-
టీడీపీది కార్మిక వ్యతిరేక విధానం
సాక్షి, హైదరాబాద్: కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్పై బుధవారం శాసనమండలిలో చర్చకు అనుమతించకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టాయి. అధికార టీడీపీది కార్మిక వ్యతిరేక విధానమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, కాంగ్రెస్, పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్)లు విమర్శించాయి. బుధవారం మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బంద్పై చర్చకు అనుమతించాలని కోరుతూ సీపీఐ, పీడీఎఫ్ సభ్యులు చైర్మన్ చక్రపాణికి వాయిదా తీర్మానాలు అందజేయగా, ఆయన తిరస్కరించారు. చర్చకు అనుమతించాలంటే మరో విధానంలో సభ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇదే సమయంలో తక్షణమే బంద్పై చర్చను చేపట్టి, కార్మికులకు సంఘీభావంగా సభలో తీర్మానం చేయాలంటూ వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ఇంతలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ దీనిపై వేరే సందర్భంలో చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఆ తర్వాత కూడా చర్చకు పట్టుబట్టినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోవడంతో వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్, పీడీఎఫ్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రభుత్వ తీరు దారుణం: ప్రతిపక్ష సభ్యులు బంద్లో ఉన్న కార్మికులకు సంఘీభావంగా సభలో చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమని సీపీఐ సభ్యుడు పి.జె.చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. మండలి నుంచి వాకౌట్ చేసిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ పక్ష నేత బాలసుబ్రమణ్యం, కాంగ్రెస్ సభ్యుడు చెంగల్రాయుడు కార్మికులపై ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. -
నిర్వాసితులంటే ఎందుకీ కక్ష?
పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాలపట్ల దానికి ఎలాంటి శ్రద్ధాలేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం చాలా తక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాలి. ‘వేయి తుపాకుల కంటే, ప్రతికూలతతో ఉండే నాలుగు వార్తాపత్రికలంటేనే నేను ఎక్కువ భయపడతాను.’ రెండు వందల ఏళ్ల క్రితం ఫ్రెంచ్ సేనాని నెపో లియన్ బోనాపార్టీ అన్నమాట ఇది. ప్రజాస్వామ్య చైతన్యం వెల్లివిరిసే భారత్ వంటి దేశంలో పత్రికలు నెపోలియన్ కాలానికి మించి ప్రజాభిప్రాయాన్ని నిర్మించే పనిని నిర్వహిస్తున్నాయి. కాబట్టే పోలవరం ప్రాజెక్టు కోసం భూము లు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలిపోయిన వేలాది మందికి పత్రికలూ, మీడియాయే ఆశాజ్యోతులుగా కనిపిస్తున్నాయి. కానీ, ఈ వ్యాసం ఉద్దేశం పోలవరం డ్యామ్ ఉపయోగాల గురించి చర్చించడం కాదు. అక్కడి నిర్వాసిత కుటుంబాలకు చెందిన వేలాది మంది మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూపు తున్న అమానవీయ ధోరణి గురించి వెల్లడించడంతో పాటు, ఆ సమస్యను ఎంత సులభంగా పరిష్కరించే అవకాశం ఉన్నదో చెప్పడమే. నిర్వాసితులూ, వాళ్ల సమస్యలూ వికారంగా ఉంటాయి తప్ప, సినీతా రల జీవితాల మాదిరిగా తళుకు బెళుకులతో ఆకర్షణీయంగా ఉండవు. చానళ్లు కూడా ఏదైనా ఒక విషాదం పట్ల ఒకరోజుకు మించి దృష్టి పెట్టవు. ఇంతకీ అసలు సమస్య- పోలవరం ప్రాజెక్టు, అందుకు అవసరమైన మౌలిక వస తుల కల్పన, కాలువల తవ్వకం వంటి అవసరాలకు భూమిని సేకరించారు. దీనికి చాలా తక్కువగా, బ్రిటిష్ ఇండియా ఏలుబడిలో రూపొందించిన భూసేకరణ చట్టం-1894 నిర్దేశించిన మేర పరిహారం ప్రకటించారు. కొత్తగా భూసేకరణ చట్టం-2013 అమలులోకి వచ్చింది. కానీ దీనిని ఇక్కడి నిర్వాసితులకు వర్తింపచేయడంలేదు. ఈ నిర్వాసితులలో ప్రధానంగా ఉభ యగోదావరి జిల్లాలు, విశాఖ జిల్లాల వారు ఉన్నారు. ఈ పథకం కోసం ఇప్పటి దాకా సేకరించినట్టు చెబుతున్న భూమి దాదాపు 30,000 ఎకరాలు. వచ్చే ఐదేళ్లలో మరో రెండు లక్షల ఎకరాలు అవసరమవుతాయి. ఈ పథకం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం, తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలాలలో ఖాళీ చేయించిన గ్రామాల వారు తక్కువ నష్ట పరిహారం పొందుతున్నారు. అంటే ఆ పరిహారం 1894 నాటి భూసేకరణ చట్టం ప్రకారమే తప్ప, కొత్తగా వచ్చిన 2013 భూసేకరణ చట్టం నిబంధనల మేరకు అందడం లేదు. ఇదీ సమస్య. ఇందుకు సంబంధించిన కొన్ని వాస్తవాలు మొదట తెలియాలి. భూసేక రణ చట్టం 2013 ఆమోదం పొందడానికి ముందు ఖాళీ చేయించిన గ్రామా లకు లేదా సేకరించిన భూములకు తాజా పరిహారం గురించి తాము సిఫా రసు చేయలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాటుతోంది. ఈ వాస్తవాలను పరి శీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ మూడు జిల్లాలకు చెందిన ఏడు లక్షల మంది నిర్వా సితులకు పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సంగతి అవగాహనకు వస్తుంది. పోలవరం, దేవీపట్నం మండలాల భూములతో పాటు, డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం ప్రభుత్వం 25,000 ఎకరాల భూమిని కూడా సేక రించింది. ఈ పరిణామాలతో పోలవరం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాలకు చెందిన రైతులు ఎదుర్కొంటున్న ఇక్కట్లు దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నాయి. సారవంతమైన భూములను ఎకరాకు రూ.1.5 లక్షలు చెల్లించి తీసు కున్నారు. కానీ ప్రస్తుతం వీటి మార్కెట్ ధర ఎకరం రూ.45 లక్షలు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను పేదలుగా మార్చింది. అదెలాగంటే, పోలవరం మండలంలో డ్యామ్ కోసం భూములు ఇచ్చి నిర్వాసితులైన వారికి ఇళ్ల స్థలా లు ఇవ్వడానికి బుట్టాయగూడెం మండలం, ముద్దపగడం గ్రామంలో భూమి ని సేకరించారు. ఇలాంటి అవసరాల కోసమే ప్రగడపల్లి అనే చోట కూడా భూమిని సేకరించారు. నివేశన స్థలాల కోసం భూమిని సేకరించడం తప్పు కాదు. కానీ సస్యశ్యామలమైన వారి భూములకు ఎకరాకు రూ. 1.5 లక్షలు వెల కట్టడం ఏమిటి? పైగా కొత్త చట్టం ప్రకారం నష్ట పరిహారం చెల్లించేం దుకు ముందుకు వస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడం దేనికి? మరో పక్క, పోలవరం డ్యామ్ను జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించినందున, ఇకపై ఆ డ్యామ్ ఖర్చులతో, నష్టపరిహారం చెల్లింపులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా కేంద్రమే చూసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రభు త్వం తరచూ చెబుతోంది. కొత్తచట్టం నిర్వాసితులకే అనుకూలం భూములను సేకరించడం, గ్రామాలను ఖాళీ చేయించడం వంటి పను లు 2013 చట్టం కంటే ముందే జరిగినప్పటికీ, కొత్త చట్టంలోని సెక్షన్ 24(2) చాలా సరళమైన భాషలో, సుస్పష్టంగా ‘1894 నాటి చట్టం మేరకే భూ సేకరణ జరిగినప్పటికీ, అందుకు సంబంధించిన పరిహారం చెల్లించినప్పటికీ, సంబంధిత వ్యక్తులు దానిని స్వీకరించినప్పటికీ, కొత్త చట్టం జనవరి 1, 2014కు ఐదేళ్ల ముందే రావలసి ఉంది కాబట్టి వారికి ఆ కొత్త చట్టం మేరకే పరిహారం ఇవ్వాలి’ అని నిర్దేశిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం డిసెంబర్ 31, 2009కు ముందే భూసేకరణ జరిపారు. అదే సెక్షన్లో, అంటే 24(2)లోని రెండో భాగం కూడా నిర్వాసితులకే మరింత అనుకూలంగా ఉంది. ఆ భాగం ఇలా పేర్కొంటున్నది: ‘నిర్వా సితులు డబ్బు స్వీకరించినప్పటికీ, తమ భూములను అప్పగిస్తూ వారు పత్రాల మీద సంతకాలు చేసినప్పటికీ, గ్రామాలను ఖాళీ చేయించి, ఇళ్లు తీసుకున్నప్పటికీ- వారంతా జనవరి 1, 2014 నాటికి అక్కడ ఉన్నవారే. ఆ భూములను సాగు చేసుకుంటున్నవారే. కాబట్టి కొత్త చట్టం మేరకే పరిహారం అందించాలి.’ పోలవరం డ్యామ్ జాతీయ పథకం. రాష్ట్ర ప్రభుత్వానికి దీనితో సంబం ధం లేదు. కానీ కేంద్రం పెద్దగా ఆసక్తి కనపరచడం లేదు. దీనిని ఆసరా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా తలదూరుస్తున్నది. అయితే డ్యామ్ నిర్మాణం చేపట్టమనీ, నిర్వాసితులకు న్యాయం చేయమనీ త్వర లోనే న్యాయస్థానాలు కేంద్రాన్ని ఆదేశిస్తాయని ఆశించవచ్చు. కేంద్రం డబ్బు ఇస్తే డ్యామ్ను నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలవ నరుల మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలుస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ వేల కోట్ల రూపాయలను తన ఆశ్రీతుల పరం చేస్తుంది. ఇలాంటి అవి నీతికి అనుమతించే విధంగా ఉంటే ఆ శాఖ మంత్రి ఉమాభారతి రాజీ నామా చేయాలి.డ్యామ్ కుడి, ఎడమ కాలువల నిర్మాణం కోసం 2005 నుంచి 25,000 ఎకరాల భూమిని సేకరించారు. కానీ డ్యామ్ నిర్మాణంలో జాప్యం జరి గింది. పూర్తికావడానికి మరో 20 ఏళ్లు పడుతుంది. అంటే వినియోగం లోకి రావడం కంటే 35 ఏళ్లకు ముందే ఆ భూములను సేకరించారు. అది కూడా ఎకరాకు మార్కెట్ ధర రూ.45 లక్షలు (నల్లజర్ల, దేవరపల్లి, ప్రగడపల్లి మండలాలలో) ఉండగా, రూ.1.5 లక్షలే చెల్లించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డ్యామ్ కోసం సేకరించిన భూమ లకు కొత్త చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి. ఇందుకు ప్రజలు పెట్టుకున్న విన్నపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానాలు ఇవ్వాలి. నిజానికి జల వనరుల మంత్రిత్వ శాఖ ఇక్కడి నిర్వాసితుల పట్ల సానుకూలంగా స్పందిస్తు న్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుపుల్ల వేస్తున్నది. మరింత నష్టపరిహారం కోసం నిర్వాసితులు కేంద్రంతో పోరాడుతుంటే, కేంద్ర ప్రభుత్వానికి సాయం గా రాష్ట్రం న్యాయవాదులను ఎందుకు పంపించాలి? ఈ వ్యాసకర్త పెట్టుకున్న దరఖాస్తుపై మే 25, 2015న గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సలహా మండలి ఢిల్లీలో ఒక సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి వచ్చిన అధికారి వాస్తవాలు తెలుసుకుని విస్తుపోయారు. తాను రాష్ట్ర ప్రభు త్వంతో చర్చించి చెబుతానని వెల్లడించారు. అయినా ఇంతవరకు రాష్ట్ర ప్రభు త్వం నుంచి ఇక్కడి వారికి ఎలాంటి సానుకూల సమాధానం అందలేదు. ‘ఒకరే చనిపోతే అది విషాదం. పది లక్షల మంది చనిపోతే అది గణాంకాల విషయం’- ఇది 70 ఏళ్ల క్రితం రష్యా నేత జోసెఫ్ స్టాలిన్ అన్నమాట. దురదృ ష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వం అదే పంథాలో ఆలోచిస్తున్నది. పోలవరం డ్యామ్ కోసం నిర్వాసితులైన వారంతా దళితులు, వెనుకబడిన వర్గాలే. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఆ వర్గాల పట్ల దానికి ఎలాంటి శ్రద్ధా లేదని భావించే విధంగా ఉంది. తూర్పు గోదావరిలోని అంగలూరు, పశ్చిమగోదావరిలోని పోలవరం మండలాలలో గ్రామాలను ఖాళీ చేయించడానికి అధికారులు చూపిన అత్యుత్సాహం దారుణం. కానీ అదే ప్రభుత్వం రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్నప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లా వాసులను బంధువులుగా ఆదరించింది. కొత్త భూసేకరణ చట్టం కింద పరిహారం చెల్లించడానికి తమకు అభ్యంతరం లేదని ఇప్పటికైనా రాష్ట్రం కేంద్రానికి లేఖ రాయాలి. అంగలూరు, దేవరగొంది, పోలవరం మండలాలలో అత్యుత్సా హం చూపిన అధికారులను శిక్షించాలి. ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూము లకు ఇప్పటి వరకు ఇచ్చిన పరిహారం బంజారాహిల్స్లో ఐదు ఎకరాలకు చెల్లించే పైకం కంటే చాలా తక్కువగా చెల్లించిన విషయాన్ని గమనించాలి. అన్నట్టు మన పాలకులంతా ఉండేది బంజారాహిల్స్లోనే మరి! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) - పెంటపాటి పుల్లరావు e-mail:Drpullarao1948@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement