-
కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
-
మాపై ఇలాంటి వ్యాఖ్యలా అంటూ.. కన్నీరు పెట్టుకున్న శుభలేఖ సుధాకర్
'శుభలేఖ' సుధాకర్, ఆ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఇండస్ట్రీలో ఆయన రాటు తేలిన కేరెక్టర్ యాక్టర్! తన దరికి చేరిన పాత్రల్లోకి ఇట్టే పరకాయ ప్రవేశం చేసి మార్కులు కొట్టేస్తూ ఉంటారు. అవి నచ్చినవారు ఆయనను పట్టేసి తమ సినిమాల్లో పెట్టేసుకుంటారు. సుధాకర్ కూడా శక్తివంచన లేకుండా నటించేసి, జనాన్ని మెప్పిస్తుంటారు. మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజకు ‘శుభలేఖ’ సుధాకర్ భర్త అనే విషయం తెలిసిందే. ఆయన నటుడిగానే కాకుండా డబ్బింగ్తోనూ ప్రేక్షకులను అలరించడం విశేషం. తాజాగా యాత్ర -2 చిత్రంలో రెడ్డి పాత్రలో ఆయన నటనకు వంద మార్కులు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఆయన పాత్రను మరిచిపోవడం కష్టం.. అంతలా ప్రేక్షకులను మెప్పించారని చెప్పవచ్చు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానల్స్ తన పట్ల వ్యవహిరిస్తున్న తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పుడు థంబ్నైల్స్ పెట్టి పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఎమోషనల్ అయ్యారు. 'సుధాకర్కు అపాయింట్మెంట్ ఇవ్వని చిరంజీవి' శైలజతో విడాకులు తీసుకున్న సుధాకర్ ఇలా తప్పుడు రాతలు ఎందుకు రాస్తారంటూ ఆయన ఆవేదన చెందారు. 'చిరంజీవితో నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54రోజుల పాటు ఆయన నిత్యం ఫోన్ కాల్ చేస్తూనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునే వారు. మెగాస్టార్ నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు చాలా ఏళ్లుగా తప్పుగానే నా గురించి చూపిస్తూ వస్తున్నారు. నేను, శైలజ విడిపోయామని పలు వీడియోలు కూడా పెట్టారు.. అందులో నిజం లేదని ఇప్పటికే మేము ఇద్దరం కలిసి చెప్పాం. ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మా అమ్మ గారు శైలజను ఒకరోజు ప్రశ్నించారు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా..? అని అప్పుడు నేను కలుగచేసుకుని అలాంటివి ఏమీ లేవని చెప్పాను. తర్వాత మళ్లీ రోజు నిద్రలోనే ఆమె మరణించారు. ఇలాంటి సమయంలో నేను ఏం అనుకోవాలి..? ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. వాళ్లకు కూడా మంచి ఎథిక్స్ ఉంటాయి. కానీ వీళ్లకు మాత్రం అలాంటివి ఏమీ లేవు అంటూ సుధాకర్ కన్నీరు పెట్టుకున్నారు. ఒక్కోసారి శుభలేఖ సుధాకర్ చనిపోయారని వీడియో పెడతారు.. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. కనీసం నేను ఎవరినీ కూడా ఇబ్బంది పెట్టను. మీ పొట్ట నింపుకోవాడానికి మరోకరిని ఇలా చంపడం ఎందుకు..? అలా సంపాదించిన డబ్బుతో తిన్న ఆహారం ఒంటికి పడుతుందా..? ఇలాంటి వీడియోలు చేసేవారు నూటికి వెయ్యి శాతం అనుభవిస్తారు.' అని ఆయన క్షోభించారు. -
బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్.. ఆరోజే రిలీజ్!
నంది అవార్డు గ్రహీత రవి చావలి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'బద్మాష్ గాళ్ళకి బంపర్ ఆఫర్'. ఈ సినిమాకు రమేశ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించాడు. శాసనసభ చిత్రంతో కథానాయకుడిగా గుర్తింపు పొందిన ఇంద్రసేన , మ్యాడ్ చిత్రంలో నటించిన సంతోష్ హీరోలుగా నటిస్తుండగా ప్రజ్ఞ నయన్, నవీన రెడ్డి హీరోయిన్లుగా నటించారు. డబ్బు కోసం రియల్ ఎస్టేట్ దందా చేసే ఒక వ్యక్తి దగ్గర పని చేసే ఇద్దరు కుర్రోళ్ళు , అతన్నే ఎందుకు కిడ్నాప్ చేశారు? ఆ కిడ్నాప్లో తెలిసిన రహస్యాలు ఏమిటి? చివరకు వాళ్ళు అనుకొన్న డబ్బు సంపాదించారా? లేదా? అనే పాయింట్ ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమా కథ నడుస్తుంది. మలయాళీ నటి మెర్లిన్ ఫిలిప్, తమిళ నటుడు తారక్, శుభలేఖ సుధాకర్ గారు ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, బెంగళూర్ , టెక్సాస్, అండమాన్ లో ఈ నెల 29 వ తేదీన రిలీజ్ అవుతుంది. చదవండి: పృథ్వీరాజ్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్పై క్లారిటీ! -
మా ఆయన ఆ పాట నాతో ఎక్కువ పాడించుకుంటారు
-
నెల్లూరు అల్లుడ్ని కావడం గర్వంగా ఉంది
నెల్లూరు(బృందావనం): ఎందరో కళాకారులను అందించిన నెల్లూరుకు అల్లుడిని కావడం గర్వకారణంగా ఉందని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. కళాంజలి 35వ వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు పురమందిరంలో ఆదివారం రాత్రి కళాంజలి పురస్కారాన్ని సుధాకర్కు రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ సంగీతానికి మంత్రముగ్ధులను చేసే శక్తి ఉందన్నారు. తనకు పాటలు పాడడం ఇష్టమని అయితే.. ప్రముఖ సింగర్ తన భార్య ఎస్పీ శైలజ దయచేసి మీరు పాటలు పాడవద్దని వారి మధ్య జరిగిన సంభాషణను చమత్కరంగా వివరించారు. మారుతున్న కాలంతోపాటు 35 సంవత్సరాలుగా కళాంజలి సంస్థ చేస్తున్న సేవలను అభినందించారు. అలాగే పాడుతా తీయగా ఫైనలిస్ట్ శరత్చంద్రకు కళాంజలి అవార్డును అందజేశారు. కార్యక్రమంలో లాయర్ వారపత్రిక సంపాదకుడు తుంగాశివప్రభాత్రెడ్డి, కాసా పెంచల వరప్రసాద్ నాయుడు, బయ్యా వెంకటరవికుమార్, వీరిశెట్టి హజరత్బాబు, వాకాటి విజయకుమార్రెడ్డి, ఎన్.బలరామయ్యనాయుడు, ఎన్వీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యాఖ్యాతగా డి.అరుణ్కుమార్ వ్యవహరించారు. బిల్లీశ్యాంసన్ ఆధ్వర్యంలో గాయకబృందం పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమాన్ని కళాంజలి వ్యవస్థాపకుడు అనంత్, ఆర్గనైజర్ దువ్వూరు బెనర్జీ, సభ్యులు జి.శివకుమార్రెడ్డి పర్యవేక్షించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement