-
నోవా లైల్స్ ‘డబుల్’
బుడాపెస్ట్ (హంగేరీ): అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ‘డబుల్’ సాధించాడు. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటికే 100 మీటర్ల స్ప్రింట్లో విజేతగా నిలిచిన అతను ఇప్పుడు 200 మీటర్ల పరుగులో కూడా అగ్రస్థానాన్ని అందుకున్నాడు. అంచనాలకు తగినట్లుగానే సత్తా చాటిన లైల్స్ 19.52 సెకన్లలో పరుగు పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో ఎరియోన్ నైటాన్ (అమెరికా – 19.75 సెకన్లు) రజతం సాధించగా, లెట్సిలో టె»ొగో (బోట్స్వానా – 19.81 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. వరల్డ్ చాంపియన్షిప్ 200 మీటర్ల పరుగులో లైల్స్కు ఇది వరుసగా మూడో స్వర్ణం కావడం విశేషం. గత ఏడాది ఒరెగాన్లో జరిగిన పోటీల్లోనూ అతను బంగారు పతకం సాధించాడు. తద్వారా బోల్ట్ తర్వాత ఒకే ఈవెంట్లో వరుసగా కనీసం మూడు స్వర్ణాలు గెలిచిన రెండో అథ్లెట్గా లైల్స్ నిలిచాడు. 4గీ100 మీటర్ల రిలేలో అమెరికా జట్టు ఫైనల్ చేరింది. ఇందులో కూడా భాగంగా నిలిచి విజయం సాధిస్తే లైల్స్ ఖాతాలో మూడో స్వర్ణం చేరుతుంది. ప్రపంచ రికార్డుకు చేరువై... 100 మీటర్ల స్ప్రింట్లో రజతం సాధించిన షెరికా 200 మీటర్ల ఈవెంట్లో తన పరుగుకు మరింత పదును పెట్టింది. ఈ జమైకా అథ్లెట్ 200 మీటర్ల పరుగులో రెండో అత్యుత్తమ టైమింగ్ను నమోదు చేస్తూ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుందిు. 21.41 సెకన్లలో షెరికా పరుగులు పూర్తి చేసింది. గాబ్రియెల్ థామస్ (అమెరికా – 21.18 సెకన్లు), షకారి రిచర్డ్సన్ (అమెరికా – 21.92 సెకన్లు)లకు వరుసగా రజత, కాంస్యాలు దక్కాయి. ప్రపంచ రికార్డు ఇప్పటికీ అమెరికాకు చెందిన ఫ్లోరెన్స్ గ్రిఫిత్ జాయ్నర్ (21.34 సెకన్లు) పేరిటే ఉంది. 1988లో ఆమె ఈ టైమింగ్ను నమోదు చేసింది. గత ఏడాది కూడా ఈ ఈవెంట్లో షెరికా స్వర్ణం సాధించింది. ఆసియా రికార్డుతో ఫైనల్లోకి భారత 4్ఠ400 రిలే బృందం ప్రదర్శన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత 4్ఠ400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ఆసియా రికార్డుతో ఫైనల్కు అర్హత సాధించింది. తొలి హీట్లో మన జట్టు రెండో స్థానంలో నిలిచింది. మొహమ్మద్ అనస్ యాహియా, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్ వరియత్తోడి, రాజేశ్ రమేశ్ భాగంగా ఉన్న భారత్ ఈ రేసును 2 నిమిషాల 59.05 సెకన్లలో పూర్తి చేసింది. ఇది కొత్త ఆసియా రికార్డు కావడం విశేషం. ఈ హీట్స్లో అమెరికా జట్టు మొదటి స్థానంలో నిలవగా, గ్రేట్ బ్రిటన్ టీమ్కు మూడో స్థానం దక్కింది. నేడు ఫైనల్ రేస్ జరుగుతుంది. -
సీఎం కేసీఆర్ ప్రజలనే కాదు, రాముడినీ మోసం చేశారు: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాలనను సీఎం కేసీఆర్ పూర్తిగా గాలికి వదిలేశారని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎలీ్ప) నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ‘బీఆర్ఎస్ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక విమానాల్లో పొరుగు రాష్ట్రాల నేతలను ప్రగతిభవన్కు పిలిపించుకుని గులాబీ కండువాలు కప్పారు. కానీ వరదలతో ముప్పు ఉందని, తమకు హెలికాప్టర్లు, రెస్క్యూటీంలను తమ ప్రాంతాలకు పంపాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్రావులు కోరినా పెడచెవిన పెట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులకు గులాబీ కండువాలు కప్పడంపై ఉన్న శ్రద్ధ తెలంగాణ వరద బాధితులను ఆదుకోవడంపై సీఎం కేసీఆర్ పెట్టి ఉంటే బాగుండేది.’అని ఆయన వ్యాఖ్యానించారు. భారీ వర్షాలు వస్తాయని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగాన్ని అప్ర మత్తం చేయని కారణంగానే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరిగిందని ఆరోపించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ అశ్రద్ధ, మానవ తప్పిదాల వల్లనే గతంలో ఎన్నడూ లేని విధంగా 60 మంది చనిపోయారని, ఈ విషాదానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఇష్టారాజ్యంగా చెక్డ్యాంలు నిర్మించిన కారణంగానే చెరువుల నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోని కారణంగా 69 చెరువులు తెగిపోయి ఒక్కసారిగా వాగులు పొంగి మోరంచపల్లి అనే గ్రామం మునిగిపోయిందని భట్టి నిందించారు. సాంకేతిక ప్రమాణాలతో కాకుండా రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా చెక్డ్యాంలు నిర్మించారని, శాస్త్రీయత లేకుండా సీఎం కేసీఆర్ సొంత ఆలోచనలతో సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులను నిర్మించిన కారణంగానే మంథని, చెన్నూరు, మంచిర్యాలలో పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయని అన్నారు. వరదలపై సమీక్షలు మేనెలలోనే నిర్వహించాల్సి ఉన్నా ఎందుకు చేయడలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన అధికారులను వరద ముంపు గ్రామాలకు పంపి అక్కడ నష్టాలను అంచనా వేయించి వెంటనే పరిహారం అందించేలా సీఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.1000 కోట్లు ఎక్కడ? ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్న సీఎం కేసీఆర్ భద్రాచలం రాముడిని కూడా మోసం చేశారని భట్టి వ్యాఖ్యానించారు. ‘వరదలు వచి్చనప్పుడు భద్రాచలం పట్టణం ముంపునకు గురికాకుండా ఉండేందుకు కర కట్టలు, కాలనీల నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఇస్తామని గతంలో చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి భద్రాచలం ముంపునకు గురైనప్పటికీ రూపాయి ఇవ్వలేదు. దేవుడినే మోసం చేసిన కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని భద్రాచలం రాముడిని మొక్కి వచ్చాను’’అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత కాంగ్రెస్ పారీ్టపై ఉందని, వరద సహాయక చర్యల్లో కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా పాలుపంచుకోవాలని, వరద బాధితులకు ధైర్యం ఇచ్చి అండగా నిలవాలని భట్టి పిలుపునిచ్చారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
అమ్మా... నా పేరు గుర్తుందా?
ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం
టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలి
ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం
పోలింగ్కు అంతా రెడీ
● రాష్ట్రంలోనే నెల్లూరు రూరల్ను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
● అభివృద్ధి, సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేశాం
మా విజయానికి బాట
ఉత్సాహంగా బైక్ ర్యాలీ
ఓటరు అసిస్టెంట్ బూత్ల ఏర్పాటు
తప్పక చదవండి
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- Mothers Day 2024: సూపర్ మామ్ఫ్లూయెన్సర్
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- Israel-Hamas war: వెళ్లిపోవాల్సిందే...రఫా ప్రజలకు మరోసారి ఇజ్రాయెల్ అల్టిమేటమ్
- మీ ‘మద్దతు’ బాధంతా బాబు కోసమేగా!
- జగన్కు ఓటేయకపోతే నష్టపోతాం
- ఇక మాటల్లేవ్!
- ‘ఏబీవీ’ అవినీతి నిజం
- మోదీ ఓటమి తెలంగాణ నుంచే మొదలుకావాలి
Advertisement