-
అరుణ్ జైట్లీకి ఆపరేషన్ విజయవంతం
న్యూఢిల్లీ: కేన్సర్తో బాధపడుతున్న కేంద్ర మంత్రి జైట్లీ(66) అమెరికాలోని న్యూయార్క్లో శస్త్ర చికిత్స చేయించుకున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించినట్లు వెల్లడించాయి. జైట్లీకి తొడ భాగంలో అరుదైన కేన్సర్ సోకింది. దీంతో ఆయన ఈ నెల 13న వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన సోషల్మీడియాలో చురుగ్గా ఉంటూ వచ్చారు. గతేడాది మే 14న ఢిల్లీలోని ఎయిమ్స్లో జైట్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జైట్లీ బరువు తగ్గేందుకు బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. -
నౌకాదళ తేజస్ పరీక్ష సక్సెస్
బెంగళూరు / న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ నౌకాదళ వెర్షన్ను అధికారులు గురువారం విజయవంతంగా పరీక్షించారు. యుద్ధవాహక నౌక నుంచి టేకాఫ్ కావడం, ఆతర్వాత హుక్ వ్యవస్థ సాయంతో సురక్షితంగా ల్యాండ్ కావడం వంటి పరీక్షల్ని పూర్తిచేశారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరప్ల సరసన భారత్ చేరింది. యుద్ధ విమానం నౌకపై దిగే సమయంలో దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉండే ‘అరెస్టర్ హుక్ సిస్టమ్’ను కూడా ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు. రాబోయే రోజుల్లో ల్యాండింగ్, ఇంధనం నింపే విషయంలో తేజస్కు మరిన్ని ట్రయల్స్ నిర్వహిస్తామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన(ఐఏఎఫ్) ఇప్పటికే 40 తేజస్ యుద్ధ విమానాల కోసం హెచ్ఏఎల్కు ఆర్డర్ ఇచ్చారు. -
30 ఏళ్ళ తర్వాత చలనం తెప్పించారు!
శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. సైన్స్ కు అందని విషయమే ఉండదేమో అన్నంతటి విజ్ఞానాన్ని మన ముందుంచుతోంది. తాజాగా జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలు అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మంచులో గడ్డ కట్టిపోయిన ఓ జీవిలో ముఫ్ఫై ఏళ్ళ తర్వాత చలనం తెప్పించిన తీరు... సృష్టికే ప్రతిసృష్టిగా నిలిచింది. అంటార్కిటికానుంచి సేకరించి తెచ్చిన ఓ నీటి ఎలుగు (టార్డిగ్రేడ్) ను ఘనీభవింపజేసి... ముఫ్ఫై ఏళ్ళ తర్వాత విజయవంతంగా దానిలో చలనం తెప్పించగలిగామని.. జపాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోలార్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. ఒక మిల్లీ మీటర్ కంటే తక్కువ పరిమాణంలో ఉండి, మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు, నీరు ఉండే ప్రాంతాల్లో ఈ జాతి జీవులు నివసిస్తుంటాయి. అవసరాన్ని బట్టి వాటి జీవక్రియ కార్యకలాపాలను అవే సమర్థించుకోగలిగే శక్తిని ఇవి కలిగి ఉంటాయి. అయితే ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన ఈ టార్డిగ్రేడ్ ను అంటార్కిటికాలోని నాచు మొక్కల్లో గుర్తించి 1983 లో పరిశోధనలకోసం తెచ్చారు జపాన్ శాస్త్రవేత్తలు. తమ పరిశోధనల్లో భాగంగా దాన్ని 20 మైనస్ డిగ్రీల్లో భద్రపరిచి ఘనీభవింపజేశారు. తిరిగి 2014 లో దాన్నియధాస్థితికి తెచ్చి పరిశోధకులు సఫలమయ్యారని క్రైయో బయాలజీ పత్రిక వెల్లడించింది. అంతేకాదు సజీవంగా మారిన టార్డిగ్రేడ్ ఓ గుడ్డును కూడ పెట్లి, అది క్రమంగా కదలడం ప్రారంభించి, పదిహేను రోజులకల్లా ఆహారం తీసుకోవడం మొదలు పెట్టిందని, ఆ గుడ్డు క్రమంగా 19 గుడ్లును పెట్టిందని, వాటిలో 14 గుడ్లు పిల్లలుగా మారగా, వాటన్నింటిలో ఎటువంటి లోపాలు లేవని పరిశోధకులు చెప్పినట్లు ఆ పత్రిక నివేదించింది. గతంలో జరిపిన పరిశోధనల్లో ఈ టార్డిగ్రేడ్ ను తొమ్మిది సంవత్సరాల తర్వాత చలనంలోకి తెచ్చారు. కానీ 30 ఏళ్ళ తర్వాత విజయవంతంగా పునర్జీవనం కల్పించడం ఇదే మొదటిసారి అని పరిశోధకులు భావిస్తున్నారు. ప్రకృతి పరిమాణాత్మక విశ్లేషణలను ఉపయోగించి నిర్విహించిన ఈ ప్రస్తుత పరిశోధనలు టార్డిగ్రేడ్ దీర్ఘకాల మనుగడను కొంతవరకూ గుర్తించ గలిగిందని, మరిన్ని అధ్యయనాలు జరిపి నియంత్రిత పరిస్థితుల్లో వీటి మనుగడపై విశ్లేషణాత్మక వివరాలను తెలుసుకునే అవకాశం ఉందని ఈ పరిశోధనా పత్రికలో రచయితలు వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement