిర్వహించి ఇచ్చిపుచ్చుకునే విధానంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏపీ, తెలంగాణ అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని, సాధ్యమైనంత త్వరగా విభజన వివాదాలను పరిష్కరించుకోవాలని సీఎంలిద్దరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏపీకు కేటాయించిన భవనాలకు సంబంధించిన వివాదం పరిష్కృతమైన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన ఏపీ సచివాలయ, అసెంబ్లీ, ఇతర భవనాలను తెలంగాణ స్వాధీనం చేసుకుంది. పరస్పర చెల్లింపులూ జరగలేదు ఉమ్మడి రాష్ట్రంలోని విద్యుత్ ప్రాజెక్టుల్లో తెలంగాణకు 53.89%, ఏపీకు 46.11% విద్యుత్ వాటాలున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడేళ్ల వరకు రెండు రాష్ట్రాలమధ్య విద్యుత్ వాటాల పంపకాలు జరిగాయి. పరస్పరం జరిగిన విద్యుత్ పంపకాలకు సంబంధించిన బిల్లులను ఇరు రాష్ట్రాలు ఒకరికి ఒకరు చెల్లించుకోవాల్సి ఉంది. ఇతర ఆర్థికపర వివాదాలు కలిపితే తెలంగాణ నుంచి రూ.5,200 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని గతంలో ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ బకాయిలను చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు దివాళ తీసినట్లు ప్రకటించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం జాతీయ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ)లో కేసు సైతం వేసింది. అయితే, రెండు రాష్ట్రాల మధ్య ఆర్థికపరమైన వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకున్న తర్వాత తమకే ఏపీ నుంచి బకాయిలు రావాల్సి ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వివాదాల స్థితిగతులపై ఇప్పటికే సీఎం కేసీఆర్కు ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య తాజాగా జరగనున్న సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించే అవకాశముంది. ఈ సమావేశంలో కుదిరే అభిప్రాయం మేరకు రెండు రాష్ట్రాల సీఎస్లు ఎస్కే జోషి, ఎల్వీ సుబ్రమణ్యంలు వచ్చే నెల 3న రాజ్భవన్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో సమావేశమై తుది నిర్ణయాలు తీసుకోనున్నారు. నీళ్లు, విద్యుత్ వివాదాలు కీలకం గోదావరి, కృష్ణా జలాల పంపకాలు, మిగులు జలాల సంపూర్ణ వినియోగంపైనే శుక్రవారం జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని అధికావర్గాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునే దిశగా చర్చలు జరిపే అవకాశముంది. తెలంగాణలో పనిచేస్తున్న 1,152 మంది ఏపీ స్థానికత ఉన్న ఉద్యోగులు ఇక్కడి విద్యుత్ సంస్థలు ఏకపక్షంగా రిలీవ్ చేయడంతో దాదాపు ఐదేళ్ల కింద ప్రారంభమైన వివాదం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ డీఎం ధర్మాధికారి పరిశీలనలో ఉంది. రిలీవైన ఉద్యోగుల్లో దాదాపు 583 మంది ఏపీకి వెళ్లేందుకు ఆప్షన్లు ఇవ్వగా, మిగిలిన వారు తెలంగాణకు ఇచ్చారు. ఈ కేసులో తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులకే రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లలో దాదాపు రూ.240 కోట్ల వరకు ఫీజులు చెల్లించింది. ఏపీ ప్రభుత్వం సైతం దాదాపు ఇదే మొత్తంలో ఖర్చు చేసి ఉండొచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారు
విభజన చట్టంలోని లోపాల వల్లే ఈ పరిస్థితి సీఎం చంద్రబాబు వెల్లడి కర్నూలు జిల్లాలో ఫుడ్పార్కు, ఇండస్ట్రియల్ హబ్కు శంకుస్థాపన కర్నూలు/కడప/విజయవాడ బ్యూరో: రాష్ట్ర విభజన చట్టంలోని లోపాల వల్ల గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆయన సోమవారం రాత్రి విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్ర విభజన బిల్లు-లోపాలు’ పేరుతో మూడో వివరణ పత్రాన్ని విడుదల చేశారు. విభజన చట్టంలోని లోపాల వల్లే తెలంగాణ, ఏపీల మధ్య వివాదాలు ఏర్పడ్డాయని అన్నారు. ఏపీకి తీవ్రమైన ఆర్థిక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీని కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు పలు అంశాలపై చర్చిస్తానని అన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకు ర్యాంకులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలకు ర్యాంకులు ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాలేజీలకు అఫిలియేషన్ సమయంలో అక్కడి సౌకర్యాలపై సర్వే చేయిస్తామని చెప్పారు. ఇందులో విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని తంగెడంచె వద్ద అల్ట్రా మెగా ఫుడ్పార్కుకు, ఓర్వకల్లు మండలంలోని పూడిచర్ల వద్ద మెగా ఇండస్ట్రియల్ హబ్కు ముఖ్యమంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. పూడిచర్ల వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి తీరుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఫెడరల్ బ్యాంక్ ఫ్లాట్
అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు
మేనిఫెస్టోలో మోదీ.. యాడ్స్లో పవన్ ఫొటోలు ఎందుకు లేవు
కాంగ్రెస్ ‘సోషల్’ టీంలో ఐదుగురు అరెస్ట్
నేను గెలుస్తానో లేదో..
దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
సెలబ్రిటీలతో ఎయిర్బీఎన్బీ జట్టు..
కర్నూలు ప్రెస్కు అరుదైన అవకాశం
14 నియోజకవర్గాల్లో 100 శాతం వీడియో నిఘా
తప్పక చదవండి
- బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
- అలా విమర్శించిన.. కాంగ్రెస్, బీజేపీపై చర్యలు
- దొరుకుతున్నవన్నీ ‘పచ్చ’నోట్లే!
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- Bobbili: వాటీజ్ దిస్ ‘బేబీ’?
- ఏపీలో జగన్తోనే ముస్లిం రిజర్వేషన్లు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి: ఎంపీ బండి సంజయ్
- బాబు మార్కు దందా.. బినామీలకే సంపద
- జయరాం.. రాం!
Advertisement